నేటి కార్యక్రమం విజయవంతం చేయాలి.

నేటి కార్యక్రమం విజయవంతం చేయాలి

పిప్పాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్

భూపాలపల్లి నేటిధాత్రి:

గురువారం భూపాలపల్లి జవహర్ నగర్ కాలనీలోని 8వ వార్డు 27వ వార్డు కాలనీలో గత 30సంవత్సరాల నుండి కాలనీలో రేషన్ షాపు లేదని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు దృష్టికి తీసుకువెళ్లిన కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి నేడు ఉదయం 9:00 గంటలకు ఐస్క్రీం కంపెనీ దగ్గర రేషన్ షాపు ఓపెన్ చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది రేషన్ షాప్ ఓపెనింగ్ తో పాటు పోచమ్మ టెంపుల్ ఆలయం లో బోరు ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కాలనీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనంతరం జై బాపు జై భీమ్ జై సంవిధానం అభియాన్ వార్డు బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి హాజరవుతారు
కావున కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఐఎన్ టియుసి యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ యుఐ నాయకులకు కార్యకర్తలకు అండ్ వార్డు ప్రజలకు పిలుపునిస్తున్నాం

నేడు పెద్దింటి కథల కార్యశాల కార్యక్రమం.

నేడు పెద్దింటి కథల కార్యశాల కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

తెలంగాణ ప్రభుత్వం సాహిత్య అకాడమీతో కలిసి యువ కథకుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కథల కార్యశాల తేదీ 27 మే మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రవీంద్రభారతి మినీ హాల్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక మరియు సాంస్కృతిక పురావస్తు శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఈ కథల కార్యశాలలో ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ “కథలు ఎలా రాయాలి” అనే అంశంపై యువ కథకులకు రోజంతా శిక్షణ ఇవ్వనున్నారు. ఇది కొత్తగా రాస్తున్న యువ రచయితలకోసమే నిర్వహిస్తున్న కార్యశాల అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలా చారి పేర్కొన్నారు.పెద్దింటి ఇప్పటికే యూనివర్సిటీలలో, డిగ్రీ కళాశాలలలో అనేక కథల కార్యశాలలు నిర్వహించారు. ఆయన రచించిన కథలు, నవలలు పలు యూనివర్సిటీల సిలబస్‌లలో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలకు కథలు పాటలు మాటలు రాస్తున్నారు.

నేటి ధాత్రి లో ప్రచురితమైన వార్తకు స్పందన.

నేటి ధాత్రి లో ప్రచురితమైన వార్తకు స్పందన
• కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో

నిజాంపేట: నేటి ధాత్రి

 

కష్టించిన పంట వానపాలు
ప్రచురితమైన వార్తకు రెవెన్యూ అధికారులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో కొనుగోలు అయినప్పటికీ లారీలు రావడం లేదని రైతులు ఆరోపించడంతో బుధవారం వార్త నేటి దాత్రిలో ప్రచురితమైంది. ఈ మేరకు నిజాంపేట మండల తాసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి లు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు నిర్వాహకులకు కొనుగోలు వేగవంతం చేయాలని సూచించడం జరిగిందన్నారు. అలాగే రైస్ మిల్ నిర్వాహకులకు లారీలను త్వరితగతిన అన్లోడ్ చేయాలని సూచించడం జరిగిందన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించడం జరిగిందన్నారు.

నేటి ధాత్రి వార్తకు విద్యుత్ అధికారుల స్పందన.

నేటి ధాత్రి వార్తకు విద్యుత్ అధికారుల స్పందన

నిజాంపేట: నేటి ధాత్రి

 

నేటి ధాత్రిలో ప్రచురితం అయిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన టేకుమల్లి యాదయ్య పొలం వద్ద 11 కేవి కరెంట్ వైర్లు “ప్రమాదకరంగా 11 కేవి విద్యుత్ వైర్లు” అనే శీర్షికతో శనివారం ప్రచురితం కాగా సంబంధిత కరెంట్ ఎఈ గణేష్ స్పందించి సిబ్బందిని పంపించి నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రైతు యాదయ్య మాట్లాడుతూ.. తమ సమస్య పరిష్కారనికి తోడుగా నిలిచిన నేటి ధాత్రి న్యూస్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

ఆనందోత్సాహాల నడుమ నేటికవిత ఆత్మీయ సమ్మేళనం.

