ముగిసిన కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు.

ముగిసిన కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద, ఆరోగ్యం, వృద్ధి, పాడిపంటల శుభఫలితాల కోసం కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు 12 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన హోమాలు నేడు పూర్ణాహుతితో ముగిశాయి. సోమవారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ మహా పర్వదినంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు, ఈఓ మహేష్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ 12 హోమాలు ప్రజల ఆర్థిక, శారీరక శ్రేయస్సు వ్యవసాయోత్పత్తి అభివృద్ధికి శుభపరిణామాలు కలగాలని ఆకాంక్షతో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సందర్భంగా శాంతి, ఐశ్వర్యం, సమృద్ధిని కోరుతూ విశేష పూజలు చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

శ్రీ ద్వాదశ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి.

శ్రీ ద్వాదశ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని శివ మార్కండేయ దేవాలయం లో కొలువైయున్న దేవతా మూర్తులైన శ్రీ వెంకటేశ్వర శివ మార్కండేయ స్వామి చెష్టి దృశ్యం ఓం చండీ ఓం పూర్ణప రుత్తి అవబ్రతశ్రానాము పూజా కార్యక్రమంతో ద్వాదశ బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ బాసని సూర్య ప్రకాష్ పద్మ దంపతులు,బాసని చంద్ర ప్రకాష్ పద్మశాలి రాష్ట్ర మిని మం వెజినెస్ అడ్వైజర్ నెంబర్ బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొము రయ్య ,రిటైర్డ్ టీచర్ దేవాల యం కమిటీ నెంబర్ వనం సదానందం ,వంశీ, కందగట్ల గోపాల్, ,శ్రావణ్ భద్రకాళి అర్చకులు, శివ మార్కండేయ వెంకటేశ్వర దేవాలయం అర్చకులు రాజకుమార్ , కరుణాకర్ ,మహిళలు భక్తులు, వివిధ బంధువుల పెద్ద నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version