పెన్షన్ల కోసం ఎదురు చూపులు.

పెన్షన్ల కోసం ఎదురు చూపులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రైకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో భాగమైన వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. బుధవారం ఉదయం జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలానికి చెందిన పలువురు వృద్ధులు తెలిపారు.

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్.

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి:

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వేదాశీర్వచన మండపంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఆలయ అధికారులు, ప్రోటోకాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నేటి కార్యక్రమం విజయవంతం చేయాలి.

నేటి కార్యక్రమం విజయవంతం చేయాలి

పిప్పాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్

భూపాలపల్లి నేటిధాత్రి:

గురువారం భూపాలపల్లి జవహర్ నగర్ కాలనీలోని 8వ వార్డు 27వ వార్డు కాలనీలో గత 30సంవత్సరాల నుండి కాలనీలో రేషన్ షాపు లేదని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు దృష్టికి తీసుకువెళ్లిన కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి నేడు ఉదయం 9:00 గంటలకు ఐస్క్రీం కంపెనీ దగ్గర రేషన్ షాపు ఓపెన్ చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది రేషన్ షాప్ ఓపెనింగ్ తో పాటు పోచమ్మ టెంపుల్ ఆలయం లో బోరు ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కాలనీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనంతరం జై బాపు జై భీమ్ జై సంవిధానం అభియాన్ వార్డు బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి హాజరవుతారు
కావున కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఐఎన్ టియుసి యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ యుఐ నాయకులకు కార్యకర్తలకు అండ్ వార్డు ప్రజలకు పిలుపునిస్తున్నాం

ఇండియన్ గ్యాస్ వినియోగదారుల ఈ-కె వై సి అవగాహన.

ఇండియన్ గ్యాస్ వినియోగదారుల ఈ-కె వై సి అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి:

ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ సింగరేణి కాలరీస్ కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్ మందమరి నందు డెలివరీ బాయ్స్ సిస్టం ఆపరేటర్స్ ను ఉద్దేశించి డివిజనల్ మేనేజర్ సింగరేణి సూపర్ బజార్ శ్రీరాంపూర్ బెల్లంపల్లి పాలకుర్తి రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఇండియన్ ఆయిల్ కంపెనీ వారు ఆదేశానుసారము ప్రతి ఒక్క వంటగ్యాస్ వినియోగదారుడు వారి గ్యాస్ కనెక్షన్ నిమిత్తము.

Indian Gas

ఈ-కేవైసీ అనుసంధానం చేసుకునే కొరకై సహకరించాలని కాల పరిమితి అయిపోయిన గ్యాస్ పైప్ ను వెంటనే మార్చుకోవాలని లేని యెడల ప్రమాదాలు సంభవిస్తాయని ఆయన తెలిపారు ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ పాలకుర్తి రాజు బ్రాంచ్ మేనేజర్ సుదర్శన్ ఎల్ పి జి కోఆర్డినేటర్ రాజు ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ ఇన్చార్జ్ మాధవరావు ప్రసాద్ మరియు డెలివరీ బాయ్స్ సిస్టం ఆపరేటర్స్ రామకృష్ణాపురం, మందమరి, బెల్లంపల్లి పాల్గొన్నారు.

భూసేకరణ వేగవంతం చేయండి కలెక్టర్.

భూసేకరణ వేగవంతం చేయండి కలెక్టర్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డు, నిజ్జా భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శంకర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ రెండు పనులు పూర్తయితే జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. నిమ్స్ కు 12, 500 ఎకరాలకి 7500 ఎకరాల భూ సేకరణ చేసి సేకరించిన భూమికి రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు.

ఏం తినేటట్లు లేదు ఏముకునేటట్లు లేదు.

ఏం తినేటట్లు లేదు ఏముకునేటట్లు లేదు

మందమర్రి నేటి ధాత్రి:

