భూపాలపల్లి జంగేడు 14వ వార్డులో అట్కాపురం కోటి వల్ల అమ్మమ్మ చనిపోయి 6వ రోజున కాంగ్రెస్ జిల్లా నాయకులు దుర్గం అశోక్ &టీమ్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన భూమయ్య మాకోటి ప్రభాకర్ కూనమళ్ళ రాజా కొండముచ్చుల నాగరాజు గారు, మరియు యాత్ నాయకులు ఆకుల సాయి చరణ్, దొంగల అనిల్,బొద్దుల వినయ్,కటకం చందు, దుర్గం అనిల్, దుర్గం సాగర్ పాల్గొన్నారు,
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం తహసిల్దార్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో.. భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. గ్రామంలోని పలువురు రైతులు భూ సమస్యలను భూభారతి రెవెన్యూ సదస్సు ఫారంలో వివరాలు పొందుపరిచి తహసిల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ.. మండలంలోని భూముల సమస్యతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారంలో వివరాలు నిశితంగా పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మల్ల అశ్విని రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణానికి బుధవారం అంకురార్పణ చేశారు. పంబాల పూజారి రౌతు కిషోర్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ఎస్సీ కాలనీ సమీపంలో పాత స్థలాన్ని మరోసారి గుర్తించి, పసుపు కుంకుమ సమర్పించి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ… ఆలయ నిర్మాణానికి ఇదే గ్రామానికి చెందిన బైరెడ్డి వెంకట్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డిలు దాతలుగా ముందుకు రావడం జరిగింద న్నారు. ఇందులో భాగంగా నేడు స్థలాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈనెల 11న ఉదయం 7 గంటలకు ఆలయ నిర్మాణానికి ముగ్గు పోయడం జరుగుతుందని కావున గ్రామ మహిళలు పసుపు కుంకుమ కొబ్బరికాయలతో అధిక సంఖ్యలో హాజరై పూజలో పాల్గొని విజయవంత చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెరుమాండ్ల రాజేశ్వర్, గట్టు మహేందర్, బిరుదు రాములు, వడ్లకొండ నాగరాజు, ఎర్రం సతీష్ కుమార్, పెరుమాండ్ల నవీన్,కన్నూరి కుమార స్వామి,కత్తి తిరుపతి, ముక్కెర రాజు, పైతరి సదయ్య, గాజుల వెంకటస్వామి, సుంకరి ప్రమోద్, గట్టు రమేష్, తోడేటి విజేందర్, కసుబోజుల రమేష్,పబ్బ రాజు తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి • భూభారతిలో సమస్యల శాశ్వత పరిష్కారం • మెదక్ ఆర్డిఓ రమాదేవి
నిజాంపేట: నేటి ధాత్రి
భూ భారతిని మండల వ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భూ భారతిలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారం అవుతాయని మెదక్ ఆర్డీవో రమాదేవి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆమె సందర్శించి రెవెన్యూ సదస్సులో దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు.. ప్రజలు భూ సమస్యల నివృత్తి కోసం రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 12 వరకు తేదీల వారిగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. భూభారతిలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారం అవుతాయని ఆమె పేర్కొన్నారు. భూ సమస్యల పై అధికారులకు దరఖాస్తుల రూపంలో వారి సమస్యలను అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాసులు, నయాబ్ తాహసిల్దార్ రమ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి, ధరణి కంప్యూటర్ ఆపరేటర్ రాజు, గ్రామ ప్రజలు ఉన్నారు.
