ఎయిరిండియా విమాన ప్రమాదం పెరిగిన మృతుల సంఖ్య.

ఎయిరిండియా విమాన ప్రమాదం పెరిగిన మృతుల సంఖ్య…

Plane Crash Death Toll: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడినవారు సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Gujarat: అహ్మదాబాద్ (Ahmedabad) ఎయిరిండియా విమాన ప్రమాదం Air India flight accident)లో మృతుల సంఖ్య పెరిగింది. మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 279కి చేరింది. గాయపడినవారు (Victims) సివిల్ హాస్పిటల్‌ (Civil Hospital)లో చికిత్స పొందుతున్నారు. విమాన ప్రమాదంలో 241 ప్రయాణికులు, 38 మంది బిజె మెడికల్ కళాశాల ప్రాంగణంలో మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కాలిన గాయాలతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు.
డీఎన్ఏ పరీక్షలు..

మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా ఆదివారం విమాన ప్రమాద ప్రయాణికుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అధికారులు అప్పగిస్తున్నారు. కాగా చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన నేపథ్యంలో.. కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో సరిపోల్చి నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తవగానే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించినట్టు ఎయిరిండియా ఇప్పటికే ప్రకటించింది. మిగతా వారు వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, హాస్టల్‌ మెస్‌లో పనిచేస్తున్నవారు ఉన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాద స్థలాన్ని జాతీయ భద్రతాదళం (ఎన్‌ఎస్‌జీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టు సమాచారం.

ఉన్నతస్థాయి కమిటి…

కాగా ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈ కమిటీ సోమవారం సమావేశమై విమాన ప్రమాదంపై విచారణ చేపడుతుందని.. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పిస్తుందని ఆయన అన్నారు. విమాన ప్రమాదాలను నివారించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికను పరిశీలిస్తుందని, భవిష్యత్తులో భద్రతా చర్యల కోసం చేపట్టాల్సిన సమగ్ర, విధాన ఆధారిత రోడ్‌‌మ్యాప్‌ను కూడా రూపొందిస్తుందని చెప్పారు.

 

తెలంగాణలో హాట్ హాట్‌గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్.

తెలంగాణలో హాట్ హాట్‌గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్…

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది.

హనుమకొండ: తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయాలు భగ్గుమన్నాయి. మాటల తూటాలతో రెండు పార్టీల్లోని నేతలు రెచ్చిపోయారు. భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపణలు చేశారు. వినయ్ భాస్కర్ వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (Naini Rajender Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెండర్లు ప్రకటించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయని వినయ్ భాస్కర్‌ అన్నారు. పూడికతీత పనుల్లో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని ఆయన చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని చర్చకు రమ్మను తాను సిద్ధమని నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. గతంలో కుడాకు ఒక రూపాయి అయినా నిధులు తెచ్చినట్టు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని నాయిని రాజేందర్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.

బీఆర్ఎస్ నేతలు సామాజిక ఉగ్రవాదులు వీళ్లను ఎన్‌కౌంటర్ చేయాలని నాయిని రాజేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల పరిస్థితి దొంగే దొంగా అన్నట్లుగా ఉందని విమర్శించారు. వరంగల్‌లో కుడా నిధులు దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్‌పై కేసు పెడతామని హెచ్చరించారు. అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ చీడ పురుగులలాంటి వాళ్లు… వీళ్లను వెంటనే జైళ్లో పెట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగితే ఇక్కడి బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌కి పారిపోతారని నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు.

కన్నుల పండుగగా గద్దర్‌ అవార్డుల వేడుక.

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024’ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా 2024 ఏడాదికి గాను తెలుగు చలనచిత్రాలకు చెందిన వివిధ కేటగిరీల్లో విజేతలతో పాటు 2014-2023 వరకు…

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024’ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా 2024 ఏడాదికి గాను తెలుగు చలనచిత్రాలకు చెందిన వివిధ కేటగిరీల్లో విజేతలతో పాటు 2014-2023 వరకు ఉత్తమ ప్రథమ, ద్వితీయ, తృతీయ చలనచిత్రాలకు, ఉత్తమ నటీనటులు, దర్శక నిర్మాతలకు సైతం ఈ పురస్కారాలను అందించారు.

14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాకు ప్రాంతీయ అవార్డులు ఇచ్చింది ఈ కార్యక్రమానికి యావత్‌ చిత్ర పరిశ్రమ కదిలొచ్చింది. తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (టీజీఎ్‌ఫడీసీ) చైర్మన్‌ దిల్‌ రాజు, ఎండీ ఎస్‌. హరీష్‌ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. రెడ్‌కార్పెట్‌పై సినీ ప్రముఖులు సందడి చేశారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అలాగే అవార్డ్స్‌ ఫంక్షన్‌కు సంబంధించిన సావనీర్‌ను వారిద్దరూ ఆవిష్కరించారు.

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ మెమెంటోనూ రూపొదించిన రమావత్‌ నాగుల నాయక్‌ను, జ్యూరీ చైర్మన్‌ మురళీమోహన్‌, చైర్‌పర్సన్‌ జయసుధ, సభ్యులు కే దశరథ్‌, డీవీకేరాజు, ఊహ తదితరులను జ్ఞాపికలతో సత్కరించారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎస్‌. తమన్‌, ఎం.ఎం కీరవాణి, గాయకులు రామ్‌ మిరియాల, మంగ్లీ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

గద్దర్‌ను గుర్తు చేసుకుంటూ మంగ్లీ ‘పొడుస్తున్న పొద్దుమీద, బండెనక బండికట్టి’ పాటలు ఆలపించారు. పాతతరం కథానాయికలు జయప్రద, జయసుధ, సుహాసిని, ఒకేఫ్రేమ్‌లో కనిపించి అలరించారు.

భీమ్స్‌ సిసిరోలియో తల్లితో పాటు కలసి పురస్కారం అందుకున్నారు. ఆ సందర్భంలో ఆయన తల్లిని ముద్దాడిన దృశ్యం మనసుకు హత్తుకుంది. ముందుగా వ్యక్తిగత అవార్డ్స్‌ విభాగం ప్రధానంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ పురస్కారాలను అందజేశారు. తర్వాత రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా తొలిపురస్కారాన్ని ‘రజాకార్‌’ చిత్రానికి గాను ఉత్తమ నిర్మాతగా గూడురు నారాయణరెడ్డి, దర్శకుడు యాట సత్యనారాయణకు అందజేశారు.

ఉత్తమ ప్రజాధరణ చిత్రం కేటగిరిలో ‘ఆయ్‌’ చిత్రానికి గాను బన్నీ వాసు తరపున అల్లు అరవింద్‌ పురస్కారం అందుకున్నారు.

శుభ పరిణామం

14 ఏళ్ల తర్వాత ఈ రోజు తెలుగు సినిమా అవార్డ్స్‌ వేడుకను నిర్వహించుకోవడం శుభ పరిణామం. 2014 జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలకు అవార్డ్స్‌ ఇవ్వడం సంతోషకరం.

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ఈ రోజు ఇంత వైభవంగా నిర్వహించుకోవడానికి కారణమైన తెలంగాణ సీఎం ఎ. రేవంత్‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. 

సినిమా టికెట్‌లు

దిల్‌రాజు

నా కుటుంబం తరపున ధన్యవాదాలు

ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుతోంది. గద్దరన్న తెలంగాణ ముద్దుబిడ్డ. ఆయన పేరును చిరస్ఙాయిగా నిలబెట్టేలా ఈ అవార్డ్‌లు ఇవ్వడం గొప్ప విషయం. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు. 1996లో ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ ఇవ్వడం మొదలైంది. మధ్యలో ఆగిపోయింది. మళ్లీ పదేళ్ల తర్వాత తిరిగి ఎన్టీఆర్‌ అవార్డ్‌ను ఇస్తున్నందుకు నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవార్డ్‌కు తొలి గ్రహీతగా ఎంపికవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ పురస్కారంతో పాటు ఇచ్చే నగదు బహుమతిని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ హాస్పిటల్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌కు రేవంత్‌ అన్న ఇచ్చినట్లు భావిస్తున్నాను’ అని చెప్పారు.

