ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన.

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన
రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడీ సతీష్ రెడ్డి
ఆర్టిఐరాష్ట్ర కమిటీ సభ్యుడు కమలాకర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

ఇటీవల రోడ్ ప్రమాదములో గాయపడ్డ భూపాల్ పల్లి జిల్లా సమాచార హక్కు చట్టం యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లును మొగుళ్ళ పల్లి మండలం ఎల్లా రెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం రోజున తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్య క్షులు కామిడి సతీష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు ముఖ్య సలహాదారులు కల్వల కమలాకర్ రావు లు పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు సమాచార హక్కు చట్టాన్ని ప్రతీ గ్రామము లోకి తీసుకు వెళ్లిన వెంకటేశ్వర్లు రోడ్ ప్రమాదము లో గాయపడడం బాధాకరం అన్నారు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

బీరప్ప స్వామి వారికి ఘనంగా బోనాలు.

శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి వారికి ఘనంగా బోనాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలం లోని కొల్లూర్ గ్రామస్తులు, గొల్ల కుర్మ కులస్తులు మహిళలు బుధవారం శ్రీ బీరప్ప స్వామి వారి జాతర ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకము, కుంకుమార్చన, అలంకరణ, సాయంత్రం గ్రామానికి చెందిన మహిళలు గ్రామస్తులు బోనాలతో ఊరేగింపుగా వచ్చి బోనాల నైవేద్యం సమర్పించారు. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు శోభాయ మానంగా జరిగింది. ఉత్సవాలు తిలకించేందుకు వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీ బీరప్ప దేవాలయ కమిటీ కుర్మా సంఘం గ్రామ పెద్దలు పూర్తిస్థాయి ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దంచి కొడుతున్న ఎండలు.!

దంచి కొడుతున్న ఎండలు.. ఉక్కపోతతో ప్రజల ఉక్కిరి బిక్కిరి

నిప్పుల కొలిమి..!

◆ దంచి కొడుతున్న ఎండలు

◆ ఉక్కపోతతో ప్రజల ఉక్కిరి బిక్కిరి

◆ జిల్లాలో 42.5 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

◆ జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 దాటితే భానుడు భగభగమనడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. సూర్యుడు రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమి తట్టుకునేందుకు ఫ్యాన్లు, కూలర్లు నడిచినా ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండకు తోడుగా వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని 38 ప్రాంతాల్లో 40.1 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం, కడ్పల్, నిజాంపేట్, కల్హేర్ 42.1 పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, న్యాల్ కల్, కోహిర్, ఝరాసంగం, 39 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. శనివారం 40 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఆదివారం వచ్చేసరికి 42.5 డిగ్రీలు దాటేసింది. 

 

Temperatures

 

జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు..

పాల్వట్ల, అన్నాసాగర్, పాశమైలారం, దిగ్వాల్, సిర్గాపూర్, పుల్ కాల్, గుండ్ల మాచనూర్, నారాయణఖేడ్, ఆర్సీ పురం, 41.1 పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వట్టిపల్లి, హత్నూర్, మనూర్, అందోల్, లక్ష్మీ సాగర్, పటాన్ చేరు, మునిపల్లి, కంది, సదాశివపేట్, కిష్టారెడ్డిపేట్, కంగిటి, సుల్తాన్ పూర్, గుమ్మడిదల, కొండాపూర్, రాయికోడ్, రుద్రారం, చౌటకూర్, జహీరాబాద్, మొగుడంపల్లి, నాగలిగిద్ద, సంగారెడ్డి, ముక్తాపూర్ తదితర ప్రాంతాల్లో 40.1 డిగ్రీలకు పైగా ఎండలు దంచి కొట్టాయి. మరోవైపు రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. అర్ధరాత్రి ఉక్కపోత ఎక్కువగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

అత్యవసరమైతేనే బయటికి వెళ్లండి..

