ముగిసిన నామినేషన్ల పర్వం.

ముగిసిన నామినేషన్ల పర్వం

* 24 బిజెపి అభ్యర్థి పాలెంకర్ పద్మ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, జనవరి 30( ప్రజా జ్యోతి న్యూస్ )పట్టణ పురపాలక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో 24 వార్డ్ బిజెపి అభ్యర్థి పాలెంకర్ పద్మ నామినేషన్ దాఖలు చేశారు. వారి వెనుక బిజెపి నాయకుడు పాలెంకర్ సంతోష్ కాలోని వాసులు పాల్గొన్నారు అని తెలియజేశారు. అనంతరం చివరి రోజు(శుక్రవారం) కావడంతో పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు భారీ ర్యాలీలు, బాజాభజంత్రీలతో మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. అభ్యర్థుల మద్దతుదారులతో పరిసర ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. పోలీసులు ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వ హించారు. అభ్యర్థి తోపాటు పాలిoకార్ మహేష్, చిరంజీవి, డప్పు విజయ్, సంతోష్ తదితరులు ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడం తో పట్టణంలో ప్రచార పర్వం ఊపందు కోనుంది.

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్న జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్న జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

◆:- తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి

◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా,హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి వారితో పాటు పుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహిం, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి,కూన.శ్రీశైలం గౌడ్,ఆవుల రాజిరెడ్డి మరియు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version