మందమర్రి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల బ్రతుకులు మాటలకే పరిమితమా సింగరేణిలో కాంట్రాక్టు అంటే ఎగిరి గంతేస్తున్న బడా కాంట్రాక్టర్లు ? 8 రాష్ట్రాలలో అమలైనా హై పవర్ కమిటీ వేతనాలు మన తెలంగాణ రాష్ట్రం సింగరేణి బొగ్గు బావిలో ఎందుకు అమలు కాలేదు ఎవరిది వివక్షత సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు జీతాలు పెరిగితే జీర్ణించుకోలేకపోయే అప్పుడున్న పెద్దలు ఎవరు ఐ పవర్ కమిటీ వేతనాలలో సంతకాలు ఎందుకు చేయలేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులు కట్టు బానిసల వల్లే పని చేయాలని అర్థమా
తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మా శ్రమ మా కష్టం కడుపు మార్చుకో నీ పని చేస్తేనే దేశానికి వెలుగులు సింగరేణి పర్మనెంట్ కార్మికులకు తో సమానంగా పనిచేస్తున్న కానీ కాంట్రాక్టు కార్మికులకు సరైన వేతనం లేక హరి గౌస పడుతున్న విషయాన్ని సింగరేణి యాజమాన్యానికి తెలియదా ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న సింగరేణి కాంటాక్ట్ కార్మికుల ఓటు బ్యాంక్ తో చెలగాటలాడుతున్నారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు పర్మినెంట్ కార్మిక సంఘాలు స్టేజీల మీద మాటలకే పరిమితం అవుతున్నాయి వేజ్ బోర్డు సమావేశాలలో ఏ ఒక్కరోజు కూడా కాంట్రాక్టు కార్మికుల హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయించలేని దుస్థితిలో ఈరోజు మనము ఉన్నామంటే సిగ్గుచేటు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న కానీ ఈరోజు కూడా మాటలకే పరిమితం అవుతున్న కార్మిక హక్కులను కాలరాస్తున్నారు అని కార్మికులు గుసగుసలాడుతున్నారు సింగరేణి యాజమాన్యం ప్రభుత్వాలు కాంట్రాక్టు వ్యవస్థని కట్టు బానిసలుగా మార్చే దిశగా పయనిస్తున్న ఆశ్చర్యపడేది లేదు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న హై పవర్ కమిటీ వేతనాలు ఈరోజు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం సింగరేణి బొగ్గు బావుల్లో పదకొండు డివిజన్లో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఎదురుచూపు కె పరిమితం తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలు పేరుతో ఉద్యమాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ గారు సకల జనుల సమ్మెలో ప్రతి బొగ్గు బై పైన 11 డివిజన్లలో సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడి సకల జనుల సమ్మెలో 42 రోజుల సమ్మెను కాంట్రాక్టు కార్మికులు జీతం లేకుండా కుటుంబాలను ఆకలితో మార్చి సమ్మెలో విజయవంతం చేసిన ఘనత సింగరేణి కాంటాక్ట్ కార్మిక సోదర సోదరీమణులది కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిపై కూర్చొని సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల లేరు అని నిండు అసెంబ్లీలో చెప్పి అవమానపరిచి కార్మికుల గొంతు కోశారు.నిజం కాదా
టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కొట్టుకపోయి మార్పు జరగాలని ప్రజలు నిర్ణయాన్ని సింగరేణి కాంటాక్ట్ కార్మికులు ఏకతాటిగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నాము సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన ఘనత చరిత్ర సింగరేణి ప్రాంత బిడ్డలది కాదని ఈరోజు అడుగుచున్నాము కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు 11 రివిజన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకసారి ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని మాట్లాడి ఒక తాటిపైన ఉండి సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు 22 జీవో.ఐ పవర్ వేతనాలు ఇప్పించే దిశగా మీరు ముందుండి కార్మికులకు అండగా ఉంటారని గడిచిన సంవత్సరం నెలలో రామగుండం ఎమ్మెల్యే ఒక్కడు రెండుసార్లు మాట్లాడడం జరిగింది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆశతో ఉన్నారు వారికి అతి తక్కువ వేతనాలు ఉన్నాయి వారికి కచ్చితంగా మనము ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని.22వ జీవో అమలు చేయాలని చెప్పడం సంతోషకరమైన విషయం కానీ అదే పది డివిజన్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఆరోజు ప్రస్తావించి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కి తెలియజేసి ఉంటే ఈరోజు కాంట్రాక్టు కార్మికులకు ఇంత అంత మేలు జరిగేది కూల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు ఈరోజు తెలియజేస్తున్నాం కార్మికుల పక్షాన విన్నమిస్తున్నాము అర్ధిస్తున్నాము వేడుకుంటున్నాము సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కాంటాక్ట్ కార్మిక సోదర సోదరీమణులకు జీతాలు పెంచే దిశగా మీరు అడుగులు వేయాలని మీ వెనకాల మేము ఉంటామని కాంగ్రెస్ పెద్దలకు మా తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాము

విత్తన దుకాణాలలో తనిఖీలు.

విత్తన దుకాణాలలో తనిఖీలు

ఎం ఏ ఓ సోమలింగారెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి:

మండల కేంద్రంలో గల విత్తన దుకాణాలను వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఇన్చార్జ్ ఎస్సై సృజన మాట్లాడుతూ.. విత్తన డీలర్లు విత్తన చట్టం ప్రకారం వ్యాపారం నిర్వహించాలన్నారు. రైతులకు అమ్మిన విత్తనాలను బిల్లు రూపంలో అందించాలన్నారు.

సిరిసిల్లలో పిడుగుపాటుకు పశువులు మృతి.

సిరిసిల్లలో పిడుగుపాటుకు పశువులు మృతి

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చిన్న బోనాల మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డు మాజీ కౌన్సిలర్ బొల్గాం నాగరాజు గౌడ్ మాట్లాడుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, మరియు జిల్లా కలెక్టర్ కి , సంబంధిత జిల్లా పశు వైద్యాధికారులకు విన్నవించడం ఏమనగా, నిన్నటి రోజున కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న బోనాల లో నిన్న మమిండ్ల నాగరాజు అనే రైతు యొక్క ఆవు పిడుగుపాటు గురై మరణించడం జరిగినది తెలిపారు. ఆ రైతు యొక్క జీవన ఉపాధి పశువులపైనే ఆధారపడి ఉన్నందున, సుమారు 50 వేల నుండి 80 వేల విలువగల ఆవు మరణించినందునకు, ఆ రైతు రోధిస్తున్నాడు తెలిపారు.కావున వెంటనే ప్రభుత్వం తరఫున రైతుకు నష్ట పరిహారాన్ని చెల్లించి, జీవన ఉపాధిని కల్పించాలని స్థానిక మాజీ కౌన్సిలర్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను తెలిపారు.

50 కేజీల బియ్యం అందజేసిన పార్టీ కాంగ్రెస్ నాయకులు.

చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన పార్టీ కాంగ్రెస్ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి.మండలం కస్పే కట్కూరు గ్రామానికి చెందిన శనిగరం దిలీప్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా. వారి. తల్లిదండ్రులను . కుటుంబ సభ్యులను. పరామర్శించి. మనోధైర్యం ఇచ్చి. వారి కుటుంబానికి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ. సత్తు శ్రీనివాస్ రెడ్డి తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేసిన సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఈ oదుకుగాను బాధిత కుటుంబ సభ్యులు బియ్యం అందజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించి. వారి కుటుంబానికి. పార్టీ పరంగా కాను ప్రభుత్వపరంగా కాను. అన్ని సహాయ సహకారాలు అందించే విధంగా. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి. బాధిత కుటుంబానికి సహాయం అందించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పష్టం చేశారు. ఇట్టి కార్యక్రమంలో. మాజీ సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్. కే రాజేశ్వరరావు. కిషన్ కుటుంబ సభ్యులు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

సిపిఐ హనుమకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్

సిపిఐ హనుమకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్

పరకాల నేటిధాత్రి:

 

ఈ నెల 26,27 న హసన్ పర్తిలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హనుమకొండ జిల్లా మహాసభలలో భాగంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్ ను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావుకి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్ర బిక్షపతికి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ,పరకాల కార్మికులకు పక్షాన నియోజకవర్గంలో ఉన్న చర్లపల్లి,పోచారం తదితరుల గ్రామాలలో కార్మికులు సంఘాలకు నాయకత్వం వహించి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మున్సిపాలిటీ భవన నిర్మాణం,హమాలీ బజార్,అమాలి ఐకెపిఆర్ లకోసం నా వంతు పనిచేస్తానని నాపై నమ్మకంతో ఈ పదవిని నాకు అప్పగించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు.

పార్టీ పదవులు కొలిక్కి..మంత్రి పదవులు వెనక్కి!!

`మంత్రి పదవుల కోసం మరింత సమయం!

`పార్టీ పదవులు మాత్రం సిద్దం!

`దాదాపు కార్యవర్గ పదవుల జాబితా సిద్ధం!

`పార్టీ పదవులు కూడా మరో మూడురోజుల తర్వాత విడుదలయ్యే అవకాశం.

`రోహిన్‌ రెడ్డి కి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.

`సీనియర్లకు పార్టీ పదవులలో సముచిత స్థానం.

`నాయకులలో అసంతృప్తి లేకుండా పదవుల పంపకం.

`పార్టీ క్రియాశీల బాధ్యతలతో నాయకులు సంతృప్తి చెందుతారని అధిష్టానం నమ్మకం.

`అన్ని జిల్లాల నాయకుల సూచనల మేరకు పార్టీ నిర్మాణం.

`స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యం.

`ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు తక్కువ రాకుండా నాయకత్వం పటిష్టం.

`ప్రతి పక్షాల కన్నా ముందే ప్రజల్లోకి నాయకులు వెళ్లాలని ఆదేశం.

`ప్రభుత్వ పథకాలపై, నిర్ణయాలపై పకడ్బందీగా ప్రచారం.

`సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ యువ వికాసం, రేషన్‌ కార్డులపై ప్రజల్లో అవగాహన పెంచడం.

`మంత్రి వర్గ విస్తరణపై ఎటూ తేల్చలేకపోతున్న అధిష్టానం!

`ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర యంత్రాంగం.

`కావాలనే వాయిదా పడుతున్నట్లు సంకేతం.

`తప్పని పరిస్థితుల్లోనే దూరం జరుపుతున్నట్లు సందేశం.

