ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ….

ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.

#ఆరోగ్య కేంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

#సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.

#డిఎం హెచ్ ఓ సాంబశివ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివ బుధవారం ఆకస్మిక తనకి చేశారు. అనంతరం రికార్డులను, మందులను, దావకాన పరిసరాలను పరిశీలించి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సిబ్బందిని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల ద్వారా విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని కావున వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి ప్రజలకు సరైన వైద్యం అందించాలని తెలిపారు. ప్రతి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మందులను అందివ్వాలి. ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రంలో నే అందుబాటులో ఉండాలని లేనియెడల చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆచార్య, నిఖిల, హెచ్ ఏ కృష్ణ, ఫార్మసిస్ట్ రంగారావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తో పాటు తీవ్రమైన గాలులు విస్తాయని వాతావరణ శాఖ జారీచేసిన నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ ముప్పు కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మొ o థ తుఫాన్ కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళవద్దని. అలాగే కరెంటు స్తంభాలను, విద్యుత్ వైర్లను, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలని. మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను చూసుకొని నడవాలని ఉధృతంగా ప్రవహించే చెరువులు వాగుల వద్దకు వెళ్లకూడదని అదేవిధంగా పాత గోడలు, ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉన్న వాటిలో వెంటనే ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే క్రమంలో విష సర్పాలతో జాగ్రత్తగా ఉండాలని . ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను బయటకి పంపరాదు అని ఆయన మండల ప్రజలకు సూచించారు.

ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన పిఆర్టియు ఎస్ సభ్యులు….

ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన పిఆర్టియు ఎస్ సభ్యులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

నల్లబెల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె శుభ నివాస్ ను మండల పిఆర్టియు టీఎస్ అధ్యక్షుడు ఉడుత రాజేందర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపీడీవోను శాలువాతో సన్మానం చేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బానోతు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పురం బద్రీనాథ్, రవీందర్, జిల్లా కార్యదర్శి శనిగరం శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు కందకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన శుభనివాస్…

ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన శుభనివాస్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

నల్లబెల్లి ఎంపీడీవో గా తొర్రూరు పట్టణానికి చెందిన జె శుభ నివాస్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎంపీడీవో గా విధులు నిర్వహించిన నరసింహమూర్తి పదవి విరమణ పొందడంతో మండల పంచాయతీ అధికారి రవికి ఎంపీడీవోగా సంబంధిత శాఖ జిల్లా ఉన్నత అధికారులు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ లలో ఎంపికైన అభ్యర్థులకు నూతన బాధ్యతలు అప్పగించగా. ఈ మేరకు జే శుభ నివాస్ ఎంపీడీవో గా నల్లబెల్లి మండలంలో మొదటి పోస్టింగ్ లో బాధ్యతలు చేపట్టి విధుల్లో చేరారు. బాధ్యతలు స్వీకరించిన శుభ నివాస్ కు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా నాగుల చవితి….

ఘనంగా నాగుల చవితి.

#ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితుడు శ్రీనివాస్ శర్మ.

#భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన మహిళలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని అభయ నాగేంద్ర స్వామి ఆలయంలో పూజారి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయానికి చేరుకొని పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామికి పూజలు గ్రామ ప్రజలతోపాటు మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరజిల్లుతూ. ఇలాంటి దోషాలు లేకుండా కాపాడాలని పలువురు మహిళలు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సీనియర్ నాయకుడు గందె శ్రీనివాస్ గుప్తా , కోటగిరి నారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

బీసీ సంఘాల బంధుకు మద్దతు….

