దైవ దర్శనం కొరకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లు.

దైవ దర్శనం కొరకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భక్తుల కొరకు  జహీరాబాద్ డిపో నుండి 02 ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లను అందుబాటులోనికి తెచ్చింది అని జహీరాబాద్ ఆర్టీసీ విలేజ్ బస్సు ఆఫీసర్స్ ఎం శివప్రసాద్, ప్రసాద్ లు తెలిపారు శనివారం ఝరాసంగం మండలంలోని బోపంపల్లి.బోరేగావ్,.జీర్లపల్లి చిలమామిడి.ఎడాకులపల్లి. గ్రామాలలో ప్రత్యేక దర్శనo కొరకు ప్రత్యేక టూర్ బస్సుల కోసం గ్రామాల ప్రజలకు వివరించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ డిపో బస్ స్టేషన్ నుండి ఉదయం 06:00 గం.లకు బయలుదేరి యాదగిరిగుట్ట శ్రీ.లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కు 10:00 గం.లకు చేరుకొని, అక్కడి నుండి దర్శనానంతరం 15:00 గం.లకు బయలుదేరి స్వర్ణగిరి దేవాలయం కు చేరుకుంటుందన్నారు…. దర్శనానంతరం  తదుపరి రాత్రి 19:00 గం.లకు తిరుగు ప్రయాణమై జహీరాబాద్ బస్ స్టేషన్ కు 23:00 గం.లకు డిపో కు రావడం జరుగుతుంది అన్నారు.

భక్తుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులు అందుబాటులో తీసుకోరావడం జరిగింది అన్నారు.
శ్రీ.దత్తాత్రేయ స్వామి దేవాలయం జహీరాబాద్ బస్ స్టేషన్ నుండి ప్రతీ పౌర్ణమి కి ముందు రోజు సాయంత్రం 16:00 గం.లకు ఈ నెల 27 .06.25 మంగళవారం న బయలుదేరి కర్ణాటక రాష్ట్రంలో గానుగాపూర్ లో గల శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం కు రాత్రి 20:00 గం.లకు చేరుకొని, అక్కడి నుండి దర్శనానంతరం ఉదయం 07:00 గం.లకు బయలుదేరి జహీరాబాద్ కి 11:00 గం.లకు  చేరుకోనును అని తెలిపారు.భక్తుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులు అందుబాటులో గలవు…. ఎక్స్ ప్రెస్ బస్సులలో కనీసం 50 మంది మరియు డీలక్స్ బస్సులలో 40 మంది ప్రయాణికులు ఉంటే బస్సులు నేరుగా బుక్ చేసుకోవచ్చును అన్నారు.

ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం..

ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం..

 

ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది తింటే జీవితంలో మధుమేహం రాదని అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిస్ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఈ వ్యాధిని మధుమేహం లేదా షుగర్ వ్యాధి అని కూడా అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది సాధారణంగా ప్యాంక్రియాస్ సరిగ్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోవడం వల్ల వస్తుంది. నేటి కాలంలో చిన్న పిల్లలు మొదలుకుని పెద్దలవరకు చాలా మంది ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. దీని కోసం కొంతమంది మందులు వాడతారు. మరికొందరు ఇన్సులిన్ తీసుకుంటారు. కానీ, అరటి పువ్వు డయాబెటిస్‌కు ఒక అద్భుతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అరటి పువ్వు మధుమేహానికి దివ్య ఔషధమని అంటున్నారు. దీని నుండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అరటి పువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయని, దీనిలోని ఫైబర్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుందని అంటున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయని చెబుతున్నారు.
అరటి పువ్వులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి. అరటి పువ్వులో మెగ్నీషియం చాలా సమృద్ధిగా ఉంటుంది. మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఇవి మహిళల్లో రుతుక్రమ సమస్యలను నివారించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా, ఇందులో ఉండే విటమిన్లు ఎ, సి, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాలానుగుణ వ్యాధులను నివారిస్తాయి. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version