 

Temperatures

 

పలు ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లేటప్పుడు తాగునీటిని వెంట తీసుకె ళ్లాలి. ఓఆర్ఎస్ ను విని యోగించాలి. 12గం టల నుంచి 3గంటల వరకూ బయటకు వెళ్లాడు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. చిన్నపిల్లలను, గర్భిణులు, వృద్ధులను ఎండలో బయటకు తీసుకెళ్లకూ దదు. చాయ్, కాఫీ, ఆల్కహాల్ చక్కెర అధికంగా ఉన్న ద్రవపదార్థాల ను తీసుకోవద్దు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. అత్యవసరమైతే డాక్టర్లు సంపాదించాలి.

సరమైతే డాక్టర్లు సంపాదించాలి. -డాక్టర్ రమ్య, మండల వైద్యాధికారి ఝరాసంగం,

మృతి చెందిన తాపీ మేస్త్రి.!

మృతి చెందిన తాపీ మేస్త్రి కార్మికునికి కుటుంబానికి ఆర్థిక చేయూత…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరదిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల14వ వార్డ్ పోచమ్మ బస్తీ ఏరియాకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు పానుగంటి వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అయన కుటుంబం నిరుపేద కావడంతో పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులందరూ కలిసి 17 వేల 7 వందల రూపాయలను మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షుడు జీలకర్ర రాయమల్లు చేతుల చేతుల మీదుగా అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చి మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి రాజేష్, సంగ రవికుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ గొప్ప శంకర్, ట్రెజరరీ కత్తెర సతీష్, సభ్యులు బాదావత్ రాజు, ముంత శ్రీనివాస్, కల్లేపల్లి ప్రసాద్, బొబ్బిలి వీరస్వామి, చొప్పరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్.!

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు…

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్

గంటల వ్యవధిలో దొంగను చేదించిన పోలీసులు…

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం తో 10 గంటల్లో దొంగతనం కేసు చెందించి దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గోదావరి ఖని కి చెందిన ఇమాన్యూల్ అనే యువకుడు జల్సా లకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రామకృష్ణపూర్ పట్టణం లోని హనుమాన్ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కిటికీ ప్రక్కన నిద్రిస్తున్న మహిళ మేడలో నుండి మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడు, ఎదురు ఇంటిలో కిటికీ ప్రక్కన పెట్టిన మొబైల్ ఫోన్ లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితులు పిర్యాదు చేయగా సి.సి కెమెరాలను పరిశీలించి ఇమాన్యూల్ నేరాలకు పాల్పడ్డాడని నిర్ధారిరించుకొని పొలుసులు మూడు బృందాలుగా ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం లో మందమర్రి సి.ఐ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్.ఐ రాజ శేఖర్, కాసిపేట ఎస్. ఐ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్రైమ్ టీమ్ సిబ్బంది జంగు, రాకేష్, మహేష్ ,వెంకటేష్, సిసిఎస్ సిబ్బంది సతీష్ శ్రీనివాస్ లను ఏసిపి అభినందించి రివార్డులను అందజేశారు.

ప్రగతి స్టేడియంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.

ప్రగతి స్టేడియంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో కొక్కిరాల రఘుపతి రావు జ్ఞాపకార్థంగా ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు యువసేన శ్రీరాంపూర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. యువకులలో క్రీడా స్ఫూర్తినీ పెంచడంకోసం,మానసిక వికాసం కోసం,స్నేహభావాన్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నూకల రమేశ్,ధర్ని మధు 21 వార్డు ఇంచార్జీ
,మాజీ కౌన్సిలర్లు పుదరీ కుమార్,తెనుగు దేవేందర్,మాజి ఎంపీటీసీ ఎల్పుల రవీందర్,చిలుకా మల్లేష్ వార్డు ఇన్చార్జులు అత్కాపూర్ సతీష్,నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు నారిగే నరేష్,అంగిడి ,రాజేష్,ఉప్పల్ రమేష్ మారు మల్లన్న నాగార్జున,ఆర్గనైజర్ భీమిని రాజేష్,కొండే రజినీ కాంత్,గుర్రపు సురేష్,మూట శేఖర్,ప్రదీప్,ప్రశాంత్ తదితర పాల్గోన్నారు

ఓబులాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా.

ఓబులాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా

మల్లాపూర్ ఏప్రిల్ 18 నేటి ధాత్రి

 

కాంగ్రెస్ పార్టీ కోరుట్ల కాంసెన్సీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగ రావు గారు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకోలేక పోతున్నారు మల్లాపూర్ మండలంలో పది సంవత్సరాలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేను గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం పైసలు ఖర్చు పెట్టుకున్నాను కష్టపడ్డాను ఫలితంగా నాకు అవమానాలే ఎదురు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు గారు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడంలేదు నిరసన గా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలియపరుస్తున్నాను
పల్లె శేఖర్ ముదిరాజ్.
.

అగ్నిప్రమాదం లో సుద్దాల బుచ్చిరాజు.!

అగ్నిప్రమాదం లో సుద్దాల బుచ్చిరాజు కి చెందిన ఇల్లు పూర్తిగా కాలి పోవడం జరిగింది

నేటి ధాత్రి

 

కథలాపూర్

ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదం లో సుద్దాల బుచ్చిరాజు కి చెందిన ఇల్లు పూర్తిగా కాలి పోవడం జరిగింది ఇట్టి విషయాన్ని మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ కి తెలుపగానే వారు స్పందించి సుద్దాల బుచ్చిరాజు కి ఒక నెలకి సరిపడా నిత్యావసర సరుకులతో పాటు వంట చేసుకోవడానికి బొల్లు, గ్యాస్ స్టవ్, చిరెలు మరియు చేద్దార్లు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో Dr.సతిష్, గంగాధర్, B. తిరుపతి, సాగర్, జలందర్, గంగాధర్, రాజేందర్ వంశీ తదితరులు పాల్గొన్నారు ఇట్టి దాతలకు మరియు ఫౌండేషన్ కి వారి కుటుంబ సభ్యులు మరియు సిరికొండ గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

మల్లాపూర్ గ్రామానికి చెందిన మృతుడు పుట్ట రాజేష్.

మల్లాపూర్ ఏప్రిల్ 18 నేటి ధాత్రి

 

మల్లాపూర్ గ్రామానికి చెందిన మృతుడు పుట్ట రాజేష్ తండ్రి పోశెట్టి (13సం) తేదీ :18/04/2025 రోజున ఉదయం పూట తన తండ్రికి జ్వరం రావడం వలన తన తండ్రి మేపుతున్న పశువులను మల్లాపూర్ గ్రామ శివారు లింగన్న చెరువు వద్దకి మేపడానికి తీసుకువెళ్లగా అక్కడ చెరువు ఒడ్డుకు మృతుడు ధరించి బట్టలు, చెప్పులు,సర్ది డబ్బకనపడగా ఆచూకీ కొరకు వెతకగా లభించక పోవటంతో శనివారం రోజున ఉదయం చెరువులో నీట మునుగి పైకి తెలినాడు.స్నానం కోసం చెరువులో దిగగా ప్రమాదవశత్తు (లేక) ఈత రాక నీటిలో మునుగి చనిపోయినడని తన తండ్రి పుట్ట పోశెట్టి వెంకటి పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కే రాజు తెలిపారు.

నీటి సమస్యపై స్పందించిన సింగరేణి అధికారులు..

నీటి సమస్యపై స్పందించిన సింగరేణి అధికారులు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల అబ్రహం నగర్ ,సర్దార్ వల్లభాయ్ నగర్ ఏరియాలో నివసించే సింగరేణి కార్మికులకు, మంచినీళ్లు అందించేలా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకోవాలని వారం రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాకుబ్ ఆలీ సింగరేణి అధికారులను కోరారు. స్పందించిన సింగరేణి అధికారులు శనివారం కల్వర్టులో ఉన్న కొన్ని నీటి పైపులైన్లను తొలగించి నూతన పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. నీటి సమస్య ఉందని తెలిపిన వెంటనే స్పందించిన సింగరేణి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి యాకూబ్ అలీ అన్నారు. లింగేశ్వర పాఠశాల నుండి అబ్రహం నగర్ బోర్డ్ వరకు కూడా కొత్త పైప్ లైన్లు వేయాలని సింగరేణి అధికారులను కోరుతున్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కి నూతన నీటి పైప్ లైన్ వేయించాలని కోరడం జరిగిందని తెలిపారు.స్పందించిన ఎమ్మెల్యే సింగరేణి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని, కాలనీ వాసుల నీటి అవసరం నిమిత్తం నూతన పైప్లైన్ వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగిందని యాకుబ్ ఆలీ అన్నారు.

