స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా వినాయకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
వినాయకుమార్ గారినీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు బండి మోహన్, జే రవికిరణ్, శివప్ప, ఓంకార్, పరశురాం,ఫాయాజ్, తదితరులు పాల్గొన్నారు.