నా బాధ్యతను పెంచింది

సినిమా పరిశ్రమను ఒకతాటిపైకి తెచ్చి గద్దరన్న పేరుతో అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉంది. కాంతారావు గారి పేరు మీద ఇచ్చే అవార్డ్‌ను స్వీకరిస్తున్న తొలి నటుడిగా నా బాధ్యతను మరింత పెంచింది. రేవంత్‌రెడ్డి గారికి ధన్యవాదాలు.

విజయ్‌ దేవరకొండ

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..

సినిమా టికెట్‌లు

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

నాన్న అంటే నమ్మకం నాన్న ప్రేమలో బాధ్యత.

నాన్న అంటే నమ్మకం నాన్న ప్రేమలో బాధ్యత..

అమ్మ ప్రేమకు ప్రతిరూపం అయితే.నాన్న ఓ నమ్మకం. అమ్మ ప్రేమలో ఆప్యాయత ఉంటే… నాన్న ప్రేమలో బాధ్యత ఉంటుంది. అదే పిల్లలకు గొప్ప భరోసా.

నా గురువు

నేను నాన్న కూచీని. నా జీవితంలోని ప్రతి అడుగులోనూ ఆయన ముద్ర ఉంది. దేని గురించైనా నాన్నతో మాట్లాడగలిగేంత చనువు నాకుంది. మగవాళ్లు తమ మనసులోని భావాలను బయటకు వ్యక్తపరచలేరు అంటారు కదా! కానీ మా నాన్న మాత్రం అలా కాదు. మాపై తనకి ఎంత ప్రేముందో ఎప్పటికప్పుడు లేఖల ద్వారా తెలియజేస్తారు. అవి చదువుతున్నప్పుడు భలే ముచ్చటేస్తుంది. నాకు ఏ సమస్య వచ్చినా ముందు నాన్నకే ఫోన్‌ వెళ్తుంది. నా గదిలో వై-ఫై పనిచేయకపోయినా తనకే ఫోన్‌ చేస్తా. ఆయనే నా గురువు.

– కృతి సనన్‌

 

తన పేరు వాడొద్దన్నారు

నాన్న మహేశ్‌ భట్‌ నా చిన్నతనంలో ఇంట్లో కన్నా సెట్‌లోనే ఎక్కువ ఉండేవారు. ఒకరకంగా నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టాకే మా మధ్య మరింత అనుబంధం పెరిగిందని చెప్పొచ్చు. మొదట నేను సినిమాల్లోకి వస్తానంటే ఆయన ప్రోత్సహించలేదు. ‘ప్రతిభ ముఖ్యం. నా కూతురిగా సినిమాల్లోకి రావడం, నా పేరు వాడుకుని అవకాశాలు సంపాదించడం నాకు ఇష్టముండదు’ అన్నారు. నాన్న పేరు వాడుకోకుండా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. ప్రస్తుతం నా విజయాలు చూసి ఆయన చాలా గర్వంగా ఫీలవుతుంటారు.

సినిమా టికెట్‌లు

– అలియా భట్‌

నా మార్గ నిర్దేశకుడు…

సరిగ్గా నేను పుట్టడానికి రెండు రోజుల ముందు… పెద్ద కళ్లు, పొడవాటి జుట్టు, అందమైన ముక్కు, పట్టీలేసుకుని.. తన పొట్టపై నేను ఆడుకుంటున్నట్లుగా నాన్నకు ఓ కల వచ్చిందట. ఆ కలకు తగ్గట్టే నేను పుట్టేసరికి… ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందని తెగ సంబరపడిపోయారట. ఆ మధుర క్షణాల గురించి నాన్న ఇప్పటికీ నాకు చెప్తూ మురిసిపోతుంటారు. చిన్నతనంలో నాన్నతో గడిపిన క్షణాలు చాలా తక్కువ. కాస్త పెద్దయ్యాక పైచదువుల దృష్ట్యా హాస్టల్‌లో ఉండాల్సి వచ్చింది. ఆతర్వాత సినిమాలతో బిజీ అయ్యాను. చాలా సందర్భాల్లో నాన్నను మిస్సయిన ఫీలింగ్‌ కలుగుతుంటుంది. నాన్న కూడా నా ఆరోగ్యం, కెరీర్‌ గురించి అనుక్షణం ఆలోచిస్తూ, మార్గనిర్దేశనం చేస్తుంటారు.

– రష్మిక మందన్నా

 

దేవుడిచ్చిన బహుమతి

ఏ అమ్మాయికైనా తండ్రిలో ఓ స్నేహితుడు కనబడితే… ఆ అమ్మాయి చాలా లక్కీ అని నా ఫీలింగ్‌. మా నాన్న అలాంటివారే. ఎదుటివారితో ఎలా మాట్లాడాలి? అనేది ఆయన్నుంచే నేర్చుకున్నాను. ఓపిక, మంచితనం, ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం…. ఇలా అన్ని విషయాల గురించి నాన్న నా చిన్నప్పుడే చెప్పారు.Father means trust, father means responsibility in love.

 

ఆయనిచ్చిన ధైర్యమే…

నా జీవితంలో నాన్న స్థానం చాలా గొప్పది. నేను ఇంత చలాకీగా ఉంటున్నానంటే దానికి కారణం నాన్నే. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే సినిమాల్లో నాదైన శైలిలో రాణించగలుగుతున్నా. షూటింగ్‌ తర్వాత ఇంటికెళ్తే.. నాతో బోలెడు కబుర్లు చెబుతుంటారు. మా మాతృభాష బడగా అయినా… నేను ఇంట్లో అప్పుడప్పుడు తెలుగు మాట్లాడుతుంటా. ‘తెలుగు బాగా మాట్లాడుతున్నావ్‌గా.. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకో’ అంటూ ఆటపట్టిస్తుంటారు నాన్న.

మహాత్మా గాంధీ మునిమనుమరాలికి జైలు.

మహాత్మా గాంధీ మునిమనుమరాలికి జైలు

 

 

 

 

మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆషిష్‌ లత రామ్‌గోబిన్‌(56)కు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రముఖ హక్కుల కార్యకర్త ఇలా గాంధీ, దివంగత మెవా రామ్‌గోబిన్‌ల కుమార్తె లత..

రూ. 3.2 కోట్ల మోసం కేసులో ఏడేళ్లు శిక్ష ఖరారు చేసిన డర్బన్‌ కోర్టు

డర్బన్‌(సౌత్‌ ఆఫ్రికా), జూన్‌ 14: మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆషిష్‌ లత రామ్‌గోబిన్‌(56)కు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రముఖ హక్కుల కార్యకర్త ఇలా గాంధీ, దివంగత మెవా రామ్‌గోబిన్‌ల కుమార్తె లత… వ్యాపారవేత్త ఎస్‌ఆర్‌ మహరాజ్‌ను 3.22 కోట్లకు మోసం చేశారు. నేరం రుజువుకావడంతో దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్‌ కోర్టు శిక్ష ఖరారు చేస్తూ, అప్పీలు చేసుకునే అవకాశాన్నీ నిరాకరించింది. తనకు తాను ఆహింసావాదిగా, హక్కుల కార్యకర్తగా చెప్పుకునే లత రామ్‌గోబిన్‌ను, వ్యాపారవేత్త ఎస్‌ఆర్‌ మహరాజ్‌ 2015లో కలిశారు.

ఆయన వస్త్ర, పాదరక్షల వ్యాపారి. ఇతర వ్యాపారవేత్తలకు అవసరమైన నిధులు సమకూరుస్తూ లాభంలో వాటా తీసుకుంటారు. ‘దక్షిణాఫ్రికాలోని ఓ ప్రముఖ ఆసుపత్రి గ్రూప్‌నకు అవసరమైన ‘లైనిన్‌’ ఇండియా నుంచి దిగుమతి చేసుకున్నా. కస్టమ్స్‌, దిగుమతి సుంకం చెల్లించాలి. ప్రస్తుతం నా దగ్గర అంత పెట్టుబడి లేదు. మీరు సమకూరిస్తే లాభంలో వాటా ఇస్తాను’ అంటూ లత.. మహరాజ్‌తో నమ్మబలికారు. మహరాజ్‌ పెట్టుబడి సమకూర్చారు. కొద్ది కాలానికే ఆమె మోసం చేసిందని తెలుసుకున్న ఆయన పోలీస్‌ కేసు పెట్టారు. అసలు ఆమె భారతదేశం నుంచి ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోలేదని నిర్ధారణ అయింది.