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.  

పరకాల నేటిధాత్రి

గుడుంబా నిర్ములన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జాన్ పాక శివారులో దాడులు నిర్వహించారు.గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన 500 లీటర్ల షుగర్ పానకం ను ధ్వంసం చేసి,5 లీటర్ల గుడుంబా,25 కేజీల షుగర్ ను స్వాధీనం చేసుకొని బాదావత్ శ్రీను,బానోత్ సురేష్ ల పై కేసు నమోదు చేసినట్టు సీఐ తాతజీ తెలిపారు.ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ఐ వై.జ్యోతి
సిబ్బంది లక్ష్మణ చారి,రవీందర్,సమ్మయ్య,విజయ్ కుమార్ పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని వివేకానంద గ్రామైక్య సంఘం నర్సక్కపల్లి, కనకదుర్గ గ్రామ ఐక్య సంఘం చర్లపల్లి, సోనియా గ్రామీక సంఘం నార్లాపూర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,పర్నెం మల్లారెడ్డి,సమన్వయ కమిటీ సభ్యులు,సిసి కుమారస్వామి,రైతులు తదితరులు పాల్గొన్నారు.

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం.!

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం- 7 వ రాష్ట్రీయ పోషణ పక్షం

 

నడికూడ,నేటిధాత్రి:

స్వాతి సిడిపిఓ అధ్యక్షతన పరకాల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామంలో జాతీయ పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి హాజరై మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో ముఖ్యంగా నిర్వహించే కార్యక్రమాలు మొదటిది ఆరోగ్య లక్ష్మి, రెండవది ప్రీస్కూల్,మూడోది లోపోషణతో బాధ పడే పిల్లల పోషణస్థితిని మెరుగుపరిచే విధంగా అంగన్వాడి టీచర్స్ పని చేయాలని సూచించారు. పోషణ పక్షంలో భాగంగా ఏప్రిల్ 8 నుండి 22 వరకు ప్రతి గ్రామంలో పోషణ కార్యక్రమాలు నిర్వహించి పోషణ లోపం లేని సమాజం నిర్మించేలా కృషి చేయాలన్నారు.గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే ఒక్కపూట భోజనం సద్వినియోగం చేసుకోవాలి, పౌష్టిక ఆహారం తీసుకుంటేనే పుట్టే పిల్లలు ఆరోగ్యవంతంగా పుడతారన్నారు.ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల కు శ్రీమంతాలు,6 నెలలు నిండిన పిల్లలకి అన్నప్రాసనలు,అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న
చిన్నారులకు గ్రాడ్యుయేషన్
డే,చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల తహసిల్దార్ టి. విజయలక్ష్మి,నడికూడ తహసిల్దార్ నాగరాజు, నడి కూడ మండల వైద్యాధికారి కే దివ్య,ఎంపీడీవో నడికూడ విమల,సఖి అడ్మిన్ హైమావతి,పోషణ అభియాన్ డిస్టిక్ కోఆర్డినేటర్ సుమల డిహెచ్ఈడబ్ల్యు కోఆర్డినేటర్ కళ్యాణి,ఐసిడిఎస్ సూపర్వైజర్లు శ్రీదేవి, హేమలత,పుణ్యవతి,రోజా రాణి,మంజుల,సునీత,రాణి, నజీమ,పర్వీన్,ఉమాదేవి, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ బిక్షపతి,జిల్లా బాలల పరిరక్షణ విభాగం విజయకుమార్,అంగన్వాడీ టీచర్స్,ఆశ వర్కర్స్,గర్భిణీ స్త్రీలు,పిల్లలు మొదలగు వారు పాల్గొన్నారు.