బీసీ సంఘాల బంధుకు మద్దతు

బంధులో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ

మంగపేట నేటిధాత్రి

 

మంగపేట మండలం రాజుపేట నుండి కమలాపురం వరకు నిర్వహించిన బైక్ లతో ర్యాలీలలో పాల్గొనీ మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, బంద్ కు మద్దతు తెలిపారు.ఈ ర్యాలీ లో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, పార్టీ సీనియర్ నాయకులు, చిలకమర్రి రాజేందర్, మాలికంఠ శంకర్ , గాదె శ్రీనివాస చారి, గ్రామ కమిటీ అధ్యక్షులు, యాగ్గడి అర్జున్, మునిగేల సాంబులు, పార్టీ నాయకులు లోడి కృష్ణ, పూసల నర్సింహా రావు , నక్క యాకయ్య, యూత్ నాయకులు ముప్పారాపు సందీప్, కేక్కం జగదీష్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు

బీసీ బంద్ లో పాల్గొన్న ఎంసిపిఐ (యు)

బీసీ బంద్ లో పాల్గొన్న ఎంసిపిఐ (యు)

నర్సంపేట,నేటిధాత్రి:

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సామాజిక రాజకీయ పార్టీలు చేపట్టిన తెలంగాణ బంద్ కు ఎంసిపిఐ (యు) సంపూర్ణ మద్దతు తెలిపింది.నర్సంపేట లో నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 లో బీసీ రిజర్వేషన్ అంశాన్నిచేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సమాజమంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్య పోరాటాలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు అనుమాల రమేష్ ,బంగారు ముత్తయ్య,అచల,మేడిద ప్రమీల,ఈర్ల అనుష ,మాదాసి రాజు,జి అంజి, సుశీల,శ్రీను,రాములు, ఐలమ్మ, జన్ను నీల,ప్రమీల పాల్గొన్నారు.

దుగ్గొండి మండలంలో…

బీసీ రిజర్వేషన్ కోసం చేపట్టిన రాష్ట్రవ్యాప్త బిసి బంద్ కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో చేపట్టిన నిరసనలో ఎం సిపిఐ పార్టీ నాయకులు పాల్గొని ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ కార్యదర్శి మొహమ్మద్ రాజా సాహెబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు,డివిజన్,మండల సభ్యులు కుమారస్వామి, కొమురయ్య, సురేందర్,చందర్ రావు,భాస్కర్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి…

బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి
-నల్లబెల్లి గ్రామ బిసి సంఘం నాయకులు
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబేల్లి గ్రామంలో బీసీ సంఘాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో బీసీలకు 42% బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం తెలపాలని తెలంగాణ బంద్ నిరసన కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మరియు వివిధ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ , కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ జాఫర్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు డోలి సతీష్, బిఆర్ఎస్ నల్లబెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటికాయల సురేష్, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు శ్రీపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం కొరకై ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతే అనే నినాదంతో దేశంలోనే కుల గణనకు నాంది పలికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనను విజయవంతంగా పూర్తి చేసి దాని ఆధారంగా 52 శాతం ఉన్న బీసీ జనాభాకు ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో రాజకీయంగా విద్య ఉద్యోగ పరంగా రిజర్వేషన్ కల్పించాలని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ తో ఆర్డినెన్స్ , రాష్ట్ర అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం బిల్లును బీసీ బిల్లు ఆమోదించి గవర్నర్కు రాష్ట్రపతికి పంపినప్పటికీ కూడా మూడు నెలలు గడుస్తున్నా ఇంకా దాన్ని కాలయాపన చేయడం ద్వారా బీసీలు నష్టపోతున్నారని తెలుసుకొని ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లడం జరిగింది దాన్ని కొంతమంది కావాల్సి కొని అడ్డుకోవడం జరిగింది. కావున కేంద్ర ప్రభుత్వం బీసీలపై ప్రేమానురాగాలు ఉంటే వారి అభివృద్ధి కోరుకున్నట్లయితే వెంటనే రాష్ట్రపతి గవర్నర్ బిల్లులను ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును చేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తంగెళ్ల భాస్కర్ ,గజ్జల దేవేందర్ పసునూరి కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దిలీప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే నారాయణ, దోమకొండ ప్రభాకర్, చెంగల స్వామి, సురేందర్, భాస్కర్, దోమకొండ ఈశ్వర్, ఆరేల్లి వీరస్వామి, ఫైండ్ల కుమారస్వామి, రాజు, సురేష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు

మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ వర్ధంతి

ఘనంగా మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ వర్ధంతి వేడుకలు.

