కార్మికులంతా రక్షణ సూత్రాలను అనుసరించి పని చేయాలి..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు, అధికారులు ప్రతి ఒక్కరూ రక్షణ సూత్రాలను అనుసరించి పని చేయాలని, ఇంటి నుండే రక్షణతో హెల్మెట్ ధరించి డ్యూటీకి రావాలని, డ్యూటీలో ఎల్లప్పుడూ రక్షణ పరికరాలు ధరించి పని చేయాలని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ అన్నారు.
మంగళవారం రామకృష్ణాపూర్ సిహెచ్పీ లో డీజీఎం బీ బీ ఝా ఆధ్వర్యంలో స్పెషల్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించగా ముఖ్య అతిథులుగా మందమర్రి ఏరియా జిఎం దేవేందర్, బెల్లంపల్లి ఏరియా రీజినల్ సేఫ్టీ జీఎం రాజ్ కుమార్, ఏరియా సేఫ్టీ అధికారి రవీందర్, ఏజీఎం వెంకటరమణ ,ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ లింగయ్య, ఫిట్ సెక్రటరీ రామకృష్ణ, ఇంజనీర్ జాకీర్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిఎం దేవేందర్ మాట్లాడారు. సింగరేణిలో పనిచేసే కార్మికులు రక్షణ సూత్రాలను పాటించాలని, ప్రతి పనిలో నిబద్ధత కలిగి ఉండాలని, ఆరోగ్యం పై దృష్టి సారించాలని, ప్రతి కార్మికుడు ఆరోగ్య సింగరేణియుడి గా ఉండాలని అన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల సేఫ్టీ కోసం ప్రతిదీ సమకూరుస్తుందని, కార్మికులు సైతం సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇళ్లు మోడల్ హౌస్ ను ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి పట్టణంలోని CKR (చింతల కొండా రెడ్డి) ఫంక్షన్ హాల్ లో కల్వకుర్తి పట్టణం, కల్వకుర్తి మండలం, వెల్దండ మండలం, చారకొండ మండాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి జిల్లా ఇంచార్జిలు తెజావత్ బెల్యా నాయక్, రాజశేఖర రెడ్డి, ప్రవీణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని వివిధ పాఠశాలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ఒకరోజు శిక్షణ మండల వనరుల కేంద్రం కొల్చారంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ రావు మాట్లాడుతూ పారిశుధ్యం పై వారికి పలు సూచనలు చేయడం జరిగింది ఇందులో రిసోర్స్ పర్సన్ వెంకటేశం, మండల వనరుల కేంద్రం సిబ్బంది మరియు సిఆర్పిలు పాల్గొనడం జరిగింది.
వేసవి సెలవుల అనంతరం ఎల్లుండి నుండి బడులు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాఠశాలల పరిశుభ్రత మరియు పారిశుధ్యం పై శిక్షణకు హాజరైన పాఠశాల పారిశుద్ధ కార్మికులకు అవగాహన శిక్షణ కార్యక్రమం జరిపించారు.
నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే పెద్ది నిధులే..
మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టే..
ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం పేరుతో నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల నిధులు గత ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులే ఆని బిఆర్ఎస్ రాష్ట్ర రైతు సమన్వయ మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి తెలిపారు.
బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగల్లి వెంకట్ నారాయణ గౌడ్ అధ్యక్షతన పట్టణంలోని సిటిజెన్ క్లబ్ లో నర్సంపేట పట్టణ వార్డు ముఖ్యులు, క్లస్టర్ బాధ్యులతో పార్టీ సమావేశం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాయిడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గత పేదేండ్ల కాలంలో నర్సంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చలేదని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక రూపాయి నిధులు కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు.
అశాస్త్రీయంగా గ్రామాలను మున్సిపాలిటీలో కలిపారని, ప్రజలతో ఎలాంటి అభిప్రాయం తీసుకోలేదని చెప్పారు.
రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర పూరితంగా మున్సిపాలిటీ వార్డుల విభజన చేసారని రవీందర్ రెడ్డి ఆరోపించారు.
ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా వార్డుల విభజన జరిగిందని,వార్డుల వారీగా కేటాయించిన ఓటర్ల సంఖ్యలో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తుందని అన్నారు.
స్థానిక అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లోను కాకుండా విభజనను పునఃసమీక్షించి శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన జరగాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నిజమైన పేదలకు అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని తెలుపుతూ పేదలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు.