 గూస్ బంప్స్‌ తెప్పించేలా ‘యముడు’ పాట.

 గూస్ బంప్స్‌ తెప్పించేలా ‘యముడు’ పాట…

మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా ‘యముడు’ చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉప శీర్షిక.  శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు.  తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధర్మో రక్షతి’ అంటూ సాగే ఓ అద్భుతమైన పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు వంశీ సరోజిని వికాస్ సాహిత్యాన్ని అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి, అరుణ్ కౌండిన్య, హర్ష వర్దన్ చావలి ఆలపించారు.  భవానీ రాకేష్ అందించిన బాణీ అయితే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. యముడి కర్తవ్యాన్ని, బాధ్యతల్ని చాటి చెప్పేలా సాగిన ఈ పాట యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌ కానుంది.

రానా నాయుడు సీజ‌న్‌2 రివ్యూ ఎలా ఉందంటే

రానా నాయుడు సీజ‌న్‌2 రివ్యూ ఎలా ఉందంటే…

 

రెండేండ్ల క్రితం వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించ‌డంతో పాటు తీవ్ర విమ‌ర్శ‌ల పాలైన వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). తాజాగా ఈ సిరీస్ సీక్వెల్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. విక్ట‌రీ వెంక‌టేశ్ (Venkatesh Daggubati), రానా (Rana Daggubati), అర్జున్ రామ్‌పాల్ (Arjun Rampal) , సుర్వీన్ చావ్లా (Surveen Chawla), కృతి క‌ర్భంద (Kriti Kharbanda), అభిషేక్ బెన‌ర్జీ (Abhishek Banerjee), సుశాంత్ సింగ్, ర‌జ‌త్ క‌పూర్ (Rajat Kapoor) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క‌ర‌ణ్ అన్షుమ‌న్ (Karan Anshuman) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే.. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీకి వ‌చ్చిన ఈ సిరీస్ గ‌త సీజ‌న్‌ను మ‌రిపించిందా లేక నిరాశ‌ ప‌ర్చిందా అనేది ఇక్క‌డ చూద్దాం.

 

అయితే మ‌రోవైపు రానాకు ద‌గ్గ‌రైన ఓ పొలిటీషియ‌న్ రానాకు వ్య‌తిరేఖంగా ర‌వూఫ్‌కు సాయం చేసి జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి అత‌ని సాయంతో రాజ‌కీయంగా ఎద‌గాల‌ని చూస్తుంటాడు. కానీ ర‌వూఫ్ ఆ పొలిటీషియ‌న్‌ను కాద‌ని తానే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఫ్లాన్లు చేస్తుంటాడు. ఇక నాగా నాయుడు సైతం ఓ గ్యాంగ్ లేడీకి డ‌బ్బులు బాకీ ప‌డడం, రానా అన్న‌, త‌మ్ముళ్లు ప్రేమ‌లో ప‌డ‌డం వారు డ‌బ్బు సంపాదించి ఈ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉండాల‌ని ప్ర‌య‌త్నాలు చేసి ఇబ్బందుల్లో ప‌డ‌తారు. మ‌రోవైపు విరాజ్ ఒబెరాయ్ ఓ త‌ప్పు చేసి ఓ పోలీస్ సాయంతో రానాను అందులో ఇరికిస్తాడు. వెర‌సి మూడు, నాలుగు గ్రూపులు, అందులో వారి సొంత వ్య‌వ‌హారాలు, వారు ప‌న్నే కుట్ర‌ల నేప‌థ్యంలో రానా అడ్ ఫ్యామిలీ ఎలా చిక్కుకుంది, అందులో నుంచి ఏవిధంగా బ‌య‌ట ప‌డ్డార‌నే ఈ రానా నాయుడు సిరీస్‌ సీజ‌న్‌2 కథ‌. క‌థ‌గా చెప్పుకోవ‌డానికి ఇది రెగ్యుల‌ర్ రివేంజ్‌, యాక్ష‌న్ డ్రామానే అయినా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ త‌ర‌హా గ్రూపులు, ఒక‌రిని మించి మ‌రొక‌రు, ఒక‌రిపై ఒక‌రు కుట్ర‌ల నేప‌థ్యంలో ఈ సీజ‌న్‌ను తెర‌కెక్కించిన‌ట‌లు అర్థ‌మ‌వుతుంది.

 

అయితే మొద‌టి భాగంలో ఉన్న‌ట్లు హింస‌, అశ్లీల స‌న్నివేశాలు, అస‌భ్య ప‌దాల వాడ‌కం 80 శాతం త‌గ్గించి పూర్తిగా రానా అయ‌న ప్యామిలీ, వారి సొంత వ్యవ‌హారాల‌ చుట్టూనే న‌డిపించారు. కాగా వెంక‌టేశ్ పాత్ర మాత్రం తీసిక‌ట్టుగా ఉంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఈ క్యారెక్ట‌ర్‌కు వెంక‌టేశ్ అవ‌స‌రమే లేదు వేరే ఎవ‌రితోనైనా చేయించొచ్చు అనే అంతగా ఆయ‌న‌ పాత్ర చిత్ర‌ణ ఉంది. ఓ క‌మెడియ‌న్ త‌ర‌హాలో, అప్పుడ‌ప్పుడు రావ‌డం, ర‌స్టిక్‌గా డైలాగులు చెప్ప‌డం ఆపై మాయం కావ‌డం, చివ‌ర‌లో రానాకు చివ‌రి నిమిషంలో హైల్ప్ చేసే క్యారెక్ట‌ర్‌కే ఆయ‌న పాత్ర ప‌రిమిత‌మైంది. పూర్తిగా రానా నేప‌థ్యంలో ఉండడం కాస్త ఊర‌ట క‌లిగించే విష‌యం. మొత్తంగా గ‌త సీజ‌న్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చేరువ కాక‌పోవ‌డంతో ఈ సీజ‌న్ విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అన్ని వెబ్ సీరిస్‌ల లాగానే ఇందులోనూ అక్ర‌మ సంబంధ సీన్లు న‌డిపించారు. గ‌త సీజ‌న్ ఇష్ట‌ప‌డిన వాళ్ల‌కు ఈ సీజ‌న్ అంత‌గా న‌చ్చ‌క పోయిన ఒక‌మారు చూసేయ‌వ‌చ్చు. ఫ్యామిలీస్ అక్క‌డ‌క్క‌డ అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

 ఇరాన్‌లో భారీ విధ్వంసం.

 ఇరాన్‌లో భారీ విధ్వంసం…

ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌లో భారీ విధ్వంసం జరుగుతోంది. శనివారం తెల్లవారుజాము వరకు ఇరాన్‌ క్షిపణి కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌..

