సైబర్‌ నేరాలపై యువతక అవగాహన.

సైబర్‌ నేరాలపై యువతక అవగాహన…

బాలానగర్ నేటి ధాత్రి:

 

సైబర్‌ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ పోలీసులు బుధవారం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజలకు పలు విషయాలపై సైబర్ క్రైమ్ పై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మొబైల్‌ ద్వారానే 80 శాతం సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు, యువత అవగాహన పెంచుకుని ఏటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొబైల్ వినియోగదారులు అపరిచిత వ్యక్తులకు ఓటిపి, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై సుజ్ఞానం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version