స్థానిక కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లెక్కల విద్యాసాగర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, క్లస్టర్ బాధ్యులు మోతే జయపాల్ రెడ్డి,మచ్చిక నరసయ్య గౌడ్,బండి రమేష్ ,రాంప్రసాద్,కడారి కుమారస్వామి,బండి ప్రవీణ్,పట్టణ
ప్రధాన కార్యదర్శి వెన్నుముద్దల శ్రీధర్ రెడ్డి,మహిళా విభాగం అధ్యక్షురాలు వాసం కరుణ,మాజీ కౌన్సిలర్స్,పట్టణ కమిటీ బాధ్యులు,వార్డు అధ్యక్షులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీలను సందర్శించిన ఎంపీఓ శ్రీపతి బాబురావు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం గంగిపెల్లి గ్రామ పంచాయతీని మంగళవారం ఎంపీవో శ్రీపతి బాబురావు ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని,
గ్రామంలో ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని,13 వ తేదీన గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా చేసి సర్టిఫికేట్ సమర్పించాలని పంచాయితీ కార్యదర్శికి తెలియజేశారు.
రహదారులు మరియు మురుగు కాల్వలు పరిశుభ్రంగా ఉంచాలని, వాటర్ పైపులైన్ మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని సూచించారు.
గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు.
సెగ్రిగేషన్ షెడ్ నందు కంపోస్టు ఎరువు తయారు చేయాలని,నర్సరీని పరిశీలించి మొక్కలు 100% పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించడం జరిగింది.
వాటర్ అండ్ శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు.
అనంతరం పెగడపల్లి గ్రామ పంచాయతీని,నర్సరీని సందర్శించి ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం మొక్కలకు నీళ్ళు అందించాలని,వాటర్ ట్యాంకు చుట్టూ శుభ్రం చేయాలని తగు సూచనలు చేశారు.
గ్రామ పంచాయతీల రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఇరు గ్రామపంచాయతీల కార్యదర్శులు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
జాతీయ బీసీ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన పూరెల్ల నితీష్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్ నియామక పత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని, బీసీ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలకంఠేశ్వర్, గౌరవ అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్, జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
సమస్య చెప్పుకుందాం అంటే అధికార పార్టీ నాయకుడే లేడు
ఇంచార్జ్ మంత్రి ఉన్నా లేనట్టే-సిపిఐ
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగర ప్రజలకు తమ సమస్యలు వెల్లవించుకుందామంటే దిక్కులేని దుస్థితి ఉందని అధికార పార్టీ ప్రజాప్రతినిధి కరీంనగర్లో లేకపోవడం వల్ల ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు ఒక సంయుక్త ప్రకటనలో అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలు, ఇందిరమ్మ ఇండ్లు, రాజివ్ యువ వికాస్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంటే కరీంనగర్ నగరంలో మాత్రం మొద్దు నిద్రలో అధికార పార్టీ ఉందని వారు విమర్శించారు.
ప్రజలు సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితి కరీంనగర్ నగరంలో నెలకొందని వారు ఆరోపించారు.
సంక్షేమ పథకాలు ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక, రాజీవ్ యువ వికాస్ ఎంపిక ఏమాత్రం జరగడంలేదని ఇది చాలా దుర్మార్గమని అన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నగరంలో మాత్రం దశ దిశ లేకుండా పోయిందని ప్రజా సమస్యలు పట్టించుకునే నాధుడే కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి ఏదో తూతూ మంత్రంగా వచ్చి అధికారుల సమావేశాలు ఏర్పాటు చేసి వెళ్లిపోతున్నాడు తప్ప ప్రజా సమస్యలు ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని కరీంనగర్ నగరాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆక్రోషం వ్యక్తం చేశారు.
గతంలో స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవినీతిపై అధికార పార్టీ నేతలు విచారణ జరిపించడంలో విఫలం చెందారని వెంటనే గత మేయర్ సునీల్ రావు, పాలకవర్గం చేసిన స్మార్ట్ సిటీ అవినీతిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయములో రోడ్లను తవ్వి రోడ్డు వేస్తామని చెప్పి మధ్యలోనే వదిలేసారని మురుగు కాలువలు కూడా అలాగే వదిలేసారని వాటి పనులను చేపించడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలం చెందినని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా తమ ఇష్టారాజ్యం వచ్చినట్లు పనులు చేస్తున్నారని వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, పారిశుద్ధం పడకేసిందని ప్రశ్నించే వారు లేకపోవడం వల్ల నగర కమీషనర్ ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నా పట్టించుకునే నాధుడు లేడని అన్నారు.