`ఆరు పదవులు అందరికీ పంచలేక తల పట్టుకుంటున్న అధిష్టానం

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:
ఒక రకంగా కాంగ్రెస్‌ పార్టీలో వున్న కొంత మంది నాయకులకు సంతోషకమైన వార్త. మరో రకంగా మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులకు కొంత చేదు గుళిక. ఎందుకంటే మంత్రి పదవుల పంపకం మరికొంత ఆలస్యమయ్యే సూచనలు కనిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఎంత వడబోసినా, ఎక్కడో సరైన సమ ప్రాధాన్యత అందరికీ కలిగించాలన్న ఆలోచనతోనే కాస్త ఆ ముహూర్తం దూరం జరుగుతోంది. కాకపోతే ఎంత ఆలస్యమైనా, సరే బెస్ట్‌ అనిపించుకునేలా విస్తరణ వుండాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కోరుకుంటోంది. సహజంగా ఎమ్మెల్యేలందరికీ మంత్రులు కావాలని కోరిక వుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అయ్యేదాకా అదో తంటా. ఏళ్లకేళ్లు ఎదురుచూసి, చూసి, అవకాశం వచ్చినా రాజకీయ పరిస్ధితులు అనుకూలించక ఎమ్మెలు కాని వాళ్లు చాల మంది వుంటారు. వాళ్లలో అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, ఓడిపోయి, గెలిచిన వాళ్లుంటారు. మరికొంత మంది ఎమ్మెల్యే కావడానికి పెద్దగా ఇబ్బందులు పడే పరిస్ధితి రాదు. అలాంటి వారు మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేలు అవుతుంటారు. రాజకీయ పరిస్దితులు రాష్ట్రంలో ఎలా వున్నా, ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వుంటారు. అటు ఓడిపోయిన వారైనా, ఇటు ఎప్పుడూ గెలుస్తుండేవారైనా పార్టీకి సేవ చేస్తూనే వుంటారు. అలా అవకాశాలు వచ్చి, ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రులు కావాలనుకోవడం తప్పు కాదు. మంత్రులు కావాలన్న వారి కోరిక మొదటిసారే తీరే వారు కొందరుంటారు. ఎన్ని సార్లు ఎమ్మెల్యేలు అయినా మంత్రులు కాని వారు కూడా చాలా మంది వుంటారు. అయినా ఎక్కడో ఆశ వారిలో సజీవంగా వుంటంది. ఒక్కసారైనా మంత్రి కావాలని బలంగా కోరుకుంటారు. కాని ఇక్కడ మరో మతలబు వుంటుంది. ఒక్కసారి మంత్రి అయిన నాయకుడు సీనియర్‌ మంత్రిగా పదే పదే పార్టీ అధికారంలో వున్నంత కాలం మంత్రులుగా పనిచేయాలని కోరుకుంటారు. అలా అవకాశాలు దక్కుతుంటాయి. ఇప్పుడున్న కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే అందరికన్నా ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన నాయకుడిగా చిరిత్ర సృష్టించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా వున్న తుమ్మల నాగేశ్వరరావు కూడా అంతే..ఆయన ఏ పార్టీలో వున్నా మంత్రిగా వుంటూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నుంచి, తర్వాత బిఆర్‌ఎస్‌ నుంచి, ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి మంత్రి పదవి అందుకున్నారు. ఇలాంటి అవకాశం అందిరికీ రాదు. చాలా అరుదుగా వస్తుంది. గతంలో మంత్రిగా పనిచేసిన మంధని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఇప్పుడు మరోసారి మంత్రి అయ్యారు. ఇలా కొంత మందిని పదవులు వాటంతటవే వరిస్తుంటాయి. చాలా మందికి మంత్రి పదవి దక్కినట్లే దక్కి చేజారిపోతుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో మంత్రి కావాల్సిన కమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. నల్లగొండ నుంచి మరో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా అలా అవకాశాలు కలిసివచ్చి ఇప్పుడు కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఇప్పుడు మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో పలుసార్లు మంత్రిగాపనిచేసిన నిజాబామాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన మైనార్టీ నాయకుడు షబ్బీర్‌ అలీ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలో వున్నా అదృష్టవంతుడు అనే పేరు వుంది. కాని ఈసారి ఆయన మంత్రి కాలేకపోతున్నారు. కాని ఆయన పేరు కూడా వినిపిస్తూనే వుంది. కాని ఆయనకు దక్కకపోవచ్చు. అయితే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వస్తే, తాను గెలిస్తే మంత్రి కావాలనుకున్న మరో నాయకుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన గతంలో విప్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీని వదిలి బిజేపిలో చేరారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడు అనే పేరు వుంది. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా వుండేది. కాని దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే కాలేకపోయారు. నిజంగా ఆయన గత ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్‌ రాజకీయమే వేరేలావుండేదని ఆయన సన్నిహితులు అంటుంటారు. అలా అదృష్టం ఖాతలో మొదటిసారి ఎమ్మెల్యే అయినా బిసి నాయకుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ మంత్రి అయ్యారు. అంటే రాజకీయ పదవులు కూడా అదృష్టంతో ముడిపడి వుంటాయని చెప్పడానికి ఇవన్నీ సాక్ష్యాలనే అని చెప్పాలి. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడూ కూడా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆందోల్‌ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ ఈసారి మంత్రి అయ్యారు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు మంత్రులౌతారన్న వాటికి కొన్ని లెక్కలుంటాయి. ఆ లెక్కలు దాటితేనే మరి కొంత మందికి అవకాశం వస్తుంది. మంత్రులయ్యే ఛాన్సు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆరు మంత్రి పదువులు ఖాళీగా వున్నాయి. వాటిలో ఓ నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. ఎందుకంటే మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపిగా, ఒకసారి ఎమ్మెల్సీగా, పిపిసి. అధ్యక్షుడుగా పనిచేసిన వి. హనుమంతరావు మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కాని ఆయన పలుసార్లు టికెట్‌ ఇచ్చినా గెలవలేదు. ఆయనకు చాలా కాలంగా కాలం కలిసి రావడం లేదు. ఆయన ఆశ తీరే పరిస్దితి ఇక కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడున్న పరిస్దితుల్లో నిజామాబాద్‌ జిల్లాకు ప్రాదాన్యత లేకపోవడంతో సుదర్శన్‌రెడ్డి పేరులో ఎలాంటి మార్పు లేకుండా వినిపిస్తోంది. అయితే షబ్బీర్‌ అలీ పేరును ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారన్నది వేచి చూడాలి. ఇక కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆయన ఆశ తీరుతుందా? లేదా? అన్నది ఎవరూ చెప్పలేని పరిస్ధితి. ఇటీవల పార్టీ అధిష్టానం భుజ్జగించిందని, ఆయన అందుకు ఒప్పుకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎంత వరకు నిజమన్నది ఎవరికీ తెలియదు. ఆయనను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి తీసుకొమ్మని చెప్పినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. కాకపోతే చాల మందికి తెలియని విషయం ఏమిటంటే జాతీయపార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు సహజంగానే పార్టీ ఉపాధ్యక్షులు అని చెప్పుకుంటారు. ఎంత మంది ఎమ్మెల్యేలున్నారో వాళ్లంతా ఉపాధ్యక్షులే అవుతారు. అలాంటి వారికి ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు ఇచ్చినంత మాత్రాన బాద్యతలు ఎక్కువగా వుండకపోవచ్చు. కాని గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా వున్న జగ్గారెడ్డికి ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇచ్చారు. దాంతో ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇచ్చి బుజ్జగించే అవకాశాలున్నాయి. కాకపోతే వర్కింగ్‌ ప్రెసిడెంటు అనేది ఆరో వేలు లాంటిదే..అలాంటి పదవిని రాజగోపాల్‌రెడ్డి తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి. ఇక మరో జిల్లా ఆదిలాబాద్‌ నుంచి ఎమ్మెల్యే గడ్డం సోదరులు ఇద్దరూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని వివేక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పేర్లు మాత్రంపదే పదే వినిపిస్తున్నాయి. కాని పదవులు పంపకాలు ఆలస్యమౌతున్నాయి. ఇదే సమయంలో పార్టీ పదవుల పంపకాలకు మాత్రం ముహూర్తం ఫిక్స్‌ అయిందనే అంటున్నారు. నిజానికి మంగళవారం పార్టీ పదవుల జాబితా విడుదలౌతుందన్న ప్రచారం విసృతంగా జరిగింది. అందులో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు వున్నట్లు తెలుస్తోంది. పూర్తి జాబితాను ఈ నెల 30లోగా ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం వుందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఏది ఏమైనా మంత్రి పదవులు ఇంకా ఆలస్యమైనా సరే, పార్టీ పదవులు తొందరగా పంపకాలు జరుగుతాయని తెలుస్తున్నందుకు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

