రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

తహసీల్దార్ వి శ్రీనివాసులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి రూరల్ మండలంలోని నాగారం ఆజంనగర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి తహసీల్దార్ వి శ్రీనివాసులు హాజరైనారు అనంతరం దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిశ్క రించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూ ములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలోఉన్న
భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసు బు క్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరిం చడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ అంజలీ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామస్వామి,అజహరో ద్దీన్, సర్వేర్ శ్రీనివాస్ రావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version