#నివాళులు అర్పించిన ఎం సిపిఐయు మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అసెంబ్లీ టైగర్ మాజీ శాసనసభ్యులు మద్ది కాయల ఓంకార్ 17వ పురస్కరించుకొని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏం సిపిఐయు మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు సాంబయ్య మాట్లాడుతూ దొరలకు వ్యతిరేకంగా భూస్వాములపై పోరాటం చేసి పెత్తందార్ల గుండెల్లో మనకు పుట్టించి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి ఓంకార్ అలాంటి వ్యక్తి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని యువకులు ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్త నాగరాజు, సుభాష్, సుదర్శన్, వెంకటయ్య, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పదివేల అప్పుకు.. ఓ నిండు ప్రాణం బలి..

పదివేల అప్పుకు.. ఓ నిండు ప్రాణం బలి..

#మరొకరి పరిస్థితి విషమం.

#సొంత అన్న వదినపై దాడికి పాల్పడిన మరిది.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

పదివేల అప్పు కోసం అన్న వదినలపై మరిది దాడికి పాల్పడి వదిన ప్రాణాలు కోల్పోగా అన్న ప్రాణాలతో కొట్టు మి ట్టాడుతున్న సంఘటన గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మేరగుర్తి మల్లయ్య-సమ్మక్క దంపతులకు రమేష్, సురేష్ ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కొడుకు రమేష్ కు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు తర్వాత 8 సంవత్సరాల క్రితం రమేష్ భార్య చనిపోగా. మరల గీసుకొండ మండలం మచ్చ పురం గ్రామానికి చెందిన స్వరూప (35) తో గ్రామంలోనే సహజీవనం చేస్తున్నాడు. స్వరూప భర్త చనిపోయాడని ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి గత పది ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం కొండాపురం గ్రామానికి వలస వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో రమేష్ తల్లిదండ్రులు, తమ్ముడు సురేష్ ఆ గ్రామంలోని ఉంటూ బ్రెడ్డు అమ్ముకుంటూ బతుకుతున్నారు. నాలుగు నెలల కిందట అన్న రమేష్ కు సురేష్ 10 వేలు అప్పుగా ఇచ్చాడు.

అప్పు తీర్చమని అడిగితే ఇవ్వడం లేదంటూ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ సైతం ఇటీవల నిర్వహించినట్లు తెలుస్తుంది. తన బంధువులు చనిపోవడంతో రమేష్ అతని భార్య చావుకు వెళ్లి బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. స్నానం చేసే క్రమంలో వేడి నీళ్లు ఎందుకు పెట్టలేదని తల్లితో రమేష్ గొడవ పెట్టుకోగా ఈ క్రమంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేష్ తన అన్నను తన డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది ఈ నేపథ్యంలో కత్తితో అన్నపై దాడి చేయగా గాయాలు కాగా పక్కనే ఉన్న స్వరూప ఆపడానికి ప్రయత్నించగా సురేష్ ఆమె పైన కూడా దాడి చేసి పొత్తికడుపు చాతి భాగంలో కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. హుటాహుటిన స్థానికుల సహాయంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి గాయాల పాలన ఇద్దరిని తరలించారు. చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన రమేష్ ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రమేష్ పరిస్థితి కూడా విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు స్వరూప కొడుకు శివ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి గోవర్ధన్ తెలిపారు.

సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

#పట్టించుకోని వైద్యాధికారులు.

#రోగులకు సరైన మందులు లేని ఆసుపత్రులు.

#వచ్చామా పోయామా అనే రీతిలో వ్యవహరిస్తున్న వైద్య అధికారులు.

#సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందిన సిబ్బంది ఎక్కడ..?

నల్లబెల్లి, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

గత నెల రోజులుగా భారీ వర్షాలు పడడంతో గ్రామాలలో ప్రజలు సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న సంఘటన నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. అసలే వర్షాకాలం దోమకాటుతోని విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతు ప్రభుత్వ దావఖానకు వెళితే సరైన వైద్యం అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రి ని ఆశ్రయించే పరిస్థితి నెలకొందని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు.

#వైద్యాధికారాలు ఎక్కడ..?

పేద ప్రజలు అంటే ఇంత చిన్న చూప. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేస్తూ. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ. సమయానికి దావకానకు రాకుండా ప్రైవేటు ఆసుపత్రికి సమయానికి కేటాయిస్తూ పేద ప్రజలకు అందవలసిన వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు రోగులు వాపోయారు.

#స్పందించని వైద్యాధికారులు.

సీజనల్ వ్యాధులపై నేటి ధాత్రి మండలంలోని వైద్యాధికారులకు చరవాణి ద్వారా సంప్రదించగా ఎలాంటి స్పందన లేదు.

#రోగుల బాధలు పట్టించుకోరా.?

వర్షాకాల సమయంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెంది రోగులు మంచాన పడ్డ కూడా కనీసం ఏఎన్ఎం లో తోపాటు ఆశ వర్కర్లు ఇంటిట తిరిగి సర్వే చేయకపోవడం చాలా బాధాకరం ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని.. సామాజిక వేత్త ప్రణీత్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ హామీల అసలు స్వరూపం బహిర్గతం చేస్తాం….

కాంగ్రెస్ హామీల అసలు స్వరూపం బహిర్గతం చేస్తాం.

#బాకీ కార్డులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.

#కాంగ్రెస్ మోసాలను వెలుగులోకి తేవడమే బిఆర్ఎస్ లక్ష్యం.

#మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు,420 హామీలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచి700 రోజులు గడిచిన ఏ ఒక్క హామీ సంపూర్ణంగా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని. రైతులు, కూలీలు,మహిళలు, యువకులు, నిరుద్యోగులను ఇలా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. బాకీ కార్డుల ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసగించడంపై ప్రజల సమక్షంలోనే బహిర్గతం చేస్తామని. ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ మోసం వెలుగులోకి తీసుకువచ్చి మండల, గ్రామస్థాయి నాయకులు బాకీ కార్డులను గ్రామాలలో విస్తృతంగా పంపిణీ చేయడంతో పాటు ప్రచారం చేయాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బాకీ కార్డులను బ్రహ్మస్త్రంగా వినియోగించుకొని ఎన్నికలకు సన్నద్ధం కావాలని అలాగే గ్రామాలలో రాజకీయ చైతన్యం పెంచి ప్రజలకు నిజాలను తెలియజేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, నాయకులు పోగుల చిరంజీవి, ఇంగ్లీ శివాజీ, నాన బోయిన రాజారాం యాదవ్, మామిండ్ల మోహన్ రెడ్డి, తిరుపతి, చేరాలుగౌడ్, గుండాల కుమారస్వామి, ఊరటి అమరేందర్ రెడ్డి, నూటెంకి సూరయ్య, పోడేటి ప్రకాశం, ఖ్యాతం శ్రీనివాస్, నాగెల్లి ప్రకాష్, శ్రీనివాస్, గుమ్మడి వేణు, వై నాలా మధు, పరికినవీన్, మేడిపల్లి రాజు గౌడ్, మురాల ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన పెద్ది సుదర్శన్ రెడ్డి.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి నన్నేసాహెబ్ తల్లి అనారోగ్యంతో మృతిచెందగా. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతురాలి స్వగృహానికి చేరుకొని ఆమె పార్థివ దేహం పై పూలమావిసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగడ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్ నాయకులు నాన బోయిన రాజారాం, సట్ల శ్రీనివాస్ గౌడ్, ఖ్యాతం శ్రీనివాస్ గుమ్మడి వేణు పాండవుల రాంబాబు ముదిరాజ్ తదితరులు ఉన్నారు.,

తహసిల్దార్ కార్యాలయంలో పరిశుభ్రత లోపం.

తహసిల్దార్ కార్యాలయంలో పరిశుభ్రత లోపం.

#పట్టించుకోని కార్యాలయ సిబ్బంది

#ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసిన దళిత నాయకులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

తహసిల్దార్ కార్యాలయానికి అనునిత్యం అనేక పనుల కోసం మండల ప్రజలు వస్తూ ఉంటారు. ఈ తరుణంలో తహసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో పరిశుభ్రత లోపించడంతో గమనించిన దళిత సంఘాల నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాలు శుభ్రత పాటించాలని ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టగా. దానిని తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది విస్మరించి మండల ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో అర్థమవుతుంది. ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై చెప్పవలసిన అధికారులే కార్యాలయం వద్ద శుభ్రత పాటించకపోతే గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏదిఏమైనాప్పటికీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే కలెక్టర్ స్పందించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ – బిఆర్ఎస్ దొందు దొందే…

కాంగ్రెస్ – బిఆర్ఎస్ దొందు దొందే

బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ

శాయంపేట నేటిధాత్రి;

శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టిరామకృష్ణ మాట్లా డుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఇద్దరూ ఇసుక, భూ భకసురులేనని నియోజక వర్గంలో గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఇప్పుడు అధి కారంలో ఉన్న కాంగ్రెస్ అక్రమం గా ఇసుక రవాణా చేస్తూ ప్రజా ధనాన్ని దోచుకున్నారు. మండ లంలో కాంగ్రెస్ బిఆర్ ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు భూమి కబ్జాఆరోపణ చేసుకుం టున్నా రని ఈ రెండు పార్టీల చరిత్ర అవినీతి దోపిడేనని ప్రజా సమస్యలు గాలికి వదిలేసారని అక్రమం దోపిడీ వాళ్ల లక్ష్య మని,మండలంలో చాలా ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని విస్మరించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుం టూ పబ్బంగడుపుతున్నారని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మండలంలో ఉన్న యూరియా సమస్య, ఆరు గ్యారెంటీలో భాగంగా మహాల క్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వక పోవడం విడ్డూ రం.వీళ్ళ ప్రవర్తన ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకులమొగిలి జిల్లా ఉపాధ్యక్షురాలు కోడెపాక స్వరూప, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి జిల్లా నాయకులు ఉప్పురాజు, కొత్తపెళ్లి శ్రీకాంత్, మంద సురే ష్, మండల ఉపాధ్యక్షులు కోమటి రాజశేఖర్, మండల కార్యదర్శి మేకల సుమన్ మండల కోశాధికారి కుక్కల మహేష్ పాల్గొన్నారు.

రైతులకు తప్పని… యూరియా తిప్పలు..

రైతులకు తప్పని… యూరియా తిప్పలు..

#రాత్రి వేళలో యూరియా కోసం రైతులపడి గాపులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

గత నెల రోజులుగా మండలంలో యూరియా కోసం రైతుల అగచాట్లు సమసిపోవడం లేదు. ఈసారి మండలంలో అత్యధికంగా మొక్కజొన్న, వరి పంటల సాగు గత ఏడాది కంటే సాగు విస్తీర్ణం పెరగడంతో పంటలకు అధిక మొత్తంలో యూరియా వాడకం ఉండడంతో రైతులు యూరియా బస్తాల కోసం నాన ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నదని మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరగడంతో రైతులు వ్యవసాయ పనులన్నీ పక్కనపెట్టి. వేకువ జాము నుండే యూరియా బస్తా కోసం ప్రభుత్వ ఆగ్రోసుల వద్ద, ప్రైవేటు డీలర్ల వద్ద క్యూ లైన్ లో నిలబడి పడి గాపులు కాస్తున్నారు. రాత్రి వేళలో సైతం కేంద్రాల వద్ద రైతులు పడుకున్న సంఘటనలు సైతం ఉండడం గమనార్వం.

