రవాణా శాఖ మంత్రిని కలిసిన కోల్ బెల్ట్ ఏరియా.

రవాణా శాఖ మంత్రిని కలిసిన కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

 

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సిసిఐ గోదాం వద్ద కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి.

అయినా ఇప్పటివరకు అధికారుల వద్ద నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి వినతి పత్రం అందించారు.

వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నస్పూర్, జైపూర్,భీమారం మండలాల పేరుతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని సుమారు వేయి కుటుంబాలు స్థానికంగా ఉంటూ బొగ్గు,కర్ర,పత్తి మొదలగునవి రవాణా చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

కానీ ఈ క్రమంలో మా పరిధిలో గల నస్పూర్ మండలంలోని తీగల పహాడ్ సిసిఐ గోడౌన్ వారు పత్తి బెల్స్ ను నిలువ చేసి ఉంచడం జరిగింది.

నిలువ చేసిన పత్తి బెల్సును స్థానికంగా ఉన్న లారీలకు కిరాయిలు ఇవ్వకుండా బయటి ట్రాన్స్ పోర్ట్ వారితో చేతులు కలిపి బయట ప్రాంతాలకు రవాణా కొనసాగిస్తున్నారని అన్నారు.

స్థానికంగా ఉన్న లారీ ఓనర్స్ అయినటువంటి మేము అక్కడికి వెళ్లి బయట వారితో రవాణా చేపించడం ఏంటని ప్రశ్నించడంతో మాపై దౌర్జన్యానికి దిగి జిల్లా కలెక్టర్ కి మాపైన ఫిర్యాదు చేసి పోలీస్ వారితో అక్రమ కేసులు పెట్టించడం జరిగిందని విన్నవించారు.

మా సమస్యను అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని రవాణా శాఖ మంత్రి ని కోరారు.

ఈ విషయానికి సానుకూలంగా స్పందించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

 

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత.

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కరేటేలో ఝరాసంగం సిద్దు మాస్టర్ విద్యార్థుల ప్రతిభ జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం సదాశివపేట పట్టణంలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ ను తెలంగాణ చీఫ్ రాపోలు సుదర్శన్ మాస్టర్ జిల్లా ఎగ్జామినర్ శంకర్ గౌడ్ మాస్టర్ జిల్లా చీఫ్ చందర్ మాస్టర్ ఎగ్జామినేటర్గా విద్యార్థులను పరీక్షించారు. ప్రతిభ కనబరిచిన సైఫ్ సంగమేశ్వర్ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ లో గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు సిద్ధంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సిద్దు మాస్టర్ సతీష్ గౌడ్. శ్వేత వారిని అభినందించడం జరిగింది

కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రిలే నిరాహార దీక్షలు.

కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రిలే నిరాహార దీక్షలు

కోల్ బెల్ట్ ఏరియా పరిధిలో స్థానికంగా ఉన్న లారీలకు మాత్రమే లోడింగ్ ఇవ్వాలి

అసోసియేషన్ నిర్ణయించిన కిరాయి మాత్రమే చెల్లించాలి

ఇతర రాష్ట్రాల లారీలు తెప్పించి స్థానికంగా ఉన్న లారీ ఓనర్ల పొట్టగొడుతారా

నస్పూర్ (మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ తీగల్పాడు గోదాం వద్ద కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యజమానుల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.ఇక్కడ స్థానికంగా ఉండే లారీ యజమానుల పొట్ట కొట్టడానికి సిసిఐ గోదాం వాళ్లు తమిళనాడు,కేరళ నుండి తక్కువ కిరాయిలకు లారీలను తెప్పించి ఇక్కడ లోడింగ్ చేపియడం వల్ల మా లారీ యజమానుల బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వందల మంది లారీ యజమానుల కుటుంబాలు లారీల మీద ఆధారపడి జీవిస్తున్నామని, మా లారీలు నడవనీయకపోతే మా పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ వాళ్లు స్పందించి మా లారీలు లోడింగ్ చేసేలా చర్య తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి మా లారీ ఓనర్లకు తగిన న్యాయం చేయగలరని పై అధికారులని వేడుకుంటున్నాము. ఈకార్యక్రమంలో కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండా సురేష్ గౌడ్,వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల సుమన్, జనరల్ సెక్రెటరీ రాందేని రమేష్,జాయింట్ సెక్రటరీ అరికోళ్ల రమేష్,కల్చర్ సెక్రటరీ గుడికందుల తిరుపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి పవన్,క్యాషియర్ కటకం ప్రశాంత్ మరియు లారీ యజమానులు పాల్గొన్నారు.

మద్యం బెల్ట్ షాపులపై గంజాయి పై దశలవారీగా పోరాటాలు.

