కోళ్ల పాము నిప్పు పెట్టిన వారి పై చర్యలు తీసుకోవాలి
జహీరాబాద్ నేతి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యాలవారం గ్రామం లో కోళ్ల పామ్ షెడ్డు కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు అని ఆ గ్రామానికి చెందిన గొల్ల శ్రీశైలం తెలిపారు. శుక్రవారం అయన మాట్లాడుతూ ఈ నెల 11 న రాత్రి సమయం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా కోళ్ల పామ్ కు నిప్పు పెట్టారు అని అట్టి వ్యక్తుల ను గుర్తించి వారి పై చర్యలు తీసుకువాలి అని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు తెలిపారు. షెడ్డు లో సుమారు 2 లక్షల వరకు సమగ్రీ ఉన్నట్లు తెలిపారు. అవి మొత్తం పాడై పోయినవి అని తెలిపారు.
దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ (ఎంఎల్టి ) గ్రూపులో తాత్కాలిక పధతిలో విద్యా బోధన చేయడానికి మహిళా విద్యాపకుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు,పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల ఒక సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మంజుల మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల కళాశాలలో టిజిసిఆర్టి ఇంగ్లీష్ ఫస్ట్ ఒకటి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఒకటి లకు గాను దరఖాస్తు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్ పీజీసిఆర్టి పోస్ట్ కు గాను అభ్యర్థి విద్య అర్హత ఎంఏ ఇంగ్లీష్ బీఈడీ అర్హత ఉండాలి, ఎంఎల్టి పోస్ట్ కు గాను ఎండి పాతాలోజి, బీఫార్మసీ, ఎంఎస్సీ జెనెటిక్స్, ఎంబిబిఎస్, బిహెచ్ఎంఎస్, పిజిడి క్లినికల్ బయో కెమిస్ట్రీ అర్హతలు గల అభ్యర్థులు వారి వారి దరఖాస్తులను పాఠశాలకు నేరుగా వచ్చి ఈనెల 14 నుండి 18 తారీకు లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలియజేశారు.
మహిళలకు నైపుణ్య శిక్షణలతో ఉపాధి మార్గాలు ఏర్పరుస్తాయని నర్సంపేట టౌన్ ఎస్సై అరుణ్ కుమార్ అన్నారు.శనివారం ఎఫ్ఎంఎం,వరంగల్ సాంఘిక సేవా సంస్థ వారి సహకారంతో నర్సంపేట ప్రతిభా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మగ్గం శిక్షణ, టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశం సంస్థ సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై అరుణ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో పేదరికం నిర్మూలించడానికి ముఖ్యంగా గృహింస, బాల్య వివాహాలు బాలల అక్రమ రవాణా నిర్మూలించడానికి వారికి ఉపాధి మార్గాలు అనేవి చాలా ముఖ్యమని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.మరో అతిథి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రమేష్ కోరే మాట్లాడుతూ సమాజంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రగతి ఎంత ముఖ్యమో వ్యక్తిగత భద్రత అంతే ముఖ్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి బ్యాంకుల ద్వారా అమలుపరుస్తున్న స్కీములను సద్వినియోగం చేసుకొని ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్, సహాయ సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బత్తుల కరుణ,ఎర్ర శ్రీకాంత్ ,ఫైనాన్స్ మేనేజర్ అజయ్ కుమార్,సంస్థ యూత్ అంబాసిడర్స్ దోమ మధుమతి, భౌగోచి దేవిక బొడ్డు అమర్నాథ్, ప్రతిభ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గిరిగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి సేవా సంస్థ కార్యదర్శి బెజ్జంకి ప్రభాకర్, ట్రేైనర్లు శ్వేతా, సంధ్యతో పాటు మహిళలు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లాలోని ఈరోజున జిల్లా కోర్టు ప్రాంగణంలో నేడు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ను నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్, డీఎల్ఎస్ఏ రాజన్న సిరిసిల్ల .P. నీరజ మాట్లాడుతూ రాజీమార్గమే రాజా మార్గమని కోర్టులలో పెండింగ్ లో ఉన్న అన్ని సివిల్ కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోగలరని సూచించారు.
