ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ధికి సిటీ నెట్ సహకారం

ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ధికి సిటీ నెట్ సహకారం

 

 

ఫ్యూచర్ సిటీస్‌లో AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) థీమ్‌తో ఎక్స్ పో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల నుంచి 300 ప్రముఖ కంపెనీలు, 60000 వేల మంది హాజరయ్యారు. భవిష్యత్ స్మార్ట్ సిటీల నిర్మాణం, సుస్థిర ప్రజా జీవనంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలని దానిపై ఎక్స్ పో నిర్వహించారు.

 రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ (Minister Narayana) పర్యటన కొనసాగుతోంది. స్మార్ట్ సిటీల నిర్మాణం అధ్యయనం, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాలో మంత్రి పర్యటిస్తున్నారు. నాలుగవ రోజు పర్యటనలో భాగంగా సియోల్ సమీపంలో జరుగుతున్న స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్ పో 2025ను మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సందర్శించారు. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఆర్గనైజేషన్, సియోల్ మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ఎక్స్ పోను మంత్రి సందర్శించారు.
ఫ్యూచర్ సిటీస్‌లో AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) థీమ్‌తో ఎక్స్ పో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల నుంచి 300 ప్రముఖ కంపెనీలు, 60000 వేల మంది హాజరయ్యారు. భవిష్యత్ స్మార్ట్ సిటీల నిర్మాణం, సుస్థిర ప్రజా జీవనంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలని దానిపై ఎక్స్ పో నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ నెట్ సీఈవో చాంగ్ జే బక్ (chang jae – bok)తో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. సుస్థిరమైన పట్టణాభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సిటీ నెట్ పనిచేస్తోంది. ఈ క్రమంలో పర్యావరణహితమైన సంపూర్ణ పట్టణాభివృద్ధి విషయంలో ఏపీకి సహకరించాలని ఈ సందర్భంగా సిటీ నెట్ నిర్ణయించింది.

విదేశీ విద్యా నిధి పథకం కొరకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ..

విదేశీ విద్యా నిధి పథకం కొరకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ

జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

విదేశీ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు 2025- 26 సంవత్సరానికి గాను విదేశీ విద్యాలయంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించబడుతున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.యు.ఎస్.ఎ, యు.కె,ఆస్ట్రేలియా,కెనడా, సింగపూర్,జర్మనీ,జపాన్, సౌత్ కొరియా,న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్,ప్రొఫెషనల్ కోర్సులలో చదవాలనుకునే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు నవంబర్ 19వ తేదీ లోగా ఆన్ లైన్ లో www.telangana.epass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన విద్యార్థులకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.అభ్యర్థులు జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులములవారై ఉండాలని, వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉండాలని, పిజి.చదవడానికి గ్రాడ్యుయేషన్ లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలని, టి.ఓ.ఈ.ఎఫ్.ఎల్, ఐ.ఈ.ఎల్.టి.ఎస్, జి.ఆర్.ఈ, జి.ఎం.ఎ.టి ఎక్కువ శాతం అర్హత,పాస్ పోర్ట్,వీసా కలిగి ఉండాలని,విదేశీ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొంది ఉండాలని,ఒక కుటుంబం నుండి ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు.ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version