ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దు
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్( నేటి ధాత్రి ):
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వచ్చే అర్జీలు పెండింగ్లో పెట్టవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.మొత్తం 182 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ శాఖకు 75, హౌసింగ్ శాఖకు 36, ఎస్డీసీకి 12, డీఆర్డీఓ, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు తొమ్మిది చొప్పున, ఎస్పీ కార్యాలయానికి 6, జిల్లా ఉపాధి కల్పన అధికారి, నీటి పారుదల శాఖ కు 5 చొప్పున, జిల్లా సంక్షేమ అధికారికి 4, వ్యవసాయ శాఖ, జిల్లా విద్యాశాఖ అధికారి, ఏడీ టెక్స్టైల్స్, సబ్ రిజిస్టర్, ఏడీ ఎస్ఎల్ఏ కు రెండు చొప్పున తదితర శాఖలకు దరఖాస్తులు వచ్చాయి. అలాగే వైద్యానికిి రూ. రెండు లక్షల ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన బొల్లె శ్రీనివాస్ పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నాడు. సాయం అందించాలని శ్రీనివాస్ భార్య శంకరవ్వ కలెక్టర్ కు విన్నవించారు. దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి, శ్రీనివాస్ వైద్యానికి రూ. రెండు లక్షల చెక్కును అందజేశారు. వైద్యానికి సహాయం అందించిన కలెక్టర్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.