జీవితం చాలా చిన్నదని మీరందరూ ఎలాంటి గొడవలకు తావివ్వకుండా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరారు, జాతీయ లోక్ అదాలత్ విజయానికి సహకరించడంలో పోలీసులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, మీడియా పనితీరును ప్రశంసించారు.
National Lok Adalat program.
ఈ కార్యక్రమం లో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ బి.పుష్పలత, అదనపు ఎస్.పి.శ్రీ.డి.చంద్రయ్య, డిఎల్ఎస్ఎ కార్యదర్శి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ.పి.లక్ష్మణాచారి, మేజిస్ట్రేట్లు శ్రీ.ఎ.ప్రవీణ్, శ్రీమతి కె.సృజన, మిస్.జి.మేఘన, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ.జె.శ్రీనివాస్ రావు, లోక్ అదాలత్ సభ్యులు శ్రీ.సిహెచ్.భాస్కర్, శ్రీ.ఎ.వేణు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ.పి.శ్రీనివాస్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, ఇతర న్యాయవాదులు, పోలీసులు, న్యాయవాదులు మరియు కక్షిదారులు పాల్గొన్నారు.
గర్భిణులకు, పసిపిల్లలకు అంగన్వాడి కేంద్రంలో పౌష్టిక ఆహారం లభిస్తుందని అంగన్వాడి టీచర్ జ్యోతి పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని నందగోకుల్ గ్రామంలో శనివారం టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వంటగది, అంగన్వాడి చుట్టూ పరిసరాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. “అమ్మ మాట అంగన్వాడి బాట” అనే కార్యక్రమంలో భాగంగా జూన్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు 5 రోజులపాటు రోజుకో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినతిపత్రం ఇచ్చిన పేదలు
అర్హులైన పేదలందరికీ పట్టాలిస్తాం… హామీ ఇచ్చిన ఎమ్మెల్యే
నర్సంపేట నేటిధాత్రి:
ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న ఇండ్లకు పట్టాలచ్చి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించి, కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్ తెలిపారు.ఈ మేరకు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పేదలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని 601/1 ప్రభుత్వ భూమిలో నిలువ నీడలేని పేదలు గత 5 సంవత్సరాలకు పైగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. వీరికి నీళ్ల సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటే దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే సహకారంతో గెలిచిన వెంటనే పేదలు నివాసం ఉండే ప్రాతంలో బోరువేయడం జరిగిందని అన్నారు.కనీస సౌకర్యాలైన మంచినీరు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాము. వర్షాకాలం వచ్చిందంటే తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. పాములు,కిటకాలుతో పేదలు సావాసం చేస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులకు పట్టాల కోసం అనేక సార్లు దరఖాస్తలు చేసుకోవడం జరిగిందని,ఎమ్మెల్యే స్పందించి పేదలు వేసుకున్న ప్రాంతాలలో కనీస సౌకర్యాలు కల్పించి,ఇండ్ల పట్టాలు ఇప్పించి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించగలరని కోరినట్లు తెలిపారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నర్సంపేట స్థానికులైనా అర్హత గల పేదలందరికి పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఇప్ప సతీష్, కలకోట అనిల్,ఎండి ఫరిదా, వజ్జంతి విజయ, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి, జగన్నాధం కార్తీక్, దాసరి నరేష్, తదితరులు పాల్గొన్నారు.
