ప్రభుత్వ పాఠశాల డయాస్ ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి…

ప్రభుత్వ పాఠశాల డయాస్ ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

మాజీ ఉపసర్పంచ్ రామగుండం రాజకుమార్

వీణవంక, నేటి ధాత్రి:

వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో సర్పంచ్ వ్యవహారంపై తీవ్ర వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రాజకుమార్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, జిల్లా కలెక్టర్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
వారి ఆరోపణల ప్రకారం గ్రామంలో సుమారు రూ.10 లక్షల విలువ కలిగిన ప్రభుత్వ పాఠశాలలో డయాస్ (వేదిక) ను ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చివేయడం జరిగింది. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన ఈ ఆస్తులను ధ్వంసం చేయడం పూర్తిగా ప్రజా నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కూల్చివేతలో
సంబంధిత అధికారుల నుండి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం అనుమతి తీసుకోకుండా
గ్రామ సభ తీర్మానం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు
ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, గ్రామ ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని వారు తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ రాజకుమార్ మాట్లాడుతూ,
“ప్రజల డబ్బుతో నిర్మించిన ఆస్తులను అన్యాయంగా కూల్చివేయడం గ్రామ అభివృద్ధికి పెద్ద దెబ్బ బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే బీఆర్‌ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం” అని హెచ్చరించారు.
కలెక్టర్ సమర్పించిన ఫిర్యాదులో బీఆర్‌ఎస్ నాయకులు
ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని
చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని
ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులను పునరుద్ధరించాలని
గ్రామ పాలనలో పారదర్శకతను నిర్ధారించాలని
డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై గ్రామ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య ప్రక్రియలను పక్కనబెట్టి తీసుకున్న నిర్ణయాలపై బీఆర్‌ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఈదునూరి భూమయ్య, నల్లగాశ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ఆవాల అరుంధతి- గిరిబాబు,మేడుదుల రాజు తదితరులు పాల్గొన్నారు.

గాలివాన ధాటికి కూలిన విద్యుత్ స్తంభాలు.. విద్యుత్ సరఫరా నిలిపివేత….

గాలివాన ధాటికి కూలిన విద్యుత్ స్తంభాలు.. విద్యుత్ సరఫరా నిలిపివేత….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చనిగేపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా పలు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో కూలిన స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసే పనులు మంగళవారం చేపట్టారు. గ్రామస్థుల సహకారంతో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. త్వరలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.

అధికారుల ఆదేశాలు బే ఖతర్..!

అధికారుల ఆదేశాలు బే ఖతర్..!

#నోటీసులు జారీ చేసి సరిపెట్టుకున్న అధికారులు.

#ప్రజల ఆరోగ్యం పై ఇంత నిర్లక్ష్యమా..

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో నెలకొల్పిన రెడ్ మిక్స్ ప్లాంట్ కర్మాగారం ద్వారా వచ్చేదుమ్ము ధూళితో డిపిఎం 38 కెనాల్ భూమిపై ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ వాహనాలు నడపడంతో సిసి రోడ్డుతో పాటు కెనాలకు ప్రమాదం ఉందని అదేవిధంగా కస్తూరిబా గాంధీ విద్యార్థులతో పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టి రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్న యజమానులకు కెనాల్ పై ఉన్నదారిపై అనుమతి లేకుండా వాహనాలు నడపరాదని నోటీసులు జారీచేసిన కూడా నిర్వాహకులు అధికారుల ఆదేశాలను బే ఖతర్ చేయడంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అధికారుల ఆదేశాల సైతం పట్టించుకోకుండా ప్లాంట్ నిర్వాహకులు యధావిధిగా వాహనాలు నడపడం లో ఆంతర్యం ఏమిటని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

#ప్లాంటు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
ఐబి ఏఈ పవిత్ర.

రెడ్ మిక్స్ ప్లాంట్ నుండి భారీ వాహనాలు డిబిఎం 38 కెనాల్ పై ఉన్న రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండానే వాహనాలు నడపడం జరుగుతుందని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టి నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని. మరల కెనాల్ పైనుండి యధావిధిగా వాహనాలు కొనసాగించడం పట్ల జిల్లా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్లాంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version