రెవెన్యూ సదస్సును సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్ నేటి ధాత్రి:
మంచిర్యాల్ జిల్లా జైపూర్ మండల్ నర్సింగాపూర్, మిట్టపల్లి గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో రెవెన్యూ అధికారులు ప్రజల భూ సమస్యలను పరిష్కరించడానికి రంగంలోకి దిగినట్లు తెలిపారు.రెవెన్యూ అధికారులు ప్రజల వద్దకి వెళ్లి వారి సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు చేపట్టి వారి సమస్యలు పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,తహసిల్దార్ వనజా రెడ్డి, వివిధ శాఖల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సును సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల్ జిల్లా జైపూర్ మండల్ నర్సింగాపూర్, మిట్టపల్లి గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో రెవెన్యూ అధికారులు ప్రజల భూ సమస్యలను పరిష్కరించడానికి రంగంలోకి దిగినట్లు తెలిపారు.రెవెన్యూ అధికారులు ప్రజల వద్దకి వెళ్లి వారి సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు చేపట్టి వారి సమస్యలు పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,తహసిల్దార్ వనజా రెడ్డి, వివిధ శాఖల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ మెట్ పల్లి జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం అని జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తున్నామని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ అన్నారు. ప్రతినెలా నాలుగవ తారీఖున జరిగే సాధారణ సమావేశం బుధవారం రోజున ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించారు.ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్ మహ్మద్ అజీమ్ లు మాట్లాడుతూప్రెస్ క్లబ్ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా సభ్యులందరికీ 15 లక్షల రూపాయల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇట్టి ఇన్సూరెన్స్ లోని ప్రయోజనాలు యాక్సిడెంటల్ డెత్ కి15 లక్షలు, శాశ్వత వైకల్యం చెందిన వారికి 15 లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యం చెందిన వారికి 15 లక్షలు, అత్యవసర వైద్యానికి లక్ష రూపాయలు, విద్యా ప్రయోజనానికి లక్ష రూపాయలు, వివాహ ప్రయోజనానికి లక్ష రూపాయలు, అంత్యక్రియల ఖర్చుకు 5000 రూపాయలు, ఏదైనా ఎముకలు విరిగినప్పుడు 25 వేల రూపాయలు, కాలిన గాయాలకి 10000 రూపాయలు, పాలసీదారుడు కి హాస్పిటల్ లో రూమ్ కోసం రోజుకి 1000 రూపాయలు చొప్పున 15 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఐసీయూలో ఉన్న పేషెంట్ కోసం రూమ్ కి 2000 రూపాయల చొప్పున 15 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న స్కీమ్ సభ్యులందరికీ చేయించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పానుగంటి మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, విజయసాగర్, సభ్యులు ఆదిల్ పాషా, ఏసవిని గణేష్ ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి ఏరియాలో గల ఎన్టీఆర్ నగర్కు చెందిన ఎనగందుల స్వాతి అనే పేద మహిళ బ్రెయిన్ ట్యూమర్తో తీవ్రంగా బాధపడుతూ తగిన చికిత్స అందుకోలేని పరిస్థితిలో ఉన్న సమాచారం చెన్నూరు శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి కి తెలియడంతో వెంటనే స్పందించి, ఆమె చికిత్స కోసం అవసరమైన ఎల్ఓసి ని మంజూరు చేశారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు బుదవారం బాధిత మహిళకు ఆమె నివాసంలో ఎల్ఓసి ని కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్ అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడారు.పేద ప్రజల పట్ల ఎమ్మెల్యే వివేక్ కు ఉన్న ప్రేమ వెలకట్టలేనిదని అన్నారు.స్వాతి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వివేక్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ, తక్షణ చికిత్స కోసం ఆసుపత్రికి ప్రయాణమయ్యారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మొట్టె సుధాకర్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గుర్రం అనిల్ కుమార్, యువజన నాయకులు కునారపు శివకుమార్ , ఊటూరి చంద్రయ్య, యాదగిరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి సరిపడా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి.
