14వ వార్డులో ఇందిరమ్మ గృహ ఇండ్ల భూమిపూజా.

14వ వార్డులో ఇందిరమ్మ గృహ ఇండ్ల భూమిపూజా

 

పరకాల నేటిధాత్రి

 

 

shine junior college

 

 

 

పరకాల పట్టణంలోని 14 వార్డులో ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన లబ్ధిదారులకు భూమిపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పట్టణ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ సోద అనితా రామకృష్ణ కాంగ్రెస్ పట్టణ అద్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,కుంకుమేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,మాజీ కౌన్సిలర్ మార్క ఉమా రఘుపతి,మాజీ మైనారిటి సెల్ అధ్యక్షులు ఎండీ అలీ హాజరై కొబ్బరికాయ కొట్టి నూతన నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటి సబ్యులు కొక్కిరాల స్వాతి,ఎండీ అమీనా,ఆకుల అశోక్,ఎండీ షఫీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శివాలయం నిర్మాణానికి 2లక్షల 16 వేల విరాళం.

శివాలయం నిర్మాణానికి 2లక్షల 16 వేల విరాళం.

చిట్యాల, నేటి ధాత్రి

 

 

Shine Junior Colleges

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామం లో నిర్మాణంలో వున్న శివ పంచాయతన ఆంజనేయ స్వామి ఆలయానికి శ్రీ&శ్రీమతి పాశికంటి రాజేందర్ వనమాల దంపతులు రూ.200116 అక్షరాల రెండు లక్షలు విరాళం గా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో గుడి చైర్మన్ రత్నాకర్ రెడ్డి గారు, కమిటీ సభ్యులు కొక్కుల సారంగం,చెక్క నర్సయ్య, మందల రాఘవరెడ్డి మరియు గ్రామ ప్రజలు అమరేందర్ రెడ్డి,ఓదెలు, కత్తెరసాల రాజయ్య,సాంబయ్య,అనగాని రాజయ్య పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలి.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలి…

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జెసికి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ కు భూపాలపల్లి టౌన్ పరిధిలోని బాల బాలికలకు వాహన సౌకర్యాలు కల్పిస్తే నీరు పేదలు అనగారిన కులాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కులాల చెందిన పిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఉంటుందని జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
దీనిని ఉద్యేసించి జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ తెలిపారు ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కూలినాటి చేసుకునే నిరుపేద కుటుంబాలకు వాళ్లకు పిల్లలు చదువుకునే కళ నెరవేరకపోగా పైసలు కట్టలేక అనేక రకాల ఇబ్బందులకు గురై ఆ పిల్లలు చదువుకు దూరమై అనేక రకాల వ్యసనాలకు బానిసవుతున్నారు వీటి నుంచి దూరం కావాలంటే ఇప్పుడే స్టార్టింగ్ స్కూలు ప్రారంభ దశలో ఉంది గనుక పిల్లలందరికీ వాహన సౌకర్యం కల్పిస్తే ఖచ్చితంగా స్కూలుకు వస్తారు ప్రభుత్వ స్కూళ్లలో మంచి చదువుకొని గొప్పవాళ్ళు అవుతారు భూపాలపల్లి టౌన్ లో వివిధ కాలనీలకు ప్రభుత్వ స్కూలు తరఫున వాహన సౌకర్యం గనుక కల్పిస్తే ఖచ్చితంగా బడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. దీనికి కలెక్టర్ ఎమ్మెల్యే సురవ తీసుకొని కచ్చితంగా వాహన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తునాం
ఈ కార్యక్రమం జిల్లా కమిటీ నాయకులు చిట్యాల శ్రీనివాస్ మందా రమేష్ పుల్ల అశోక్ జన్నే లక్ష్మణ్ పంగ మహేష్ చిర్ర శ్రీకాంత్ రవీందర్ పాల్గొన్నారు

18 న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్.

18 న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్.

