చర్లపల్లి పాఠశాలలో కార్గిల్ దివాస్ రజితోత్సవ సభ..

చర్లపల్లి పాఠశాలలో కార్గిల్ దివాస్ రజితోత్సవ సభ

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో కార్గిల్ దివాస్ విజయోత్సవ సభను ఘనంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కార్గిల్లో వీరమరణం పొందిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
భారత్ పాకిస్తాన్ మధ్య మే 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగిందనీ ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు,కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం అని,యుద్ధ ప్రారంభదశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యిందనీ, నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుందనీ,అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగిందనీ,ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ అని, ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయనీ అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది అని అన్నారు.దివాస్ ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారనీ, 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారనీ,ఈ సందర్భంగా,భారత సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలను స్మరించుకుంటారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకవత్ దేవా,కంచ రాజు కుమార్ అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ నందిపాటి సంధ్య,నిడిగొండ అక్షయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
-టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా శనివారం పట్టణంతోపాటు మండలంలోని చర్లపాలెం, గోపాలగిరి, గుర్తురు, చింతలపల్లి, కొమ్మనపల్లి తండ గ్రామాలలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలను ఎల్లవేళలా అన్ని విధాలుగా కాపాడుకుంటామని,పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను అన్ని విధాలుగా అండగా నిలుస్తానని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అన్ని స్థానాలలో గెలిపించి సత్తా చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, పెదగాని సోమయ్య, డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు, మంగళపల్లి రామచంద్రయ్య,జినుగా సురేందర్ రెడ్డి, జక్కుల రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దేవేందర్ రెడ్డి,కందాడి అచ్చిరెడ్డి,పెరటి యాకూబ్ రెడ్డి,కాందాడి అశోక్ రెడ్డి,కంచర్ల వెంకటాచారి, ధరావత్ సోమన్న, పంజా కల్పన,మోత్కూరి రవీంద్ర చారి, బాలకృష్ణ,రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్,పాడ్యా రమేష్ నాయక్,వల్లపు మల్లయ్య, ధర్మారపు మహేందర్, యనమల శ్రీనివాస్,అలువాల సోమయ్య, వెలుగు మహేశ్వరి,తోట అశోక్,మనోహర్, వెంకన్న, ఉపేంద్ర,గిరిధర్, పరశురాములు,బుచ్చి రాములు,మురళి తదితరులు పాల్గొన్నారు.

సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి..

సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

దేశ రక్షణ కోసం పాటుపడే సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని సంక్షేమ బాలికల గురుకులం ప్రిన్సిపాల్ విజయరత్నమాల తెలిపారు.

కార్గిల్ విజయ దివస్ ను పురస్కరించుకొని మేరా యువభారత్, నవయుగ విజన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం డివిజన్ కేంద్రంలోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
అమర సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు.

నవయుగ విజన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బానోతు వీరన్న నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ….

1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు శత్రుదేశంపై అసమాన పరాక్రమం ప్రదర్శించారని కొనియాడారు. శత్రు సైనికులను మట్టుబెట్టి ఆపరేషన్ విజయ్ ను విజయవంతం చేశారన్నారు. ఎందరో సైనికుల త్యాగాల ఫలితంగా భారత్ సురక్షితంగా ఉందని, వారి త్యాగాలను ఏటాస్మరించుకోవాలన్నారు. యువత, విద్యార్థులు దేశభక్తుని పెంపొందించుకోవాలని, సైన్యంలో చేరి సేవలు అందించేందుకు ముందు వరసలో నిలవాలని కోరారు.

సైనికుల త్యాగాలకు ప్రతిబింబం కార్గిల్ దివస్..

సైనికుల త్యాగాలకు ప్రతిబింబం కార్గిల్ దివస్

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

సైనికుల త్యాగాలకు ప్రతిబింబం కార్గిల్ దివస్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో డి.సి.పి. ఎ.భాస్కర్, మంచిర్యాల ఎ.సి.పి. ప్రకాష్ లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్గిల్ దివస్ కార్యక్రమాన్ని కార్మికుల త్యాగాలకు ప్రతిబింబమని, భావితరాలకు తెలిసే విధంగా జరుపుకుంటున్నామని తెలిపారు.1999 లో నావీ, ఎయిర్ ఫోర్స్,ఆర్మీ సమిష్టిగా పోరాడి మన దేశ సరిహద్దులను కాపాడారని,ఆ సమయంలో పోరాడి అమరులైన సైనికుల త్యాగాలను స్మరించుకోవాలని తెలిపారు.భారత దేశాన్ని సరిహద్దులలో సైనికులు 365 రోజులు 24 గంటలు ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నారని,దేశ ప్రజల రక్షణ కోసం అందరినీ వదిలి దేశ సేవలో ఉన్నారని తెలిపారు.నిరంతరం విధులు నిర్వహిస్తున్న సైనికులకు గౌరవంగా కార్గిల్ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని తెలిపారు.మాజీ సైనికులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,పోలీస్ అధికారులు,ఎన్.సి.సి. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాల్లో పద్మశాలీలు ముందుండాలి..

