కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు సిరిసిల్ల జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తూ .గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం.ప్రవీణ్ .సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి.ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత.నలినికాంత్ గారి తో. ప్రచారంలో తంగళ్ళ పల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో వాడవాడల గడపగడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత నలినీ కాంత్ గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలనుదృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు .ఉంచుతున్నారని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిఅప్పుల పాలు చేస్తే దాన్ని అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువస్తూ అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత నలిని కాంత్.గార్లను మీ ఆశీర్వాదంతో అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తూ ఓటు అభ్యర్థిస్తూ ఓటర్లనువేడుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ చైర్మన్ వేల్పుల స్వరూప తిరుపతిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళా పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ…

ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ
– తెలంగాణ కోసం చేసిన ఉద్యమం స్ఫూర్తిదాయకం
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల
సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే
మహేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితమే ఒక ప్రేరణ అని అన్నారు.
ఆయన తెలంగాణ కోసం చేసిన ఉద్యమం, రైతు హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు.

 

ఈ తరానికి బాపూజీ ఒక ఆదర్శమని అన్నారు. తన రాజకీయ జీవితమంతా సాధారణ ప్రజల కోసం అర్పించిన మహానుభావుడు బాపూజీ అని అన్నారు.
ముఖ్యంగా రైతాంగం కోసం నిస్వార్థంగా కృషి చేశారనీ అన్నారు.
ఆయన చూపిన మార్గం పల్లెబాటలో నడిపే వెలుగుదీపమని అన్నారు.
వారి ఆలోచనలు నేటి తరం స్పూర్తిగా తీసుకోవాలనీ, ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.

ఆయన ఆశయాల సాధనకోసం కృషి చేయాలని అన్నారు.
హైదరాబాద్ సంస్థాన ప్రజలకోసం నిజాం ను ఎదిరించిన యోధుడు,తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన తెలంగాణ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలను
ప్రతిభావంతులైన చేనేత కళాకారులను ప్రోత్సహించేదుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, వస్త్ర వ్యాపార, అనుబంధ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version