ఆనందోత్సాహాల నడుమ నేటికవిత ఆత్మీయ సమ్మేళనం
మెట్ పల్లి ఫిబ్రవరి 26 నేటి ధాత్రి
ఉదయసాహితి తెలంగాణ ఆధ్వర్యంలో అంతర్జాల సమూహం లో నిర్వహింపబడుతున్న నేటికవిత ఆత్మీయసమ్మేళనం ఫిబ్రవరి23న ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రంలో ఆనందోత్సాహాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది., రెండు తెలుగు రాష్ట్రాల లోని నేటికవిత సభ్యులు ఈ సమ్మేళనం లో పాల్గొని సమ్మేళనానికి నిండు శోభను కూర్చారు. ఆత్మీయ పలకరింపుతో, సాహిత్య సంబంధ ఊసులను పంచుకోవడానికి ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రం వేదికైంది. ఉదయసాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వురిమళ్ల సునంద వరి శ్రీవారు భోగోజు ఉపేందర్ రావు సమ్మేళనానికి హాజరైన ప్రతినిధుల కు ఆతిథ్యాన్నిచ్చి,అందరినీ సాదరంగా ఆహ్వానించారు. నేటికవిత అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య, నేటి కవిత సలహాదారు దాస్యం సేనాధిపతి పర్యవేక్షణలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహింపబడినాయి. ఉదయం పదిగంటలకు జరిగిన ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా భోగోజు ఉపేందర్ రావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనం చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు.
ఉదయసాహితి రాష్ట్ర బాధ్యులు శ్రీదాస్యం లక్ష్మయ్య, దాస్యం సేనాధిపతి, వురిమళ్ల సునంద తో పాటు ఖమ్మం అక్షరాల త్రోవ మిత్రులు రాచమల్ల ఉపేందర్, దాసరోజు శ్రీనివాస్, నామా పురుషోత్తం వేదికను అలంకరించారు. సమావేశంలో దాసరోజు శ్రీనివాస్, నామా పురుషోత్తం, శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి , తదితరులు అతిథి సందేశాలను అందించారు. అనంతరం స్వీయ పరిచయాలను మూడు ఆవృతాలలో నిర్వహించారు. కవయిత్రి బత్తిన గీతాకుమారి స్వాగతం పలికారు.
పుస్తకావిష్కరణలు
ఈ ప్రారంభ సమావేశంలోకరీంనగర్ కు చెందిన కవి నగునూరి రాజన్న రచించిన హైకూల సంకలనం వెలుగు పూలు ను దాస్యం సేనాధిపతి ఆవిష్కరించగా , మంగా నెల్లూరు కు చెందిన కవి యర్రాబత్తిన మునీంద్ర రచించిన కలల కావడి సంకలనాన్ని శ్రీదాస్యం లక్ష్మయ్య ఆవిష్కరించారు.
స్వీయ పరిచయ వేదికలు
ఆత్మీయసమ్మేళనానికి హాజరైన కవులు కవయిత్రులు స్వీయపరిచయవేదిక ద్వారా తమను గురించి తాము పరిచయించుకున్నారు. లక్ష్మీ పద్మజ దుగ్గరాజు అధ్యక్షత న జరిగిన మొదటి ఆవృతంలో దాస్యం సేనాధిపతి, శ్రీదాస్యం లక్ష్మయ్య, వురిమళ్ల సునంద, కె.మంజుల, కందుకూరి మనోహర్, ఏడెల్లి రాములు, గుడ్లదొన సాయి చంద్రశేఖర్, కె.వి. సుబ్రహ్మణ్యేశ్వరరావు, మేరుగు అనురాధ, నగునూరి రాజన్న, తుంబూరు జగన్మోహన్ తదితరులు తమ స్వీయ పరిచయం సాహిత్య ప్రస్థానాన్ని, నేటి కవితతో తమకు గల అనుబంధాన్ని గురించి వివరించారు.
రెండవ ఆవృతంలో
రమాదేవి కులకర్ణి అధ్యక్షతన జరిగిన రెండవ ఆవృతంలో బత్తిన గీతాకుమారి, యర్రాబత్తిన మునీంద్ర, లింబగిరి స్వామి, ముద్దు వెంకటలక్ష్మి, చిందం సునీత, చింతల కమల, శింగరాజు శ్రీనివాస్ కుమార్, రమాదేవి బుక్కపట్నం, ఉదయశ్రీ ప్రభాకర్, యనమండ్ర వరలక్ష్మి, వేముల వరలక్ష్మి , పరిమి వెంకట సత్యమూర్తి, తదితరులు తమ స్వీయ పరిచయం సాహిత్య ప్రస్థానాన్ని, నేటి కవితతో తమకు గల అనుబంధాన్ని గురించి వివరించారు.