రాజకీయాల్లో పద్మశాలీలు ముందుండాలి

అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బాపు

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలో అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బాపు ఆధ్వర్యంలో శనివారం మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాపు మాట్లాడుతూ పద్మశాలీలు చరిత్రకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించారన్నారు. వృత్తిపరంగా,విద్యారంగంలో, వ్యాపారాలలో స్ఫూర్తిదాయకంగా ఎదిగున్నారు.కానీ రాజకీయ ప్రతినిధులు లోపించడం వల్ల సమాజ మొత్తానికి అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇకనైనా చైతన్యంతో ముందుకు వచ్చి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలి వర్గానికి చెందిన యువత సామాజికంగా విశ్వసయనీయత కలిగిన నాయకులు జెడ్పిటిసి, ఎంపీటీసీ,సర్పంచ్,వార్డ్ మెంబర్ పదవుల కోసం పోటీచేసి గెలిచి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పద్మశాలి కులస్తుల సమావేశంలో మండల నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మండల సంఘం అధ్యక్షుడిగా వేముల మల్లేష్,ప్రధాన కార్యదర్శిగా దుస్సా భూమన్న అవినాష్, ఉపాధ్యక్షుడిగా కొత్తపల్లి తిరుపతి,ప్రచార కార్యదర్శి, కార్యవర్గ సభ్యులుగా పలు గ్రామాల ప్రతినిధులను ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా నూతన కమిటీని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శివ్వారం సర్పంచ్ ఆవిడపు గణేష్, జైపూర్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు కర్ణ భూమన్న,సభ్యులు మల్లేష్, డాక్టర్ శంకర్,ఇప్పపల్లి రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

వర్గ సామాజిక జమిలి పోరాటాలే దోపిడికి ప్రత్యామ్నయం..

వర్గ సామాజిక జమిలి పోరాటాలే దోపిడికి ప్రత్యామ్నయం

సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలే మార్గం

ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

కార్పొరేట్ పెట్టుబడి దారి అనుకూల పాలకుల దోపిడీ విధానాలకు వర్గ సామాజిక ఐక్య పోరాటాలే ప్రత్యామ్నాయన్ని చూపిస్తాయని ఆ దిశలో వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రజా ఉద్యమాల నిర్మించాలని ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపునిచ్చారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ నగర ప్లీనరీ సమావేశం కామ్రేడ్ ఎగ్గేని మల్లిఖార్జున్, ఐతం నాగేష్, మలోత్ ప్రత్యూష అధ్యక్ష వర్గంగా కరిమాబాద్ మున్నూరుకాపు సంఘం భవన్ లో జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న గాదగోని రవి మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి తమ ఇష్టానుసారంగా పాలను కొనసాగిస్తూ ప్రజల ఆశలను అడియాశలు చేస్తున్నారని ఈ క్రమంలో పేద మధ్యతరగతి ప్రజలపై నిత్యవసర వస్తువుల ధరల భారం విపరీతంగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందన్నారు. ప్రజల మధ్యన ఐక్యత లేకుండా కుల మత ప్రాంత విభేదాలతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోడీ పాలన కొనసాగుతున్నదని నిర్బంధాలను ప్రయోగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వినాశనకర విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి సామాజిక వర్గ పోరాటాలను ఐక్యంగా నడిపించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు ఆ దిశలో ఎంసిపిఐ(యు) కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో అనేక సమస్యలు తిష్ట వేశాయని గత ప్రస్తుత పాలకులు హామీలకే పరిమితం అవుతూ జిల్లా అభివృద్ధిని విస్మరించారని విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్న పట్టించుకోకుండా పేదలు తలదాచుకోవడానికి గుడిసెలు వేసుకుంటే మాత్రం నానా బీభత్సం చేస్తూ నిర్బంధం ప్రయోగిస్తున్నారని రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ ను తీర్చి దిద్దుతామని గొప్పలు చెప్పి ఆచరణలో ప్రచార అర్పటం తప్ప చేసింది శూన్యమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా పోరాటాలే ప్రజా సమస్యల పరిష్కారానికి వరంగల్ జిల్లా అభివృద్ధికి తోడ్పాటును ఇస్తాయని అన్నారు.
అనంతరం పార్టీ నగర నిర్మాణం ప్రజా పోరాటాలపై కామ్రేడ్ సుంచు జగదీశ్వర్ రిపోర్టు ప్రవేశపెట్టగా ప్రతినిధులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు నర్ర ప్రతాప్, మంద రవి, కన్నం వెంకన్న, వంగల రాగసుధ, మాలోత్ సాగర్, ముక్కేర రామస్వామి, పరిమళ గోవర్ధన్ రాజు, మాలోతూ ప్రత్యూష, తాటికాయల రత్నం, మాలి ప్రభాకర్, మహమ్మద్ ఇస్మాయిల్, నరసయ్య, దాసు రవి, రాజేందర్, యాదగిరి,మాధవి,స్వప్న లతోపాటు నగరంలోని ప్రతినిధులు పాల్గొన్నారు.

హుజురాబాద్ ఏసిపి కుటుంబాన్ని పరామర్శ..

హుజురాబాద్ ఏసిపి కుటుంబాన్ని పరామర్శ

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

హుజరాబాద్ ఏసీబీ వాసంశెట్టి మాధవి భర్త జిదుల మహేష్ కుమార్ ఆకస్మికoగా గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరం కరీంనగర్ వారి నివాసంలో మహేష్ కుమార్ చిత్రపటానికి పువ్వుల మాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవునూరి శ్రీనివాస్,దీటి సుధాకర్ రావు, దాసరపు చందు, కురుమిండ్ల సుకేష్ పాల్గొన్నారు.

అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌కు రూ.5 ల‌క్ష‌లు…

అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌కు రూ.5 ల‌క్ష‌లు

వ‌చ్చేనెల‌ 15లోగా ఇండ్ల కేటాయింపు పూర్తి చేయాలి

ఇందిర‌మ్మ ఇండ్ల స‌మ‌స్య‌లు, ఫిర్యాదుల ప‌రిష్కారానికి టోల్ ఫ్రీ నెంబ‌ర్‌

వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్ధికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు

రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ ,వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

హైద‌రాబాద్,నేటిధాత్రి:

ఇందిర‌మ్మ ఇండ్ల స‌ర్వేలో ఇండ్ల స్ధ‌లాలు లేని అర్హ‌త క‌లిగిన ల‌బ్దిదారుల‌కు అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను వ‌చ్చే నెల 15వ తేదీలోగా కేటాయించాల‌ని, ఇందుకు అర్హులైన ల‌బ్దిదారుల ఎంపిక‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.అంపూర్తిగా ఉన్న ఇండ్ల‌ను పూర్తిచేసుకోవ‌డానికి ప్ర‌భుత్వ‌మే ల‌బ్దిదారుల‌కు 5 ల‌క్ష‌ల రూపాయిలు ఆర్ధిక స‌హాయాన్ని అందిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌కు ద‌ర‌ఖాస్తు ఎప్పుడు చేసుకున్నార‌నేది ముఖ్యం కాద‌ని నిరుపేద‌ల‌కు ఇండ్లు ఇవ్వడ‌మే ప్ర‌ధాన‌మ‌న్నారు. ఇప్పుడు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాకూడా వాటిని ప‌రిశీలించాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.ఇందిర‌మ్మ ఇండ్ల‌కు సంబంధించి ఇసుక, చెల్లింపులు, ల‌బ్దిదారుల ఎంపిక‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. శ్రావ‌ణ మాసం మొద‌లైన నేప‌ధ్యంలో త్వ‌ర‌లోనే ఇందిర‌మ్మ ఇండ్ల గృహ ప్ర‌వేశాలు కూడా ఉంటాయ‌ని తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల‌కు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హైద‌రాబాద్‌లోని హౌసింగ్ కార్యాల‌యంలో త్వ‌ర‌లో ఒక టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెల‌పారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల ప్ర‌కారం శాస‌న‌స‌భ్యుల‌ను భాగ‌స్వామ్యం చేసి ప్ర‌తి మండ‌లంలో రేష‌న్ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని ఇందుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అధికారులను ఆదేశించారు.డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ రాష్ట్ర సచివాలయంలో శ‌నివారం వరంగల్ నగర అభివృద్ధిపై పంచాయితీరాజ్ శాఖ‌ మంత్రి సీత‌క్క‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ,ముఖ్యమంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డితో కలిసి వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం,మెగా టెక్స్‌టైల్ పార్క్‌, భద్రకాళి దేవస్థానం,అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ,ఔట‌ర్‌రింగ్ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై మంత్రి పొంగులేటి స‌మీక్షించారు.ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌కు అనుగుణంగా చారిత్రాత్మ‌క వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా చేయాల‌న్ని సంక‌ల్పంతో ప‌నిచేస్తున్నామ‌ని పేర్కొన్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌ను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప‌నిచేయాల‌న్నారు. వ‌రంగ‌ల్ అభివృద్దికి చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాలకు సంబంధించిన డి.పి.ఆర్‌. టెండ‌ర్‌, ప‌నులు ప్రారంభించ‌డానికి, పూర్తి చేయ‌డానికి ఒక‌ ల‌క్ష్యాన్ని నిర్ధేశించుకొని ప‌నిచేయాల‌ని మంత్రి సూచించారు.

Indiramma housing issues

వ‌రంగ‌ల్ ప్రాంత చిర‌కాల స్వ‌ప్న‌మైన మామునూరు ఎయిర్ పోర్ట్ క‌ల త్వ‌ర‌లో సాకారం కానుంద‌ని అయితే ఎయిర్ పోర్ట్‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ యుద్ధ ప్రాతిప‌దికన చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భూ సేక‌ర‌ణ‌కు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవ‌ని రెండు రోజుల క్రితం 205 కోట్ల రూపాయిల‌ను విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌ని ఈ భూ సేక‌ర‌ణ‌కు గ్రీన్ ఛాన‌ల్ ద్వారా నిధులు విడుద‌ల చేస్తామ‌న్నారు.కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు సంబంధించి అక్క‌డ రాజీవ్ గాంధీ టౌన్ షిప్‌లో ఆర్ & ఆర్ ప్యాకేజీ కింద 1398 మంది ల‌బ్దిదారుల‌ను గుర్తించి 863 ప్లాట్‌లు కేటాయించ‌డం జ‌రిగింద‌ని తెల‌పారు. ఈ కాల‌నీకి సంబంధించి సెప్టెంబ‌ర్ నెలాఖరు నాటికి మౌలిక‌స‌దుపాయాల క‌ల్ప‌న పూర్తికావాల‌ని ఆదేశించారు. అలాగే వెట‌ర్న‌రీ హాస్పిట‌ల్‌, ప్రాధ‌మిక పాఠ‌శాల‌, గ్రామ పంచాయితీ కార్యాలయ భ‌వ‌నం నిర్మించాల‌ని, మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో స్ధానిక యువ‌తకు ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు.


రూ. 4170 కోట్ల‌తో 2057 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్య‌వ‌స్ధ‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని
ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించ‌డానికి వీలుగా పనుల‌ను విభ‌జించుకొని ద‌శ‌ల వారీగా చేప‌ట్టాల‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.భ‌ద్ర‌కాళి ఆల‌య మాడవీధుల‌తోపాటు క‌ల్యాణ మండ‌పం, పూజారి నివాసం,విద్యుత్ అలంక‌ర‌ణ‌లను వ‌చ్చే ద‌స‌రా నాటికి అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్ర‌ణాళిక‌ను రూపొందించుకొని ప‌నిచేయాల‌ని ఆదేశించారు. అమ్మ‌వారి ఆల‌య అభివృద్ది ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు తానే స్వ‌యంగా వ‌స్తాన‌ని చెప్పారు. రోప్‌వే, గ్లాస్‌బ్రిడ్జి తో స‌హా అన్ని ప‌నులు వ‌చ్చే డిసెంబ‌ర్ క‌ల్లా పూర్తిచేయాల‌న్నారు. భ‌ద్ర‌కాళి చెరువు ప్రాంతంలో ఇంత‌వ‌ర‌కు 3.5 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టిని త‌ర‌లించామ‌ని, 2.06 కోట్ల రూపాయిల మ‌ట్టిని విక్ర‌యించామ‌ని అధికారులు తెలిపారు. ఈ వ‌ర్షాకాలం పూర్త‌యిన వెంట‌నే ఈ చెరువు మ‌ట్టిని త‌ర‌లించాల‌ని మంత్రి సూచించారు. ఆల‌యంలో యంత్రాల సాయంతో భోజ‌న త‌యారీ కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌తామ‌ని దీనికి త‌గ్గ‌ట్టుగా నిర్మాణాలు చేయాల‌న్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా వ‌రంగ‌ల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవ‌స‌ర‌మైన భూమిని గుర్తించాల‌ని సంబంధిత అధికారులకు సూచించారు.హాస్ట‌ల్ లో విధ్యార్ధుల‌కు, హాస్పిట‌ల్ లో ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందేలా చూడ‌డానికి మండ‌లానికి సంబంధించిన ఒక ప్ర‌త్యేక అధికారిని నియ‌మించాల‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ స‌మావేశంలో మహబూబాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు బ‌ల‌రాం నాయిక్‌, శాసన సభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.నాగరాజు,గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌, నాయ‌ని రాజేంద‌ర్‌ రెడ్డి,శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,బస్వరాజు సారయ్య,అంజిరెడ్డి,బండ ప్ర‌కాష్‌, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో పాటు వివిధ శాఖ‌ల‌కు సంబంధించిన రాష్ట్ర స్ధాయి ఉన్న‌తాధికారులు, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన క‌లెక్ట‌ర్లు డాక్టర్ సత్య శారద,స్నేహ శబరీష్,ఎస్పీలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

బస్సు కారు డి ముగ్గురికి గాయాలు.

బస్సు కారు డి ముగ్గురికి గాయాలు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో అనగా 26 7 2025 రోజున జమ్మికుంట నుండి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టిజి 02 జెడ్ 0026 చిట్యాల మండలం లోని కొత్తపేట బస్టాండు వద్ద ఆగి నలుగురు ప్యాసింజర్లను ఎక్కించుకొని అప్పుడే కదులుతున్న సమయంలో గోపాల్పూర్ క్రాస్ నుండి ఒక షిఫ్ట్ కారు ఏపీ 36 ఎక్స్ 9797 అది వేగంగా అజాగ్రత్తగా వచ్చి ప్రభుత్వ బస్సు యొక్క కుడివైపున బలంగా ఢీకొనడంతో బస్సులో ఉన్న ఒక వ్యక్తి మోకాలికి గాయం అయిందని కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా గాయాలు అయినాయి అని అట్టిబస్ డ్రైవర్ (హుజురాబాద్ బస్ డిపో లో ఆర్టీసీ డ్రైవర్) గా పని చేస్తున్న గోలి జనార్ధన్ సన్నాఫ్ పోశెట్టి అను వ్యక్తి దరఖాస్తు ఇచ్చి అజాగ్రత్తగా వచ్చి ప్రభుత్వ బస్సును ఢీకొట్టడంతో బస్సు యొక్క బంపర్ హెడ్లైట్ బాడీ డ్యామేజ్ అయిందని కావున అందుకు కారకులైన కారు డ్రైవర్ (గట్టు రఘు నైన్ పాక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు) పై తగు చట్టారిత చర్యలు తీసుకోవాలని కోరగా చిట్యాల ఎస్ఐ జి శ్రవణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి అన్నదాన

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి అన్నదాన సత్రానికి వస్తువుల విరాళం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

శ్రీకేతకీ సంగమేశ్వరస్వామి అన్నదాన సత్రానికి వస్తువుల విరాళం గ్యాస్ పొయ్యి, స్టీల్ గిన్నెలు, 50 కేజీ అన్నం వండే పాత్రనలను మారుతి ఎన్ కోరే బీదర్ వాస్తవ్యులు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీమండల సర్పంచుల పోరం అధ్యక్షులు రుద్రప్ప పాటిల్,మల్లయ్య స్వామి, తదితరులు పాల్గొని శాలువాతో వారికి సన్మానించి ప్రసాదం అందజేశారు.

42 శాతం బీసీ బిల్లును బిజెపి ఆమోదించి ముస్లింలకు న్యాయం చేయాలి.

42 శాతం బీసీ బిల్లును బిజెపి ఆమోదించి ముస్లింలకు న్యాయం చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి ;

చిట్యాల మండల మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అన్ని రంగాలలో రాజకీయ ప్రాతినిధ్యం కొరకుకులగనన చేపట్టి 42%బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపించడం జరిగినది ముఖ్యంగా ఇందులో ముస్లిం బీసీలకు స్థానం కల్పించడం జరిగినది ఈ బిల్లును రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు అమలు కాకుండా అడ్డుపడుతున్నారు కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు అలాగే మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ఇంకా దేశంలోని మరికొన్ని రాష్ట్రాలలో బీసీ ముస్లింలకు రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా అక్కడి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయివాస్తవంగా స్వాతంత్రానికి పూర్వం 1852లో అంటర్ కమిషన్ బ్రిటిష్ కాలంలోనేముస్లింలలో ఉన్న బీసీ లకు చట్టబద్ధత చేసింది ముఖ్యంగా ముస్లిం లో ఉన్న బీసీ ఎ బి సి గ్రూప్ లకు చెందిన కులాలైన ఫకీరు మెహతారు దూదేకుల ఖురేషి గారెడి చాకలి మంగలి అత్తరు సాహెబులు పాములు పట్టేవారు 14 కులాలకు చెందిన బీసీ ముస్లింలు దాదాపుగా 37 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయము సమాజంలో ఉన్న హిందూ సోదరులకు తెలుసు కావున 42% బిసి బిల్లుకు అడ్డుపడకూడదని మన తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి నాయకులను ముస్లిం బీసీ ఏ బి సి గ్రూపులకు చెందిన కులస్తుల తరపున రాష్ట్ర బిజెపి పెద్దలను కోరుచున్నాము అని మహమ్మద్ రాజ్ మహమ్మద్ విలేకరుల సమావేశంలో తెలియపరిచారు.

వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలి.

వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలి.

చిట్యాల, నేటిధాత్రి :

దేశ,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, తప్పనిసరి అవకాశం ఉన్నకాడ రిజర్వెన్లలోపోటీ చేయడానికి అవకాశం కల్పించాలని వికలాంగుల సంఘం నాయకుడు పుల్ల మల్లయ్య* కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులను కోరారు
శమనవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు అన్ని రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తూన్నాయని అన్నారు . ఈ ప్రభుత్వాలు కొత్త పించలు సంక్షేమ పథకాలు, , అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు , భూమి కొనుగోలు పథకాలు వికలాంగులకు రావలసిన అనేక పథకాలలో అన్యాయం జరుగుతుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బంధులను, అవస్తలను ప్రభుత్వాలు గుర్తించి 5% శాతం రిజర్వేషన్లు కల్పించారని ,త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 5 శాతం రిజర్వేషన్లు సంబంధించిన కేంద్ర , రాష్ట్ర జిల్లా ఎన్నికల అధికారులు అమలు చేసి వికలాంగుందరికి అవకాశం కల్పించాలని కోరారు

చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ

చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రోగ్రాం షెడ్యూల్..

చిత్తూరు(నేటి ధాత్రి):

చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు
27-07-2025 వ తేదీ ఆదివారం ఉదయం 07-00 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరి 08-00 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేయనున్నారు.
అనంతరం
నగరి నియోజకవర్గం,నిండ్ర మండలం, ఉరురు పేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ స్వర్గీయ ఎన్ టి రామారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు,
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరై అన్న నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు..

సింగరేణిలో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను..