తొలిసారి ఆర్థిక మూలాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌

బుషెహర్‌, సౌత్‌పార్స్‌ చమురు క్షేత్రాలపై దాడి

ఇరాన్‌ చుట్టూ 78 ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు

150 టార్గెట్లపై దాడులు 78 మంది మృతి

ఆర్మీ, ఎమర్జెన్సీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ల దుర్మరణం

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతిదాడిలో ముగ్గురి మృతి

టెల్‌అవీవ్‌/న్యూఢిల్లీ, జూన్‌ 14:
ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌లో భారీ విధ్వంసం జరుగుతోంది. శనివారం తెల్లవారుజాము వరకు ఇరాన్‌ క్షిపణి కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌.
సాయంత్రం తొలిసారి ఆర్థిక మూలాలపై విరుచుకుపడింది. బుషెహర్‌ చమురు క్షేత్రాలు (ఇక్కడే అణు విద్యుత్తు కేంద్రం ఉంది), సౌత్‌ పార్స్‌ న్యాచురల్‌ గ్యాస్‌ క్షేత్రాలపై దాడులు చేసింది.
ఆ ప్రాంతాల్లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని ఇరాన్‌ అధికారిక వార్తాసంస్థ తస్నీమ్‌ న్యూస్‌ పేర్కొంది.
ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ ఇంటికి సమీపంలోనూ క్షిపణులు పడ్డాయని వెల్లడించింది.
ఐక్య రాజ్య సమితి(ఐరాస) అణు విభాగం చీఫ్‌ రాఫెల్‌ గ్రోసీ కూడా ఓ ప్రకటన ద్వారా ఇరాన్‌లోని నటాంజ్‌(షాహిద్‌ అహ్మదీ రోషన్‌) అణు కేంద్రం ధ్వంసమైనట్లు నిర్ధారించారు.
ఇరాన్‌ మొత్తం తమ టార్గెట్‌లో ఉందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించగా..
ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 9 మంది కీలక సైంటిస్టులు, 16 మంది మిలటరీ జనరళ్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) వెల్లడించింది.
వీరిలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ముఖ్య సలహాదారు షంఖానీ, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఆఫ్‌ ఇరానియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మహమ్మద్‌ బఘేరీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ చీఫ్‌ గులామ్‌ అలీ రషీద్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గులామ్‌-అల్‌-మర్హాబ్‌, ఇస్లామిక్‌ రివొల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ) కమాండర్‌ హుస్సేన్‌ సలామీ, ఐఆర్‌జీసీ ఎయిర్‌ కమాండర్‌ ఆమిర్‌ అలీ హాజీజాదే,డ్రోన్ల విభాగం కమాండర్‌ తాహెర్‌ పుర్‌, ఎయిర్‌ డిఫెన్స్‌ కమాండర్‌ దావూద్‌ షిహ్యాన్‌, క్షిపణి విభాగం కమాండర్‌ మహమ్మద్‌ బఘేరీ ఉన్నారు.
దీంతో ఇరాన్‌ త్రివిధ దళాలు పెద్దదిక్కులను కోల్పోయినట్లయింది.
ఆర్మీ కమాండర్‌ ఆమిర్‌ మౌసావీ, ఐఆర్‌జీసీ గ్రౌండ్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ మహమ్మద్‌ పాక్‌పౌర్‌, ఖుద్స్‌ ఫోర్స్‌ కమాండర్‌ ఇస్మాయిల్‌ ఖ్వానీ, ఐఆర్‌జీసీ నేవీ కమాండర్‌ అలీరెజా తంగ్సీరి మాత్రమే ఇరాన్‌ సెక్యూరిటీ చైన్‌లో సజీవ కమాండర్లుగా ఉన్నట్లు తెలిపింది.
శనివారం సాయంత్రం నెతన్యాహు మాట్లాడుతూ.
మరో 90 నిమిషాల్లో ఇరాన్‌కు పెద్ద దెబ్బ తగులుతుందని ప్రకటించారు.
ఆయన ప్రకటన వెలువడిన 90వ నిమిషం నుంచి ఇజ్రాయెల్‌ వైమానిక దళం క్షిపణులతో ఇరాన్‌పై విరుచుకుపడడం గమనార్హం..! 150 టార్గెట్లను ఛేదించామని పేర్కొంటూ.
అందుకు సంబంధించిన ఫుటేజీని ఐడీఎఫ్‌ తన అధికారిక టెలిగ్రామ్‌ చానల్‌లో విడుదల చేసింది. శుక్ర, శనివారాల్లో జరిపిన దాడుల్లో చనిపోయిన ఇరాన్‌ శాస్త్రవేత్తల వివరాలను ప్రకటించింది.
ఆ జాబితాలో న్యూక్లియర్‌ ఇంజనీరింగ్‌ నిపుణులు ఫ్రెదోన్‌ అబ్బాసీ, అహ్మద్‌ రజా దరియానీ, ఫిజిక్స్‌ నిపుణులు మహమ్మద్‌ మెహ్దీ తెహ్రాన్షీ, ఆమిర్‌ హసన్‌ ఫఖీ, అబ్దుల్లామిద్‌ మినుష్షర్‌, మన్సూర్‌ అస్ఘరీ, మెకానిక్స్‌ నిపుణుడు అలీ బౌఖాయ్‌ ఖత్రిమీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు అక్బర్‌ మతాలిజాదా, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు సయీద్‌ బార్జీ ఉన్నట్లు తెలిపింది.
ఇరాన్‌ మీడియా కూడా ఇజ్రాయెల్‌ దాడుల్లో 78 మంది మరణించారని, 320 మంది గాయపడ్డారని పేర్కొంది.

ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులతో ఇరాన్‌లోని ప్రముఖులు రష్యాకు పారిపోతున్నట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా స్పష్టం చేస్తోంది. సుప్రీం లీడర్‌ ఖమేనీ ఇంటి సమీపంలోనూ క్షిపణి దాడులు జరగడం.

ఆయన ముఖ్య సలహాదారు సహా, ఆర్మీ అధికారులు చనిపోవడంతో వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌ జెట్లు పెద్ద సంఖ్యలో రష్యాకు చేరుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ వార్తాసంస్థ ‘వైనెట్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇందులో ఓ విమానం ట్రాకింగ్‌ మధ్యలో కనుమరుగైందని, అందులో ఖమేనీలాంటి ప్రముఖ వ్యక్తి ఉండి ఉంటాడని పేర్కొంది.

రష్యా-ఇరాన్‌ ద్వంద్వ పౌరసత్వం ఉన్న ప్రముఖులు కూడా ప్రైవేట్‌ జెట్లలో దేశాన్ని వీడుతున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు, ఇజ్రాయెల్‌ దాడుల పట్ల ఇరాన్‌లోనే పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘‘ప్రతీ 47 ఏళ్లకు ఇరాన్‌కు స్వాతంత్య్రం వస్తుందనుకుంటా. ఇప్పుడు కూడా సుప్రీంలీడర్‌ పాలన నుంచి విముక్తి దొరుకుతుందని భావిస్తున్నా’’ అంటూ ఓయువతి పేర్కొంది.

ఎస్‌సీవో ప్రకటనకు భారత్‌ దూరం:

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడులను షాంఘై సహకార సంస్థ(ఎ్‌ససీవో) తీవ్రంగా ఖండించింది. అయితే.. ఎస్‌సీవో ప్రకటనకు భారత్‌ దూరంగా ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) స్పష్టం చేసింది.

ఈ అంశంపై ఎస్‌ఈఏ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ భారత్‌ పాల్గొనలేదని వివరించింది.

చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తాము ఇరు దేశాలను కోరుతున్నట్లు తెలిపింది.

కాగా… పాలస్తీనాలో నివసించే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని బయట తిరగొద్దని సూచించింది.

ఇక అమెరికాతో చర్చలు అర్థరహితం:

ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో అమెరికాతో అణుచర్చలు జరపడం అర్థరహితమని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికారి అబ్బాస్‌ అరగ్చి అంతర్జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.

అమెరికా-ఇరాన్‌ మధ్య ఆదివారం ఒమన్‌లో అణు చర్చలు జరగాల్సి ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

 ఇదే విషయాన్ని ఆయన ఐరోపా సమాఖ్య రాయబారి ఖాజా కల్లా్‌సకు తెలిపానని వెల్లడించారు.

ఇజ్రాయెల్‌కు అమెరికా ప్రత్యక్ష మద్దతు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

నెతన్యాహు కుమారుడి పెళ్లి వాయిదా:

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కుమారుడు అవ్నర్‌ నెతన్యాహు వివాహం వాయిదా పడింది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెతన్యాహు కుటుంబం ప్రకటించింది.

అవ్నర్‌ పెళ్లి సోమవారం అమిత్‌ యార్డెనీతో జరగాల్సి ఉంది. వాయిదా పడ్డ పెళ్లి తేదీని త్వరలో ప్రకటిస్తారని సమాచారం.