మానేరు రివర్ ఫ్రంట్ అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి
జిల్లా ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మానేరు రివర్ ఫ్రంట్,కేబుల్ బ్రిడ్జి పనుల అభివృద్ధి పై అధికారులతో సమీక్ష చేయాలి
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం సృష్టించడానికి పర్యాటక రంగ అభివృద్ధి కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన నిర్మాణ పనుల్లో పూర్తిగా అవినీతి,అక్రమాలు చోటు చేసుకున్నాయని,తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విజిలెన్స్ ద్వారా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున సిపిఐ కరీంనగర్ నగర సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ లోని మానేరు ఫ్రంట్,తీగల వంతెన ను సిపిఐ బృందం పరిశీలించింది. ఈసందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం కోసం ఐదు వందల కోట్ల నిధులు మంజూరు చేయగా అందులో వంద కోట్లు టూరిజం శాఖ, వంద కోట్లు నీటి పారుదల శాఖ నిధులు మంజూరు చేసిందని, పర్యాటక రంగ అభివృద్ధి కోసం చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోయాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కరీంనగర్ కు చెందిన శాసనసభ్యులు ఆనాటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో జరిగిన ఈ పనులు పూర్తిగా అవినీతి మయమై లోపభూయిష్టంగా జరిగాయని, తన అనుచరులైన వారిని, వారి కుటుంబానికి చెందిన వారిని కాంట్రాక్టర్లుగా, బినామీలుగా ఉపయోగించుకొని పనుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులను అసంపూర్తిగా చేశారన్నారు. అప్పటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆగమేఘాల మీద కరీంనగర్ కు వచ్చి మానేరు రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించారని, కానీ నేటికీ పనులకు అతిగతి లేదన్నారు. రివర్ ఫ్రంట్ ప్రాంతంలో నిర్మించిన చెక్ డ్యాములు పూర్తిగా నాణ్యత లోపం తో నిర్మించడం వల్ల వర్షాలకు ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కొట్టుకుపోయాయని, నిర్మాణ లోపాలు ఉన్నటువంటి మానే రివర్ ఫ్రంట్ కు రెండు వందల కోట్లు రూపాయల నిధులను ఏప్రాతిపదికన విడుదల చేశారో నేటి ప్రభుత్వం స్పష్టం చేయాలని, నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విజిలెన్స్ విచారణ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెంకటరెడ్డి తెలిపారు. తీగల వంతెనను ఆనాటి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హడావుడిగా ప్రారంభించారని, రెండు వందల ఎనిమిది కోట్ల నిధులు వెచ్చించి కనీసం విద్యుత్ దీపాలు, రోడ్లు సరిగా వేయకపోవడం, వేసిన వీధి దీపాలు వెలగకపోవడం దారుణమని, నాడు ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా ఇంచార్జీ మంత్రిగా నియామకమైనందున తక్షణమే జిల్లా అధికారులతో కేబుల్ బ్రిడ్జి మానేరు ఫ్రంట్ పై సమీక్ష సమావేశం జరిపి అవినీతి అక్రమాలకు పాల్పడి నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి ఎక్కడ జరిగితే అక్కడ సిపిఐ ప్రత్యక్షమవుతుందని అవినీతి అంతమే సిపిఐ పంతమని, ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టకుంటే సిపిఐ చూస్తూ ఊరుకోదని ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈప్రాజెక్టులో రెండు వందల కోట్ల ప్రజాధనాన్ని మొక్కుబడిగా ఖర్చు చేసి నీటిపాలు చేసిందని, ప్రజాధనాన్ని సంక్షేమం కోసం కాకుండా కాంట్రాక్టర్ లబ్ధికోసం అప్పగించిన నాటి ప్రభుత్వంలో మంత్రి గంగుల కమలాకర్ కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడని విమర్శించారు. ఏమేరకు అభివృద్ధి పనులు జరిగాయని,ఎంత అవినీతి జరిగిందని,ఎందుకు పనులు నిలిచిపోయాయి అనే విషయాలపై నిష్పక్షపాతంగా కాంగ్రెస్ ప్రభుత్వం తగిన విచారణ చేపట్టి బాధ్యులైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని అవినీతిపై సిపిఐ పోరాటం చేస్తుందని మర్రి వెంకటస్వామి తెలిపారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు కిన్నెర మల్లవ్వ, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు,న్యాలపట్ల రాజు,కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,కసిరెడ్డి మణికంఠ రెడ్డి,బండ రాజిరెడ్డి,కంది రవీందర్ రెడ్డి,మచ్చ రమేష్, బ్రామండ్లపల్లి యుగేందర్, నాయకులు గామినేని సత్తయ్య, నగునూరి రమేష్, కూన రవి, చెంచల మురళి, మామిడిపల్లి హేమంత్ కుమార్,సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెంచిన స్టూడెంట్స్ బస్ పాస్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి
జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తూ అడ్మిషన్స్ చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్
సిరిసిల్ల టౌన్( నేటి ధాత్రి ):
