మహిళల గోరింటాకు సంబరాలు..

మహిళల గోరింటాకు సంబరాలు..

నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ)
ఆర్యవైశ్య మహాసభ హనుమకొండ జిల్లా కమిటీ, జిల్లా మహిళా కమిటీ,వాసవి క్లబ్ హన్మకొండ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద గల టిటిడి కళ్యాణ మండపంలో జరిగిన “ఆషాఢ గోరింటాకు సంబరాలు”కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వైశ్య సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమమూలో పాల్గొన్న
మహిళా సోదరమణులు సామూహికంగా ఒకరి చేతికి ఒకరు మైదాకు పెట్టుకుని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమ ప్రారంభ సూచకంగా మహిళలు వైశ్యుల కులదేవత, ఆరాధ్య దైవం, వాసవి మాత చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహిళలు తంబోలా తదితర కాలక్షేప కార్యక్రమాలు నిర్వహించుకుని, గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలను ఉద్దేశించి హన్మకొండ జిల్లా ఆర్యవైశ్య మహసభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట సురేష్, దొడ్డ మోహన్ రావు మాట్లాడుతూ భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లాలోని మహిళా సోదరీమణులు ఆషాడ మాస గోరింటాకు కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయడం పట్ల సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుకు వచ్చిన జిల్లా మహిళా కమిటీనీ వారు ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్తులో జిల్లా మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా అధ్యక్షులు తోట సురేష్, ప్రధాన కార్యదర్శి దొడ్డ మోహన్ రావు, కార్య నిర్వాహక అధ్యక్షుడు వెనిశెట్టి రఘు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుకొనీశెట్టి మునిందర్,చకిలం రాజేశ్వర్ రావు,పబ్బతి నాగభూషణం, ఆవోప హన్మకొండ జిల్లా కోశాధికారి గంప సతీష్ వెలగందుల శ్రీధర్, శ్రీనివాస్,లక్ష్మణ్ కాంత్, జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు పడకండి జ్యోతి, ఉపాధ్యక్షురాలు దొడ్డ దేవి, కోశాధికారి అయిత పద్మజ, దోమకుంట్ల వాణి,తోట సంధ్య ,పబ్బతి సునీత,శ్రీరామ్ జయలక్ష్మి,భారతి,అన్నపూర్ణ లతో పాటు సుమారు నూట యాభై మంది మహిళలు పాల్గొన్నారు.

బహిరంగ సభకు భారీగా తరలిరండి…

బహిరంగ సభకు భారీగా తరలిరండి…

నారా లోకేష్ కు టిడిపి జాతీయ పరిపాలన అధ్యక్షులుగా పదవి ఇవ్వాలని ప్రతిపాదన

కాకాని, జగన్ మైనింగ్ అవినీతి వెలికి తీయాలని ప్రతిపాదన

తిరుపతి(నేటి ధాత్రి) మే 26:

 

 

 

ఎన్టీఆర్ జన్మదిన పురస్కరించుకుని టిడిపి మహానాడు 27, 28,29 న భారీ బహిరంగ సభ కు భారీగా తరలిరావాలని తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పిలుపు నిచ్చారు,
స్థానిక తిరుపతి
ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో సోమవారం తిరుపతి టిడిపి నాయకుల తో కలిసి ఆయన మాట్లాడుతూ నందమూరి తారకరామారావు జన్మదిన పురస్కరించుకొని 27 28 29 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని తలపెట్టారని తిరుపతి నుంచి అధిక సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నాలని, నారా లోకేష్ కు టిడిపి జాతీయ పరిపాలన అధ్యక్షులుగా (టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ) పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన తిరుపతి నుంచి టిడిపి నాయకులు కార్యకర్తలు పలువురి అభిప్రాయలతో ఈ ప్రతిపాదనను పెడుతున్నామని ఇందుకు అందరూ అంగీకరించాలని కోరుతున్నామన్నారు.
కాకాని, జగన్ మైనింగ్ అవినీతి వెలికి తీయాలని ప్రతిపాదన
వైసీపీ పార్టీలోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనింగ్ కేసులో పై చర్చించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలను మహానాడులో చర్చించాలని
ఆయన అన్నారు,
ఈ మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర పరిపాలనపై అంశాలపై అలాగే పలు అంశాలపై చర్చించుకుని ఇటు పార్టీని అటు రాష్ట్ర పరిపాలనను పరిపాలించేందుకు పొలంసాలపై చర్చించి అలాగే తిరుపతి నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు, అన్నిటిని అందరూ ఆమోదించి ఆదర్శవంతమైన పాలనను ప్రజలకు అందించాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు మంత్రులు కూడా
హాజరు కానున్నారని ఆయన తెలిపారు,
ముఖ్యంగా 29వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తో పాటు డిప్యూటీ మేయర్ ఆర్ సి, మునికృష్ణ,
కట్టా జయరామ్ యాదవ్, బుల్లెట్ రమణ, రామారావు,జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలిరండి..

*ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలిరండి..

*టిడిపి నాయకులు, జాతీయ బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం..

తిరుపతి( నేటి ధాత్రి)మార్చి 27:

 

యాదవ కార్పొరేషన్ కు తిరుపతి టిడిపి బిసి నాయకులు మాజీ తుడా చైర్మన్ జి నరసింహ యాదవ్ రాష్ట్ర చైర్మన్ గా ఏప్రిల్ 2వ తేదీన విజయవాడలో జరుగు ప్రమాణ స్వీకారం మహోత్సవానికి పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ కుల సంఘ నాయకులు భారీగా తరలిరావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం పిలుపునిచ్చారు, గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తిరుపతి టిడిపి బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ రెండవ తేదీన ఉదయం 9 గంటలకు యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం కు బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలిరావాలని రజక సంఘం, గాండ్ల సంఘం, యాదవ సంఘం,నాయి బ్రాహ్మణ సంఘం, మత్స్యకారుల సంఘం, వడ్డెర సంఘం, వన్నెకుల క్షత్రియ సంఘం, పట్టు శాలి సంఘం, శాలివాహన సంఘ నాయకులు
హాజరు కావాలని
బీసీ కార్పొరేషన్ లో రాష్ట్రంలో ఉన్నతమైన చైర్మన్ పదవిని మన తిరుపతి నాయకులు నరసింహ యాదవ్ కు రావడం మనకందరికీ ఆనందంగా ఉందని కనుక తిరుపతి జిల్లా నుంచి భారీగా తరలి వెళ్దామని పిలుపునిచ్చారు, తిరుపతి నుండి భారీగా బీసీ కుల సంఘ నాయకులు పెద్ద
ఎత్తున తరలిరావాలని టిడిపి నాయకులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి .జగన్నాథం
పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కరాటే చంద్ర, గాండ్ల సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్నాథం, తిరుపతిలో కుల సంఘాల నాయకులు వడ్డెర సంఘం నాయకులు బాలాజీ,
కరాటే చంద్ర , అక్కినపల్లి లక్ష్మయ్య , ఆముదాల తులసీదాస్ , శంకరయ్య , భక్తవత్సలం , అశోక్
తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version