కారేపల్లి నేటి ధాత్రి
వ్యవసాయ సీజన్ ఒక నెల ముందు ప్రారంభం కావడంతో రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు విత్తనాలు నాణ్యమైన ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచే రైతులను ఆదుకోవాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేసి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నాడు కారేపల్లి మండలం టేకులగూడెంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం ఖమ్మం డివిజన్ మహాసభలో ముఖ్యఅతిగా పాల్గొని ప్రారంభిస్తూ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు పొద్దున లేస్తే రైతు గురించి రైతు సంక్షేమం గురించే మాట్లాడుతున్నారని రైతు సంక్షేమం గురించి పాలకులు ఉన్న ఈ దేశంలో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతును వేధించటం సరికాదని ఆయన అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు భరోసా లాంటి తదితర పథకాలను 100% అమలు చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు లక్షలాదిమంది ఆదివాసి గిరిజనులు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న వేల ఎకరాలకు ఈనాటి కోడి భూములకు పట్టాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ఉందని ఆయన అన్నారు అనంతరం అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు ఆవల వెంకటేశ్వరావు మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలను నిల్వచేసుకునేందుకు వీలుగా అన్ని మండలాలలో గిడ్డంగులు నిర్మించాలని చెప్పి వారు కోరారు మోడీ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల మార్కెట్ విధానం మొత్తం ప్రైవేటు వారి చేతుల్లోకి వెళుతుందని దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర రాకపోగా మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముందు రైతు సంఘం జెండాను జిల్లా కార్యదర్శి ఆవులు వెంకటేశ్వర్లు ఎగరవేయగా అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఈ సభలో రైతు సంఘం నాయకులు కొల్లేటి నాగేశ్వరరావు కేలోతు లక్ష్మణ్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్ ఝాన్సీ ప్రసంగించగా ఈ మహాసభకు గుగులోత్ తేజ నాయక్ అధ్యక్షత వర్గంగా వ్యవహరించగా నాయకులు రాకేష్ గుమ్మడి సందీప్ బిక్కసాని భాస్కర్ సత్తిరెడ్డి లక్పతి వీరబాబు మదర్ సాహెబ్ సక్రు నాగయ్య పాపారావు సరోజిని అనసూర్య తదితరులు పాల్గొన్నారు అనంతరం ఖమ్మం డివిజన్ నూతన కమిటీని 17 మందితో ఎన్నుకోగా డివిజన్ అధ్యక్షులుగా ధరావత్ లక్ష్మణ్ కార్యదర్శిగా తేజ నాయక్ ఉపాధ్యక్షులుగా సత్తిరెడ్డి భాస్కర్ పుప్పాల రామారావు వీరబాబు లతో కూడిన 17 మందితో కమిటీ ఎన్నుకోవడం జరిగింది.
• ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలు గుర్తించాలి.
ప్రమాదం జరగడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
• ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టీకరణ
జడ్చర్ల నేటి ధాత్రి:
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడితే సహించేది లేదని, అందుకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. జడ్చర్ల పట్టణంలోని మూడవ వార్డులో బుధవారం విద్యుత్ షాక్ తో శ్రేయాన్స్ అనే పదేళ్ల బాలుడు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రక్షణ లేని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లనున్నాయని వాటి కారణంగా ప్రజల ప్రాణాలకు ఆపద వాటిల్లకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని స్పష్టం చేసారు. ప్రత్యేకించి వానకాలంలో విద్యుత్ ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అన్ని ప్రాంతాల్లోనూ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను గురించి సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి కోరారు. రక్షణ లేని ట్రాన్ఫర్మర్ల వద్ద ప్రమాదాలు జరగడంతో పాటుగా గాలి వానలకు విద్యుత్ వైర్లు తెగిపడటం వల్ల కూడా ప్రాణాలు పోయే ప్రమాదాలు సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేసారు. అందుకే అధికారులు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాతంతాలను గుర్తించి, వాటిని నివారించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని సూచించారు. దీని కోసం అవసరమైతే అదనపు నిధులను ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి తాను కృషి చేస్తానన్నారు. అయితే ఇటీవల జడ్చర్లలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో అధికార సిబ్బంది నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడితే తాను సహించేది లేదని, అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.