’’నేటిధాత్రి’’ కథనానికి స్పందించిన మంత్రి ‘‘కొండ సురేఖ.’’

`మంచినీటిని కాలుష్యం చేస్తున్న మిల్లులపై చర్యలు: మంత్రి ‘‘కొండా సురేఖ.’’

`’’కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర’’ కథనానికి మంత్రి ‘‘కొండా సురేఖ’’ స్పందన.

`‘‘నేటిధాత్రి’’ దిన పత్రికలో వచ్చిన ‘‘కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర’’ అనే వార్తకు రాష్ట్ర అటవీ, పొల్యూషన్‌ శాఖ మంత్రి ‘‘కొండా సురేఖ’’ స్పందించారు. 

`ఈ మేరకు ‘‘నేటిధాత్రి’’ తో మంత్రి మాట్లాడుతూ మంచినీటిలో బాయిల్డ్‌ మిల్లుల కెమికల్‌ నీటికి కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేటిధాత్రి’’ దిన పత్రికలో వచ్చిన వార్తపై వివరాలు సేకరించమని అధికారులను ఆదేశించారు.

`నగరంలో ఇలాంటి మిల్లులు ఎన్ని వున్నాయి, వారి వివరాలు కూడా అందించమని మంత్రి ‘‘కొండా సురేఖ’’, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’కు కూడా సూచించారు. తాను ప్రస్తుతం డిల్లీ వెలుతున్నట్లు, వచ్చిన వెంటనే పూర్తి సమాచారం ఆధారాలు అందించమని వాటి ఆధారంగా తగు చర్యలకు ఆదేశిస్తామని ఎడిటర్‌ ‘‘కట్టరాఘవేంద్రరావు’’కు మంత్రి చెప్పారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