ఇజ్రాయెల్‌లో ముగ్గురి మృతి:

శుక్రవారం రాత్రి ఇరాన్‌ జరిపిన బాలిస్టిక్‌ క్షిపణి దాడుల్లో టెల్‌అవీవ్‌ శివార్లలోని రామత్‌గన్‌లో కోహెన్‌ ఏంజెల్‌(87), రిషోన్‌యెజిలోన్‌లో ఇజ్రాయెల్‌ అలోనీ(67), ఎట్టీ అనే మహిళలు చనిపోయారని, ఏడుగురు సైనికులు సహా 80 మందికి గాయాలైనట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది.

క్షతగాత్రుల్లో 34 మంది పారామెడికల్‌ బృందాలకు చెందినవారని తెలిపింది.

టెల్‌అవీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం బెన్‌ గురియన్‌ వద్ద పేలుడు సంభవించినట్లు ఇరాన్‌ వార్తాసంస్థలు చెబుతుండగా.

యుద్ధం ప్రారంభానికి ముందు నుంచి ముందుజాగ్రత్త చర్యగా విమానాల రాకపోకలను నిషేధించామని ఐడీఎఫ్‌ పేర్కొంది.

ఇరాన్‌ దాడుల్లో రామత్‌గన్‌, రిషోన్‌యెజిలోన్‌ నగరాల్లో నివాస గృహాలు, వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి. అయితే.. పౌరులను ముందుగానే బంకర్లకు తరలించడం వల్ల ప్రాణనష్టం తప్పిందని ఐడీఎఫ్‌ చెబుతోంది.

30 ఏళ్ళ పెదరాయుడు.

30 ఏళ్ళ పెదరాయుడు…

నటప్రపూర్ణ మోహన్ బాబు నటజీవితంలో మరపురాని మరచిపోలేని చిత్రం ‘పెదరాయుడు’… ఈ చిత్రం జూన్ 15తో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.

నటప్రపూర్ణ మోహన్ బాబు నటజీవితంలో మరపురాని మరచిపోలేని చిత్రం ‘పెదరాయుడు'(Pedarayudu)… ఈ చిత్రం జూన్ 15తో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది…
మోహన్ బాబు (mohanbabu)నటజీవితాన్ని ‘పెదరాయుడు’కు ముందు – ‘పెదరాయుడు’ తరువాత అన్న రీతిలో విడదీయవలసి ఉంటుంది… అంతకు ముందు మోహన్ బాబు వందల చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి అలరించారు… ‘ప్రతిజ్ఞ’తో నటనిర్మాతగా మారి ప్రయాణం సాగించారు… సొంత చిత్రాల నిర్మాణంలో మోహన్ బాబు ఎన్నెన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నారు… ఆయన నటించి నిర్మించిన చిత్రాల్లో కొన్ని అఖండ విజయాలను నమోదు చేశాయి… మరికొన్ని అపజయాల బాట పట్టాయి… ఈ నేపథ్యంలో యన్టీఆర్ ప్రధాన పాత్రలో మోహన్ బాబు నిర్మించిన ‘మేజర్ చంద్రకాంత్’ బంపర్ హిట్ గా నిలచింది… ఆ సినిమా తరువాత మళ్ళీ కొంత నిరాశ! ఆ సమయంలో మోహన్ బాబు నిర్మించి నటించిన ‘పెదరాయుడు’ అనూహ్య విజయం సాధించింది… 1995 జూన్ 15న విడుదలైన ‘పెదరాయుడు’ ముందు పోటీ చిత్రాలు నిలవలేకపోయాయి… ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా బాక్సాఫీస్ రేసు గెలవడమే కాదు ఆల్ టైమ్ హిట్ గానూ ‘పెదరాయుడు’ నిలచింది…
సినిమా థియేటర్‌లు

తమిళంలో శరత్ కుమార్ హీరోగా రూపొందిన ‘నాటామై’ మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని చూసిన రజనీకాంత్ , దానిని తెలుగులో రీమేక్ చేయమని మోహన్ బాబుకు సూచించారు. అలాగే అందులో పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ నటిస్తానని మాటిచ్చారు… అదే తీరున నటించి అలరించారు… యన్టీఆర్, ఏయన్నార్, దాసరి వంటి ప్రముఖుల సమక్షంలో ఆరంభమైన ‘పెదరాయుడు’ సాధించిన ఘనవిజయంతో మోహన్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్ళింది… భానుప్రియ, సౌందర్య నాయికలుగా నటించిన ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు… కోటి సంగీతం సమకూర్చారు… సీతారామశాస్త్రి, భువనచంద్ర, శ్రీహర్ష రాసిన పాటలు జనాన్ని ఆకట్టుకున్నాయి… ఈ నాటికీ మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రాలలో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన సినిమాగా ‘పెదరాయుడు’ నిలచే ఉంది… ఇప్పటికీ ‘పెదరాయుడు’ బుల్లితెరపై కనిపిస్తే జనం ఆసక్తిగా చూస్తూనే ఉండడం విశేషం!

అసైన్డ్‌ భూములకు రెక్కలు.

అసైన్డ్‌ భూములకు రెక్కలు…

 

ఏడాది క్రితం ఆయన కరుడు గట్టిన వైసీపీ నేత. పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములతో ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా పెద్ద వ్యాపారమే చేశారు.

ఆ నాటి ప్రభుత్వంలో ముఖ్యపాత్రలో ఉన్న ఓ ఐఏఎస్‌ కుమారుడు, అల్లుడితో కలిసి అసైన్డ్‌ భూచక్రం తిప్పారు.

రూ.75 కోట్ల భూమిని సెటిల్‌చేసిన రెవెన్యూ మనిషి

విశాఖలో మళ్లీ మొదలైన ఎన్‌వోసీ దందా

3 ఎకరాలు ఆయనకు. 2 ఎకరాలు బ్రోకర్‌కు

మాజీ సైనికుడి సతీమణికి కుచ్చుటోపీ

ఈ డీల్‌తో రంగం మీదకు మరో మాజీ మంత్రి

మనోరమ హిల్స్‌పక్కనే ఐదు ఎకరాలపై కన్ను

బెజవాడ కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు

ఎండాడ పెందుర్తిలో 60 ఎకరాల డీ పట్టాపై డీల్‌

ఏడాది క్రితం ఆయన కరుడు గట్టిన వైసీపీ నేత. పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములతో ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా పెద్ద వ్యాపారమే చేశారు.

ఆ నాటి ప్రభుత్వంలో ముఖ్యపాత్రలో ఉన్న ఓ ఐఏఎస్‌ కుమారుడు, అల్లుడితో కలిసి అసైన్డ్‌ భూచక్రం తిప్పారు. భీమిలీ, పెందుర్తి, ఎండాడ, భోగాపురం ప్రాంతాల్లోని అతి ఖరీదైన భూములను హస్తగతం చేసుకొని ఒప్పందాలు చేసుకున్నారు.

2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని బోధపడి ఎన్నికలకు కొద్దిరోజుల ముందే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారినా భూదోపిడీ స్వభావం మారలేదు.

రెవెన్యూ శాఖలో కీలకమైన ఓ పెద్దమనిషిని ముందుపెట్టి విశాఖ కేంద్రంగా అసైన్డ్‌ భూములను చేజిక్కించుకునే ప్రయత్నాలు మళ్లీ ప్రారంభించారు.

ఇందులో రూ.75 కోట్ల విలువైన ఓ ఐదు ఎకరాల భూమిని అడ్డదారిలో చేజిక్కించుకున్నారు.

ఫలితంగా రెవెన్యూ పెద్దమనిషికి మూడు ఎకరాలు, ఈయనకు రెండు ఎకరాల చొప్పున వాటాల పంపిణీ జరిగింది. మనోరమ హిల్స్‌ సమీపంలోని అత్యంత ఖరీదైన 5 ఎకరాల డీ పట్టా భూమిని ఓ మాజీ మంత్రికి సెటిల్‌ చేసేందుకు ఇప్పుడు పావులు కదుపుతున్నారు.