#యూరియా కొరత లేదు.

రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ మంత్రిత్వశాఖ సంబంధిత అధికారులు సైతం రాష్ట్రంలో ఎలాంటి యూరియా కొరత లేదని రైతులకు సరిపడా యూరియాను అందించడం జరుగుతుందని చెప్పినప్పటికీ అది మాటలకే పరిమితం అవడం తప్ప ఆచరణలో ఎక్కడ కనిపించడం లేదని ప్రతిపక్ష పార్టీలు, రైతులు గగ్గోలు పెడుతున్న యూరియా కొరత నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని రైతులు వాపోతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులతో ఎలాంటి సమీక్షలు జరపకుండా గాలికి వదిలేయడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పలువురు ప్రజా సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు రైతులు పడుతున్న కష్టాలను గమనించి పంటలకు సరిపడా యూరియాను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు…

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్న రావు ఆదేశాల మేరకు నాటు సారా నియంత్రణకై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గురువారం నల్లబెల్లి మండలం నందిగామ, రేలకుంట జంట గ్రామాలలో నాటుసార స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగిందని.ఈ దాడులలో ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని 1900 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందని వరంగల్ రూరల్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ మురళీధర్ పేర్కొన్నారు. ఈ దాడులలో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి, వరంగల్ రూరల్ టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ చందర్, ఎన్ఫోర్స్మెంట్ సిఐ నాగయ్య, ఎస్సైలు రమ, శిరీష, స్థానిక ఎస్ఐ గోవర్ధన్ సిబ్బంది పాల్గొన్నారు

కాంగ్రెస్ నాయకుల కు అడ్డగా తహసిల్దార్ కార్యాలయం…

కాంగ్రెస్ నాయకుల కు అడ్డగా తహసిల్దార్ కార్యాలయం.

#కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే శిక్షించాలి.

#ఆత్మ హత్య యత్నానికి ప్రేరేపించిన ఎమ్మార్వో ను తక్షణమే సస్పెండ్ చేయాలి.

#కల్పన కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి.

#మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

నల్లబెల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వాంకుడోత్ కల్పన సోమవారం ఆత్మహత్య యత్నానికి పాల్గొన్న సంఘటన పై బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పాల్గొని కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక గిరిజన మహిళ ఉద్యోగి పట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలను తమ పార్టీ కార్యాలయాలుగా మార్చుకొని అక్రమ పనుల కోసం అధికారులను వేధిస్తూ తమ ఉనికిని చాటుకునేందుకు నీచమైన రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయడం సిగ్గుచేటు. గిరిజన మహిళ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించకపోవడం దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వాంకుడోత్ కల్పన తనకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రమాదం ఉందని వారు నన్ను లైంగికంగా వేధిస్తున్నారని ఎమ్మార్వో కు పలుమార్లు చెప్పినా కూడా ఎమ్మార్వో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాజీ పడాలని చెప్పడం ఆమెను మానసికంగా ఎంతగానో కృంగాదీసింది. తోటి ఉద్యోగరాలకు ప్రమాదం ఉందని తెలిసి ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి కారకుడైన ఎమ్మార్వో ముప్పు కృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయలలో కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ ఉన్నత అధికారులు ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడుతున్న అధికారులకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మండలంలో మైనింగ్, మట్టి మాఫియా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారుల పైన జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకుల అరాచకాలను ప్రశ్నించిన వారి పైన అక్రమంగా కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటు. ఇప్పటివరకు ఆత్మహత్యాయత్నం చేసుకున్న కల్పనను పై ఉన్నతాధికారులు ఎవరు పరామర్శించకపోవడం బాధాకరమని. నిరసన కార్యక్రమాన్ని విరమించాలని నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై గోవర్ధన్ చెప్పినప్పటికీ కూడా శాంతించని బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆర్డీవో వచ్చి బాధితురాలకు భరోసా ఇచ్చేంతవరకు నిరసన కార్యక్రమాన్ని విరమింప చేసే ప్రసక్తే లేదని భీష్మించి కూర్చున్నారు. పరిస్థితి చేయి దాటి పోతుందని గమనించిన ఎస్సై గోవర్ధన్ ఆర్డీవోతో చరవాణి ద్వారా పెద్ది స్వప్నతో మాట్లాడుతూ కల్పన ఆత్మహత్యయత్నని కి కారకులైన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వగా నిరసన కార్యక్రమాన్ని విరమింప చేశారు. ఈ మేరకు కేసును సుమోటోగా తీసుకొని వెంటనే నిందితులను అరెస్టు చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, నాయకులు పాలెపు రాజేశ్వరరావు, గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, నాన బోయిన రాజారామ్ యాదవ్, అమరేందర్, గోనె యువరాజు, మామిండ్ల మోహన్ రెడ్డి, లావుడియా తిరుపతి, జాటోతు తిరుపతి, మాజీ ఎంపిటిసి లక్ష్మి, ఖ్యాతం శ్రీనివాస్, పాండవుల రాంబాబు, మేడిపల్లి రాజు, మాటూరి హరీష్, తదితరులు పాల్గొన్నారు.

