హన్మకొండ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు – భారీ అవినీతి బట్టబయలు

హన్మకొండ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు – భారీ అవినీతి బట్టబయలు

హనుమకొండ, నేటిధాత్రి.

 

హనుమకొండ జిల్లా వరంగల్ (ఆర్.ఓ) సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు భారీ అవినీతి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఏప్రిల్ 2న నిర్వహించిన ఈ దాడుల్లో అనేక కీలక విషయాలు బయటపడ్డాయి.

తనిఖీల సమయంలో కార్యాలయంలో అనుమతి లేకుండా తిష్టవేసిన 20 మంది దళారులు/డాక్యుమెంట్ రైటర్లను గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుండి లెక్కల్లో చూపని రూ.47,450 నగదు, అలాగే 70 రిజిస్ట్రేషన్‌కు సంబంధించినవి కాని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

దళారుల మొబైల్ ఫోన్లను పరిశీలించగా, సబ్‌ రిజిస్ట్రార్ అధికారులు జమలాపురం రామనరసింహారావు (SRO-I), దావులూరి ఆనంద్ (SRO-II) లతో జరిగిన వాట్సాప్ చాట్‌లు వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా గత ఏడాది కాలంలో ఫోన్‌పే ద్వారా దాదాపు రూ.42,03,125 (42లక్షలు) లంచాల రూపంలో లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఇంకా, కార్యాలయంలో 204 డెలివరీ చేయని రిజిస్టర్డ్ పత్రాలు అధికారుల వద్దే ఉండటం గమనార్హం. ఇది విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి ఉదాహరణగా అధికారులు పేర్కొన్నారు.

ఇదే సమయంలో సబ్‌ రిజిస్ట్రార్ల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.24,61,540 నగదు, సుమారు 819.5 గ్రాముల బంగారం, 2.6 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, కపిల్ చిట్స్‌లో రూ.30,10,000 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా గుర్తించారు.

తనిఖీల సందర్భంగా మరికొన్ని అక్రమాలు బయటపడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నేటిధాత్రి, హన్మకొండ.

ప్రజలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగుల నుండి లంచం డిమాండ్‌కు గురైతే, ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ నీళ్లు కు ప్రజలు ఇబ్బందులు…

అధికారుల నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ నీళ్లు కు ప్రజలు ఇబ్బందులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ లో మిషన్ భగీరథ అధికారుల సమన్వయ లోపం కారణంగా మిషన్ భగీరథ నీళ్లు జహీరాబాద్ నియోజకవర్గం ప్రజల కు సకాలంలో అందకపోవడంతో ప్రజలు విచారణ వ్యక్తం చేస్తున్నారు. దయచేసి అధికారులు స్పందించాలని డి ఈ మరియు ఏ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడొస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలవక జహీరాబాద్ పట్టణం ప్రజలతోపాటు నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి డి ఈ, మరియు ఏ ఈ మరియు కిందిస్థాయి సిబ్బంది కోఆర్డినేషన్ చేసుకొని ప్రజలకు నీళ్లు అందించాలని నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు. అధికారులు ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎందుకంటే వారి ఫోన్లు సైతం ఎత్తకపోవడంతో ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పోతుంది.

కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి..

కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి.

#చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు.

#భూమి ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న డిబిఎం 38 కెనాల్ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకతీయ కెనాల్ ఇరువైపుల ఎడమవైపు 120 మీటర్లు, కుడి వైపు 100 లీటర్లు వదిలివేసి నిర్మాణాలు చేసుకోవాలని గతంలో సంబంధిత అధికారులు సూచించారు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మండల నాయకులు ఇష్ట రాజ్యాంగ కెనాల్ భూమిని ఆక్రమించుకొని అమాయకులకు అధిక రేటులకు అమ్ముకోవడం జరిగింది. నిర్మాణాలు చేపట్టే క్రమంలో అధికారులు నిబంధనలకు మించి ఇండ్ల నిర్మాణాలు చేపడితే తక్షణమే తొలగించబడతాయని హెచ్చరించిన కూడా కొందరు భూమి కొనుగోలు చేశారని . పూర్తిగా విషయం తెలుసుకున్న తర్వాత కొనుగోలు దారులు లబోదిబోమంటూ భూమి అమ్మిన నాయకులను ఆశ్రయించగా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు మేము చూసుకుంటామని భరోసా ఇవ్వడంతో నిర్మాణాలు ఇష్ట రాజ్యాంగ చేస్తున్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version