చిట్యాల, నేటిధాత్రి ;

 

Shine Junior Colleges

 

 

చిట్యాల మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు బుధవారం 18వ తేదీన చిట్యాల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నామని మండల విద్యాధికారి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక కన్వీనర్ కొడెపాక రఘుపతి తెలిపారు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న (హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్ క్రీడా పాఠశాలలు) చిట్యాల మండలంలో ఉన్న బాల బాలికలు క్రీడా పాఠశాలలో 4వ తరగతి అడ్మిషన్ కొరకు 1 – 9 – 2016 నుండి 31 – 08 – 2017 మధ్యలో జన్మించిన బాల బాలికలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలలలో అడ్మిషన్ కొరకు చిట్యాల ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయని తెలపడం జరిగింది ఇది క్రీడల్లో రాణించాలనుకునే వారికి ఒక సువర్ణ అవకాశంగా తీసుకోవాలని మాట్లాడడం జరిగింది ఈ క్రీడా పాఠశాలల అడ్మిషన్ల ఎంపికలో షటిల్ రన్, మెడిసిన్ బాల్, వర్టికల్ జంప్, 800 మీటర్ల పరుగు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఎత్తు మరియు బరువు విభాగాలలో పరీక్షలు నిర్వహించి ఎంపికలు చేస్తామని ఈ మండల స్థాయి క్రీడా పాఠశాలల ఎంపికల కోఆర్డినేటర్ సూదం సాంబమూర్తి ఫిజికల్ డైరెక్టర్ మాట్లాడడం జరిగింది ఈ ఈ ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులు జనన ధ్రువీకరణ పత్రాలు స్టడీ సర్టిఫికెట్లు తీసుక రావాలి వివరాల కొరకు 9966992295 నెంబర్ లో సంప్రదించాలన్నారు

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పరకాల నేటిధాత్రి

 

 

 

Shine Junior Colleges

మున్సిపాలిటీ పరిధిలోని రెండోవార్డ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు బొచ్చు అనూష దశ్వంత్ రెండో వార్డులో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టి ఇల్లు నిర్మాణం కోసం ముగ్గు పోసి ప్రారంభించారు.గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని గత ప్రభుత్వం కేవలం అసమర్థ పాలన కొనసాగించినదని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకునే రీతిలో నడిపిస్తున్నదని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కట్టుకుని బాగుపడాలని అర్హులైన వారికి ఇండ్లు l మంజురు చేసి వారిని ఆదుకునే రీతిలో ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పరకాల మండల ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మడికొండ కవిత చంగల్ రావు, మడికొండ లలిత,బొచ్చు అనిల్,కాంగ్రెస్ నాయకులు బొచ్చు సంపత్,ఏం డి,హాజీ చుక్క శాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలి.

రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలి…

మంగపేట నేటిధాత్రి:

 

Shine Junior Colleges

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాహనదారులందరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు మన ప్రాణానికి ముప్పుగా మారుతున్నాయి ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం కావున ప్రజల విధిగా హెల్మెట్ ధరించి వాహన చట్టాలను గౌరవిస్తూ ప్రయాణం సాగించాలని మంగపేట పోలీస్ విజ్ఞప్తి చేశారు.
మంగపేట పోలీస్ పరిధిలో జరిగిన లోకధారథలో 70 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులో పైన్ మరియు పదిమందికి మూడు రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది అని కావున అందరూ హెల్మెట్ ధరించకుండా , ఆల్కహాల్ తాగి వాహనాలు నడపరాదని వాహన దారులకు పోలీసులు వారు విజ్ఞప్తి చేశారు.

బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలి.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలి

ఇస్లావత్ దేవన్ కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

Shine Junior Colleges

 

మంగళవారం రోజున ఉదయం 10:00 గంటలకు భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నేతృత్వంలో 8 ఇంక్లైన్ రోడ్ లో నూతనంగా చేపట్టనున్న సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, ఐ ఎన్ టి యు సి. నాయకులు మహిళా కాంగ్రెస్ ఆయా విభాగాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయగలరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

Shine Junior Colleges

భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, పద్దెనిమిది మంది లబ్దిదారులకు ఉత్తర్వుల మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అంతకుముందు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడైన పాలకుర్తి తిరుపతి – స్వప్న ఇంటి నిర్మాణ పనులను ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, మట్టి తీసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుపతి దంపతులకు ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు

ఈనెల 19న చలో హైదరాబాద్ విజయవంతం చెయ్యాలి.

ఈనెల 19న చలో హైదరాబాద్ విజయవంతం చెయ్యాలి

అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి:

ఈనెల 19న హైదరాబాద్ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సన్మాన సభ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకుడు అంబాల చంద్రమౌళి మాదిగ తెలిపారు జిల్లాలోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అంబాల చంద్రమౌళి మాదిగ పిలుపునిచ్చారు సోమవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా ఈనెల 19న విహెచ్ పిఎస్ సంఘo ఆధ్వర్యంలో వికలాంగులు పెద్ద ఎత్తున సన్మానం చేయబోతున్నారని తమకు సమాజంలో ప్రత్యేక గుర్తింపును తీసుకొని వచ్చి అనేక హక్కులను సాధించి పెట్టిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పట్ల కృతజ్ఞత భావంతో వికలాంగులు ఈ సన్మాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వారికి చేయూతనందించాల్సిన బాధ్యత ఎమ్మార్పీఎస్ అన్ని అనుబంధ సంఘాల నాయకుల మీద ఉంది కనుక మనలో జిల్లా మండల స్థాయిలో ఎదిగిన నాయకులు నాయకురాలు తక్షణమే తమ సొంత గ్రామాలలోని వికలాంగులను సమన్వయం చేసి వాహనం ఏర్పాటు చేసి వారిని పెద్ద ఎత్తున జాగ్రత్తగా హైదరాబాద్ కు తరలించాలని వివిధ మండలాలలో ఇన్చార్జులుగా కొనసాగుతున్న వారు ఫోన్లో ద్వారా తమ సొంత గ్రామాలలోని వికలాంగులను మాట్లాడి హైదరాబాద్కు తరలించే విధంగా అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాలని మన అధినేత మంద కృష్ణ మాదిగ మీద ఎంతో అభిమానంతో వికలాంగులు చేస్తున్న సన్మాన సభను విజయవంతం చేయాలని చంద్రమౌళి మాదిగ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ
నియోజకవర్గ ఇన్చార్జి అంతడుపుల సురేష్ మాదిగ
బట్టువిజయకుమార్
మేకల రమేష్ మాదిగ
ఎంవైఎస్ జిల్లా అధ్యక్షులు
మంద తిరుపతి
ఎర్ర భద్రయ్య మాదిగ
సిరిపంగ చంటి మాదిగ
ఓనపకల కుమార్ మాదిగ
అంతడుపుల చందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గా బోలి బాబు నియామకం.

ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గా బోలి బాబు నియామకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

 

ఎమ్మార్పీఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల ఇన్చార్జిగా బోలి బాబు మాదిగను నియమించడం జరిగిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ లు పోగు వెంకటేశ్వరరావు మాదిగ, రుద్రారపు రామచంద్ర మాదిగ, సుంచు రాజు మాదిగలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బోలి బాబు మాదిగ సొంత గ్రామము జయశంకర్ జిల్లా ఘన్పూర్ మండల్ వాస్తవాడైన ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల చంద్ర మొగిలి మాదిగ, జిల్లా సీనియర్ మాదిగ, నోముల శ్రీనివాస్ మాదిగ, దోర్నాల రాజేందర్ మాదిగలకు ఎమ్మార్పీఎస్ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ..

