వెంకటనారాయణ మృతి బాధాకరం…
అంత్యక్రియలకు తన వంతు ఆర్థిక సహాయం అందించిన నాయిని వెంకట్ గౌడ్ (గజిని)…
కొల్చారం (మెదక్) నేటిధాత్రి:
కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన దాది వెంకటనారాయణ శనివారం ఉదయం మృతి చెందాడు. మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాయిని వెంకట్ గౌడ్ (గజిని) అంత్యక్రియలకు మృతుని కుటుంబ సభ్యులకు తన వంతుగా 5000 రూపాయలు, ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు గడ్డమీది నర్సింలు, పుల్లబోయిన పోచయ్య, రాములు, స్వామి, శ్రీనివాస్, మరియు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.