కోట్ల రూపాయలతో నిర్మించిన తీగల వంతెన పూర్తిగా దెబ్బతింటున్న అటువైపు కన్నెత్తి చూసే వారు లేరని రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని పేర్కొన్నారు.
ప్రతి ఆదివారం తీగల వంతెనపై ప్రజలు ఆహ్లాదకరంగా వినోదం పంచుకోవడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని, చెప్పిమాట తప్పారన్నారు.
వర్షాకాలం సమీపిస్తున్న ప్రత్యామ్నాయ చర్యలు కరీంనగర్ నగరంలో నేటికీ కమిషనర్ చేపట్టకపోవడం చూస్తుంటే ప్రజల పట్ల అధికారులకు, ప్రభుత్వానికి ఎంత చిత్త శుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు.
ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్న ఒక్క ఇల్లు కూడా ఇప్పటికీ కరీంనగర్ నగరంలో ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు.
నగరంలోచాలామందికి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు బిల్లు అమలు కావడం లేదని,గ్యాస్ డబ్బులు బ్యాంకులో పడడం లేదని ఇది చాలా దుర్మార్గమని వెంటనే కరీంనగర్ నగరంలో ఇందిరమ్మ కమిటీలు వేసి ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని లేకుంటే ప్రజాగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురకక తప్పదని కసిరెడ్డి సురేందర్ రెడ్డి,పైడిపల్లి రాజు విమర్శించారు.
భూపాలపల్లి రూరల్ మండలంలోని నాగారం ఆజంనగర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి తహసీల్దార్ వి శ్రీనివాసులు హాజరైనారు అనంతరం దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిశ్క రించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూ ములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలోఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసు బు క్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరిం చడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ అంజలీ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామస్వామి,అజహరో ద్దీన్, సర్వేర్ శ్రీనివాస్ రావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
— నస్కల్ లో రెవేన్యూ సదస్సు • భూ సమస్యలకు అర్జీలు చేసుకోండి • ఎమ్మార్వో శ్రీనివాస్
నిజాంపేట: నేటి ధాత్రి
భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట తాహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని నస్కల్ గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సును ఎమ్మార్వో శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలు ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాయబ్ తహసిల్దార్ రమ్య శ్రీ, ఆర్ఐ లు ప్రీతీ, ఇమద్, ధరణి ఆపరేటర్ రాజు, గ్రామస్తులు దేశెట్టి సిద్దారములు, గుమ్ముల అజయ్, మద్దికుంట శ్రీను తదితరులు ఉన్నారు.
పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి
బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్
పరకాల నేటిధాత్రి
బస్సు పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ సామాన్య ప్రజలతోపాటు,విద్యార్థుల బస్సు పాస్ 20 శాతం,పెంచిన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం ఆర్డినరీ పాస్ ధరను రూపాయలు 1150 నుండి రూ.1400కు,మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1300 నుండి 1600 కు,డీలక్స్ పాస్ ధరను 1450 నుండి 1800 పెంచిన టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవారికి ఉచితమని మగవారి దగ్గర టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద భారం వేస్తుంన్నారని,పెంచిన ఆర్టీసీ టికెట్ ధరను వెంటనే తగ్గించాలని లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున ధరలు తగ్గించేవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ డిమాండ్ చేశారు.
మండలంలోని చౌటుపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడిబాట గ్రామసభను మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం రాజేందర్ బాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నడికూడ మండల విద్యాశాఖ అధికారి కె.హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తారు. అయితే దానికోసం మన ఊరిలో మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తూ కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఐ ఎఫ్ పి టివి ప్యానెల్ ద్వారా డిజిటల్ విద్యాబోధన చౌటుపర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతుంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం,కృత్యాధార, అనుభవజ్ఞులైన అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులచే విద్య బోధన జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్,పాఠ్య పుస్తకాలు,వర్క్ బుక్కులు ఉచితంగా అందిస్తున్నారు, ప్రతిరోజు రుచికరమైన పౌష్టికాహారం మధ్యాహ్న భోజనం,వారానికి మూడు గుడ్లు,మూడు రోజులు రాగి జావా,ప్రతినెల తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుంది. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తున్నందున గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి,ప్రభుత్వ బడి అభివృద్ధి చెందేటట్లుగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు, యువజన సంఘాలు,పూర్వ విద్యార్థులు గ్రామంలోని పెద్దలు అందరూ కలిసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి గూడెం రమ్య విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు,మహిళా స్వయం సహాయక సంఘాలు,అంగన్వాడీ టీచర్లు,పాఠశాల ఉపాధ్యాయులు,యువజన సంఘాల నాయకులు,పూర్వ విద్యార్థులు సమావేశంలో పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు ముందు ధర్నా కార్యక్రమం మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగినది
మంచిర్యాల నేటి దాత్రి
మంచిర్యాల భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్లు
1.) ఈ పి ఎఫ్- 95 యొక్క కనీస పెన్షన్ 1000/- రూపాయల నుండి 5000/- రూపాయలకు వెంటనె పెంచాలి. మరియు చివరకు జీతంలో 50% + డి ఏ రిలీఫ్ పెన్షన్ ను చెల్లించాలి.
