విదేశీ విద్యా నిధి పథకం కొరకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ..

విదేశీ విద్యా నిధి పథకం కొరకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ

జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

విదేశీ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు 2025- 26 సంవత్సరానికి గాను విదేశీ విద్యాలయంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించబడుతున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.యు.ఎస్.ఎ, యు.కె,ఆస్ట్రేలియా,కెనడా, సింగపూర్,జర్మనీ,జపాన్, సౌత్ కొరియా,న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్,ప్రొఫెషనల్ కోర్సులలో చదవాలనుకునే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు నవంబర్ 19వ తేదీ లోగా ఆన్ లైన్ లో www.telangana.epass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన విద్యార్థులకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.అభ్యర్థులు జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులములవారై ఉండాలని, వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉండాలని, పిజి.చదవడానికి గ్రాడ్యుయేషన్ లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలని, టి.ఓ.ఈ.ఎఫ్.ఎల్, ఐ.ఈ.ఎల్.టి.ఎస్, జి.ఆర్.ఈ, జి.ఎం.ఎ.టి ఎక్కువ శాతం అర్హత,పాస్ పోర్ట్,వీసా కలిగి ఉండాలని,విదేశీ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొంది ఉండాలని,ఒక కుటుంబం నుండి ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు.ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

భారతీయుల్లో పెరుగుతున్న విదేశీ పర్యటన మోజు

కరోనా పరిస్థితులు దాడిన తర్వాత భారతీయుల ఆలోచనా సరళిలో చాలా మార్పులు వచ్చాయి. ఇందుకు సంకేతమే ప్రపంచాన్ని చుట్టేసి రావాలనుకునేవారి సంఖ్య గణనీయంగా పెరగడం. విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టడానికైనా మనవాళ్లు వెనకాడటం లేదట! అంతర్జాతీయ టూరిస్ట్‌ సంస్థల లెక్కల ప్రకారం విదేశీ పర్యటనకు సగటు భారతీయుడు చేసే ఖర్చు రూ.2లక్షలు! 2023లో 2.82 లక్షల మంది విదేశాలను చుట్టి వచ్చారు. ఇందుకోసం వీరు చేసిన ఖర్చు రూ.2.82లక్షలు! 2034 నాటికి ఈ ఖర్చు రూ.4.78 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా! అంతేకాదు విదేశీ పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య 8కోట్లకు చేరగలదని భావిస్తున్నారు. మనవాళ్లు మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల పట్ల అధిక మోజు కనబరుస్తున్నట్టు ట్రావెల్‌ సంస్థలు తెలుపు తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులను మరింతగా ఆకర్షించేందుకు వివిధ దేశాలు పలు కొత్త రాయితీలు ప్రకటిస్తున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version