అయ్యా సార్లు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు మా గోడు వినరా…

అయ్యా సార్లు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు మా గోడు వినరా
మెట్ పల్లి ఏప్రిల్ 7 నేటి దాత్రి

మెట్పల్లి పట్టణంలోని వెల్లుల రోడ్డు హనుమాన్ నగర్ కాలనీ బచ్పన్ స్కూల్ దగ్గర వివరాలకు వెళ్తే మెట్పల్లిలోనే కళానగర్ ఎలా అభివృద్ధి చెందిందో హనుమాన్ నగర్ కాలనీ ఏడవ వార్డు దినదిన అభివృద్ధి చెంది రియల్ ఎస్టేట్ బిల్డర్ల వాళ్లకు అడ్డగా మారి ప్లాట్స్ కొంటూ అమ్ముతూ ఇండ్లు కొంటూ అమ్ముతూ డ్రైనేజీలు లేక డ్రైనేజీలు ఇష్టం వచ్చినట్టు వాళ్ల ఇస్తాను సారం చేసుకుంటూ పోతున్నారు సామాన్య జనాలకు ఇబ్బందిగా మారి అధికారులు చూచి చూడనట్టు వదిలేయడం వల్ల హనుమాన్ నగర్ బచ్పన్ స్కూల్ దగ్గర మున్సిపల్ అధికారులు డ్రైనేజీ తవ్వి పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ఇక్కడ నివసిస్తున్న కాలనీవాసులకు తీవ్ర ఇబ్బంది అయి అనారోగ్యం పాలవుతున్నారు ఎండాకాలం కాలనీవాసులకు చెరువులు తలపిస్తున్నాయి దోమలు మురుగునీరు వాసన భరించలేక

సతమతమవుతున్నారు ఎండాకాలమే ఇలా ఉంటే వర్షాకాలం ఏ విధంగా ఉంటదో అని కాలనీవాసులు భయాందోళనలో ఉన్నారు అధికారులకు ప్రజా ప్రతినిధులకు నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా తూతూ మంత్రంగా వచ్చి ఏదో చేసిన మా అంటే చేసినాము అనే విధంగా చేసి వెళ్తున్నారు ఆరోగ్యాలు దెబ్బతిని హాస్పిటల్ వెంట తిరుగుతున్నారు, ఇప్పటికైనా అధికారులు చర్య తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించుకుంటున్నాం.

ప్రజలకు ఇచ్చిన మాటతో ఓడిన ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తాను…

ప్రజలకు ఇచ్చిన మాటతో ఓడిన ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తాను

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వార్డు ఇంచార్జ్ పి. అరవింద్
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 19 వ వార్డులో పారిశుద్ధ్య లోపంతోని మురికి కాలువలు నిండుకుండ లాగా మారి అందులో విపరీతమైన దోమలు దుర్వాసనలు వెదజల్లుతూ ప్రజా ఆరోగ్యాలకు ఇబ్బంది కలుగుతుంటే అ అవార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అరవింద్ దృష్టికి ప్రజలు తీసుకెళ్లినారు ఇందుకు స్పందించిన అరవింద్ పురపాలక సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాడు పరిస్థితి వివరించడంతో వెంటనే స్పందించిన జహీరాబాద్ పరిపాలన సంఘం మున్సిపల్ కమిషనర్ జైతురాం నాయక్ సిబ్బందితో చెప్పి వార్డులో ఉన్న మురికి కాలువలు చెత్తకుప్పలు తొలగించి పిచ్చి త్వరలో మురికి కాలువలలో దోమల మందులను పిచికారి చేస్తామని అదేవిధంగా వీధి కుక్కలు పందులు లేకుండా చూస్తామని వాడి ఇంచార్జ్ అరవింద్ గారికి హామీ ఇచ్చారు ఇందుకు సంతోషించిన 19వ వార్డు ప్రజలు అరవింద్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసినారు ప్రజలతో మాట్లాడుతూ అరవింద్ నేనెప్పుడూ ఓడిన గెలిచిన ప్రజల మధ్యనే ఉంటాను మన వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తేవాలని నాతో అయినంత వరకు సమస్యలను పరిష్కరిస్తారని నాతో కానీ యెడల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కచ్చితంగా ప్రజా సమస్యలు తీరేలా చూస్తానని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రజా ప్రభుత్వమని తెలిపినారు,

అధికారుల ఆదేశాలు బే ఖతర్..!

అధికారుల ఆదేశాలు బే ఖతర్..!

#నోటీసులు జారీ చేసి సరిపెట్టుకున్న అధికారులు.

#ప్రజల ఆరోగ్యం పై ఇంత నిర్లక్ష్యమా..

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో నెలకొల్పిన రెడ్ మిక్స్ ప్లాంట్ కర్మాగారం ద్వారా వచ్చేదుమ్ము ధూళితో డిపిఎం 38 కెనాల్ భూమిపై ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ వాహనాలు నడపడంతో సిసి రోడ్డుతో పాటు కెనాలకు ప్రమాదం ఉందని అదేవిధంగా కస్తూరిబా గాంధీ విద్యార్థులతో పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టి రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్న యజమానులకు కెనాల్ పై ఉన్నదారిపై అనుమతి లేకుండా వాహనాలు నడపరాదని నోటీసులు జారీచేసిన కూడా నిర్వాహకులు అధికారుల ఆదేశాలను బే ఖతర్ చేయడంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అధికారుల ఆదేశాల సైతం పట్టించుకోకుండా ప్లాంట్ నిర్వాహకులు యధావిధిగా వాహనాలు నడపడం లో ఆంతర్యం ఏమిటని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

#ప్లాంటు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
ఐబి ఏఈ పవిత్ర.

రెడ్ మిక్స్ ప్లాంట్ నుండి భారీ వాహనాలు డిబిఎం 38 కెనాల్ పై ఉన్న రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండానే వాహనాలు నడపడం జరుగుతుందని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టి నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని. మరల కెనాల్ పైనుండి యధావిధిగా వాహనాలు కొనసాగించడం పట్ల జిల్లా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్లాంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ….

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ.

#విచారణకే పరిమితమైన మైనింగ్ అధికారుల పనితీరు.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ కు వినతి పత్రం అందించి తక్షణమే సిమెంట్ క్రషర్ ను తొలగించి విద్యార్థుల, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసం గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సంబంధిత అధికారుల ను భయభ్రాంతులకు గురిచేసి క్రషర్ నిర్వహణ చేశారని. అలాగే ప్లాంట్ కు ఇరువైపులా ఉన్న కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు, రామాలయం కు వచ్చే భక్తులకు క్రషర్ ద్వారా వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు తప్ప క్రషర్ ను తొలగించి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రెడ్ మిక్స్ ప్లాంట్ యజమానులపై చర్యలు తీసుకొని ప్లాంటును తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా లింగయ్య, బిక్షపతి, కిషోర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version