చర్లపల్లి పాఠశాలలో కార్గిల్ దివాస్ రజితోత్సవ సభ..

చర్లపల్లి పాఠశాలలో కార్గిల్ దివాస్ రజితోత్సవ సభ

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో కార్గిల్ దివాస్ విజయోత్సవ సభను ఘనంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కార్గిల్లో వీరమరణం పొందిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
భారత్ పాకిస్తాన్ మధ్య మే 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగిందనీ ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు,కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం అని,యుద్ధ ప్రారంభదశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యిందనీ, నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుందనీ,అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగిందనీ,ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ అని, ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయనీ అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది అని అన్నారు.దివాస్ ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారనీ, 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారనీ,ఈ సందర్భంగా,భారత సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలను స్మరించుకుంటారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకవత్ దేవా,కంచ రాజు కుమార్ అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ నందిపాటి సంధ్య,నిడిగొండ అక్షయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

బాలాజీ టెక్నో స్కూల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని లక్నేపెల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు కార్గిల్ విజయ్ దివస్ ను ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.పాఠశాల స్కూల్ ప్రిన్సిపాల్ పి.రాజేంద్రప్రసాద్ హాజరై మాట్లాడుతూ మే, 1999 న పాకిస్తాన్ చొరబాటుదారులు దొంగ చాటున నియంత్రణ రేఖను దాటి భారత భూభాగాన్ని ఆక్రమించారని అలాగే శ్రీనగర్, లేహ్ ను కలిపే కీలకమైన జాతీయ రహదారి 1-ఏ ను విడదీయడం వారి దుష్ట లక్ష్యంగాచేసుకొని భారత సైన్యంపై దాడి జరిపారని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే భారత సైన్యం కళ్ళలో జాతీయ జెండాను,గుండెల్లో దేశభక్తిని కలిగి శత్రుతూటాలకు ఎదురొడ్డి తరిమికొట్టి కార్గిల్ యుద్ధంలో గెలిచిన రోజు గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటారని తెలిపారు. అనంతరం కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. రమేశ్, రామ్మూర్తి ,విజయ్, గౌతమ్, కనకయ్య , రామ్ కిషోర్, ఓదేలు, కనకరాజు, అనిత,వ్యాయామ ఉపాధ్యాయులు భవాని చందు, పార్వతి, ఎన్.సి.సి క్యాడేట్లు , విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version