2.) ఈ పి ఎఫ్ జీత పరిమితిని 15,000/- నుండి 30,000/- పెంచాలి. ఈ ఎస్ ఐ జీతం పరిమితిని 21,000/- నుంచి 42,000/- పెంచాలి.
3.) ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణమే నిషేధం విధించాలి.
4.) బీమా ఆర్థిక రంగంలో 100% విదేశీ పెట్టుబడులను నిషేధించాలి.
5.) స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం మరియు సామాజిక భద్రత కల్పించాలి.
6.) అసంఘటిత కార్మిక రంగానికి బోర్డ్ లను ఏర్పాటు చేసి వాటికి తగినన నిధులను కేటాయించాలి. 7) మినిమం వేజెస్ 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్2016 నుండి పెండింగ్లో ఉన్న సమస్య 2012లో డిమాండ్ చేసిన విధంగా బిఎంఎస్ మినిమం వేజెస్ 25 వేల రూపాయలు ప్రకటించాలి 8) కార్మిక బోర్డులో ఉన్న వెయ్యి నాలుగు కోట్లు ఇతర శాఖలకు మళ్లించిన డబ్బులను తిరిగి బోర్డులో జమపరిచి కార్మికుల డెత్ క్లేములు మిగతా సౌకర్యల కొరకు వినియోగించాలి
సమస్యల పరిష్కారం కోసం భారతీయ మజ్ధూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించడం జరిగింది
కార్మికుల తీవ్ర సమస్యల పరిష్కారం కోసం తక్షణమే రాష్ట్రంలోని జిల్లాస్థాయిలో నిరసన కార్యక్రమాలను నిర్వహించి కలెక్టర్ సంబదిత అధికారుల ద్వారా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి కి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది.
భారతీయ మజ్దూర్ సాంగ్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్ అధ్యక్షతన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
వీరిలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లగిసెట్టి కమలాకర్ మరియు సింగరేణి ఏ బి కె ఎం ఎస్ నాయకులు కె శ్రీనివాస్ మరియు మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ పెయింటర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సంగెం లక్ష్మణ్ ,వేల్పుల స్వామి పెయింటర్ యూనియన్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కార్యదర్శి , ఆఫీస్ సెక్రటరీ మహానంద్ ప్రభాకర్, మరియు ఎస్ సి సి ఎల్ కన్వీనర్ ,మిట్టపెల్లి మొగిలి బిఎంఎస్ నాయకులు మంచిర్యాల జిల్లాలో బిఎంఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగినది
స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా వినాయకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. వినాయకుమార్ గారినీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు బండి మోహన్, జే రవికిరణ్, శివప్ప, ఓంకార్, పరశురాం,ఫాయాజ్, తదితరులు పాల్గొన్నారు.
గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…
ఎమ్మెల్యే కోరం కు వినతిపత్రం అందజేసిన అఖిలపక్షం…
ట్రెంచ్ హద్దులు ఏర్పాటు కు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్య…
నేటి ధాత్రి – గార్ల :-
సీతంపేట పరిధిలోని గార్ల పెద్ద చెరువు ఆక్రమణకు గురౌతూ కబ్జా కు గురైన చెరువు శిఖం భూములను కబ్జా నుండి కాపాడి,శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ కోరారు. మంగళవారం గార్ల గ్రామ పంచాయతీ కార్యాలయం లో నిర్వహించిన భూ భారతీ గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే కనకయ్య ను సిపిఎం,సిపిఐ,న్యూడెమోక్రసీ పార్టీల అధ్వర్యంలో వినతిపత్రం అందించారు.ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ,మండలానికే తలమానికంగా మారిన గార్ల పెద్ద చెరువులో 766 సర్వే నెంబరు లో శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయాని,766 సర్వే నెంబరు భూములతో పాటు 457, 440 సర్వే నెంబరు లలో ఉన్న ఎఫ్ సి ఎల్ భూములను సర్వే చేపట్టి శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెండ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని కోరారు. అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాలు చేయించుకున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్పందించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తక్షణమే హద్దులు గుర్తించి ట్రెంచ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టె బోయిన శ్రీనివాస్,న్యూ డెమోక్రసీ నాయకులు జి.సక్రు తదితరులు పాల్గొన్నారు.