హృదయం ద్రవించిపోయింది
బుధవారం జడ్చర్లలోని 3వ వార్డులో విద్యుత్ షాక్ తో మరణించిన శ్రేయాన్స్ ను చూసి తన హృదయం ద్రవించి పోయిందని, జరిగిన సంఘటన తనను కలచివేసిందని అనిరుధ్ చెప్పారు. శ్రేయాన్స్ తండ్రి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొక్కా రాఘవేందర్ ను ఎమ్మెల్యే ఫోన్ లో పరామర్శించారు. బంగారు భవిస్యత్తు కలిగిన బాలుడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం ఎంతో బాధాకరమని చెప్పారు. ఆ చిన్నారి బాలుడు మృతితో ఆ కుటుంబానికి ఏర్పడిన లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు. ఈ ఆపద సమయంలో ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాతృమూర్తి శశికళారెడ్డి శ్రేయాన్స్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాఘవేందర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మాజి పాక్స్ చైర్మన్ బస్వరాజు గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఝరాసంగం పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,యువ నాయకులు మిథున్ రాజ్ ,మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్ , బస్వరాజ్ తదితరులు.
గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్యాలారం బసవరాజ్ ఝరాసంగం పట్టణంలోని నూతనంగా గృహప్రవేశం చేస్తున్న బసవరాజ్ గారికి గృహప్రవేశం శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ వాడితోపాటు కాంగ్రెస్ నాయకులు కుతుబుద్దీన్ సత్తార్ భాయ్ ఎజాస్ బాబా బిజీ సందీప్ తదితరులు ఉన్నారు.
ఉపాధి హామీ పని ప్రదేశంలో ప్రథమ చికిత్స నీడ నీటి సౌకర్యాలు కల్పించాలి.
డి ఆర్ డి ఓ.పోరిక బాల కృష్ణ
చిట్యాల నేటిధాత్రి:
జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల ప్రజా పరిశత్ కార్యాలయం వారంతా సమావేశంనకు ముఖ్య అడతిథులు గా డి ఆర్ డి ఓ పోరిక బాల కృష్ణ (జిల్లా గ్రామీన అభివృద్ధీ అధికారి హాజరయ్యారు ఈ సందర్బంగా డిఆర్ ర్డీవో మీటింగ్ లో మాట్లాడుతూ దీనసరి కూలి 307/- రూపాయలు వచ్చు విధంగా మా సిబ్బంది కి సూచనలు చేశాము వాళ్ళు చెప్పిన కొలతల ప్రకారం పని చేసి 300 ల నుండి 307 రూపాయలు వచ్చు విధంగా పని చేయమని చెప్పారు అదేవిధంగా పని వద్ద కచ్చితంగా నీడ, ప్రధమ చికిత్స పెట్టె, నీటి సౌకర్యం విధిగా పంచాయతీ కార్యదరషులకు కల్పించాలని చెప్పారు తర్వాత రేపు రాబోయే వనమహోత్సవం కార్యక్రమమాo క్రింద తీసుకున్న స్థలాలను పంపించి టార్గెట్ ప్రకారం నాటించాలి అని చెప్పారు ఎస్సి ఎస్టీ చిన్న సానకారు రైతులకు పండ్ల తోటలపథకం క్రింద అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని చెప్పాడు మండల కార్యాలయనకు వచ్చిన పంచాయతీ కార్యదర్శులకి ఫీల్డ్ అసిస్టెంట్స్ కి సమీక్ష సమావేశం తీసుకున్నారు ఈ కార్యక్రమం లొ జయశ్రీ ఎంపీడీఓ క్వాలిటీ కాట్రోలర్ ధర్మషింగ్ , ఏపీవో అలీం,సాంకేతిక సహాయకులు, సుధాకర్, అపర్ణ, స్వామి, స్రవంతి , పంచాయతీ కార్యదర్శలు,స్వచ్చా జిల్లా కోర్డినేటర్ వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ పోలీసులు బుధవారం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజలకు పలు విషయాలపై సైబర్ క్రైమ్ పై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మొబైల్ ద్వారానే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయని సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు, యువత అవగాహన పెంచుకుని ఏటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొబైల్ వినియోగదారులు అపరిచిత వ్యక్తులకు ఓటిపి, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై సుజ్ఞానం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని నియంత్రించాలి…
పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు…
నేటి ధాత్రి -మహబూబాబాద్ :-
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అద్వానంగా ఉండి, బడిబాట కార్యక్రమం మొక్కుబడిగా కొనసాగుతున్నదనీ తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు డిమాండ్ చేశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ ను కలిసి విద్యారంగ సమస్యలపై పి డి ఎస్ యు ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ,విద్యార్థులు లేరనే సాకుతో మూసివేతకు గురవుతున్న పాఠశాలలకు లోతైన పరిశీలన చేసి మూసివేతకు గురికాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మరోపక్క ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలిశాయనీ తమ ఇష్టానుసారం ఫీజులు దండుకుంటూ హంగు ఆర్భాటాలు చూపించే విధంగా కరపత్రాలు పట్టుకొని గ్రామాలపై దండయాత్ర వలె అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారనీ తెలిపారు.ఉన్నత అధికారులు ఫీజుల దోపిడిని నియంత్రించి, కార్పొరేటు,ప్రైవేటు అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.వివిధ రకాలుగా టై, బెల్టు, పాఠ్యపుస్తకాల పేరుతో వసూలు చేస్తున్న జీరో దందాను నిలువరించాలని, పేద,మధ్యతరగతి కుటుంబాల పిల్లల తల్లిదండ్రులను ఆర్ధిక భారం నుండి బయటపడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విజయ్,పట్టణ నాయకులు శేఖర్, దీపక్, సుందర్,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగు, కొక్కరకుంట, వన్నారం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామడుగు మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ మండల అధికారులు గ్రామాల్లో ప్రతీ ఇంటికి తిరిగి ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా సరైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా చూసుకోవాలని, లబ్ధిదారులు సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో గోపాలరావుపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, వెన్న రాజమల్లయ్య, రామడుగు కార్యదర్శి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడే శంకర్, పంజాల శ్రీనివాస్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ కర్ణ శీను, పొన్నం మల్లేశం, బత్తిని అజయ్, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బి.రవి రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి…
నేటి ధాత్రి – మహబూబాబాద్ :-
జిల్లాలో వ్యాప్తంగా పనిచేస్తున్న ఫార్మసీ వైద్య సిబ్బంది అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించిన తాత్కాలిక పద్ధతులైన అంతరా ఇంజక్షన్స్, ఓరల్ పిల్స్,ఐ యు సి డి జిల్లాకు వచ్చినఅన్ని రకాల మందులు పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఫార్మసీ వైద్య సిబ్బందిలో తో ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ,వర్షాకాలంలో మందులన్నీ మూడు నెలల స్టాక్ ఉంచుకోవాలని కోరడం సూచించారు.