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలను 20% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తూ అడ్మిషన్స్ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్ మాట్లాడుతూ ఇప్పటికే గతంలో పెంచిన బస్ ఛార్జీలు, స్టూడెంట్స్ పాస్ ఛార్జీలు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ 20% ఛార్జీలు పెంచి అమలు చేస్తే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రధానంగా ఉన్నత విద్య కోసం బస్ నమ్ముకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోని చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే చాలా రూట్లలో విద్యార్థులు కోసం బస్సులు నడపడం లేదు. ఒక ప్రక్క బస్సులు సంఖ్య పెంచి, ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఛార్జీలు, బస్ పాసులు పెంచే ఆలోచన చేయడం దుర్మార్గపు చర్య. తక్షణమే పాసుల ఛార్జీలు పెంపు ఆలోచనలు విరమించుకోవాలి. లేకుంటే అన్ని డిపోల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని అన్నారు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని పాఠశాలలు ఉన్నాయని వాటిని పర్యవేక్షణ చేయడంలో జిల్లా విద్యాధికారుల లోపం స్పష్టంగా కనబడుతుందని వెంటనే పర్మిషన్ లేని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయాలని అన్నారు అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభమైతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లకు ,పక్కా భవనాలు నిర్మించాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రినీ నియమించాలని డిమాండ్ చేశారు, లేని యెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ కుమార్, జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు సాయి భరత్, శివ ,నాయకులు జస్వంత్, అఖిల్, అక్షయ్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
అవినీతిని రూపుమాపి అభివృద్ధి చేసి చూపిస్తా
ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు
అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
జైపూర్ నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం,రసూల్ పల్లి,జైపూర్ వద్ద శనివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నియోజికవర్గానికి విచ్చేసిన మంత్రి వివేక్ వెంకట్ స్వామికి కాంగ్రెస్ నాయకులు మేళ తాళాలతో,బాణసంచా కాల్చి మంత్రికి ఘన స్వాగతం పలికి పూలమాలలతో,శాలువాలతో సత్కరించారు.జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికిన సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన పేదవారికి అందే విధంగా కృషి చేస్తానని అన్నారు.అలాగే పేదవారికి సన్న బియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలియజేశారు.ప్రజా పాలనలో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అక్రమ అరెస్టులకు తావు లేకుండా చూసే బాధ్యత తనదే అని అన్నారు. పేదవారికి ఉచిత విద్య అందించాలనే కృషితో సోమనపల్లి గ్రామంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేలా కృషి చేస్తానని అన్నారు.అలాగే చెన్నూరు నియోజకవర్గం లో అక్రమంగా ఇసుక రవాణా,మట్టి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.నేను ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎన్నుకున్న నాయకుడిని నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యోగక్షేమాలు చూసుకుంటూ వారికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన పథకాలను అందే విధంగా నా సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
విమాన ప్రమాద మృతులకు ఘన నివాళి • కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా పాత్ ఫైండర్ ఐనవోలు పాఠశాల సంతాపం
అయినవోలు నేటి ధాత్రి:
అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అనేక అమాయక ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయిన విషయం అత్యంత హృదయవిదారకమైనది. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చేలా అయినవోలు ఫాత్ పైండర్ పాఠశాలలో శనివారం విద్యార్థులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర్ రావు మరియు ప్రిన్సిపాల్ సుభహనోద్దీన్ ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాలుపంచుకుని, మౌనంగా కాంతి ప్రదీపాలు చేతబట్టి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ధైర్యం, ఆదరణ కలగాలని ప్రార్థించారు.మానవత్వాన్ని ప్రతిబింబించే విధంగా నిర్వహించిన ఈ కాండిల్ ర్యాలీ ద్వారా, శాంతి, ప్రేమ, మరియు ఐక్యత సందేశం సమాజానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పాఠశాల డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు తెలియజేశారు.
అంత్యక్రియలకు తన వంతు ఆర్థిక సహాయం అందించిన నాయిని వెంకట్ గౌడ్ (గజిని)…
కొల్చారం (మెదక్) నేటిధాత్రి:
కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన దాది వెంకటనారాయణ శనివారం ఉదయం మృతి చెందాడు. మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాయిని వెంకట్ గౌడ్ (గజిని) అంత్యక్రియలకు మృతుని కుటుంబ సభ్యులకు తన వంతుగా 5000 రూపాయలు, ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు గడ్డమీది నర్సింలు, పుల్లబోయిన పోచయ్య, రాములు, స్వామి, శ్రీనివాస్, మరియు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.