వ్యాపారంలో మానవత్వం పూర్తిగా మర్చిపోతున్నారు. మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా? అనే విచక్షణ పూర్తిగా కోల్పోతున్నారు. వ్యాపారంలో అడ్డ దారులు తొక్కడం చాలా మంది చేస్తారు. కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే అడ్డ దారులు వెతుక్కుంటున్న వాళ్లు కూడా వుంటున్నారు. ప్రజల ప్రాణాలతో, జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పైకి చూస్తే మాత్రం అవి బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మాత్రమే. ఆ మిల్లులకు అవసరమైన నీటిని వాడుకొని, వదిలేసే సమయంలో మానవత్వం మర్చిపోతున్నారు. ఎవరి ప్రాణాలు ఏమైతే మా కేమిటి అనే ధోరణి అవలంభిస్తున్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన రాంపూర్‌ లో వున్న బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల యజమానులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. మిల్లు నుంచి వెలువడే వ్యర్థపు నీటిని ఏకంగా మంచి నీటి కాలువలోకి వదిలేస్తున్నారు. హన్మకొండ, వరంగల్‌ నగరాలకు మంచి నీటిని సరఫరా చేసే కాలువలలో మిల్లు కెమికల్‌ నీటి వ్యర్థాలు యదేచ్చగా వదిలేస్తున్నారు. రాంపూర్‌లో వున్న మిల్లులన్నీ ఇలాంటి దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నాయి. మంచి నీటి కాల్వలోకి మిల్లుల కెమికల్‌ వాటర్‌ వదిలి నీటిని కాలుష్య కాసారం చేస్తున్నారు. ఇందుకు అధికారులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. మిల్లుల నిర్వాకం నిర్వకానికి సహకరిస్తూ అమ్యామ్యాలకు అలవాటు పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే సహజంగా రైస్‌ మిల్లుల నుంచి వ్యర్థాలు అంటే గాలిలో కలిసే ఊక మాత్రమే అని అందరూ అనుకుంటారు. కానీ భయంకరమైన కెమికల్‌ వ్యర్థాలు ..అధికారుల నిర్లక్ష్యం తోడు కావడంతో మిల్లర్లు ఆడిరది ఆట పాడిరది పాట మారిపోయింది. అయినా మురుగునీటిని మంచి నీటిలో కలుపుతున్నామన్న సోయి కొంచెం కూడా లేకపోతోంది. సొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు మిల్లర్లు యదేచ్చగా సాగిస్తున్న దుర్మార్గాన్ని వెనకేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి బాయిల్డ్‌ మిల్లులో వెలువడిన మురుగునీటిని శుద్ధి చేసే యంత్రాంగం వుంటుంది. అందుకు ప్రత్యేకమైన ప్లాంటు ఏర్పాటు జరుగుతుంది. కానీ అది తూతూ మంత్రంగానే వినియోగిస్తున్నారు. ఆ నీటి శుద్ధి ప్లాంట్‌ను వినియోగించడమే కొన్ని సంవత్సరాలుగా మానేశారు. ఆ ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వాటిని వినియోగించడమే మానేశారు. దాంతో మిల్లుల నుంచి వెలువడే వ్యర్థాల మూలంగా మంచి నీటి కాలువలు మొత్తం కలుషితమైపోతున్నాయి. మిల్లులు సాగిస్తున్న ఈ దుర్మార్గం మూలంగా ప్రజల ప్రాణాలకు హాని జరుగుతోంది. ఆ వ్యర్థాలు ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. అధికారులకు పట్టిన అవినీతి రోగం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. మిల్లుల మూలంగా ఆ నీరు కొన్ని సంవత్సరాలుగా కాలువలో చేరడం వల్ల కాలువలు కూడా పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. ఎక్కడిక్కడ కాలువలకు చెందిన రిటైనింగ్‌ వాల్స్‌ దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల పొడవునా మంచి శుద్దమైన మంచి నీరు పారాల్సిన చోట మురుగునీటి మూలంగా అడ్డంకులు ఏర్పడడంతో పాటు, కలుషితమైపోతున్నాయి. కాలుష్య కాసారంగా మారిపోతున్నాయి. మురుగునీటి నుంచి వచ్ఛే వ్యర్థాలు కాలువల మధ్యలో గుట్టలుగా చేరిపోతున్నాయి. దాంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతోంది. మొత్తంగా అక్కడ పేరుకుపోయిన కెమికల్‌ ప్రతి నీటి చుక్క కాలుష్యాన్ని మొసుకుపోతోంది. ఇక ఆ పక్కనే వున్న చెరువులోకి కూడా కొన్ని మిల్లుల నుంచి కెమికల్‌ నీరు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. ప్రభుత్వం ఏటా చెరువులో చేపలు పెంచే లక్ష్యం నిర్వీర్యమౌతోంది. ఏటా చేపల లక్ష్యం కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ కెమికల్‌ వాటర్‌ చెరువులోకి చేరడం మూలంగా చేప పిల్లలు చనిపోతున్నాయి. ఈ విషయం మత్య్స శాఖ దృష్టికి వచ్చినా ఆ అధికారులు కూడా కళ్లు మూసుకుంటున్నారు. వాటర్‌ బోర్డు అధికారులు ఆ కాలువల వైపు కన్నెత్తి చూడకపోవడాన్ని ప్రజలు నిరసిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కదలకపోవడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. నేటిధాత్రి కథనంలో దానికి సంబంధించిన ఫోటోలు ప్రచురించడం జరిగింది. మిల్లుల కెమికల్‌ నీరు కాలువలో కలవడమే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. రాంపూర్‌ మిల్లులు వదిలిన రసాయన నీరు..మంచి నీటి కాలువలో చేరుతూ వుండడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. పాపానికి సంకేతం. పర్యావరణం మీద చిన్న పాటి నిర్లక్ష్యం కూడా వహించకూడని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారుల జాడెక్కడ? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే అన్నీ తెలిసినా అధికారులు చోద్యం చూడడం అంటే ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం తప్ప మరేం లేదు. హనుమాన్‌ ఇండస్ట్రీస్‌ ,కామదేను ట్రేడర్స్‌ ,వినాయక ఇండస్ట్రీస్‌ ,మారుతి ఆగ్రో ఇండస్ట్రీస్‌ ,శ్రీ ధనలక్ష్మి ఇండస్ట్రీస్‌ ,శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీస్‌ ,శ్రీ శ్రీనివాస ఇండస్ట్రీస్‌ ,సూర్య ఇండస్ట్రీస్‌ ,సూర్య తేజ ఇండస్ట్రీస్‌లు సాగిస్తున్న అరాచకం సొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులకు తెలుసు. అందువల్ల పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు కళ్లు మూసుకొని మొద్దు నిద్రపోతున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ముక్కుపుటాలు అధిరేలా వాసన వస్తున్నా అధికారులు తొంగి చూడొద్దనుకుంటున్నారా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కెమికల్‌ కలిసిన మిల్లుల క్రిటికల్‌ వాటర్‌ మంచినీటి కాలువను కలుషితం చేస్తున్నా కనిపించడం లేదా? నిలదీస్తున్నా స్పందన కరువౌతోంది. అవే నీటిని మున్సిపల్‌ వాటర్‌ బోర్డు ప్రజలకు పంపిస్తున్నారన్న సంగతి కనిపించడం లేదా?ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం అనుకునేలా మిల్లర్లకు వరంగా మారి ప్రజలకు శాపమౌతోంది. కలుషిత నీటిని తాగుతున్నారన్న సోయి కూడా అధికారులకు లేకపోవడం వారి బాధ్యతారిత్యానికి నిదర్శనమనే చెప్పాలి. వరంగల్‌ ప్రజలకు శాపంగా మారుతున్నా మిల్లులకు సహకరిస్తూ, ఉదాసీనత చూపిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, ఇరిగేషన్‌ డిపార్ట్మెంట్‌, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌. అధికారులను గత కొన్ని సంవత్సరాలుగా మామూళ్లతో మెయింటైన్‌ చేస్తున్న కిలాడి మిల్లర్‌ ఎర్రబెల్లి..

కేతకిలో ప్రత్యేక పూజలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే.

కేతకిలో ప్రత్యేక పూజలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంఘం మండలం కేంద్రంలో దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ కేతక సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించారు.

పేద రైతుల ప్రభుత్వ భూమి కబ్జా లో నిదురెందుకు.!

గుట్ట పై షెడ్డును కూల్చారు…మరి ఆశ్రమ కబ్జా కట్టడం పై చర్యలేవి..??

పేద రైతుల ప్రభుత్వ భూమి కబ్జా లో నిదురెందుకు??

రెవెన్యూ అధికారుల కబ్జా నివేదిక పైన చర్యలేవి??