అనాధ బాలకార్మికులం..! కామాంధులు తిని వదిలేసిన చిదిమేసిన ఎంగిలి విస్తరాకులం మేము మేము అనాధ బాలకార్మికులం..!
హైదరాబాద్,నేటి ధాత్రి:
బ్రతుకు కోసం మెతుకుకోసం పోరాటం చేస్తున్న ఆరవ పంచభూతమైన ఆకలికి వారసులం మేము మేము అనాధ బాలకార్మికులం..!
రోజంతా మస్తు పని చేస్తాం…కడుపును పస్థులు ఉంచుతాం… వెట్టిచాకిరి చేస్తున్న భావిభారత పౌరులం మేము మేము అనాధ బాలకార్మికులం..!
సమాజంలో తన్నులు తిట్లు అవార్డులు పొందిన ఉదయిస్తున్న సూర్యులం మేము మేము అనాధ బాలకార్మికులం..!
ఇరానీ హోటల్ నుండి ఇటుకల బట్టిల వరకు అంతట కట్టు బానిసలమై జీవనోపాధి కోసం బాల్యాన్ని బలిపశువులుగా చేస్తూ…
Orphan child laborers
మోములో మోదమంటే ఎరగనోల్లం మేము మేము అనాధ బాలకార్మికులం..! మేము అనాధ బాలకార్మికులం..! బడి ఈడు పిల్లలని బడిలో చేరుద్దాం! బంగరు భవితకు బాటలు వేద్దాం!! ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం (జూన్ 12) సందర్బంగా..బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి మనం అంతా కలిసి పనిచేయాలని ముఖ్యంగా ప్రభుత్వాలు,సామాజిక సంస్థలు కలిసి పనిచేయాలని కోరుకుంటూ..వారికి మంచి రోజులు రావాలని కోరుకుంటూ… రచన✍మంజుల పత్తిపాటి (కవయిత్రి). ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్. యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. చరవాణి 9347042218.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున వ్యవసాయ శాఖ ఏడిఈ మరియు ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ మరియు పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేయడం తనిఖీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీటీ త్రిబుల్ వన్ రకం పత్తి విత్తనాలను అమ్మిన సాగు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు,రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు రశీదు షాప్ యజమానులు నుంచి తీసుకోవాలి అని అన్నారు,ఈ తనిఖీ లో ఏడి ఏ రమేష్.వ్యవసాయశాఖ అధికారులు పోలీసులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం ముందస్తు జాగ్రత్తగా దోమల మందు డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల చిరు మల్ల మరియు కేజీబీవి స్కూల్లో ప్రారంభించి ముందస్తు మలేరియా పాజిటివ్ కేసులు ఉన్న 13 గ్రామాల్లో స్ప్రే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ పోలేబోయిన కృష్ణయ్య, కీటక జనిత వ్యాధుల నియంత్రణ సూపర్వైజర్ అరుణ్ బాబు, ఎం పి హెచ్ ఎ (ఎం) నరసింహారావు, రమాదేవి, ఆశాలు గణతమ్మ, పుష్ప, ఆదిలక్ష్మి, జగదీశ్వరి, కేజీబీవీ స్టాప్. వై రజిని, సుజాత మరియు పార్వతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు
రవాణా శాఖ మంత్రిని కలిసిన కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సిసిఐ గోదాం వద్ద కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి.
అయినా ఇప్పటివరకు అధికారుల వద్ద నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి వినతి పత్రం అందించారు.
వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నస్పూర్, జైపూర్,భీమారం మండలాల పేరుతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని సుమారు వేయి కుటుంబాలు స్థానికంగా ఉంటూ బొగ్గు,కర్ర,పత్తి మొదలగునవి రవాణా చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
కానీ ఈ క్రమంలో మా పరిధిలో గల నస్పూర్ మండలంలోని తీగల పహాడ్ సిసిఐ గోడౌన్ వారు పత్తి బెల్స్ ను నిలువ చేసి ఉంచడం జరిగింది.
