ఎరువుల షాపులలో ఆకస్మికంగా తనిఖీ..

ఎరువుల షాపులలో ఆకస్మికంగా తనిఖీ

మొగుళ్ళపల్లి ఎస్సై బి అశోక్
మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం, మొగుళ్ళపల్లి (PACS) వద్ద యూరియా మరియు ఇతర ఎరువుల విక్రయాల పై స్థానిక ఎస్సై బి. అశోక్ , మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి తానిఖీ నిర్వహించడం జరిగింది. తానిఖీలో యూరియా మరియు ఇతర ఎరువుల లభ్యత మరియు నిల్వలకు సంబంధించిన వివరాలు, కొనుగోలు రశీదులు, అమ్మకపు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డు, ధరల పట్టికలు మొదలగునవి పరిశీలించి తానిఖీ చేయడం జరిగింది. అలాగే ప్రతి రైతుకి వారి యొక్క వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని బట్టి, రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం సిఫారసు మేరకే యూరియా మరియు ఇతర ఎరువుల బస్తాలను రైతులకి పంపిణీ చేయాలని సూచించడం జరిగింది. అలాగే, నానో యూరియా మరియు నానో డి‌ఏ‌పి వాడకం, నానో యూరియా వాడడం వల్ల కలిగే లాభాలు మరియు సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి రైతులకు సూచించడం జరిగింది.
మొగుళ్ళపల్లి మండల డీలర్లు సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని తెలియపర్చడం జరిగింది ఈ PACS, మొగుళ్ళపల్లి వద్ద 444 బస్తాలు, PACS, మొట్లపల్లి వద్ద 444 బస్తాలు, PACS, ఇస్సిపేట వద్ద 444 బస్తాలు మరియు అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద 222 బస్తాలు వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది, కావున రైతులు మీ యొక్క పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ మరియు ఆధార్ కార్డు తో సంబంధిత కేంద్రాలనుండి ఎరువులను పొందగలరు.
ఇట్టి తానిఖీలో CEO A. సాగర్ PACS పంపిణీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన..

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన సంగారెడ్డి కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు, పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల విషయాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. కాంపౌండ్ వాల్, మౌలిక సదుపాయాలపై అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీలు..

వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీలు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను ఆకస్మికంగా తనిఖీ చేసిన. శ్రీ ఎస్ వి ప్రసాద్. జయింట్ రిజిస్టర్.ఆఫ్. కో-ఆపరేటివ్ సొసైటీ/.G.m.Haca. హైదరాబాద్ గారు. మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా సొసైటీ అధికారి. రామకృష్ణ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా. నేరెళ్ల. పాక్స్. చైర్మన్ కోడూరి. భాస్కర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చిన ఆఫీసర్లు. నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎరువులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి రైతులకు అన్నివేళలా ఎరువులు అందుబాటులో ఉంచుతూ రైతులకు సంఘాల ద్వారా. సేవలు అందించాలని ఆదేశించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో. అసిస్టెంట్ రిజిస్టర్. బి రమాదేవి. సంఘం కార్యదర్శి సిబ్బంది అంజయ్య రాజయ్య సాయి తదితరులు పాల్గొన్నారు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను ఆకస్మిక తనిఖీ..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను ఆకస్మిక తనిఖీ

జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్.

ఇబ్రహీంపట్నం.నేటిధాత్రి

మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రాథమిక వ్యవసాయ సహకార
ఎరువుల సరఫరా పై పరిశీలించిన కలెక్టర్ పాక్స్ నిర్వహిస్తున్న ఎరువుల విక్రయాలుకు సంబందించిన రికార్డులను పరిశీలించారు యూరియా ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు యూరియా ఇచ్చుచున్నారో పరిశీలించి వారి భూమి వివరములు తనిఖీ చేసినారు తదుపరి కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం పంట వేసిన రైతులకి పంట కు అవసరమైన యూరియా మాత్రమే సరఫరా చేయవలెనని అధికారులకు ఆదేశించిన
ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణి చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బంది పై మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించాడు మరియు కలెక్టర్ వెంట మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్, ఇబ్రహీంపట్నం మండల్ తహసీల్దార్ వరప్రసాద్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ ‌. ‌

రోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ‌

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీ చేశారు సీజన్ వ్యాధుల గురించి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది హాజరు పట్టికను పరిశీలి ంచి సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు మందుల కొరత లేకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డే )డేసర్వే చేయాలని మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అదే రంగాపురం పిఢిసిల్ల మోట్ల పెళ్లి నూతన సబ్ సెంటర్ లను (పల్లె దవఖానాలను) పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ నాగరాణి డాక్టర్ నవత ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

ప్రభుత్వ ఆసుపత్రి పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదివేల చూడాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తంగళ్ళపల్లి మండలం పరిధిలోని తెనుగు వారి పల్లి లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల ఆవరణలో గ్రామంలో రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శి కిసూచించారు అనంతరం మధ్యాహ్నం భోజనం సిద్ధం చేస్తుండగా భోజన సదుపాలను పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా అని ఆరా తీశారు వాటర్ ప్యూరిఫర్ వాటర్ కల్పించాలనిఫ్యాన్లు మరమ్మతులు చేయించి విద్యార్థులకు ఆ సౌకర్యం కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు పాఠశాలకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు పాఠశాలకు మంచి భవనం ఉందని కానీ విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందని పేర్కొంటూ గ్రామ పిల్లలందరూ ఇదే పాఠశాల చదివేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన సాంకేతికతో కూడిన బోధనపై అవగాహన కల్పించాలని ఆదేశించారు విద్యార్థులు చదువులో రాణించి క్రమశిక్షణతో కూడిన బోధన అందించాలని సూచిస్తూ ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి ప్రభుత్వ వైద్యశాలలో 75% ప్రసవాలు అయ్యేలా చూడాలని వైద్యులకు సూచించారు తంగళ్ళపల్లి లోని ప్రాథమిక కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రి ఆవరణలో గడ్డి నిరుపయోగంగా మొక్కలు పిచ్చి మొక్కలు నిండి ఉండడంతో వాటిని తొలగించాలని ఎంపిఓని ఆదేశించారు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు సీసీ కెమెరాలు మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకోవాలని తెలుపుతూ అనంతరం హాస్పిటల్ లోని ఓపి ఇతర రిజిస్టర్ను తనిఖీ చేశారు ల్యాబ్ ఫార్మసీ ఆయా గదులు పరిశీలించి వైద్యులకు సూచనలు చేస్తూ పరిసరాలను పరిశీలన చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోకల్పిస్తున్న సౌకర్యాలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని 70% శాతానికి పసవాలు కల్పించేలాఆశ వర్కర్లతో నిత్యం సమావేశం ఏర్పాటు చేస్తూ నార్మల్ ప్రసవాలు ఎక్కువ జరిగేలా జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ చంద్రిక రెడ్డి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version