Dr. B. Ravi Rathod, District Medical Health Officer.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ లక్ష్మీనారాయణ,డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సారంగం, డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ కొప్పు ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కెవి రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ,లోక్య,ఫార్మసీ ఆఫీసర్ రామారావు, డిపిఓ నీలోహన, డిడిఎం సౌమిత్, సూపర్వైజర్ రవి, రాజ్యలక్ష్మి విసిసిఎం, ఫార్మసీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…
గార్ల నేటి ధాత్రి:
మండలంలోని సమీపంలో ఉన్న గార్ల పెద్ద చెరువులో కబ్జాకు గురైన చెరువు శిఖం భూములకు వెంటనే ట్రెంచ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక మంగపతి రావు భవనంలో మల్లెల నాగమణి అధ్యక్షత జరిగిన మండల కమిటీ సమావేశంలో శ్రీనివాస్, సత్యవతిలు మాట్లాడుతూ, మండలానికే అతిపెద్ద చెరువు గా ఉండి,అటు ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇటు రైతుల లెక్కల ప్రకారం సుమారుగా 18 వందల ఎకరాల వరి పంటల భూములకు సాగునీరు అందించే ఈ చెరువు శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుని పట్టాలు చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెంచ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు కె.ఈశ్వర్ లింగం, వి.పి.వెంకటేశ్వర్లు,ఐ.గోవింద్,ఎల్లయ్య, మౌనిక,ఉపేందర్ రెడ్డి, బి.లోకేశ్వరావు,కైబాబు,మౌలానా,సిహెచ్.మౌనిక,ఎ.రామకృష్ణ,కె.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండలం. టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగింది. ఇందిరమ్మ కమిటీ సభ్యులతోపాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో. గ్రామంలో లబ్ధిదారులకు. ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగిందని తెలియజేస్తూ. ఈ సందర్భంగా సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గడ్డం మధుకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సీఎం పరిపాలనలో పేద ప్రజలకు ఇండ్లు లేని లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని సంకల్పంతో ఇల్లు నిర్మించాలని తెలంగాణ ప్రజా పరిపాలనలో ప్రజలు అందరూ. మంచిగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి ధ్యేయంగా. ప్రజా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.పొన్నం ప్రభాకర్ రెడ్డికి. వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ప్రవీణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ కమిటీ సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం రచన. కొంపల్లి శ్యాం. కొండ రాజు. పొన్నం కనకయ్య. అడి గొప్పల రాము. యమునా. ముంతాటి శారద. జ్యోతి. మౌనిక. సంపతి శ్యామల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో జరిగిన రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న రైతులు అధికారులు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో జూన్ 4న రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం రైతు వేదికలో జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే యూరియాను పచ్చి రొట్ట ఎరువులను వర్మి కంపోస్టు జీవన ఎరులను భూసార పరీక్ష ఫలితాలను బట్టి పంటలకు ఎరువులను.
అందించడం బట్టి రసాయన ఆధారిత పురుగు మందులను.మాత్రమే ఉపయోగించడం మరియు సమగ్ర సస్య రక్షణ పద్ధతులను పాటించడం పంట కోసం చేసిన వివిధ విత్తనాలను రసాయనిక ఎరులను మరియు రసాయనిక మందులు కొనుగోలు చేసిన రసీదులను.
భద్ర పరచాలని. సాగునుటి యజమాన్యం తడి పొడి పద్ధతితో పాటు వరి సాగు.
మల్చింగ్ సుస్థిరమైన వ్యవసాయ కోసం పంట మార్పిడి మరియు పంట వైవిద్దీకరణ పూల మరియు మునగ సాగు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం యూట్యూబ్ ఛానల్ ను మరియు ఏ యు వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమాన్ని..
ఉపయోగించడం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం రైతుల వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటకు సంబంధించిన విషయాలపై చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు తదుపరి కార్యక్రమంలో అంశాలను పాటిస్తామన్నారు ఇట్టి కార్యక్రమంలో.
శాస్త్రవేత్తలు. డాక్టర్ . సిహెచ్. రమేష్. డాక్టర్ హిందూజ. ఎన్ ఏ..lcar.llrr. శాస్త్రవేత్త డాక్టర్ శృతి. కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు. శ్రీనివాస్ రెడ్డి. వేణుగోపాల్. వ్యవసాయ అధికారి. కే సంజీవ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
ఈ శ్రీనివాస్ రెడ్డి. ప్రాథమిక వ్యవసాయ సహాయ సంగం చైర్మన్ కె భాస్కర్. విజేందర్ రెడ్డి. వ్యవసాయ విస్తరణ అధికారులు. గౌతమ్ లక్ష్మణ్. విద్యార్థులు సిద్ధార్థ్ మరియు సన్నీ ప్రసాద్ రైతులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.