నిలువ చేసిన పత్తి బెల్సును స్థానికంగా ఉన్న లారీలకు కిరాయిలు ఇవ్వకుండా బయటి ట్రాన్స్ పోర్ట్ వారితో చేతులు కలిపి బయట ప్రాంతాలకు రవాణా కొనసాగిస్తున్నారని అన్నారు.
స్థానికంగా ఉన్న లారీ ఓనర్స్ అయినటువంటి మేము అక్కడికి వెళ్లి బయట వారితో రవాణా చేపించడం ఏంటని ప్రశ్నించడంతో మాపై దౌర్జన్యానికి దిగి జిల్లా కలెక్టర్ కి మాపైన ఫిర్యాదు చేసి పోలీస్ వారితో అక్రమ కేసులు పెట్టించడం జరిగిందని విన్నవించారు.
మా సమస్యను అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని రవాణా శాఖ మంత్రి ని కోరారు.
ఈ విషయానికి సానుకూలంగా స్పందించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో జియా గ్యారేజ్ నడిపిస్తున్న మెకానిక్ యూనిస్ ప్రమాదవశాత్తు బైక్ చైన్ లో పడి ఎడమచేతి రెండు వెళ్ళు పూర్తిగా కట్ కావడం జరిగింది.ప్రమాదానికి గురైన వ్యక్తి నెల రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో అతని యొక్క జీవనాధారం కొరకు మెకానిక్ యూనియన్ ని సంప్రదించినట్లు తెలిపారు.ఈ విషయం పై వెంటనే స్పందించిన నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అతనికి ఆర్థిక సహాయంగా11,000 వేల రూపాయలను మంగళవారం అందించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్ మాట్లాడుతూ టూవీలర్ మెకానిక్ యూనియన్ ఉండడం వల్ల మెకానికులకు ఎలాంటి ఆపద వచ్చిన యూనియన్ అండగా ఉంటుందని యూనియన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అదేవిధంగా యూనియన్ లో లేనివారు కూడా సభ్యత్వం తీసుకుని యూనియన్ నుంచి ఏమైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మెకానిక్ సోదరులు ఉపయోగించుకోవాలని కోరారు.అలాగే ప్రతి కమిటీ సభ్యుడు మరియు మెకానిక్ సోదరులు యూనియన్ లో లేని వారిని కూడా యూనియన్ సభ్యత్వం తీసుకునే విధంగా ప్రతి ఒక్క మెకానిక్ తో మాట్లాడి యూనియన్ వల్ల ఏమిటి లాభాలు ప్రతి ఒక్క మెకానిక్ మరియు యూనియన్ కమిటీ సభ్యులు తెలియజేయాల్సిందిగా కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల నరేష్ గౌడ్,ఉపాధ్యక్షులు పెండెం భాస్కర్,చంద్రమౌళి,ప్రసాద్, అల్లావుద్దీన్,బానేష్ పాల్గొన్నారు.
NTR – War 2: పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా లుక్స్..
వార్-2 (War 2) చిత్రం తారక్ (Jr NTR) బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
వార్-2 (War 2) చిత్రం తారక్ (Jr NTR) బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదల చేయగా దానికి చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. టీజర్లో ఎన్టీఆర్ లుక్, స్టైలింగ్ అదిరిందనే ప్రశంసలు వచ్చాయి. ఆ క్రెడిత్ మొత్తం అనైతా ష్రాఫ్ అడజానియాకే (Anaita Shroff Adajania) దక్కుతుంది. తన కాస్ట్యూమ్స్కి, తన పని తనానికి వచ్చిన ప్రశంసని, అభిమానుల నుంచి వచ్చిన ప్రేమను చూసి ‘వార్ 2’ కాస్ట్యూమ్ డిజైనర్ ఆనందంతో మునిగి తేలుతున్నారు. దేశంలోనే అత్యుత్తమ స్టైలిస్ట్గా గుర్తింపు పొందిన అనైతా ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘‘వార్ 2’లో మొదటిసారి ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో పని చేయడం పూర్తిగా సంతోషాన్ని ఇచ్చింది. అదొక కొత్త అనుభూతి. ఆయన సెట్స్లోకి ఎంట్రీ ఇస్తే ఆ ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తుంటుంది. ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతారు. ఆపై అతను పోషిస్తున్న పాత్రలో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ కోసం చాలా లుక్స్ డిజైన్ చేశాం. ఆయన పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాం. ఓ లక్ష్యంతో, ఉద్దేశ్యంతో పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశాం’’ అని అన్నారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రమిది. కియారా అద్వానీ కథానాయిక. ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో వార్ 2 భారీ ఎత్తున విడుదల కానుంది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.