ఎంపీడీవో జి, శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపిన..

ఎంపీడీవో జి, శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సర్పంచ్,

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలం ఎంపీడీవో పదవి బాధ్యతలు చేపట్టిన జి, శ్రీనివాస్ గారికి మర్యాదగాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మల్గి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి యువజన నాయకులు దత్తు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన.

అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గా ప్రసాద్

నేటి ధాత్రి చర్ల

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఒక సంవత్సర కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలను తీసుకుని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రగతికి ఆయన కృషి ఎంతో అభినందనీయమని తెలియజేశారు

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్.!

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు…

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్

గంటల వ్యవధిలో దొంగను చేదించిన పోలీసులు…

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం తో 10 గంటల్లో దొంగతనం కేసు చెందించి దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గోదావరి ఖని కి చెందిన ఇమాన్యూల్ అనే యువకుడు జల్సా లకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రామకృష్ణపూర్ పట్టణం లోని హనుమాన్ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కిటికీ ప్రక్కన నిద్రిస్తున్న మహిళ మేడలో నుండి మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడు, ఎదురు ఇంటిలో కిటికీ ప్రక్కన పెట్టిన మొబైల్ ఫోన్ లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితులు పిర్యాదు చేయగా సి.సి కెమెరాలను పరిశీలించి ఇమాన్యూల్ నేరాలకు పాల్పడ్డాడని నిర్ధారిరించుకొని పొలుసులు మూడు బృందాలుగా ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం లో మందమర్రి సి.ఐ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్.ఐ రాజ శేఖర్, కాసిపేట ఎస్. ఐ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్రైమ్ టీమ్ సిబ్బంది జంగు, రాకేష్, మహేష్ ,వెంకటేష్, సిసిఎస్ సిబ్బంది సతీష్ శ్రీనివాస్ లను ఏసిపి అభినందించి రివార్డులను అందజేశారు.

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.!

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.శేఖర్ పాటిల్ శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సోమవారం నాడు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.శేఖర్ పాటిల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇదిలాపల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ నాయకులు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఏర్పడడంతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సత్కరించారు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

బ్యాట్ మెంటెన్ విజేతలను అభినందించిన.!

బ్యాట్ మెంటెన్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నెటిదాత్రి :
వనపర్తిలో
సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా బ్యాట్ మెన్టెన్ పోటీలలో డబుల్స్ సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన సయ్యద్ జీషాన్ ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు .15 వ వార్డ్ మున్సిపల్ మాజి కౌన్సిలర్ ,బండారు కృష్ణ మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోజ్ పెద్దింటి.వెంకటేష్, జోహెబ్బు హుస్సేన్. ,చిట్యాల రాము, ధర్మా నాయక్, మురళీ సాగర్ ,నీలస్వామి, శ్రీను, సల్మాన్,ఖలీల్ తదితరులు అభినందించిన వారిలో ఉన్నారు

సుమతిరెడ్డి మహిళా కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా….

అకాడమిక్ ప్రణాళికను పరిశ్రమలకు అనుగుణంగా రూపకల్పన చేసుకుని ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు

ఆటోనమస్ స్టేటస్ పొందిన సుమతిరెడ్డి మహిళా కళాశాల సిబ్బందిని అభినందించిన “ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి”

