రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందాలీ మండల బిజెపి అధ్యక్షులు..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల బిజెపి పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తల సమావేశంలో పలు విషయాలపై చర్చించి వివరాలు వెల్లడించిన మండల బిజెపి అధ్యక్షులు వే న్నమనేని శ్రీధర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోవు సర్పంచ్ ఎన్నికల్లో మరియు వార్డ్ మెంబర్స్.పోటీ చేయడం కొరకు విధి విధానాల గురించి చర్చించడంతోపాటుప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి జాతీయ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించాలని అలాగే ప్రతి ఇంటికి వెళ్లి 420 హామీలు వాటి మోసాలను వివరించాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ కి. బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇతర పార్టీల అందరికీప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి చేసిన అనేక సంక్షేమ పథకాల గురించి సంస్కరణ గురించి ప్రతి ఇంటికి గడప.గడపన తెలియజేయాలని ప్రతి కార్యకర్త తమ కర్తవ్యం గా పనిచేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు. జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటిరాజు. మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు. కోసినీ వినయ్ యాదవ్. ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల ఆశీర్వాద్.బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు మోర్చా అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్చార్జులుమహిళా బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