అధికారుల అత్యుత్సాహం కేవలం గుట్ట పైనేనా??

ఆశ్రమ భూ కబ్జా లో ముడుపులేమైన ముట్టాయా అని ప్రజల మాట ముచ్చట…

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి:

ఎల్లారెడ్డిపేట మండలం లో రెండు వేరు వేరు ప్రదేశాలలో భూకబ్జా సమస్య. వెంకటాపూర్ గ్రామంలో ఒక ఆశ్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేశారని ఆ విషయంలో రెవెన్యూ అధికారులు నివేదిక ఉన్నతాధికారులకు పంపిన , హై కోర్ట్ సంగెం బాలయ్య భూమి కబ్జా గురి అయిందని అక్కడ ఉన్న అక్రమ కట్టడం కూల్చి వేయాలని ఆర్డర్ ఉన్న కూడా అధికారులు మౌనం వహిస్తున్నారు.ఆ మౌనానికి ముడుపులేమైన ముట్టాయా అని మండల ప్రజలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.ఇది ఇలా ఉండగా ఈ నెల 14,15 వ తేదీలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని సింగారం గ్రామం లో కుల,మతాలకు అతీతంగా దర్శావళి గుట్ట పైన ప్రతి సంవత్సరం లాగే గ్రామస్తుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్న దర్గా లకు ఉర్సు పండుగ అంగరంగ వైభవంగా జరిపారు.ఈ క్రమంలో విశిష్ట అతిధుల ఆహ్వానం ఉండడం వలన అక్కడ ఉన్న గుట్టను చదును చేసి షెడ్ ని నిర్మాణం చేశారు. అది ప్రభుత్వ భూమిలో ఉందని కొద్దిరోజుల క్రితం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఒక పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

poor farmers

ప్రభుత్వ భూమిలో షెడ్ నిర్మాణం జరిగింది అని మే 27 న ఉదయం అధికారులు, పోలీసుల సమక్షంలో జెసిబి తో ఆ నిర్మాణాన్ని కూల్చారు.ఈ రెండు సమస్యలో కబ్జా అనేది కనిపిస్తున్న అధికారులకు,ఆ పార్టీ నాయకులకు కేవలం దర్శావళి గుట్ట ను రాజకీయం చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వ భూమి, పేద రైతు భూమి కబ్జాకు గురై అధికారుల నివేదిక,హై కోర్ట్ ఆర్డర్ లు ఉన్న కూడా పట్టించుకొని అధికారులకు దర్శావళి గుట్ట పైన షెడ్ నిర్మాణం కబ్జా భూమి లో జరిగిందని అధికారుల అత్యుత్సాహాన్ని చూస్తే ఓ మౌజయ ఆశ్రమానికి సంబంధించి ముడుపులు ఏమైనా ముట్టాయ అని ప్రజలు నుండి సందేహాలను వ్యక్త పరుస్తున్నారు. అధికారుల తీరు ప్రజల సందేహాలకు తగ్గట్టుగానే ఉండడం, ఒక పార్టీ నాయకులు కుల,మతాధిపత్యం పరంగా ఫిర్యాదులు చేస్తూ మతాల మధ్య చిచ్చులు రేపే విధంగా గొడవలు సృష్టించాలని రాజకీయం చేస్తున్నారని సింగారం గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్ సినియర్ నాయకున్ని పరామర్శించిన.

కాంగ్రెస్ సినియర్ నాయకున్ని పరామర్శించిన

మున్నూరుకాపు సంఘము మండల అధ్యక్షులు పుప్పాల దీపక్ పటేల్

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో గుడివాడలో కాంగ్రెస్ సినియర్ నాయకుడు సిరంగి బిక్షపతి పటేల్ తల్లి సిరంగి రాధమ్మ స్వర్గస్తులయ్యారు కావున వారి కుటుంబ సభ్యులను పారమర్శించి ఓదార్చి మనోధైర్యం చెప్పిన గణపురం మండల మున్నూరుకాపు సంఘము అధ్యక్షులు పుప్పాల దీపక్ పటేల్ వారి వెంట తో దేవేందర్ పటేల్ సిరంగి రామకృష్ణపటేల్ రిటైడ్ ఈఈ,ప్రభాకర్ పటేల్, రాజేశ్వర్ రావుపటేల్, అన్నం అనిల్ పటేల్,పటేల్,సురేష్ పటేల్,సుధాకర్ పటేల్,విడిదినేని రవి పటేల్ విద్యుత్ ఏ ఈ, శంకర్ పటేల్ పుప్పాల రామారావు పటేల్ నర్సింగం పటేల్ రామదాసు బాబు రాముణయ్య రవీందర్ రెడ్డి ల్యాదేళ్ల సమ్మయ్య లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు.

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు.

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

 

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జహీరాబాద్ పురపాలక కమిషనర్ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రత్యేక బృందాలతో దాడులు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు, కమిషనర్ తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తూ పట్టుబడిన వారికి వెయ్యి రూపాయల నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని కమిషనర్ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

న్యాల్ కల్ మండల ఇన్చార్జి తహసిల్దార్ పీ.రాజిరెడ్డి.

న్యాల్ కల్ మండల ఇన్చార్జి తహసిల్దార్ పీ.రాజిరెడ్డి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మండల ఇన్చార్జి రాజిరెడ్డిని స్కాల్కల్ మండలము న్యాల్ కల్ తహసిల్దార్ నియమిస్తూ జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు.ఇది వరకు మండల తహసిల్దార్ గా విధులు నిర్వహించిన భూపాల్ మేడ్చల్ కు బదిలీ అవ్వడంతో మండల ఉప తహసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డిని అదనపు బాధ్యతలు అప్పగించడంతో మండల ఇన్చార్జి తహసిల్దారుగా విధుల్లో చేరారు. విధి నిర్వహణలో రెవెన్యూ చట్టానికి లోబడి, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు విధులు నిర్వహించనున్నట్లు ఇన్చార్జి తహసిల్దార్ రాజిరెడ్డి స్పష్టం చేశారు.

