చర్లపల్లి పాఠశాలలో కార్గిల్ దివాస్ రజితోత్సవ సభ..

చర్లపల్లి పాఠశాలలో కార్గిల్ దివాస్ రజితోత్సవ సభ

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో కార్గిల్ దివాస్ విజయోత్సవ సభను ఘనంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కార్గిల్లో వీరమరణం పొందిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
భారత్ పాకిస్తాన్ మధ్య మే 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగిందనీ ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు,కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం అని,యుద్ధ ప్రారంభదశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యిందనీ, నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుందనీ,అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగిందనీ,ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ అని, ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయనీ అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది అని అన్నారు.దివాస్ ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారనీ, 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారనీ,ఈ సందర్భంగా,భారత సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలను స్మరించుకుంటారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకవత్ దేవా,కంచ రాజు కుమార్ అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ నందిపాటి సంధ్య,నిడిగొండ అక్షయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

రఫీ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్టిఐ నేత చర్లపల్లి.

రఫీ,కుటుంబాన్ని పరామర్శించిన ఆర్టిఐ నేత,చర్లపల్లి చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా శుక్రవారం మొగుళ్లపల్లి మండలం గుడి పహాడ్ గ్రామానికి చెందిన మమ్మద్ రఫీ ఇటీవల అనారోగ్య కారణాల వలన మరణించాడు మృతుని,ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని రఫీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను బంధుమిత్రులను పరామర్శించిన ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, మృతుని సోదరులు మహ్మద్ రాజ్ మహమ్మద్ ,అక్బర్ ,పాషా ఈ కార్యక్రమంలో, బుర్ర సమ్మయ్య కాంగ్రెస్ నాయకుడు రాజు, లింగంపల్లి,రాజేశ్వరరావు గిరబోయిన ఐలయ్య మేకల దేవేందర్ ,సాంబయ్య తదితరులు నివాళులర్పించారు

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన.

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన
రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడీ సతీష్ రెడ్డి
ఆర్టిఐరాష్ట్ర కమిటీ సభ్యుడు కమలాకర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

ఇటీవల రోడ్ ప్రమాదములో గాయపడ్డ భూపాల్ పల్లి జిల్లా సమాచార హక్కు చట్టం యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లును మొగుళ్ళ పల్లి మండలం ఎల్లా రెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం రోజున తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్య క్షులు కామిడి సతీష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు ముఖ్య సలహాదారులు కల్వల కమలాకర్ రావు లు పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు సమాచార హక్కు చట్టాన్ని ప్రతీ గ్రామము లోకి తీసుకు వెళ్లిన వెంకటేశ్వర్లు రోడ్ ప్రమాదము లో గాయపడడం బాధాకరం అన్నారు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.

చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపా ధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
పచ్చని చెట్లతో,పారే నదులతో,అందమైన పక్షులు, అలరించే జంతువులతో, ఎన్నో జీవుల్ని కలిగి వున్న గ్రహం ఈ భూమి.ఈ జీవులన్నిటి మనుగడకు కావలసినది నీరు.అటువంటి నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, ప్రజలకు అవగాహన కలిగించుటకు 1993వ సం॥లో ఐక్యరాజ్యసమితి మార్చి 22ని అంతర్జాతీయ జల దినోత్సవం’గా ప్రకటించిందని, భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరయితే ఉందో,ఇప్పుడు కూడా అంతే నీరు ఉంది. పెరగడం కాని, తరగడం కాని లేదు.కానీ ప్రపంచ జనాభా నిత్యం పెరుగుతునే ఉంది. అందుకే కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు. భూమి మీద ఉన్న నీటిలో 97% ఉప్పునీరు. కేవలం 3% మాత్రమే మంచినీరు. ఈ నీటిని మనం చాలా పొదుపుగా ఉపయోగించుకోవాలని, ప్రపంచంలో భారీయుద్ధాలలో చనిపోయిన వారికన్నా కలుషిత నీరు తాగడం వలన మరణించిన వారి సంఖ్య ఎక్కువని,సంవత్సరానికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి మరణిస్తున్నారని అన్నారు.
కాబట్టి,నీటిని పొదుపుగా వాడుట, కలుషితం అవకుండా కాపాడుట మన అందరి యొక్క బాధ్యత అని,సకల చరాచర జీవకోటికి ప్రాణాధారం నీరు,నీరు లేక జీవకోటి మనుగడ లేదని అన్నారు.అనంతరం జల ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కంచరాజు కుమార్,అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్యా,విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version