స్వర్గీయ చిట్టాల శ్రీనివాస్ గారి 8వ వర్థంతి సందర్బంగా అన్నదాన కార్యక్రమం.
దాతల కొరికపై
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదాలకంటే-అన్నదానం గొప్పది.
బెల్లంపల్లి నేటిధాత్రి :
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణం శనివారం రోజున కాంట చౌరస్తా బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్ జి ఒ అన్నదాత ప్రాజేక్ట్ టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ నగర్ కు చెందిన కీర్తిశేషులు చిట్యాల శ్రీనివాస్ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బెల్లంపల్లి పట్టణంలో అన్నమో రామచంద్ర అని అలమటించే ఎందరో…ఆకలి తీరుస్తూ బెల్లంపల్లి పట్టణంలో 339వ వారాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు స్వర్గీయ చిట్టాల శ్రీనివాస్ గారి 8వ వర్థంతి సందర్బంగా వారి కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో అన్నదాన కార్యక్రమము యాచకులకు, నిరుపేదలకు, దినసరి అడ్డ కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 339వ వారల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమం లో దాతల కుటుంబ సభ్యులు బందు మిత్రులు చిట్యాల సాయి కృష్ణ, కోట శ్రీనివాస్ , మోహన్, బాబు, సాయి, అశ్విన్
అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ,గన్నెవరం తిరుమల చారి,MD యుసుఫ్,MD ముస్తాఫా,అబ్దుల్ రహీమ్
పాల్గొన్నారు.