వనపర్తి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ.

నేడు వనపర్తి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోటీ చేసే అభ్యర్థులు నేడు వనపర్తి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు నామినేషన్లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు నామినేషన్ వేసే అభ్యర్థులు 5000 రూపాయలు డిపాజిట్ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఆర్యవైశ్య మహా సభ ఆదేశాలు నియమ నిబంధనలు పాటిస్తామని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు వనపర్తి లో ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేయుటకు ఆర్యవైశ్య యువకులు న్యాయవాదులు రిటైర్డ్ ఉపాధ్యాయులు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేయుటకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని పూరి బాలరాజ్ పేర్కొన్నారు

తంగళ్ళపల్లి మండలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.

తంగళ్ళపల్లి మండలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లిమండలం బస్వాపూర్ గ్రామంలో. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు. సత్తు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు.కార్యక్రమాలు తీసుకొచ్చి. రాష్ట్రంలో ప్రజలకు సన్న బియ్యం కార్యక్రమాన్ని అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ. ప్రభుత్వం ఇచ్చినటువంటి . ఆరు గ్యారంటీలే కాకుండా. ఎన్నో సంక్షేమ.పథకాలు తీసుకొచ్చి రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధిలో ఉంచాలని. ప్రజలకు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని. అలాంటిది దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో ముందు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దువ్వాసి దేవరాజు. సెక్రెటరీ వేణు. బలసాని శ్రీనివాస్ గౌడ్. అల్లూరి తిరుపతిరెడ్డి. బద్రి. లింబాద్రులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం.

కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలి

◆ సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి పార్టీ విధేయులకు ప్రాధాన్యత ఇవ్వలి

◆ అన్ని వర్గాలను కలుపుకొని పోయే నాయకుడిని పెద్దపీట వెయ్యాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్,అల్ ఇండియా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ పరిది ఝారసంగం మండలంలోని మచ్నూర్ గ్రామంలో సోమవారం ఝారసంగం మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమై పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండలంలో బలమైన కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ చేపట్టబోయే నూతన గ్రామ, మండల అధ్యక్షుల ఎంపికను అందరూ ఏకతాటిపై నిలిచి నూతన అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేసి జహీరాబాద్ నియోజకవర్గంలోనే ఝారసంగం మండల కాంగ్రెస్ పార్టీని పటిష్టం చెయ్యాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ..

నూతన నాయకత్వాన్ని అందరి అభిప్రాయంతో ఎంచుకోవలని తెలిపారు.

పార్టీ నూతన మండల ఎంపిక కోసం సంస్థాగత ఎన్నికల ఇంచార్జ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పార్టీ అధిష్టానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,ఓసి జనరల్ వారి నుంచి అనగా 2017 కంటే ముందు పార్టీలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉదాహరణకు ఝారసంగం మండల అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి మూడు దశబ్దాలకుపై, న్యాల్కల్ మండల అధ్యక్షుడు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఉన్నప్పటి నుంచి 2009 లో నియోజకవర్గల పునర్విభజనలో జహీరాబాద్ లో విలీనం అయిన నాటి నుంచి ఇప్పటివరకు అన్నగా రెండు దశాబ్దాలకు పైగా ఉండగా, 2009 నుండి
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం, మిగిలిన మండలాల వారు 2018 సంవత్సరం నుంచి ఉండటంపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు.

మూడు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఇచ్చిన పాసులను ఇష్టానుసారంగా ఇచ్చుకొని జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులకు,మాజీ జడ్పిటిసిలు,మాజీ ఎంపిపిలు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ లకు ఇవ్వకపోవడంతో కార్యకర్యాల ఆగ్రహానికి కారణం అయింది.

ఏది ఏమైనప్పటికి పార్టీ అధిష్టానం మండల అధ్యక్షుడిని మార్చి పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే వారిని అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానంతో కోరారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ అసెంబ్లీ ఓటమి చెందడానికి పలు కారణాల్లో అధ్యక్షులను మార్చకపోవడం కూడా ఒకటని సమావేశంలో చెప్పుకోవడం విశేషం..

ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాలంటే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో నూతన అధ్యక్షుల నియామకం చేపట్టి వారికి అవకాశం కల్పిస్తే వారు ఐకమత్యంగా ఉంటూ పార్టీ విజయం కోసం కష్టపడే అవకాశం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రచార కార్యదర్శి మహేందర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎండి.

ముల్తానీ, ఝారసంగం మండల మాజీ ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు శంకర్ పాటిల్, మాజీ జడ్పిటిసి వినిల నరేష్, మాజీ ఎంపిపి దేవదాస్, మాజీ సర్పంచులు నవాజ్ రెడ్డి, రామిరెడ్డి, ఇస్మాయిల్ సాబ్, రాజుస్వామి, శంషోద్దీన్, నందప్ప పాటిల్, మహరుధ్ రావు, సుధాకర్, మాణిక్యం, మాజీ ఎంపిటిసిలు మొహమ్మద్ హాఫిజ్, రవి, మాజీ ఉప సర్పంచ్ సంగన్న, యువజన కాంగ్రేన్ అధ్యక్షుడు రాఘవేంద్ర, అభిలాశ్ రెడ్డి, యువ నాయకులు, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version