నేటిధాత్రి, హనుమకొండ

హనుమకొండ జిల్లా, హసన్ పర్తి మండలం, అనంతసాగర్ లో గల సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యుజిసి) మరియు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి స్వయం ప్రతిపత్తి హోదా (అటనమస్ స్టేటస్) వచ్చినట్లు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. దేశంలోని ముఖ్య నగరాలలో కలశాల లకు దీటుగా, సుమతిరెడ్డి కళాశాల విద్యార్థినిలకు కావలసిన మెలకువలు నేర్పించి, వివిధ రంగాలలో రాణించుటకు దోహదము చేస్తున్నామని, దేశ విదేశాలలో గల వివిధ ఎమ్మెల్సీ కంపెనీలలో సుమతి రెడ్డి కళాశాల విద్యార్థినిలు ఉద్యోగాలు చేస్తున్నారని, ప్రపంచంలో గల వివిధ దేశాలలో గల కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ప్రతిష్టాత్మక సంస్థలలో పని చేయుటకు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. పూర్వ విద్యార్థినులు వివిధ దేశాలలో పనిచేస్తూ కళాశాల ప్రతిష్టతను నిలుపుతున్నారు అని వరదారెడ్డి తెలిపారు. స్వయం ప్రతిపత్తి హోదా వలన కళాశాలకు అకాడమిక్ మెరుగుదల సాంకేతిక అభివృద్ధి కళాశాల అభ్యున్నతికి దోహదపడతాయి అని అన్నారు. స్వయం ప్రతిపత్తి హోదా వలన కలుగు వివిధ లాభాలలో అకాడమిక్ ప్రణాళికను పరిశ్రమలకు అనుగుణంగా రూపకల్పన చేసుకుని ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చునని అన్నారు. విద్యా విధానాలను నాణ్యతతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకోవడానికి అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ హోదా వలన కళాశాల హోదా పెరిగి, మంచి గుర్తింపు రావడంతో పాటు, విద్యార్థినులకు మెరుగైన అవకాశాలు రావడానికి దోహదపడుతుందని వరదారెడ్డి తెలిపారు. సుమతీరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల తన పాఠ్యప్రణాళిక రూపకల్పన, మూల్యాంకన ప్రమాణాలు ఏర్పరచుకోవడం వలన, పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం గల ప్రణాళికను పొందుపరచుకోవడం వలన, ప్రపంచంలో గల అన్ని రంగాలలో అవకాశాలను మరింత మెరుగుపరచుకొని ఉద్యోగ అవకాశాలు నిండుగా ఉంటాయని తెలిపారు.

సుమతిరెడ్డి మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ. రాజశ్రీ రెడ్డి మాట్లాడుతూ…

ఈ స్వయం ప్రతిపత్తి హోదా వలన విద్యార్థినులకు మరింత వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతుంది అని, కంపెనీలకు సంబంధించిన వివిధ పాఠ్యాంశాలను పొందుపరిచి విద్యార్థినులలో గల సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రపంచ స్థాయిలో ఉద్యోగ మరియు వ్యాపారవేత్తలుగా నిలుపుటకు నిరంతరం కృషి చేస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ రాజశ్రీ రెడ్డి తెలిపారు. ఈ ఆటోనామస్ హోదా అనేది కళాశాల యొక్క కీర్తిని మరింత పెంచేందుకు దోహదపడుతుందని విద్యార్థినులు నూతన ఆవిష్కరణలు చేయుటకు కావలసిన అంశాలను పాఠ్య ప్రణాళికలో పొందుపరచుకోవడం జరుగుతుందని తెలిపారు. సుమతీ రెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినిలను ఉత్తేజం చేస్తూ, కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాము. మహిళలను అన్ని రంగాలలో శక్తివంతం చేసేందుకు, వారి అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు.

సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆటోనమస్ స్టేటస్ పొందినందుకు, కలశాలలోని వివిధ విభాగాంధీపతులు డాక్టర్ ఈ సుదర్శన్, డాక్టర్ కే మహేందర్, డాక్టర్ ఎన్ శ్రీవాణి, ఏవో వేణు గోపాలస్వామి, అధ్యాపక బృందం విద్యార్థినులకు మరియు తల్లిదండ్రులకు తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు యాజమాన్యం. ఈ సందర్భంగా ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, కార్యదర్శి ఎం మధుకర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ రాజశ్రీ రెడ్డి ఈ అత్యున్నత విజయానికి కారణమైన కళాశాల సిబ్బంది యొక్క, అంకిత భావాన్ని వారు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version