మూడవ ఆవృతంలో
డా.చీదెళ్ల సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన మూడవ ఆవృతంలో లింగుట్ల వెంకటేశ్వర్లు, సయ్యద్ జహీర్ అహ్మద్, డా. ఆడేరు చెంచయ్య, కటుకం కవిత, కొలచన విజయభారతి, బిరుదురాజు ప్రమీలారాణి, మూర్తి శ్రీదేవి, తులసి వెంకట రమణాచార్యులు, అరుణ కీర్తి పతాక, అక్కి నర్సింలు గౌడ్, తదితరులు తమ స్వీయ పరిచయం సాహిత్య ప్రస్థానాన్ని, నేటి కవితతో తమకు గల అనుబంధాన్ని గురించి వివరించారు.
అనంతరం ఉదయసాహితి సర్వసభ్య సమావేశం రాష్ట్ర గౌరవాధ్యక్షులు దాస్యం సేనాధిపతి అధ్యక్షతన జరిగింది.
భోజనానంతరం నేటికవిత సమూహం లో అర్హత సాధించిన 10 మంది కవులకు కవయిత్రులకు కవితాభూషణ
08 మంది కవులకు కవయిత్రులకు కవితావిభూషణ ఐదుగురికి సహస్ర కవితా స్ఫూర్తి అవ్వార్థులను బహుకరించారు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వారందరికీ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, శాలువాలతో అతిథులు, నిర్వాహకులచే ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం మూర్తి శ్రీదేవి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది
ఉదయసాహితి తెలంగాణ రాష్ట్ర సర్వ సభ్య సమావేశం – తీర్మానాలు
ఫిబ్రవరి 23 న ఖమ్మం లోని బోడెపూడి విజ్ఞాన కేంద్రం లో ఉదయ సాహితి తెలంగాణ సర్వ సభ్య సమావేశం రాష్ట్ర గౌరవాధ్యక్షులు దాస్యం సేనాధిపతి అధ్యక్షతన జరిగింది…ఈ కార్య క్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీదాస్యం లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వురిమళ్ల సునంద ల తో పాటు…రాష్ట్ర,జిల్లా కమిటీల బాధ్యులు పాల్గొన్నారు.
తొలుత శ్రీమతి మూర్తి శ్రీదేవి స్వాగతం పలికారు. సభాధ్యక్షులు దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ సాహితీ వికాసం లో..సాహితీ సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఉదయసాహితికి సహకరిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు..శ్రీదాస్యం లక్ష్మయ్య ఆధ్వర్యం లో ఉదయ సాహితి ద్వారానిర్వహింపబడుతున్న నేటి కవిత అంతర్జాల సమూహం లో వైవిద్యమైన కార్యక్రమాలను చేపట్టడం పట్ల తమ సంతోషాన్ని ప్రకటించారు..
సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వురిమళ్ల సునంద సభలు ఖమ్మం లో నిర్వహించినందులకు వారికి, వారి శ్రీవారు భోగోజు ఉపేందర్ రావ్ కి కృతఙ్ఞతలు తెలిపారు..అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరిమళ్ల సునంద తాము సంస్థ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలను వివరిస్తూ వార్షిక నివేదికను సమర్పించారు.
అధ్యక్షులు శ్రీదాస్యం లక్ష్మయ్య కోశాధికారి పక్షాన ఆర్ధిక నివేదికను సమర్పించారు. అనంతరం సభ్యులంతా చర్చించి దిగువ తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
తీర్మానాలు
ఇప్పుడున్న ఉదయసాహితి జిల్లా కమిటీలను రద్దు చేసి, రాష్ట్రస్థాయిలో ఒకే కమిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర అధ్యక్షులకు అధికారం ఇవ్వనైనది