రక్తదానం చేయండి..ప్రాణదాతలు కండి అని ఏ.ఎస్.ఆర్.సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ పిలుపునిచ్చారు.శనివారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నర్సంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఏ.ఎస్.ఆర్.సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ పాల్గొని 27 వ సారి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా హాస్పిటల్ ఆర్.యం.ఓ.డాక్టర్ గణేష్ అభినందించిన అనంతరం వారు మాట్లాడుతూ,ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణ దాతలు కావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ హాస్పిటల్ లలో రక్త నిల్వలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో,ప్రతి ఒక్కరు రక్తదానం చేసి రక్త నిల్వలుపెంచి ప్రాణదాతలు కావాలన్నారు.18 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా రక్తదానం చేయొచ్చని పేర్కొన్నారు. రక్తదానం చేసిన కొద్దిరోజుల్లోనే మళ్ళీ రక్తం పునరుత్పత్తి అవుతుందన్నారు. రక్తదానం చేసిన వారిలో నర్సింగ్ విద్యార్థులు,మెడికల్ షాప్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రవికాంత్ లు ఉన్నారు.ఈకార్యక్రమం లో బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నిషియన్ లు శ్రీనివాస్,రాజేశ్వరిభాయి,నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
పేదింటి అడబిడ్డలకు కళ్యాణలక్మి షాదీముభారక్ పథకాలు ఒక వరం లాంటివి .
◆ -పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్
◆ – ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
పట్టణం లోని గౌరి ప్యాలెస్ లో కళ్యాణలక్మి/షాదీముభారక్ సంబంధిత నియోజకవర్గ లోని 925 మంది లబ్దిదారులకు గాను ₹.92,607,300 /- విలువ గల చెక్కులను పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ గారితో కలిసి పంపిణీ చేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పథకాలు పేదింటి అడబిడ్డలకు వరప్రదాయినిలని .దేశంలో ఏ రాష్రంలో కూడా కళ్యాణలక్మి, షాదీముభారక్ లాంటి పథకాలు లేవని, పేదింటి అడబిడ్డలను కన్న తల్లిదండ్రులు పడే బాధలు తెలిసి సీఎం కేసీఆర్. ఈ పథకాలు ప్రవేశపెట్టారని, వారికి ఎప్పటికి రుణపడి ఉంటామని తెలిపారు.అలాగే ఇటీవలే ముఖ్య మంత్రి గారి జహీరాబాద్ పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి పనుల కొరకు నిధులను కేటాయిస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేశాం అని, కానీ ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిధులను వరాలను ఇవ్వలేదు అని పువ్వు ఇవ్వక పోయినా కనీసం పత్రి అయినా ఇవ్వలేదు అని అన్నారు మోసపూరిత హామీలతో గద్దెను ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తూ కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక పథకం లో 1,00,116 తో పాటుగా తులం బంగారం ఇస్తాం హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండలల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,సంజీవ్ రెడ్డి,వెంకటేశం,పాక్స్ చైర్మన్ మాచెందర్, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భక్తుల కొరకు జహీరాబాద్ డిపో నుండి 02 ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లను అందుబాటులోనికి తెచ్చింది అని జహీరాబాద్ ఆర్టీసీ విలేజ్ బస్సు ఆఫీసర్స్ ఎం శివప్రసాద్, ప్రసాద్ లు తెలిపారు శనివారం ఝరాసంగం మండలంలోని బోపంపల్లి.బోరేగావ్,.జీర్లపల్లి చిలమామిడి.ఎడాకులపల్లి. గ్రామాలలో ప్రత్యేక దర్శనo కొరకు ప్రత్యేక టూర్ బస్సుల కోసం గ్రామాల ప్రజలకు వివరించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ డిపో బస్ స్టేషన్ నుండి ఉదయం 06:00 గం.లకు బయలుదేరి యాదగిరిగుట్ట శ్రీ.లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కు 10:00 గం.లకు చేరుకొని, అక్కడి నుండి దర్శనానంతరం 15:00 గం.లకు బయలుదేరి స్వర్ణగిరి దేవాలయం కు చేరుకుంటుందన్నారు…. దర్శనానంతరం తదుపరి రాత్రి 19:00 గం.లకు తిరుగు ప్రయాణమై జహీరాబాద్ బస్ స్టేషన్ కు 23:00 గం.లకు డిపో కు రావడం జరుగుతుంది అన్నారు.
