రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షణీయం.
#పి ఆర్ టి యు టి ఎస్ అధ్యక్షుడు ఉడుత రాజేందర్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్న హారిక, మహాలక్ష్మి, అక్షితలు ఇటీవల రాష్ట్రస్థాయి రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ లో రాష్ట్రస్థాయికి ఎంపిక అవడం హర్షినియమని పి ఆర్ టి యు టీఎస్ మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్ అన్నారు. శనివారం మండల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అలాగే విద్యార్థులను ప్రోత్సహించి ఎంపిక కావడానికి కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్ శంకరయ్య, ప్రధానోపాధ్యాయురాలు అంబి వసంత, ఉపాధ్యాయ బృందాన్ని ఈ మేరకు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు లడే రవీందర్, శ్రీధర్ బాబు, పురం బద్రీనాథ్, జిల్లా బాధ్యులు నాగరాజు, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పద్మజ, ప్రమీల, భారతి, రజిత, మనహళ్ రావు, ప్రశాంత్, రాము, బలరాం నాయక్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