ఇలా రెండో మూడో కాదు..ఏకంగా 46 ఎకరాల డీ పట్టా భూమిని సెటిల్‌ చేసేందుకు విజయవాడ కేంద్రంగా విశాఖ రెవెన్యూ అధికారులతో కీలక సమావేశాలు జరుగుతున్నాయి.

నాటి టీడీపీ ప్రభుత్వం 2016లో జీవో 279 జారీ చేసింది. దీని ప్రకారం, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు అసైన్డ్‌ చేసిన భూములకు పదేళ్ల కాలపరిమితి తీరితే ఇక వాటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోనక్కరలేదు.

ఈ జీవో ప్రకారం 10 ఏళ్ల కాలపరిమితి దాటిన మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమర యోధుల భూముల రిజిస్ట్రేషన్‌, క్రయవిక్రయాలకు ఎన్‌వోసీలు అక్కరలేదని, వాటికి ఏపీ అసైన్‌మెంట్‌ చట్టం-1977లోని భూ బదలాయింపు నిషేధం వర్తించదని రెవెన్యూశాఖ గడిచిన 8 ఏళ్లలో 15 ఆదేశాలు ఇచ్చింది.

అయినా, మళ్లీ ఎన్‌వోసీ డ్రామాను తెరపైకి తీసుకొచ్చి ఈ నేత మాజీ సైనికుల కుటుంబాలను బురిడీ కొట్టించి మరీ భూములు హస్తగతం చేసుకుంటున్నారు.

ఇందుకు రెవెన్యూశాఖలోని ఓ పెద్దమనిషి, విశాఖలోని ఓ మాజీ మంత్రి, మరి కొందరు తోడవ్వడం సదరు భూమి యజమానులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.

కూటమి వచ్చాక అసైన్డ్‌ భూముల దందా నిలిచిపోయిందని ఒకవైపు ప్రభుత్వం చెబుతోంటే, తెరవెనుక ఈ నేత ఆ భూములను చెరపట్టి చీకటి ఒప్పందాలు చేసుకునే పనిలో ఉండటం ప్రభుత్వానికి పెనుసవాల్‌ విసరడమే.

జీవో 279ని అనుసరించి మూడు కేటగిరీల డీ పట్టా భూములకు పదేళ్ల కాలపరిమితి దాటాక రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించాలి.

దీంతో లబ్ధిదారులకు ఆ భూమిపై పూర్తి హక్కులు వస్తాయి. ఆ భూములను తాకట్టుపెట్టుకోవచ్చు. ఇంకా ఆర్ధిక అవసరాలకు అమ్ముకోవచ్చు. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసింది

అయితే, ఈ కేటగిరీ భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో జీవో 279 ప్రకారం ఎన్‌వోసీలు అడగ రాదని రిజిస్ట్రేషన్‌ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

దీని అమలుకోసం అనేకానేక మార్గదర్శకాలు, సర్క్యూలర్‌ ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే, ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రభుత్వం నుంచి డీ పట్టా భూములు పొందిన మాజీ సైనికుల కుటుంబాలకు అసలు అవగాహనే లేదు.

కలెక్టర్‌ దగ్గర ఎన్‌వోసీ తీసుకుంటేనే భూమి ఫ్రీ హోల్డ్‌ అవుతుందని, ఆ తర్వాతే రిజిస్ట్రేషన్‌ చేస్తారని రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, కొందరు అధికారులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీంతో అవసరమే లేని ఎన్‌వోసీ ఇప్పించడం పెద్ద వ్యాపారంగా మారింది.

కొందరు ఎన్‌వోసీలు ఇప్పిస్తాం అంటూ కోట్లు దండుకుంటుంటే, మరి కొందరు కోట్ల విలువచేసే ఆ భూములనే కొట్టేస్తున్నారు. ఇందులో విశాఖకు చెందిన ఓ నేత సిద్ధహస్తుడు.

గతంలో వైసీపీలో ఉన్న ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. జగన్‌ ప్రభుత్వంలో వైసీపీ నేతగా ఆయన ఎన్‌వోసీలు ఇప్పించే వ్యాపారమే చేశారు. కూటమి వచ్చాక అదే పని మళ్లీ ప్రారంభించారు.

మనోరమ హిల్స్‌పై కన్ను…

ఎవ్వరికీ ఎలాంటి ఎన్‌వోసీలు ఇవ్వకూడదని రెవెన్యూశాఖలోని ఓ కీలక పెద్ద మనిషి విశాఖ అధికారులకు అనధికారిక హుకుం జారీ చేయించారు.

ఒక వేళ ఏ భూమికైనా ఎన్‌వోసీ కావాలనుకుంటే రెవెన్యూశాఖలో అత్యున్నత స్థాయి నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని, అంతిమంగా కలెక్టర్‌ ఆదేశాలు ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు ఇప్పించారు.

ఇది జీవో 279కి పూర్తి విరుద్ధం. అయితే, ఇది అమలయితేనే తమ వద్దకు భూముల పంచాయతీలు వస్తాయని భావించిన రెవెన్యూ పెద్ద నిబంధనలకు విరుద్ధమైన పనులు చేసేలా అధికారులపై ఒత్తిడిచేశారు.

ఇదే పనిగా, విశాఖకు చెందిన ఓ నేతతో ఎండాడలోని ఐదు ఎకరాల భూమి ఫైలును తెప్పించుకున్నారు. నాటి రెవెన్యూ అధికారితో కలిసి గుట్టుగా ఫైల్‌ను సెటిల్‌ చేయించారు.

ఫలితంగా రెవెన్యూ పెద్దకు మూడు ఎకరాలు, విశాఖ నేతకు రెండు ఎకరాల భూమి దక్కింది.

ఇప్పుడు ఈ భూమిని 700 గజాల చొప్పున విడగొట్టి అమ్మేస్తున్నారు.

భూమికి అసలు యజమాని అయిన మాజీ సైనికుడి కుటుంబానికి ఈ నేత ఇచ్చిన సొమ్ము కేవలం రూ.25 లక్షల మాత్రమే.

ఈ విషయం తెలిసి విశాఖకు చెందిన ఓ మాజీ మంత్రి భూమిని సెటిల్‌ చేయించిన నేతను పిలిపించారు.

తనకు తెలియకుండా ఆ భూమికి ఎలా ఎన్‌వోసీ ఇప్పించారని నిలదీశారు. ఫలితంగా రెండున్నర కోట్ల ప్యాకేజీ మాట్లాడుకొని ఇంటికి తీసుకె ళ్లి సమర్పించినట్లు తెలిసింది. అయితే, ఇది సరిపోదని, మొత్తం రెండు ఎకరాలు తనకే కావాలని పేచీపెట్టడంతో, ప్రత్యామ్నాయంగా మనోరమ హిల్స్‌ పక్కనే ఉన్న మరో ఐదు ఎకరాల భూమిని సెటిల్‌ చేయిస్తానని మాటిచ్చినట్లు తెలిసింది.

ఈ భూమి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కుటుంబం నియంత్రణలో ఉంది. అది కూడా ఓ మాజీ సైనికుడి కుటుంబం నుంచి లాక్కున్నదే.

అయితే, ఎండాడలోని ఐదు ఎకరాల కేసు విజయవంతంగా సెటిల్‌ కావడంతో ఆ నేత పెందుర్తి, ఎండాడ, భీమిలి ప్రాంతాల్లోని 60 ఎకరాల డీపట్టాలపై కన్నేశారు. ఇప్పుడు పెద్ద దుకాణ మే తెరిచారు.

విశాఖ కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఆయనకు పెద్దపీట వేయిస్తున్నారు. ఇటీవల ప్రధాని వచ్చినప్పుడు ఆయనకు ఎయిర్‌పోర్టులోనే స్వాగతం పలికేందుకే తన వెంట తీసుకెళ్లారు. అప్పట్లోనే ఈ వ్యవహారం రచ్చకెక్కింది.

సార్ నా పోస్టుమార్టం ఆపండి పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు.

సార్ నా పోస్టుమార్టం ఆపండి పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు…

 

Youth Shocks Police: పోస్టుమార్టం జరగడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి ఘాతమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.

