అభ్యర్థులు ఎన్నికల నియమావలి పాటించాలి.
#తహసిల్దార్ ముప్పు కృష్ణ.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల నియమావళి పాటించాలని తహసిల్దారు ముప్పు కృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఖర్చులను ఎప్పటికప్పుడు వివరించాలని. అభ్యర్థులు ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా సామరసంగా ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి చంద్రకళ, ఎంపీడీవో శుభానివాస్, ఏఎస్ఐ కీరు నాయక్, ఎన్నికల అబ్జర్వర్, సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులు పాల్గొన్నారు.