సింగరేణిలో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయండి

బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 గనిపై సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ద్వార సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలోయాదగిరి సత్తయ్య అధ్యక్షులు, యతిపతి సారంగపాణి ప్రధాన కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ బొగ్గు పరిశ్రమ పరిరక్షణ కార్మిక హక్కుల సంరక్షణయే లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు,ఉద్యమాలను సింగరేణి కార్మికులు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.గతంలో 1.3 లక్షల ఉద్యోగులతో 30 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగిందని, ప్రస్తుతం 39వేల ఉద్యోగులతో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని కోల్ ఇండియాలో 6.5 లక్షల ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 2 లక్షల ఉద్యోగులతో 800 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు.
ఉత్పత్తిలో పెరుగుదల గణనీయంగా పెరిగిందని, ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిందని అన్నారు.శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ, తక్కువ వేతనం,భద్రత లేని పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులను వినియోగిస్తున్నారు.వారికి కనీస వేతనాలు (హెచ్ పి సి), సురక్షిత పని వాతావరణం, వైద్య సదుపాయాలు,నివాస క్వార్టర్లు లేవు.తెలంగాణ రాష్ట్రం గత 12 సంవత్సరాలుగా కనీస వేతన సవర జరగలేదని సింగరేణిలో కోల్ ఇండియా మాదిరిగా హై పవర్ కమిటీ వేతనాలు ఇప్పటికీ అమలు కాలేదని వెంటనే అమలు చేయుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సింగరేణిలో రాజకీయ జోక్యం విచ్చలవిడిగా పెరిగిందని, సంస్థలు పరిపాలన విభాగం గాడు తప్పిందని అందుకే రాజకీయ జోక్యం తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ట్రాన్స్కో,జెన్కో సంస్థల నుండి బకాయిలు
గత ప్రభుత్వ హయాంలో రూ. 26,000 కోట్లు బకాయిలు ఉండగా,ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఆ మొత్తం రూ. 39,661.57 కోట్లుకి పెరిగిందని విద్యుత్ బొగ్గుబకాయలు చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బొగ్గు బకాయిలు రూ.14,743.25 కోట్లు
విద్యుత్ బకాయిలు రూ.24,918.32 కోట్లు చెల్లింపులకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి
ఉద్యోగ భద్రత,బొగ్గు పరిశ్రమల భవిష్యత్తు, సాంకేతిక సామర్థ్యం పరిరక్షణ కోసం కార్మికులు మరియు ప్రజలతో కలసి ఒక ఉద్యమ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుందని తెలియజేశారు.
జూలై 24 నుండి 31 వరకు బొగ్గు గనుల పైన ద్వారా సమావేశాలు నిర్వహించి కార్మికులను చైతన్య పరచడం.
ఆగస్టు 5 నుండి 14 వరకు కోల్ బెల్టు ప్రాంత గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించడం,ప్రజల అవగాహన కోసం బహిరంగ సభలు నిర్వహించడం.
ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 5 వరకు సింగరేణి కార్మిక వాడలలో బహిరంగ సమావేశాలు,పత్రికా విలేకరుల సమావేశాలు నిర్వహించడం.
సెప్టెంబర్ 15 నుండి జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం.సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.పర్మనెంట్ కార్మికుల సంఖ్య పెంచాలని కనీసం 50% ఉత్పత్తి శాశ్వత ఉద్యోగులతో ఉత్పత్తి జరగాలని విజ్ఞప్తి చేశారు.కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు, సీఎం పిఎఫ్ ఖాతాలు,వైద్యం, క్వార్టర్లు కల్పించాలని,బొగ్గు సంస్థల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని,కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సీఎం పిఎఫ్ వ్యవస్థను పూర్తిగా ఆన్‌లైన్ చేసి పెన్షన్ సమస్యలు పరిష్కారం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం రూ.39,661.57 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని,చట్టబద్ధ బొగ్గు గనుల సేఫ్టీ/భద్రతా చర్యలు అమలు చేయాలి.కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలి.సింగరేణి,కోల్ ఇండియాలలో యూనియన్ వెరిఫికేషన్ ఒకే విధానంలో జరగాలని,ఏపీ ఈ ఎక్స్ జెసిసి, వెల్ఫేర్,సేఫ్టీ కమిటీల సమావేశాలు నియమితంగా చేపట్టాలి.సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా అలవెన్స్ లపై ఆదాయ పన్ను రియంబర్స్ మెంటు చెల్లించాలని,
తదితర డిమాండ్ల పరిష్కారం కొరకు జాతీయ ఆందోళన కార్యక్రమాలలో సింగరేణి కార్మికులు భాగస్వామి కావాలని పిలుపునిచ్చినారు.
ఈ కార్యక్రమంలో నాతాడి శ్రీధర్ రెడ్డి ఏరియా ఉపాధ్యక్షులు,సెంట్రల్ సెక్రెటరీ మాదాసు రవీందర్,సెంట్రల్ ట్రెజరర్ ఆకుల హరి, శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్,ట్రెజరర్ గూడ శ్రీకాంత్,జాయింట్ సెక్రెటరీ మేకల స్వామి,కట్కూరి సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోళ్ళ మహేందర్,ఆర్కె5 ఫిట్ సెక్రెటరీ రామకృష్ణ,అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ చంద్రశేఖర్,టి.కిరణ్ కుమార్,కుంట రాజు,పాగిడి శ్రీకాంత్,చల్ల ప్రశాంత్,బుర్ర అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అమర హాస్పిటల్ లో మెగా మెడికల్ చెకప్..

టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అమర హాస్పిటల్ లో మెగా మెడికల్ చెకప్

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 26:

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) సిబ్బందికి అమర హాస్పిటల్ లో శనివారం మెగా మెడికల్ చెకప్ ప్రారంభమయ్యింది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త ఉత్తర్వులు మేరకు, టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు గారి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ లోని పోలీసులు, అటవీ శాఖ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పూర్తి స్థాయి మెడికల్ చెకప్ లు చేపట్టారు. శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ గౌరినేని రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారుఈ సందర్భంగా

ఎస్పీ పీ శ్రీనివాస్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి వార్షిక మెడికల్ చెకప్ చేయడానికి ఈ ఏడాది అమర హాస్పిటల్ ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది యావన్మందికి రెండు రోజులు పాటు మెడికల్ చెకప్ చేస్తున్నారని తెలిపారు. అమర ఎండీ రమాదేవి మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్ల తనకు ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు. పుష్ప సినిమాలో ఉన్నది సినిమా హీరో అయితే, రియల్ హీరోలు టాస్క్ ఫోర్స్ సిబ్బందే నని కొనియాడారు. మున్ముందు అవసరమైన ఇతర చికిత్సలు కూడా అందజేస్తామని చెప్పారు. అమర చైర్మన్ డాక్టర్ గౌరినేని ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యం గా ఉండటమే జీవితంలో నిజమైన విజయం సాధించడమని తెలిపారు. మెడికల్ చెకప్ లో భాగంగా రక్త పరీక్షలు, బీపీ, ఈసీజీ లాంటి టెస్ట్ లు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు జి. బాలిరెడ్డి. వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్, ఆర్ఐలు కృపానంద, సాయి గిరిధర్, సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఇంకా ఆర్ఎస్ఐలు, ఇతర సిబ్బందితో పాటు హాస్పిటల్ జీఎం ఆనంద్, సీఈఓ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

స్వర్గీయ చిట్టాల శ్రీనివాస్ గారి 8వ వర్థంతి సందర్బంగా.

స్వర్గీయ చిట్టాల శ్రీనివాస్ గారి 8వ వర్థంతి సందర్బంగా అన్నదాన కార్యక్రమం.

దాతల కొరికపై
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదాలకంటే-అన్నదానం గొప్పది.

బెల్లంపల్లి నేటిధాత్రి :

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణం శనివారం రోజున కాంట చౌరస్తా బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్ జి ఒ అన్నదాత ప్రాజేక్ట్ టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ నగర్ కు చెందిన కీర్తిశేషులు చిట్యాల శ్రీనివాస్ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బెల్లంపల్లి పట్టణంలో అన్నమో రామచంద్ర అని అలమటించే ఎందరో…ఆకలి తీరుస్తూ బెల్లంపల్లి పట్టణంలో 339వ వారాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు స్వర్గీయ చిట్టాల శ్రీనివాస్ గారి 8వ వర్థంతి సందర్బంగా వారి కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో అన్నదాన కార్యక్రమము యాచకులకు, నిరుపేదలకు, దినసరి అడ్డ కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 339వ వారల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమం లో దాతల కుటుంబ సభ్యులు బందు మిత్రులు చిట్యాల సాయి కృష్ణ, కోట శ్రీనివాస్ , మోహన్, బాబు, సాయి, అశ్విన్
అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ,గన్నెవరం తిరుమల చారి,MD యుసుఫ్,MD ముస్తాఫా,అబ్దుల్ రహీమ్
పాల్గొన్నారు.

ఎరువుల షాపులలో ఆకస్మికంగా తనిఖీ..

ఎరువుల షాపులలో ఆకస్మికంగా తనిఖీ

మొగుళ్ళపల్లి ఎస్సై బి అశోక్
మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం, మొగుళ్ళపల్లి (PACS) వద్ద యూరియా మరియు ఇతర ఎరువుల విక్రయాల పై స్థానిక ఎస్సై బి. అశోక్ , మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి తానిఖీ నిర్వహించడం జరిగింది. తానిఖీలో యూరియా మరియు ఇతర ఎరువుల లభ్యత మరియు నిల్వలకు సంబంధించిన వివరాలు, కొనుగోలు రశీదులు, అమ్మకపు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డు, ధరల పట్టికలు మొదలగునవి పరిశీలించి తానిఖీ చేయడం జరిగింది. అలాగే ప్రతి రైతుకి వారి యొక్క వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని బట్టి, రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం సిఫారసు మేరకే యూరియా మరియు ఇతర ఎరువుల బస్తాలను రైతులకి పంపిణీ చేయాలని సూచించడం జరిగింది. అలాగే, నానో యూరియా మరియు నానో డి‌ఏ‌పి వాడకం, నానో యూరియా వాడడం వల్ల కలిగే లాభాలు మరియు సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి రైతులకు సూచించడం జరిగింది.
మొగుళ్ళపల్లి మండల డీలర్లు సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని తెలియపర్చడం జరిగింది ఈ PACS, మొగుళ్ళపల్లి వద్ద 444 బస్తాలు, PACS, మొట్లపల్లి వద్ద 444 బస్తాలు, PACS, ఇస్సిపేట వద్ద 444 బస్తాలు మరియు అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద 222 బస్తాలు వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది, కావున రైతులు మీ యొక్క పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ మరియు ఆధార్ కార్డు తో సంబంధిత కేంద్రాలనుండి ఎరువులను పొందగలరు.
ఇట్టి తానిఖీలో CEO A. సాగర్ PACS పంపిణీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

కోరపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో సైకిళ్ల పంపిణీ..

కోరపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో సైకిళ్ల పంపిణీ
జమ్మికుంట (నేటిధాత్రి)
ఈరోజు జమ్మికుంట మండలంలోని కోరపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని లకు కేంద్రమంత్రి బండి సంజయ్ సంకల్పంగా తీసుకున్నటువంటి నిజోయకవర్గ పదో తరగతి విద్యార్థినిలకు సైకిల్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి కరీంనగర్ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఎర్రవెల్లి సంపత్ రావు సంపెల్లి సంపత్ రావు, పుల్లూరు ఈశ్వర్, పుల్లూరి రవి, ఈ కార్యక్రమంలో పాల్గొని సైకిల్లు పంపిణీ చేయడం జరిగింది.

విద్యార్థులలో గ్రంథాలయ పఠనంపై అసక్తిని పెంచే శిక్షణ..

విద్యార్థులలో గ్రంథాలయ పఠనంపై అసక్తిని పెంచే శిక్షణ

మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలోని కేసముద్రం విలేజ్ ఉన్నత పాఠశాలలో 25 జూలై మరియు 26 జూలై తేదీలలో జడ్పీహెచ్ఎస్ కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ మరియు జడ్పీహెచ్ఎస్ కేసముద్రం స్టేషన్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు పాఠశాల గ్రంధాలయాలను ఏర్పాటు చేయడం మరియు గ్రంథాలయాల నిర్వహణ, పాఠశాలలో గ్రంథాలయ పఠన కార్యక్రమాలను నిర్వహించడం, విద్యార్థులలో పఠనంపై ఆసక్తిని కలిగించడం మొదలగు అంశాలపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి, మరియు ఇనుగుర్తి మండల విద్యాశాఖాధికారి జంగా రూపారాణి, జడ్పీహెచ్ఎస్ కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకట్రాంనర్సయ్య, జెడ్ పి హెచ్ ఎస్ కేసముద్రం స్టేషన్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, ఆర్పీలుగా ఎం సురేష్ నాయుడు, వి భాస్కరరావు, రాజ్ కుమార్, సి.ఆర్.పి.లు సుల్తానా, స్వాతి, సరిత, నాగవాణి పాల్గొన్నారు,

లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించిన వరంగల్ జిల్లా

లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించిన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ:-

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి :-

తేదీ:- 26-07-2025 వరంగల్ ఎం.జీ.ఎం. హాస్పిటల్ లోని డి – అడిక్షన్ సెంటర్ ఓ.పి. విభాగంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “సమాజంలోని పేదలు మరియు వెనుకబడిన వర్గాలకు సులభంగా అందుబాటులో ఉండే చట్టపరమైన సహాయాన్ని అందించడానికి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ఉద్దేశించబడ్డాయి అని తెలిపారు. ఈ సెంటర్ లో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను నిర్వహించే పారా లీగల్ వాలంటీర్ వై.సిందూజ ప్రజలకు న్యాయ సేవలను అందించడంతో పాటు, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారితో, వారి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం, కౌన్సెలింగ్ తదితర ప్రత్యామ్నాయ కార్యకలాపాలను చేపట్టడం జరుగుతుంది, తద్వారా మత్తు పదార్థాల బారిన పడిన ప్రజలు కొంతమేరకైనా మారతారేమోనని ఆశిస్తున్నాం.

న్యాయ సలహా మరియు ప్రత్యుత్తరాలు, దరఖాస్తులు, పిటిషన్‌లను రూపొందించడంలో సహాయం చేయడం లీగల్ ఎయిడ్ క్లినిక్‌ యొక్క బాధ్యత అని తెలిపారు. ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ కేవలం ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఎటువంటి సమస్యలనైనా ఈ క్లినిక్ లో తెలియపరిచి, న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయి కుమార్, ఎం.జీ.ఎం. సూపరింటెండెంట్ కిషోర్, సైకియాట్రి హెచ్.ఓ.డి. శ్రీనివాస్, ఆర్.ఎం.ఓ అశ్విన్, సైకియాట్రి ఫ్యాకల్టీ మురళీకృష్ణ, చిన్నికృష్ణ, పారాలి ఈగల్ వాలంటీర్ వై.సింధుజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version