 

Shine Junior Colleges

 

 

 

గౌరవ శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు ఆదేశాలను నేను పాటిస్తున్న రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాలను వమ్ము చేయకుండా చిట్యాల మండలంలో మండలంలో అన్ని గ్రామాలు సందర్శించి..

 

 

గ్రామ కమిటీల పునర్మానం చేపట్టి..

 

గ్రామ గ్రామాన జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ జెండా పండుగను విజయవంతం జరిగేలా కృషి చేస్తానన్నారు.

సొంత డబ్బులతో నోట్ బుక్స్ పంపిణీ.

సొంత డబ్బులతో నోట్ బుక్స్ పంపిణీ

నిజాంపేట నేటి ధాత్రి:

 

విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఉపాధ్యాయులు దశరథం అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు దశరథం తన సొంత డబ్బులతో 200 నోట్ బుక్స్, పెన్సిల్, పెన్నులను విద్యార్థులకు అందించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. విద్యార్థులు బౌషత్తులో మంచి స్థాయిలో ఉండలని కోరుకుంటున్ననారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, ఉపాధ్యాయులు గణేష్, షాదులు కార్యదర్శి భాగ్యలక్ష్మి, మ్యాదరి నర్సిములు తదితరులు ఉన్నారు.

ప్ర‌భాస్‌.. ది రాజా సాబ్ టీజ‌ర్ వ‌చ్చేసింది!

ప్ర‌భాస్‌.. ది రాజా సాబ్ టీజ‌ర్ వ‌చ్చేసింది!

 

 

 

ఎడాదిగా ప్ర‌భాస్ రాజా సాబ్ మూవీ నుంచి అప్డేట్ ఎప్పెడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ కోరిక‌కు ఎట్ట‌కేల‌కు ఎండ్ కార్డ్ ప‌డింది.

 

దాదాపు ఓ ఎడాదిగా ప్ర‌భాస్ (Prabhas) రాజా సాబ్ (The Raja Saab) మూవీ నుంచి అప్డేట్ ఎప్పెడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ కోరిక‌కు ఎట్ట‌కేల‌కు ఎండ్ కార్డ్ ప‌డింది.
హైద‌రాబాద్ ప్ర‌సాద్ ఐ మాక్స్ లో ఉద‌యం 10.51 నిమిషాల‌కు ది రాజా సాబ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.
ప్ర‌భాస్ మొట్ట మొద‌టి సారి హ‌ర్ర‌ర్ జాన‌ర్, డ‌బుల్ రోల్‌ చేయ‌డం, ఇప్పటికే
ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ మరింత ఆసక్తిని రేకెత్తించాయి.

ఇప్ప‌టికే.. ముంద‌స్తుగా రిలీజ్ చేసిన‌ ప్రీ టీజర్ సెన్షేష‌న్ అవ‌గా తాజాగా సోమ‌వారం విడుద‌ల కానున్న టీజ‌ర్పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఆ ప్రీ టీజర్ లో క‌థానాయిక‌లు మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ (Riddhi Kumar) స‌హా చాలా మంది ఆకాశాన్ని చూస్తూ షాక్ కు గురి అవుతున్న‌ట్లు చూయించారు.
ఆ షాట్ సోష‌ల్ మీడియాలోహైలైట్ అయింది.
అయితే టీజ‌ర్ విడుద‌ల సంద‌ర్బంగా ఐమాక్స వ‌ద్ద జాత‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.
వేల‌ల్ఓ ప్ర‌భాస్‌ఫ్యాన్స్ త‌ర‌లి వ‌చ్చి అక్క‌డ ప్ర‌భాస్ చిత్ర ప‌టాల‌కు పాలాభిషేకం చేయ‌డంతో పాటు పెద్దెత్తున బాణా సంచా పేల్చి హంగామా చేశారు.

ఇదిలాఉంటే..

సినిమా టీజ‌ర్‌ను చూస్తే అభిమానుల‌కు ఓ పండ‌గే అనేలా ఉంది.