ఉదయ సాహితి తెలంగాణ ఇంతకాలం ప్రతి నెలా మొదటి ,మూడవ ఆదివారాల్లో గూగుల్ మీట్ ద్వారా నిర్వహిస్తున్న సాహిత్య సమాలోచన కార్యక్రమాన్ని ఇకముందు ప్రతి నెల రెండవ ఆదివారం మాత్రమే నిర్వహించాలని నిర్ణయించనైనది
.మార్చ్ 2025 మాసం నుండి నేటికవిత సమూహం లో ప్రతి శుక్ర వారం బాల సాహిత్య సృజనకు చోటు కల్పించాలని తీర్మానించనైనది.
ఉదయ సాహితి రాష్ట్రం లో విస్తరణ కోసం రాష్ట్ర కమిటీ నందుఅన్ని ఉమ్మడి జిల్లాల నుండి సభ్యులను చేర్చుకునే అధికారం అధ్యక్షులకు ఇవ్వనైనది.
.రాష్ట్ర స్థాయిలో తమ తల్లిదండ్రుల స్మారకర్థం సాహితీ పురస్కారాలను ఉదయ సాహితీ ఆధ్వర్యం లో‌ అందజేయడానికి ముందుకు వచ్చిన దాస్యం సేనాధిపతి, లక్ష్మయ్య కు సభ తమ ఆమోదం తెలిపింది
ఉదయ సాహితీ సభ్యులందరూ నేటికవిత సమూహం లో చేర్చు కోవాలని నిర్ణయించనైనది
ఆంధ్రప్రదేశ్ లో ఉదయసాహితీ కమిటీ ఏర్పాటు మరియు విస్తరణ కోసం లింగుట్ల వెంకటేశ్వర్లు (తిరుపతి )ని కన్వీనర్ గా, సింగరాజు శ్రీనివాస్ కుమార్ (నెల్లూరు) ని కో కన్వీనర్ గా నియమించనైనది.
మూర్తి శ్రీదేవి వందన సమర్పణతో ఉదయసాహితి సర్వ సభ్య సమావేశం ముగిసింది.
ఉదయసాహితి తెలంగాణ
(రాష్ట్ర నూతన కార్యవర్గం )
తేది 23 ఫిబ్రవరి రోజున ఖమ్మం లో జరిగిన ఉదయసాహితి తెలంగాణ సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీదాస్యం లక్ష్మయ్య ప్రకటించారు
గౌరవాధ్యక్షులు* : శ్రీ దాస్యం సేనాధిపతి (కరీంనగర్ )
అధ్యక్షులు* శ్రీదాస్యం లక్ష్మయ్య (పెద్దపల్లి )
ఉపాధ్యక్షులు
ఎన్. వి. రఘువీర్ ప్రతాప్ (నల్గొండ )
డా. పోరెడ్డి రంగయ్య (ఆలేరు )
డా. పల్లేరు వీరాస్వామి (వరంగల్ )
ఎర్రం రాజా రెడ్డి (కరీంనగర్ )
శ్రీపెరంబుదూరి లింబగిరి స్వామి (మెట్ పల్లి )
మహిళా ఉపాధ్యక్షులు*
డా. చీదేళ్ల సీతాలక్ష్మి (హైదరాబాద్ )
రమాదేవి కులకర్ణి (హైదరాబాద్ )
మద్దెల సరోజన (జగిత్యాల )
చిందం సునీత (కరీంనగర్ )
కటుకం కవిత (కోరుట్ల )
ప్రధాన కార్యదర్శి :
వురిమళ్ల సునంద (ఖమ్మం )
సహాయ కార్యదర్శులు*:
ఏడెల్లి రాములు (పెద్దపల్లి ) గుడ్లదొన సాయి చంద్రశేఖర్ (హైదరాబాద్ )
మేరుగు అనురాధ (వరంగల్ )
నగునూరి రాజన్న (కరీంనగర్ )
కోశాధికారి : శ్రీ తులసి వెంకట రమణాచార్యులు హైదరాబాద్ )
మహిళా కార్యదర్శి మూర్తి శ్రీదేవి (హైదరాబాద్ )
ప్రచార కార్యదర్శి*లక్ష్మీ పద్మజ దుగ్గరాజు (హైదరాబాద్ )
కార్యవర్గ సభ్యులు*:
నామా పురుషోత్తం (ఖమ్మం )
అల్లాడి శ్రీనివాస్ (మంచిర్యాల )
మేజర్ రేళ్ళ సంజీవ్ (కరీంనగర్ )
రమాదేవి బుక్కపట్నం (హైదరాబాద్ )వకుళ వాసు (వరంగల్ )
తాళ్లూరి లక్ష్మి (ఖమ్మం )
తుంబూరు జగన్మోహన్ (నిజామాబాదు )
పరిమి సత్య మూర్తి .(హైదరాబాద్ )
పులి జమున (మహబూబ్ నగర్ )
డా. బి. సుధాకర్ ( సిద్దిపేట ) ఉషశ్రీ వెగ్గలం (కరీంనగర్ )
గుర్రాల మాధవ్ (మెట్టుపల్లి )
విజయలక్ష్మి నాగరాజు (కరీంనగర్ )
బత్తిన గీతాకుమారి (ఖమ్మం )
ప్రత్యేక ఆహ్వానితులు*
లింగుట్ల వెంకటేశ్వర్లు
శింగరాజు శ్రీనివాస్ కుమార్
సావిత్రి రంజోల్కర్,
డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి ముద్దు వెంకటలక్ష్మి పత్తిపాటి రూపలత తదితరులు పాల్గొన్నారు.

