కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి..

కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి.

#చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు.

#భూమి ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న డిబిఎం 38 కెనాల్ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకతీయ కెనాల్ ఇరువైపుల ఎడమవైపు 120 మీటర్లు, కుడి వైపు 100 లీటర్లు వదిలివేసి నిర్మాణాలు చేసుకోవాలని గతంలో సంబంధిత అధికారులు సూచించారు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మండల నాయకులు ఇష్ట రాజ్యాంగ కెనాల్ భూమిని ఆక్రమించుకొని అమాయకులకు అధిక రేటులకు అమ్ముకోవడం జరిగింది. నిర్మాణాలు చేపట్టే క్రమంలో అధికారులు నిబంధనలకు మించి ఇండ్ల నిర్మాణాలు చేపడితే తక్షణమే తొలగించబడతాయని హెచ్చరించిన కూడా కొందరు భూమి కొనుగోలు చేశారని . పూర్తిగా విషయం తెలుసుకున్న తర్వాత కొనుగోలు దారులు లబోదిబోమంటూ భూమి అమ్మిన నాయకులను ఆశ్రయించగా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు మేము చూసుకుంటామని భరోసా ఇవ్వడంతో నిర్మాణాలు ఇష్ట రాజ్యాంగ చేస్తున్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

చెరువు శిఖం భూములను సంరక్షించాలి.

చెరువు శిఖం భూములను సంరక్షించాలి.

#కబ్జా చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

#చెరువులను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

మండల కేంద్రంలోని రేవులకుంట, వెంకటపాలెం చెరువు భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ సంపత్ కు వినతిపత్రం అందించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం చెరువు శిఖం భూములను సైతం ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి చెరువుల శిఖం భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని. అదేవిధంగా శిఖం భూములను కబ్జా చేసి ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా అధికారులు చొరవ చూపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ మాసంపల్లి అఖిల్, పరికిత్యారాజు, బూస కుమారస్వామి, వైనాల జంపయ్య, మేకల మోహన్, కోల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version