భక్తుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులు అందుబాటులో తీసుకోరావడం జరిగింది అన్నారు. శ్రీ.దత్తాత్రేయ స్వామి దేవాలయం జహీరాబాద్ బస్ స్టేషన్ నుండి ప్రతీ పౌర్ణమి కి ముందు రోజు సాయంత్రం 16:00 గం.లకు ఈ నెల 27 .06.25 మంగళవారం న బయలుదేరి కర్ణాటక రాష్ట్రంలో గానుగాపూర్ లో గల శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం కు రాత్రి 20:00 గం.లకు చేరుకొని, అక్కడి నుండి దర్శనానంతరం ఉదయం 07:00 గం.లకు బయలుదేరి జహీరాబాద్ కి 11:00 గం.లకు చేరుకోనును అని తెలిపారు.భక్తుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులు అందుబాటులో గలవు…. ఎక్స్ ప్రెస్ బస్సులలో కనీసం 50 మంది మరియు డీలక్స్ బస్సులలో 40 మంది ప్రయాణికులు ఉంటే బస్సులు నేరుగా బుక్ చేసుకోవచ్చును అన్నారు.
2025వ సంవత్సరం వానా కాలానికి సంబంధించి రైతు భరోసా కోసం కొత్తగా పట్టా దారు పాసుపుస్తకాలు తీసు కున్నటువంటి రైతులు మీయొక్క పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు మరి యు మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ వెంటనే తీసుకొని మండల వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించగలరు, దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 18.06.2025 .జూన్ 18 వ తారీకు వరకే చివరి రోజు ఉన్నందున, రైతులు చివరి రోజు వరకు చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవా ల్సిందిగా కోరుతున్నాం ప్రస్తు తానికి ఈ పథకానికి జూన్ 5వ తారీఖు వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందినటు వంటి రైతులు అర్హులు, ఒకవేళ ఇదివరకే రైతు భరోసా తీసు కుంటూ బ్యాంక్ అకౌంట్ ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే రైతులు కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలతో మీ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.
ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యాశాల కార్యక్రమం శనివారం కల్వకుర్తి మండల పరిధిలో బిజెపి పార్టీ ఆఫీసులో కల్వకుర్తి బిజెపి మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ పార్టీ పతాక ఆవిష్కరణ చేసి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండికారి బాలాజీ రాష్ట్ర నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ..ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన గత 11 ఏళ్లలో అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతోందని కేవలం 11 ఏండ్లలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి విశేష కృషి వలన జిడిపిలో నాలుగో స్థానానికి ఎగ బాకడమే కాకుండా దేశంలోని 27 కోట్ల మంది పేద ప్రజలను పేదరికం నుంచి దూరం చేసి మధ్యతరగతి ప్రజలుగా మార్చిన గొప్ప నాయకుడు మన నరేంద్ర మోడీ గారని అన్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా రోగానికి వ్యాక్సిన్ అందించి ప్రపంచాన్ని కాపాడిన గొప్ప నాయకుడని అన్నారు. పెహల్గాం తీవ్రవాద దాడిలో పాల్గొన్న ముష్కర మూకలకు , తీవ్రవాద అనుకూల పాకిస్తాన్ కు సరైన బుద్ధిచెప్పి ప్రపంచానికి భారతదేశ యుద్ధ శక్తిని తెలియజేశారని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నారని అన్నారు. కుల మతాలకతీతంగా తీసుకు వచ్చిన ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విమాన ప్రమాదంలో మరణించిన వారికోసం మౌనం పాటించి నివాళులు అర్పించారు. కార్యాశాల కార్యక్రమం అనంతరం నూతనంగా ఎన్నికైనటువంటి పట్టణ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు బండల రామచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి నారేడ్ల శేఖర్ రెడ్డి మాజీ మండలం అధ్యక్షులు సురేందర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, సింగల్ విండో వైస్ చైర్మన్ శ్యాంసుందర్, బిజెపి మండల ఉపాధ్యక్షుడు నోముల రవీందర్ రెడ్డి , పుట్ట మల్లేష, మండల కార్యదర్శులు పి లింగారెడ్డి, సైదులు గౌడ బిజెపి కార్యవర్గ సభ్యులు మందరాజు రెడ్డి, కరుణ రెడ్డి సురేష్ గౌడ్, కిరణ్ రెడ్డి, సంతోష్ నాయక్ బీజేవైఎం నాయకులు నాప శివసేన, బూతు అధ్యక్షులు ఆనంద్,ఆంజనేయులు, విజయ్, సాయిబాబా, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్
