బీసీలకు మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్న,

బీసీలకు మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

 

సిరిసిల్ల పట్టణం కేంద్రం లో ని ప్రెస్ క్లబ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము ముదిరాజ్ మాట్లాడుతూ వాకిటి
శ్రీ హరికి మంత్రి పదవి ఇచ్చి,ముదిరాజులకు ఇచ్చిన మాట ను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని, అన్నారు. అలాగే చొక్కాల రాము ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం ముదిరాజులు ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పిటిసి మరియు జడ్పీ చైర్మన్ స్థానాలను కూడా ముదిరాజులకు కేటాయించాలని అన్నారు. బీసీడీఈ లో ఉన్న ముదిరాజులను బీసీ ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు.వాకిటి శ్రీహరి కి మంత్రి పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పంబాల దేవరాజు సంయుక్త కార్యదర్శి జంగాపల్లి శేఖర్,రాయిని ప్రతాప్, సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు వంకాయల కార్తీక్,కోలా నరేష్, మామిండ్ల నారాయణ మునిగల రాజు చుక్క శేఖర్ బల్లెపు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

విద్వేషకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు..

విద్వేషకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు..

సోషల్ మీడియాను చెడుకు ఉపయోగించొద్దు..

వాట్సాప్, ఇన్ స్టాలో వచ్చే పుకార్లను నమ్మొద్దు..

నిబంధనలకు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు…

యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి..

రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్..

రామాయంపేట ఏప్రిల్ 15 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలు మార్పించేస్తూ ప్రజల మనోభా వాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పోస్టులు పెట్టవద్దని, అలా పెట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్య లు తీసుకోవడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్ హెచ్చరించారు.
ఇందుకోసం ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు తప్పుడు వార్తలు పెట్టే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగు తుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు. సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచా రాన్ని రామాయంపేట సర్కిల్ కార్యాలయం కంట్రోల్

రూమ్ వాట్సప్ నెంబర్కు 8712667100 తెలియజేయాలని అట్టి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ టెక్నాలజీ యుగంలో వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ద్వారా సమాచారము క్షణాల్లో కొన్నిలక్షల మందికి చేరుతుందని పంపించే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను మంచి మంచి కార్యక్రమాలకు ప్రజలను యువతను చైతన్యపరిచే విధమైన పోస్టులు చేస్తూ మంచితనానికి ఉపయోగిం చుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత వారి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టి ఇబ్బంది పడవద్దని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

పనిచేసేవారికే పదవులు…

– కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి సత్యం.

చందుర్తి, నేటిధాత్రి:

ఈ నెలలో జరిగే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలకు ఉత్సవ కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 29మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయడము హర్షనీయమని ఆ కమిటీలో చందుర్తి మండల కేంద్రానికి చెందిన గొట్టే ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షులు చింతపంటీ రామస్వామిని నియమించడం చాలా సంతోషంగా ఉందని చందుర్తి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి సత్యం శుక్రవారం రోజున పాత్రికేయుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేసే వారికే పదవులు ఇస్తుందని వారం రోజులపాటు జరిగే ఉత్సవాలు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోవడానికి పోలీస్ సిబ్బందిని ఇతర సిబ్బందిని వారితో పాటు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు. కమిటీలో ఇద్దరికీ అవకాశం కల్పించినందుకు మండల ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version