కోట్లతో వాటర్ షెడ్ల నిర్మాణం: మంత్రి.

కోహిర్: 10. 50 కోట్లతో వాటర్ షెడ్ల నిర్మాణం: మంత్రి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

10. 50 కోట్లతో వాటర్ షేట్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కోహిర్ మండలం పీచే రాగడి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. మహిళా సంఘాలకు 1. 56 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం.

దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం. 

దమ్మాయిగూడ నేటి ధాత్రి

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

దమ్మాయిగూడ మున్సిపల్ సిబ్బందికి గత రెండు నెలలు గా జీతాలు రానందున ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు పక్కన ఉన్న నాగారం మున్సిపాలిటీ ఫిబ్రవరి జీతాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ దమ్మైగూడలో ఎందుకు ఇవ్వడం లేదు అని మున్సిపల్ సిబ్బంది ప్రశ్నించడం జరిగింది వారికీ మద్దతుగా బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి తక్షణమే చేర్యా తీసుకోవాలని కోరడం జరిగింది లేనిపక్షంలో సోమవారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగారం మాజీ చైర్మెన్ కౌకుట్ల చెంద్రారెడ్డి,( బి ఎం ఎస్ ) నాయకులు రాము, మోర నాగమల్లా రెడ్డి, సామల భరత్ రెడ్డి , డొంకెన రవీందర్ గౌడ్, రామిడి బాపి రెడ్డి, మహిళా మోర్చా మునిసిపల్ అధ్యక్షురాలు రోత్తమ్ ప్రశాంతి, దాసరి సరెండర్ రెడ్డి, దసారం సతీష్ కుమార్, కే కుమార్, జరిపిటి ఆంజనేయులు, తడుక కృష్ణ, సాయికృష్ణ చారీ, చక్రపాణి, ర్ సురేష్, మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మినిస్టేడియంలో కొనసాగుతున్నకబడ్డీ రెజ్లింగ్ క్రీడలశిక్షణ.

మిని స్టేడియంలో కొనసాగుతున్న కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా యువజన,క్రీడల అధికారిని టీవీఎల్ సత్యవాణి ఆధ్వర్యంలో నర్సంపేట మిని స్టేడియంలో కబడ్డీ ఇంచార్జ్ కోచ్ యాట రవికుమార్ ముదిరాజ్, రెజ్లింగ్ ఇంచార్జ్ కోచ్ సిరపురపు మహేశ్ శిక్షణలో ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు సాయంత్రం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు బాల బాలికలకు కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి.

Kabaddi

ఈ శిక్షణలో పాల్గొనే విద్యార్థులు ప్రతిరోజు ఉదయం,సాయంత్రం మిని స్టేడియం నర్సంపేటలో జరిగే కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణకు హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు కబడ్డీ శిక్షణ కొరకు 9666623438, రెజ్లింగ్ శిక్షణ కొరకు 6305271260 నెంబర్లను సంప్రదించాలని డివైస్ ఓ టీవీఎల్ సత్యవాణి ఒక ప్రకటనలో తెలిపారు.

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం

*బిట్స్ స్కూల్ విద్యార్థులకు
గ్రీన్ ఒలంపియాడ్ టెస్ట్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం*

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

సమాజంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం, వాహనాల వినియోగం ఎక్కువ కావడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందనీ, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు.పర్యావరణ అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గత నవంబర్ మాసంలో నిర్వహించిన గ్రీన్ ఒలంపియాడ్ టెస్ట్ లో పాల్గొన్న బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.ఈ పర్యావరణ పరిరక్షణా చర్యలు చేపట్టడాన్ని మీ వ్యక్తిగత జీవితంలో ఒక ప్రధాన బాధ్యతగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు.
బాలాజీ విద్యార్థులు మొత్తం 183 మంది ఈ ఒలంపియాడ్ టెస్ట్ రాశారు. అందులో పదిమంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికెట్ పొందగా 173 మంది విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎం.డి. రియాజుద్దీన్, ప్రదీప్ చౌదరి, క్రాంతి కుమార్ మరియు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కోహిర్ మండలంలోని పిచారగడి గ్రామంలో.!

కోహిర్ మండలంలోని పిచారగడి గ్రామంలో వాటర్ షెడ్ ప్రారంభోత్సవా కార్యక్రమంలో పాల్గొన్న.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

➡ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ
➡ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
➡ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

inauguration ceremony of a water

 

శనివారం నాడు, కోహిర్ మండలంలోని పిచారగడి గ్రామంలో వాటర్ షెడ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్,కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ గారు,మహిళ సంఘాల అధ్యక్షులు&సభ్యులు, మరియు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డ్రైనేజీ పొంగిపొర్లుతు కాలనీలో దుర్గంధం.

డ్రైనేజీ పొంగిపొర్లుతు కాలనీలో దుర్గంధం

15,20 రోజుల నుంచి రోడ్డుపై ఏరులై పారుతున్న డ్రైనేజీ పట్టించుకోని అధికారులు

డ్రైనేజీ సమస్య శాశ్వితంగా పరిష్కారం చూపించండి

స్థానిక కాలనీవాసులు

మల్కాజ్ గిరి నేటిదాత్రి

మల్కాజిగిరి డివిజన్ బాల సరస్వతి నగర్ లో (ఆత్మ లింగ మహా గణపతి ఆ లయ రోడ్డులో) గత 20 రోజులుగా డ్రైనేజీ పొంగిపొర్లు తున్న అధికారులు పట్టించుకోవడం లేదని తెలుపుతున్నారు. డ్రైనేజీ పొంగి పొర్లుతుందని వాటర్ వర్క్స్ సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసిన ఇటువైపు చూడడం లేదని, చూస్తాము చేస్తాము పంపిస్తున్నామని మాటలు చెబుతూ కాలనీవాసులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు స్థానికులు తెలుపుతున్నారు.గత వారం ఇదే సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత వారికి చెప్పగా తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని వదిలేసారని, డ్రైనేజీ పొంగి కాలనీ రోడ్లన్నీ కూడా వాసనతో ఇండ్లలోకి దుర్గంధం వస్తుంటే ఇండ్లలో స్థానికులు ఉండలేకపోతున్నారని ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారుల పైన ఉన్నత అధికారులు చర్యలు తీసుకో వాలని కోరుతున్నారు.చిన్న చిన్న సమస్యలనే పరిష్కరించలేని అధికారులు, నాయకులు ప్రజా సమస్యలను ఇంకా ఏదైనా ఇబ్బందులు వస్తే ఎలా పరిష్కరిస్తారని స్థానికులు అడుగుతున్నారు.సమస్య పరిష్కరించకుండా వదిలేస్తే కాలనీ వాసులు,ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని రోడ్డుపై నడవడానికి కూడా సమస్యగా ఉందని చెబుతున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి

 

పరకాల నేటిధాత్రి

మండలంలోని పోచారం,లక్ష్మీపురం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డితో పాటు ఐకేపీ నోడల్ ఆఫీసర్ జ్యోతి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ దాసరి బిక్షపతి,బుడిమె రాజయ్య మరియు పోచారం గ్రామ కమిటీ అధ్యక్షులు నీరటి అశోక్, పరకాల సమన్వయ కమిటీ సభ్యులు కొలిపాక చందు,కోరే శ్రీనివాస్,పిఏసీఎస్ డైరెక్టర్ కొలిపాక అర్జున్ పిఏసీఎస్ పరకాల కార్యనిర్వహణాధికారి నాగరాజు,రాయపర్తి మాజీ ఎంపీటీసీ పర్నం మల్లారెడ్డి, లక్ష్మీపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ పల్లెబోయిన శ్రీనివాస్,మాజీ సర్పంచ్ ఆలేటి రవింర్,చిలువేరు మల్లయ్య మరియు గ్రామ కమిటీ సభ్యులు పల్లెబోయిన భాస్కర్,బండారి నరేష్,మంగళపెల్లి సాంబయ్య,మొగిలి సెంటర్ ఇంచార్జీ రమేష్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్యకర్తలు రైతులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version