పాఠశాలల పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య నిర్వహణపై.

– పాఠశాలల పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య నిర్వహణపై…

– మండల స్థాయిలో శిక్షణ…

కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి:-

 

 

 

మండలంలోని వివిధ పాఠశాలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ఒకరోజు శిక్షణ మండల వనరుల కేంద్రం కొల్చారంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ రావు మాట్లాడుతూ పారిశుధ్యం పై వారికి పలు సూచనలు చేయడం జరిగింది ఇందులో రిసోర్స్ పర్సన్ వెంకటేశం, మండల వనరుల కేంద్రం సిబ్బంది మరియు సిఆర్పిలు పాల్గొనడం జరిగింది.

వేసవి సెలవుల అనంతరం ఎల్లుండి నుండి బడులు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాఠశాలల పరిశుభ్రత మరియు పారిశుధ్యం పై శిక్షణకు హాజరైన పాఠశాల పారిశుద్ధ కార్మికులకు అవగాహన శిక్షణ కార్యక్రమం జరిపించారు.

ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు.

కోటగుళ్లలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు

గోశాల నిర్వహణకు రూ. 56వేల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఆదివారం సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న పానిగంటి గణేష్ కు వేతనం కింద రూ 56 వేలను అందజేశారు. ఈ సందర్భంగా గోశాల గోమాతలకు నవీన్ కుమార్ సుమతి దంపతులు పండ్లను
అందజేశారు. అనంతరం డాక్టర్ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గోశాల నిర్వహణకు వేతనాన్ని అందజేసిన నవీన్ కుమార్ సుమతి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version