ఎన్ హెచ్ ఆర్ సి నల్లబెల్లి మండల కమిటీ ప్రకటితం….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T151315.045.wav?_=1

ఎన్ హెచ్ ఆర్ సి. నల్లబెల్లి మండల అధ్యక్షులుగా యార మధుకర్ రెడ్డి

ప్రధాన కార్యదర్శిగా నాగపురి రమేష్, ఉపాధ్యక్షులుగా ఇంతల అనంతరెడ్డి, అధికార ప్రతినిధిగా రమేష్

నియామక పత్రాలు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

వరంగల్ జిల్లా అధ్యక్షులు మేరుగు రాంబాబు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఆవునూరి కిషోర్

“నేటిధాత్రి”,నల్లబెల్లి (వరంగల్ జిల్లా):

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నల్లబెల్లి మండల కమిటీని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షులు మెరుగు రాంబాబు ప్రకటించారని జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అవునూరి కిషోర్ తెలిపారు. మండల అధ్యక్షులుగా యార మధుకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నాగపురి రమేష్, మండల ఉపాధ్యక్షులుగా ఇంతల అనంతరెడ్డి, అధికార ప్రతినిధిగా ఆవునూరి రమేష్ లను నియమించినట్లు తెలిపారు. పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పడిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర జిల్లా కమిటీల ఆదేశాల మేరకు పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నల్లబెల్లి మండల అధ్యక్షులుగా ఎన్నికైన యార మధుకర్ రెడ్డి మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, నెహ్రూ నాయక్, వరంగల్ జిల్లా అధ్యక్షులు మేరుగు రాంబాబుకు, గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కిషోర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకిచ్చిన ఈ పదవిని నీతి నిజాయితీతో నిర్వహిస్తామని మండలంలో సంస్థ బలోపేతం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. మండల అధ్యక్షులుగా యార మధుకర్ రెడ్డి నియామకంతో నల్లబెల్లి మండల ప్రజలు, విద్యావంతులు, మేధావులు అభినందించి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం వితరణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T144213.303-1.wav?_=2

 

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం వితరణ.

#గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ఇటీవల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండి సర్వర్ అనారోగ్యంతో మృతి చెందగా. మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో బుధవారం మృతిని స్వగృహానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 వేల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట నాయకులు కొండి అశోక్, పరికి పవన్, మురికి రవి, భాష బోయిన సమ్మయ్య, కొత్త పెళ్లి రమణ చారి, గాజు బిక్షపతి, కనుకo సాల్మన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version