సార్ నా పేరు అజయ్ శంక్‌వర్ నేను బతికే ఉన్నాను.

దయచేసి నా పోస్టుమార్టం ఆపండి అని అన్నాడు.ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లా ఘాతమ్‌పూర్ టౌన్‌లో గురువారం ఓ శవం దొరికింది. ఆ శవం ఎవరిది అన్నది తెలియలేదు.

దీంతో పోలీసులు శవం ఫొటో తీసి, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారు.ఆ శవం ఎవరిదో తెలిస్తేచెప్పమని కోరారు.

సుమన్ అనే మహిళ ఘాతమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.

చనిపోయిన వ్యక్తి తన తమ్ముడు అజయ్ అని గుర్తుపట్టింది.

అతడు తరచుగా రెడ్ షర్ట్, బ్లాక్ కలర్ పాయింట్ వేసుకుంటాడని కూడా పోలీసులకు చెప్పింది.శవం ఎవరిదో తెలిసింది కాబట్టి.. పోలీసులు మిగిలిన ప్రొసిజర్స్ పూర్తి చేశారు.

శవాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. శుక్రవారం ఉదయం పోస్టుమార్టం జరగాల్సి ఉంది. పోస్టుమార్టం జరగడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి ఘాతమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.

‘సార్ నా పేరు అజయ్ శంక్‌వర్. నేను బతికే ఉన్నాను. దయచేసి నా పోస్టుమార్టం ఆపండి’ అని అన్నాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు.

చనిపోయాడనుకున్న వ్యక్తి బతికి రావటంతో నోరెళ్ల బెట్టారు. అతడ్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.

అజయ్ కుటుంబం ఆ శవం అజయ్‌దే అని గుర్తుపట్టింది. దీంతో పోస్టుమార్టం కోసం పంపాము. తర్వాత నిజమైన అజయ్ స్టేషన్‌కు వచ్చాడు. దీంతో పోస్టుమార్టం ఆపేశాము. శవం ఎవరిదో కనుక్కునే పనిలో పడ్డాము’ అని అన్నారు

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్.

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్…

 

 

Helicopter crash: ఉత్తరాఖండ్‌ ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్‌‌లో ఆదివారం హెలికాఫ్టర్ కుప్పకూలింది.

ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

Uttarakhand: ఇటీవల అహ్మదాబాద్‌ (Ahmedabad)లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్‌‌ (Uttarakhand)లో ఆదివారం హెలికాఫ్టర్ (Helicopter) కుప్పకూలింది (Crash).
ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గౌరికుండ్, త్రిజుగి నారాయణ్ మద్య ఆర్యన్ కంపెనీకి చెందిన హెలీకాఫ్టర్ ఈ ప్రమాదానికి గురైంది.
అయితే ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. డెహ్రాడూన్‌ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆదివారం తెల్లవారు జామున 5:20 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ కేదార్‌నాథ్ ధామ్ నుండి గుప్త్ కాశి బయలుదేరింది.
గౌరికుండ్ సమీపంలో కూలిపోయింది.
పైలెట్ సహా ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో 6 గురు ప్రయాణికులు ఉన్నారు.
ప్రయాణీకులు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్‌కు చెందినవారుగా గుర్తించారు.
ప్రమాదఘటన తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పేర్కొన్నారు.

కాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హెలికాఫ్టర్ల ప్రమాదాలపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు.

హెలి సర్వీసులపై స్పెషల్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

హెలికాప్టర్ల సాంకేతిక స్థితి పూర్తిగా తనిఖీ చేయడం తప్పనిసరి అని ప్రయాణానికి ముందు ఖచ్చితమైన వాతావరణ సమాచారం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

అన్ని సాంకేతిక భద్రతా అంశాల సమీక్ష కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

రాజీ మార్గమే రాజా మార్గం…

రాజీ మార్గమే రాజా మార్గం…

నర్సంపేట సబ్ జడ్జి వరూధిని

నర్సంపేట కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

ఎలాంటి సమస్యలకైనా రాజీ మార్గమే రాజా మార్గమని నర్సంపేట తాలూకా లీగల్ సర్వీస్ అతారిటి ఛైర్మన్, కోర్టు సబ్ జడ్జి వరూధిని అన్నారు. నర్సంపేట కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు.ఈ లోక్ అదాలత్ లో తాలూకా లీగల్ సర్వీస్ అతారిటి ఛైర్మన్,సబ్ జడ్జి వరూధిని మాట్లాడుతూ రాజి పడదగిన కేసులలో రాజి పడటం ద్వార కేసుల నుండి పరిష్కారం పొందవచ్చు అని లోక్ అదాలత్ ను కక్షిదారులు
సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కాగా లోక్ అదాలత్ లో
నిర్వహించిన వాటిల్లో 42 క్రిమినల్ కేసులు రాజి పడ్డారు.
4 ఎక్సైజ్ కేసులలో 20 వేలు ఫైన్ కట్టారు.బ్యాంక్ పిఎల్సి కేసులు 15 కాగా 6,69,086 రూపాయలకు సెటిల్ మెంట్ అయ్యారు. ఎస్టిసిలు 3288 కేసుల్లో రూ.8,43,050 ఫైన్ కట్టారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి బోడివల్లి చేంద్ర ప్రసన్న,సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ లక్ష్మీ నారాయణ, ఏపీపీ,ఎసిపి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడిదెల సంజయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి,లోక్ అదాలత్ మెంబర్ మోటురి రవి,లీగల్ సర్వీస్ అతారిటి న్యాయవాది దొంతి సాంబయ్య,న్యాయవాదులు తండ సారంగపాణి,రహీముద్దీన్,కొమ్ము రమేష్ యాదవ్,పుట్టపాక రవి,అంబటి రాజ్ కుమార్,పొనుగోటీ అజయ్,బొడ్డుపెళ్లి అజయ్,కందకట్ల వీరష్,పండుగ శ్రీనివాస్,అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు,బ్యాంక్ అధికారులు,కోర్టు సిబ్బంది, పోలీస్ లు , కక్షిదారులు పాల్గొన్నారు.

ఎర్రబెల్లి స్వర్ణను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఎర్రబెల్లి స్వర్ణను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఎనుమాముల నేటిధాత్రి:

నగరంలోని 14 డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణను వారి నివాసంలో మర్యాదపూర్వం కలిశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజలల్లో తీసుకువెళ్లాలని సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ హనుమకొండ వర్కింగ్ ప్రెసిడెంట్ పులిచేరి రాధాకృష్ణ. ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు పస్తం శంకర్ ఏనుమాముల గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని. సుందరయ్య నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు. త్రికోవెల శీను. బాలాజీ నగర్ గ్రామ అధ్యక్షుడు కడెం కుమార్ ఎస్సార్ నగర్ యూత్ అధ్యక్షుడు పల్లకొండ చందు. సౌరం ప్రభాకర్ సౌరం అభిలాష్. కోగిల సుధాకర్. కాశెట్టి కమలాకర్. దస్రు నాయక్ తోట శీను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఏకాబ్రాచారి. తిరుపతి. ఎండి సంధాని. ఎండి యూసుఫ్ సంగారబోయిన రాజు. ఎండి ఖాజా రేహాన్ తోట శ్రీను ఖాన్. వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు.

పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.

పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం:-

హాజరైన రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్:-

 

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి, (లీగల్):-

 

 

 

 

శనివారం హనుమకొండ లోని నేత హాస్టల్ లో పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో పద్మశాలి న్యాయవాదుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ల ఎన్నికలలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా వలుస సుదీర్, కోశాధికారి గా సిరిమల్ల అరుణ, కార్యవర్గ సభ్యులుగా యం.

మేఘనాథ్, పరకాల బార్ అసోసియేషన్ మహిళ కార్యదర్శిగా గజ్జెల సధారణి, జనగామ జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి రామకృష్ణ గెలుపొందిన తదితర న్యాయవాదులను ఆయన ఘనంగా సన్మానించారు.

