కోహిర్ మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న మజ్లిస్ పార్టీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. ఏఐఎంఐఎం పార్టీ తన పట్టు నిరూపించుకోవడానికి ఆరుగురు అభ్యర్థులను బరిలోకి దించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కోహిర్ పట్టణ వీధుల్లో ప్రచారం చేస్తూ, మజ్లిస్ గుర్తు ‘పతంగి’ (గాలిపటం) కు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.కోహిర్ పట్టణలో మజ్లిస్ జెండా ఎగరేసి ‘పతంగి’ పార్టీ అధ్యక్షునికి బహుమతిగా అందజేస్తామని పార్టీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ అన్నారు మొట్టమొదటిసారిగా కోహిర్ పట్టణంలో మున్సిపాల్ ఎన్నికలు జరగడం వల్ల పతంగి ఎగరేసి పార్టీని బలపరిస్తానని భారీ మెజారిటీతో మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న మజ్లిస్ ‘పతంగి’పార్టీ