జమ్మికుంట:నేటిధాత్రి
హుజరాబాద్ నియోజకవర్గం లో గత కొద్ది రోజులుగా ఇల్లంతకుంట మండలంలో ఇటు జమ్మికుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు దాడులు చేసుకుంటారని కొంతమంది గిట్టని వాళ్లు పార్టీలో విభేదాలు ఉన్నాయి వాళ్లకు వాళ్లకే పడతలేదు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు అని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది ప్రణవ్ మద్దతుదారులని బల్మూరు వెంకట్ వర్గమని బద్నాం చేస్తున్నారు అలాగే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి అన్ని కార్యక్రమాలు నడిపించినటువంటి పత్తి కృష్ణారెడ్డి నీ ఇందులోకి లాగుతున్నారు హుజురాబాద్ నియోజకవర్గం లో మాది ఒకటే పార్టీ ఒకరే లీడర్ ఆది మా ప్రణవ్ బాబే బల్మూర్ వెంకట్ మా పార్టీ ఎమ్మెల్సీ మేమందరం ఐక్యతతో పని చేస్తాం మా పార్టీలో ఎలాంటి చీలికలు లేవు గొడవలు వ్యక్తిగతంగా పెట్టుకున్నవి పార్టీకి సంబంధం లేదని ఈ పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతుంది .
విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మార్గన్’. లియో జాన్పాల్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్గా పరిచయం అవుతున్నాడు.
విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మార్గన్’. లియో జాన్పాల్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్గా పరిచయం అవుతున్నాడు. మర్డర్ మిస్టరీ- క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో ‘మార్గన్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సురేశ్బాబును విజయ్ ఆంటోని కలిశారు. థ్రిల్లింగ్ అంశాలతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇదని విజయ్ ఆంటోని తెలిపారు.
మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న చిట్యాల జర్నలిస్టులు.
చిట్యాల నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ రక్త దాన దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టు టి యు డబ్ల్యు జె ఐ జె యు, ఐటీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో చిట్యాల మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాట్రేవుల ఐలన్న పాల్గొని మాట్లాడుతూ రక్తదానం మహాదానమని అన్ని దానాల కన్నరక్త దానం గొప్పదనం గొప్పదని అన్నారు, ఈ రక్తదాన శిబిరంలో జర్నలిస్టులందరూ పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్యాతం సతీష్, శామంతుల శ్యామ్ ఐజేయు జిల్లా జిల్లా నాయకులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాట్రేవుల ఐలన్న ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు పుల్ల రవితేజ, వెల్దండ సత్యనారాయణ, శృంగారపు రంగాచారి, బోల రాజేందర్, బుర్ర రమేష్, గుర్రం రాజమౌళి, కటుకూరి శ్రీనివాస్, సరి గొమ్ముల రాజేందర్, చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలం పెద్ద కోడెపాక గ్రామానికి చెందిన రాజోలు నరహరిఅనే వ్యక్తికి సొంత ఇల్లు లేదు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఇందిర మ్మ ఇళ్లలో అర్హునిగా తన పేరు ప్రకటించారు అయితే మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని గతంలో కలిసిన క్రమంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశానని సాకును చూపి మంజూరైన ఇందిరమ్మ ఇల్లును ఇందిరమ్మ కమిటీ సభ్యులు తొలగించారు. అడిగితే కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమకు అన్యాయం చేశారని బాధితుడు వేడుకొన్నాడు.గత పది సంవత్సరాలుగా కిరాయి ఇంట్లో అద్దెతో జీవనం గడుపు తున్నానని కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎమ్మెల్యే చొరవతో ఇల్లు వస్తుందని ఆశపడిన తమకు స్థానిక ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీరని అన్యాయం చేశారని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి విచారణ జరిపి నాలాంటి వారికి అండగా నిలవాలని ప్రభుత్వం పై నమ్మకం ఉంచాలని కోరడమైనది
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.