తీర్థయాత్రల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీలు.

తీర్థయాత్రల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీలు

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

 

 

తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 05 వ తేదీ నుండి జూలై 13 వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు.

యాత్రకి సంబందించిన వివరాలు వెల్లడించారు.

ప్యాకేజీ వివరాలు : (ఐదు జ్యోతిర్లింగ యాత్ర – SCZBG43):* ఉజ్జయిని (మహాకాళేశ్వర్ – ఓంకారేశ్వర్) – త్రయంబకేశ్వర్ – భీమశంకర్ – ఘృష్ణేశ్వర్).

ఈ యాత్రలో మహాకాళేశ్వర్ / ఓంకారేశ్వర్ / త్రయంబకేశ్వర్ / భీంశంకర్ / ఘృష్ణేశ్వర్ / ఎల్లోరా / మోవ్/ నాగ్పూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు.

ఈ యాత్ర జూలై 05 వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంట్టుంది.

దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14700, 3 ఏసీ ధర 22900, 2 ఏసీ ధర 29900 ఉంటుంది.

ఈ యాత్ర సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ ధర్మాబాద్ నాందేడ్ ముధ్ఖడ్ మరియు పూర్ణ మీదుగా వెళ్తుంది.

సౌకర్యాలు :రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం), వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్ అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితం.

ప్రతి రైలు లో 718 మంది ప్రయాణికులు ఉంటారు.

ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సావకార్యాలు సమకురుస్తారు.

కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు.

టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు
9701360701,9281495843,9281030750,9281030749 లకు సంప్రదించాలని మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రధించాలని తేలిపారు.

దైవ దర్శనం కొరకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లు.

దైవ దర్శనం కొరకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భక్తుల కొరకు  జహీరాబాద్ డిపో నుండి 02 ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లను అందుబాటులోనికి తెచ్చింది అని జహీరాబాద్ ఆర్టీసీ విలేజ్ బస్సు ఆఫీసర్స్ ఎం శివప్రసాద్, ప్రసాద్ లు తెలిపారు శనివారం ఝరాసంగం మండలంలోని బోపంపల్లి.బోరేగావ్,.జీర్లపల్లి చిలమామిడి.ఎడాకులపల్లి. గ్రామాలలో ప్రత్యేక దర్శనo కొరకు ప్రత్యేక టూర్ బస్సుల కోసం గ్రామాల ప్రజలకు వివరించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ డిపో బస్ స్టేషన్ నుండి ఉదయం 06:00 గం.లకు బయలుదేరి యాదగిరిగుట్ట శ్రీ.లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కు 10:00 గం.లకు చేరుకొని, అక్కడి నుండి దర్శనానంతరం 15:00 గం.లకు బయలుదేరి స్వర్ణగిరి దేవాలయం కు చేరుకుంటుందన్నారు…. దర్శనానంతరం  తదుపరి రాత్రి 19:00 గం.లకు తిరుగు ప్రయాణమై జహీరాబాద్ బస్ స్టేషన్ కు 23:00 గం.లకు డిపో కు రావడం జరుగుతుంది అన్నారు.

భక్తుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులు అందుబాటులో తీసుకోరావడం జరిగింది అన్నారు.
శ్రీ.దత్తాత్రేయ స్వామి దేవాలయం జహీరాబాద్ బస్ స్టేషన్ నుండి ప్రతీ పౌర్ణమి కి ముందు రోజు సాయంత్రం 16:00 గం.లకు ఈ నెల 27 .06.25 మంగళవారం న బయలుదేరి కర్ణాటక రాష్ట్రంలో గానుగాపూర్ లో గల శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం కు రాత్రి 20:00 గం.లకు చేరుకొని, అక్కడి నుండి దర్శనానంతరం ఉదయం 07:00 గం.లకు బయలుదేరి జహీరాబాద్ కి 11:00 గం.లకు  చేరుకోనును అని తెలిపారు.భక్తుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులు అందుబాటులో గలవు…. ఎక్స్ ప్రెస్ బస్సులలో కనీసం 50 మంది మరియు డీలక్స్ బస్సులలో 40 మంది ప్రయాణికులు ఉంటే బస్సులు నేరుగా బుక్ చేసుకోవచ్చును అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version