అంబేద్కర్ ఆశయ సాధన కొరకై యువత ముందుకు నడవాలి.

అంబేద్కర్ ఆశయ సాధన కొరకై యువత ముందుకు నడవాలి.

#భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన బానోతు సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత భారత రాజ్యాంగానికే దక్కుతుందని కొనియాడారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.రాజ్యాంగబద్ధమైన విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి,సర్పంచ్ నాగేల్లి జ్యోతి ప్రకాష్, మాజీ ఎంపీటీసీలు వైనాల వీరస్వామి, జన్ను జయరావు , వార్డు మెంబర్లు కనకం నవీన్, నాగేల్లి అనిల్, పరికి కోర్నేలు, బూస సదయ్య, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.

ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి మున్సిపాలిటీలోని ఆయా వార్డులలో పర్యటిస్తూ నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఉదయం 7:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు.
తదుపరి తాపీ సంఘం ఆధ్వర్యంలో అభ్యాస పాఠశాలలో సుభాష్ నగర్‌లో కాల్‌టెక్స్ ఏరియాలో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం ఏ ఎం సీ చౌరస్తా వద్ద స్వర్గీయ కాక వెంకటస్వామి (మాజీ కేంద్ర మంత్రి వర్యులు) విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే కాంటా చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ విలువలు, స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు బాధ్యతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్…

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

రాజ్యాంగ విలువలతో సమగ్ర అభివృద్ధే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో నిర్వహించిన
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ముందుగా పోలీసులు, సాయుధ దళాలు, ఎన్ సీసీ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26న భారతదేశం స్వతంత్ర, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన సందర్భంగా ఈ రోజును పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
మన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ సభ సభ్యుల కృషి అభినందనీయమని, ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కల్పించే గొప్ప రాజ్యాంగం మనదని కలెక్టర్ అన్నారు. స్వాతంత్ర్య సాధనలో ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ, జిల్లా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల జీవితాల్లో కీలక మార్పుకు దారితీసిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కోటి 85 లక్షల 97 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయగా, రూ.97 కోట్ల 43 లక్షలు మహిళలకు ఆదా అయిందన్నారు.

వైద్య ఆరోగ్య సేవలు

పేదలకు భరోసా

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య బీమా పరిమితిని ప్రభుత్వం 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. జిల్లాలో 39,605 మంది ఈ పథకం ద్వారా వైద్య సేవలు పొందగా, రూ.88 కోట్ల 13 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
ఔషధి ద్వారా 1,03,402 మందికి వైద్య సేవలు, 5,690 మంది మహిళలకు ఆరోగ్య మహిళా క్యాంపులు, 65 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మహాదేవపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

రైతు బరోసా పథకం ద్వారా ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.6 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 1,24,496 మంది రైతులకు రూ.96 కోట్లు చెల్లించామని చెప్పారు.రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బీమా పథకంలో 72,058 మంది నమోదు చేసినట్లు తెలిపారు.

జిల్లాలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామని తెలిపారు. 46,840 ఉచిత వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు, గృహాజ్యోతి పథకం ద్వారా 56,525 కుటుంబాలకు రూ.37 కోట్ల 42 లక్షలు ప్రభుత్వమే సబ్సిడీ చెల్లించినట్లు పేర్కొన్నారు.

నిరుపేదలకు గౌరవ నివాసం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాలో 3,943 ఇండ్లు మంజూరు, 3,180 ఇండ్లకు మార్క్ అవుట్ ఇచ్చామని, ఇప్పటి వరకు రూ.51 కోట్ల 40 లక్షలు విడుదల చేశామని తెలిపారు.

పేదలకు వరం
మహాలక్ష్మి గ్యాస్ పథకం, ఈ పథకం ద్వారా 68,311 మందికి రూ.500కే గ్యాస్ ఇస్తున్నామని ఇప్పటి వరకు 2,36,243 సిలిండర్లు సరఫరా చేసి రూ.6 కోట్ల 55 లక్షల సబ్సిడీ చెల్లించినట్లు తెలిపారు.

277 రేషన్ దుకాణాల ద్వారా 1,37,950 కార్డుదారులకు బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. వానాకాలం పంట ద్వారా 1,15,853 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.274 కోట్లు చెల్లించామని, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క–సారక్క మహిళా జిల్లా సమాఖ్యలో 87,134 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బ్యాంకు లింకేజి ద్వారా ఇప్పటి వరకు రూ.240 కోట్లకు పైగా రుణాలు, 1,17,220 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసినట్లు చెప్పారు.

భూపాలపల్లి మున్సిపాల్టీలో రూ.113 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, పట్టణ మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి, వ్యక్తిగత రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.
మారుమూల గ్రామాలు, నిరుపేదల సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, పార్లమెంట్, శాసన మండలి, శాసన సభ్యులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, మీడియా మిత్రులకు జిల్లా కలెక్టర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తదుపరి ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంషా పత్రాలు అందచేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,
అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఆర్డిఓ బాలకృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డా బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైదానం పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహూతులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా సింగరేణి, విద్యా, డిఆర్‌డీఓ, గృహ నిర్మాణ, సంక్షేమ, వ్యవసాయ, ఉద్యాన, వైద్య శాఖల అధికారులు స్టాళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేయాలని డిపిఆర్‌ఓను కలెక్టర్ ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఈ సందర్భంగా సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పి నరేష్ కుమార్, ఆర్డిఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version