నేటి విద్యాలయాలు అభివృద్ది..

నేటి విద్యాలయాలు అభివృద్ది.. భవిష్యత్తు దేశాభివృద్ధి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

విద్యాలయాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వికలాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ ద్వారా రూ.69 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ మరియు గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ పాఠశాల లో చదివి ఈరోజు జీవితంలో స్థిరపడిన హరీష్ నాకు పాత మిత్రుడని హరిష్ తో పాటు ఈ పాఠశాల లో చదివి జీవితంలో స్థిరపడ్డ వారి మాదిరిగానే మీరు మంచిగా చదువుకొని మీరు కూడా జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. ఆత్మన్యూనత భావం నుంచి ఆత్మవిశ్వాసానికి ఎదగడానికి మీరందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. వ్యతిరేక ఆలోచనలు చేయరాదని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ఈ పాఠశాలలో ఏమైనా అభివృద్ధి పనులు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. అంతకుముందు అంధుల ఆశ్రమ పాఠశాల లో చదివి వివిధ ప్రభుత్వ ప్రైవేటు శాఖలో ఉద్యోగాలు సాధించి జీవితం లో స్థిరపడిన పలువురు పూర్వపు విద్యార్థులను ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓ.రాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, రాములు యాదవ్, రమేష్ యాదవ్, ఏసు దాస్ , రఘురామిరెడ్డి ,తిరుమల వెంకటేష్, పాపారాయుడు, రాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version