మద్యం బెల్ట్ షాపులపై గంజాయి పై దశలవారీగా పోరాటాలు

డివైఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా అధ్యక్షుడు భూక్య నవీన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు కొన్ని అనివార్య కారణాలవల్ల మే 25 26 కు వాయిదా వేయడం జరిగిందని దీనిని మేధావులు పెద్దలు మిత్రులు గమనించాలని ఈ మధ్యకాలంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మద్యం బెల్టు షాపులపై గంజాయి నిర్మూలన పై నూతన కార్యచరణకు ఈ జిల్లా కమిటీ శ్రీకారం చుట్టిందని ఇకనుంచి దశలవారీగా జిల్లాలో యావత్ యువకులను బానిసలను చేస్తూ వారి ప్రాణాలను కోల్పోయే విధంగా మనుషుల విలువలను దెబ్బతీసే విధంగా రోజు రోజుకు జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం షాపులపై దఫళవారీగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించిందని ఎన్నోసార్లు అధికారులకు వినతులు స్వయంగా పట్టించిన కూడా జిల్లాలు అధికారులేనట్టుగా నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తుందని, దీనిపైన డివైఎఫ్ఐ అధికారులు సిండికేట్ యాజమాన్యాలు బెల్టు షాపులు కుమ్మక్కయ్యే యువకులను నాశనం చేసేందుకు ధనార్జినేయంగా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ దంధాలు నడిపిస్తున్నారని స్పష్టమైన అవగాహనకు వచ్చిందని అందుకోసమే ఈ జిల్లాలో యువకులు మద్యం తాగుతూ తద్వారా గంజాయి డ్రగ్స్ కూడా బానిసలు అవుతున్నారని దీనిపై అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూనే పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అంతవరకు డివైఎఫ్ఐ పోరాటాలు ఉంటాయని యువకులకు ఈ జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిమెంట్ కర్మాగారం గాని, కోల్ శుద్ధి కర్మాగారం, గాని ఉక్కు పరిశ్రమ, గాని ఏర్పాటు చేస్తే ప్రజల్లో ఆర్థిక ఇబ్బందులు ఉండమని యువకులు కూడా గంజాయి డ్రగ్స్ మద్యం నుంచి బయటపడతారని వీలైనంత త్వరగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దీని మీద దృష్టి సారించి జిల్లాలో ఉన్న యువకులందరికి ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పిస్తూనే రోజురోజుకు పెరుగుతున్న మద్యం బెల్ట్ షాపులపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తామని.
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలు పడుతున్న సమస్యలపై త్వరలోనే సందర్శనలు చేసి సమగ్రమైన సమాచారంతో పోరాటాలు నిర్వహించబోతున్నామని ప్రభుత్వాసుపత్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి తెలియజేసేందుకు దశల వారి పోరాటాలు కూడా డివైఎఫ్ఐగా నిర్వహించబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం కవిత, గుడి కందుల దేవేందర్, బందు సుజాత, జిల్లా కమిటీ సభ్యులు, జ్ఞానేశ్వరి బుర్ర స్వాతి, అజ్మీర సరిత, ఎర్ర సుజాత, భాస్కర్లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

పల్లెల్లో రాజ్యమేలుతున్న బెల్ట్ షాపులు..

*పల్లెల్లో రాజ్యమేలుతున్న బెల్ట్ షాపులు..

*అక్రమాలను ఆదరిస్తున్న ఎక్స్ంజ్,శాఖ..

పలమనేరు(నేటి ధాత్రి) 

ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలను అందిస్తున్నారు లేదో కానీ గ్రామాల్లో మాత్రం మద్యం ప్రియులకు బెల్ట్ షాప్ రూపంలో తెగ మందు తాగిస్తున్నారు గడిచిన ప్రభుత్వంలో బ్రాంది షాపులను ప్రభుత్వం నడిపి బెల్ట్ షాపులను అరికడితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మద్యం షాపులను ప్రైవేటీకరణ చేసి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తుంది అనడంలో సందేహం లేదు గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు నిర్వహణ నిర్వహిస్తూ అధిక మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు.ఈ బెల్ట్ షాపులను అరికట్టాల్సిన ఎక్సైంజ్,
శాఖ వారికి సహకరిస్తూ అంధకారప్రాయంగా ముందుకు వెళ్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్, చంద్రబాబు నాయుడు,ముఖ్యమంత్రి.. డిప్యూటీ సీఎం గా జనసేన పార్టీ కొణిదల
పవన్ కళ్యాణ్ పదవిలో కూర్చున్న తర్వాత మద్యం బాబులకు పట్టణాల్లో గాని, మండలాల్లో గాని మద్యం షాపులు పెట్టుకోవాలని
సీఎం డిప్యూటీ సిఎం లు ఆదేశించిన
ఎక్స్ంజ్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది, మద్యం దుకాణం దారులతో ఎక్స్ంజ్,
అధికారులు కుమ్మకై పల్లెల్లో బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి చేయి తడుపుతే షాపులు పెట్టుకోవడానికి
అనుమతి వచ్చినట్లేనని బెల్ షాపు విక్రయదారుల నుండి వేలాది రూపాయలు వీరు జేబులోకి నింపుకొని ప్రభుత్వ ఖజానాకు
గండి కొడుతున్నారు అని అనుమానాలు కూడా వస్తున్నాయి.. ప్రభుత్వం నియంత్రించిన ధరల కంటే
గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో ఒక్కొక్క మద్యం బాటిల్ మీద 20 నుండి 30 రూపాయలు దాకా అధికంగా వసూలు చేసి అటు అధికారులు
షాపు యజమానులు బెల్ట్ షాపు విక్రయ విక్రయదారులు జేబులు నింపుకుంటున్నారు. ప్రతినిత్యం
దినసరి కూలి పనికి పోతే రోజుకు
400 నుండి 500 రూపాయలు దాకా సంపాదించుకొని పల్లెల్లో సాయంత్రం అయితే బెల్ట్ షాప్ వద్దకు వెళ్లి 200 నుండి 250 దాకా ఖర్చుపెట్టుకొని కుటుంబాన్ని ‌ రోడ్డుపాలు చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు మనోవేదనకు
గురవుతున్నామని మా కుటుంబాన్ని ఎలా పోషించాలో అని ఆలోచనలో
పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చెందారు.. ఇకనైనా పల్లెల్లో బెల్ట్ షాపులు తొలగించాలని సంబంధిత
ప్రభుత్వం గానీ సంబంధిత అధికార శాఖ కానీ చొరవ తీసుకొని
బెల్ట్ షాపులపై ప్రత్యేకంగా ఉంచకపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఈ మద్యం ద్వారానే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది అనడంలో సందేహం లేదు. మరి అధికారులు ఏం చేస్తారో చూడాల్సి ఉంది..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version