మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి
మాజీ సర్పంచుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ అక్కనపల్లి కరుణాకర్ డిమాండ్
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ సర్పంచులు 2019 -24 సంవత్సరానికి పని చేసినటువంటి మాజీ సర్పంచులు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మాజీ సర్పంచుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ అక్కనపల్లి కరుణాకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వo కాలనీలో, గ్రామాల్లో సర్పంచులు చేసినటువంటి అభివృద్ధి
పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. గత ప్రభుత్వ కాలం పోయి నూతన ప్రభుత్వం వచ్చినాక కూడా బిల్లులు చెల్లించకపోవడం వల్ల చాలామంది సర్పంచులు తమ ఇల్లు, పొలాలు తాకట్టు పెట్టి గత ప్రభుత్వంలో సర్పంచుల సొంత నిధులతో ఖర్చు పెట్టించి నా గత బిఆర్ఎస్ ప్రభుత్వం. నేడు నూతన ప్రభుత్వంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా పోవడం వల్ల మాజీ సర్పంచులకు కుటుంబ పరంగా మరియు ఆర్థిక పరంగా నష్టపోయారని సర్పంచుల జిల్లా ఫోరం పేర్కొన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో సర్పంచులు కట్టించినటువంటి కార్యాలయాలల్లో
నేడు నూతనంగా వచ్చిన ప్రభుత్వ, అధికారులు గానీ నాయకులు గానీ ఉండలేరా అని ప్రశ్నించడం జరిగినది. కాబట్టి వెంటనే మాజీ సర్పంచుల బిల్లులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయాలని ప్రెస్ మీట్ ద్వారా కోరడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్. అక్కనపల్లి కరుణాకర్ జిల్లా అధ్యక్షులు దుమ్మ అంజయ్య. గుణాల లక్ష్మణ్. సిరికొండ శ్రీనివాస్. ఆరే మహేందర్. రవి నాయక్. శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు.