పరకాలలో కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబరాలు
రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్
పరకాల,నేటిధాత్రి
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందిన సందర్బంగా పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా కాల్చి,స్వీట్లు పంచి సంబరాలను జరుపుకున్నారు.ఈ గెలుపు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనమని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలుపుతూ గెలుపొందిన నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలే కాక తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని ఎన్నిక ఏదైనా గెలుపు ఇకనుండి కాంగ్రెస్ పార్టీ దే అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,ఏఎంసీ వైస్ చైర్మన్ బుజ్జన్న,రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మడికొండ శ్రీను,సమన్వయ కమిటీ సభ్యులు,చిన్నాల గోనాథ్ ఈర్ల చిన్ని,పంచగిరి జయమ్మ,చందుపట్ల రాఘవరెడ్డి,దుబాసి వెంకటస్వామి,పసుల రమేష్,మార్క రఘుపతి గౌడ్,సదానందం గౌడ్,పోరండ్ల సంతోష్,మడికొండ సంపత్ కుమార్,మంద నాగరాజు,రఘు నారాయణ,దార్నా వేణుగోపాల్,బొమ్మ కంటి చంద్రమౌళి,దుప్పటి సాంబశివుడు,బొచ్చు భాస్కర్,దావు పరమేశ్వర్,దుగ్గేల వినయ్,బాసాని సుమన్,సురేష్,బండారి కృష్ణ,మచ్చ సుమన్,నాగరాజు,సదన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