ఇట్టి సందబంగా దుస్సా జనార్ధన్ మాట్లాడుతూ ప్రతీ యువ న్యాయవాది నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నారు.

Advocates

 

ఈ కార్యక్రమం లో పావ అధ్యక్షులు గంజి గణేష్, సీనియర్ న్యాయవాదులు మార్గం వీరస్వామి, దాసరి ప్రేంసాగర్, కొండబత్తుల రమేష్ బాబు, పోపా రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్, బిల్లా ప్రభాకర్, మేరుగు సుభాష్, రవీందర్, పాము రమేష్, ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లా పద్మశాలి అధ్యక్షులు చిలుకమారి వెంకటేశ్వర్లు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

పేదల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం

ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు

కేసముద్రం నేటి ధాత్రి:

నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు నూతన గృహ నిర్మాణ ముగ్గు పోయి కార్యక్రమాన్ని కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో కేసముద్రం విలేజ్ మరియు ఎన్టీఆర్ నగర్ లోని నిరుపేద లబ్ధిదారులకు ముగ్గులు పోయూ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే నా ఇందిరమ్మ ఇండ్లు గుర్తుకు వస్తాయని, పేదల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుండు గోపాల్,సుభాష్ రెడ్డి, చిట్ట సులోచన, కీర్తి శ్రీలత, హౌసింగ్ ఎయ్యి అభినయ్ గౌడ్, మున్సిపల్ ఆఫీసర్లు ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసముద్రం విలేజ్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాసాడి శ్రీనివాస్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్, మండల ఓ బి సి అధ్యక్షులు చిట్ల సంపత్, మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్, విలేజ్ గ్రామ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు లావుడియా వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్యాల లక్ష్మణ్,గుబరాజు,గుండు లక్ష్మీనారాయణ,జీలకర్ర బాబు, బట్టి గులాబీ, ఎండి సోనీ,ఎస్ కే యాకుబ్బి, తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలో దందాలకు చోటు లేదు..

నియోజకవర్గంలో దందాలకు చోటు లేదు..

కాకా వారసత్వాన్ని కొనసాగిస్తా… ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా

కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

 

 

 

నియోజకవర్గంలో దందాలకు తావు లేదని, కాకా వారసత్వాన్ని కొనసాగిస్తూ, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా రామకృష్ణాపూర్ పట్టణానికి విచ్చేసిన వివేక్ వెంకట స్వామికి పట్టణ కాంగ్రెస్ శ్రేణులు ఏరియా ఆసుపత్రి సమీపంలో ఘన స్వాగతం పలికి, భారీ గజమాలతో సత్కరించారు.

ఏరియా ఆసుపత్రి సమీపంలో సింగరేణి కార్మికుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఏరియా ఆసుపత్రి నుండి రాజీవ్ చౌక్, భగత్ సింగ్ నగర్ ,సూపర్ బజార్ చౌరస్తా,రామాలయం చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

అనంతరం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.రామకృష్ణాపూర్ నాయకులు ఇంత ఘన స్వాగతం పలికినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఎక్కడ కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చేసానని, అందుకే ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించారని గుర్తుచేశారు.

ఇకముందు కూడా అవకతవకలు లేకుండా, అక్రమాలు లేకుండా అభివృధి చేస్తానని అన్నారు.

ఇసుక దందా బంద్ కు కట్టుబడి ఉన్నానని, మైనింగ్ మంత్రిగా అది నా బాధ్యత అని అన్నారు.

రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని తెలిపారని చెప్పారు.

ఇసుక రాయల్ ట్యాక్స్ తో అధిక నిధులతో అభివ్రుద్ది చేస్తానని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్, 500 లకే గ్యాస్ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Labor and Mines Minister Vivek Venkataswamy

 

 

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటానని,ప్రభుత్వం అర్హులైన వారికి సన్న బియ్యం కూడా ఇస్తుందని గుర్తు చేశారు.ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని,మీకోసమే పని చేస్తానని భరోసా ఇస్తున్నానని అన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పార్టీ సీనియర్ నేతలు రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్,మాజీ చైర్ పర్సన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మహంకాళి శ్రీనివాస్, శ్యామ్ గౌడ్,గోపతి బానేష్,యువ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అభివృద్ధి ప్రదాతలకు క్షీరాభిషేకం.

అభివృద్ధి ప్రదాతలకు క్షీరాభిషేకం

కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధికి 100 కోట్లు నిధులు మంజూరు చేయడం అభినందనీయం

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాతల చిత్రపటాలకు పాలాభిషేకం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో అమీనాపురం లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా కేసముద్రం మునిసిపాలిటీని ఏర్పాటు చేయడమే కాకుండా మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలలో అంతర్గత రోడ్లు డ్రైనేజీలు వివిధ అభివృద్ధి పనుల క్రింద 100 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినందుకు అభివృద్ధి ప్రధాతలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి, మహబూబాబాద్.

శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ కు పాలాభిషేకం చేసి కేసముద్రం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

అదేవిధంగా గతంలో పాలిటెక్నిక్ కాలేజీని, డిగ్రీ కాలేజీని, అగ్నిమాపక కేంద్రాన్ని, బైపాస్ రోడ్డును, అంబేద్కర్ నుండి కోరుకొండ పెళ్లి క్రాస్ వరకు ఆర్ అండ్ బి రోడ్డును , 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ నియోజకవర్గానికి అదనంగా 1000 ఇండ్లుమంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరగా మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

కే సముద్రం మున్సిపాలిటీని అభివృద్ధి పదములో నడిపించే అభివృద్ధి ప్రదాతలకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, జన్ను కట్టయ్య, సామ సుధాకర్ రెడ్డి, మందుల కృష్ణమూర్తి, వేల్పుగొండ ఏలియా, కుడారి నాగేంద్రబాబు, లాకావత్ బాలు నాయక్, భోగం రమాదేవి, కుక్క ముడి యాకయ్య పాల్గొన్నారు.

మంత్రి వివేక్‌కు ఘన స్వాగతం.

మంత్రి వివేక్‌కు ఘన స్వాగతం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

చెన్నూర్ నియోజకవర్గానికి తొలిసారిగా పర్యటన చేసిన మైనింగ్ మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాలమాకుల రాజబాబు రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా గోదావరి బ్రిడ్జి పై స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి కావాలని మొక్కుబడులు కోరిన నాయకులు గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేయించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు డీజే,డ్యాన్స్‌లతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తాను.

ఇసుక దందా పూర్తిగా నిలిపేలా చర్యలు తీసుకుంటాను అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు రాజబాబు రెడ్డి, గంగపుత్ర సంఘం నాయకులు తగర శ్రీనివాస్,శ్రీనివాస్, లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్ ల ద్వారా అందరికి న్యాయం అదుబాటులోకి.

లోక్ అదాలత్ ల ద్వారా అందరికి న్యాయం అదుబాటులోకి

కోర్టు ఇంచార్జి న్యాయమూర్తి సిహెచ్ శ్రావణ స్వాతి

పరకాల నేటిధాత్రి

 

 

శనివారం రోజున మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కోర్టు ఆవరణలో నిర్వహించారు.పరకాల పట్టణంలోని కోర్టు ఇంచార్జి న్యాయమూర్తి సిహెచ్ శ్రావణ స్వాతి వివిధ కేసులను రాజీ మార్గము ద్వార పరిష్కరించారు.ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ లోకదాలత్ ద్వారా అందరికీ న్యాయం అందుబాటులోకి వచ్చిందని రాజీ మార్గం ద్వారా సమయాన్ని డబ్బును ఆద చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల బార్ సోసియేషన్ అధ్యక్షులు పెండల భద్రయ్య,లోక్ అదాలత్ సభ్యులు రవికుమార్,సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కొప్పుల శంకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుమార్,రుధిర,ఏసీపీ సతీష్ బాబు,సీఐ క్రాంతికుమార్,ఏజిపి లక్కం శంకర్,లోక్ ఆదాలత్ సభ్యులు ఒంటేరు రాజమౌళి,పోలీస్ సిబ్బంది,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version