హ‌ర్ర‌ర్ సీక్వెన్సులు, కామెడీ బాగా వ‌ర్కౌట్ అయిన‌ట్లు తెలుస్తుంది.

విజువ‌ల్స్, త‌మ‌న్ సంగీత కూడా సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేలా ఉన్నాయి.

ప్రభాస్ ఈ సినిమాలో తాతమనవడిగా డబుల్ రోల్ చేస్తుండ‌గా ఆయ‌న స‌ర‌స‌న నిధి ఆగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్‌, రిద్ధి కుమార్ న‌టిస్తున్నారు.

కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మారుతి (Director Maruthi) డైరెక్ట్ చేయ‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై విశ్వ ప్ర‌సాద్ నిర్మించారు.

డిసెంబ‌ర్‌5న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది.

కామ్రేడ్ యాకయ్య ఆకస్మిక మరణం పేదల పోరాటాలకు తీరనిలోటు.

కామ్రేడ్ యాకయ్య ఆకస్మిక మరణం పేదల పోరాటాలకు తీరనిలోటు

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

యాకయ్య మృతదేహానికి ఎర్ర జెండా కప్పి పూలమాలలు ఘన నివాళులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

ఎంసిపిఐ(యు) డివిజన్ కమిటీ సభ్యుడు పట్టణ నాయకుడు కామ్రేడ్ కుక్కల యాకయ్య ఆకస్మిక మరణం పేద ప్రజల ఉద్యమాలకు తీరని లోటని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.
నర్సంపేట పట్టణంలోని జ్యోతిబసు నగర్ లో అమరజీవి కామ్రేడ్ కుక్కల యాకయ్య అనారోగ్యంతో ఆకస్మికంగా ఆయన స్వగృహంలో చనిపోగా మృతదేహాన్ని సందర్శించి పార్టీ ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ యాకయ్య పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడిగా నర్సంపేట పట్టణ నాయకుడిగా పనిచేసాడని అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎర్ర జెండా పట్టి నిరంతరం పోరాడిన నిస్వార్థ జీవి అని ఆయన లేని లోటు పార్టీకి ప్రజా ఉద్యమాలకు ఎనలేనిదని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమరజీవి కామ్రేడ్ కుక్కల యాకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబూరావు వంగల రాగసుధ యుపిఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు ఎండి మాశూక్, డివిజన్ కమిటీ సభ్యులు మోటం సురేష్, బండారి మల్లేశం, జ్యోతిబస్ నగర్ కాలనీవాసులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ.

మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ…

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిబాపూ పూలే ఆలోచన విధానం తో బిసి లు అందరూ ఐక్యవేదిక కిందికి రావాలని బీసీ బంధువుల సమక్షంలో సిరిసిల్ల జిల్లా శాఖ గాంధీ చౌక్ లోను మాస్ కన్వీనర్ వెంగల లక్ష్మణ్ జెండా ఆవిష్కరించారు.పాత బస్టాండ్ నేతన్న సాక్షిగా కన్వీనర్ డాక్టర్ జనపాల శంకరయ్య జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దొంత ఆనందం గారు ,రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటి యాదవ్ ,పాల్గొని విద్యార్థుల విద్యా ఉద్యోగాల అవకాశాలలో బీసీలకు కేటాయించిన సీట్లు తారుమారు కాకుండా ఉండాలంటే బీసీలు ప్రశ్నించే తత్వం డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ ఎంతోమంది బీసీ జనాభా ఉన్న అనైక్యత కారణంగానే ప్రశ్నించే తత్వం లోపించడం వల్లే ఎవరికో వంత పాడుతూ తిరగడం వల్లే బీసీల అనైక్యత చోటుచేసుకుందని ఈ కట్లను వదిలించుకొని ఐక్యంగా ముందుకు సాగితే అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగుతుందని వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలంతా ఐక్యమైతే మనదే రాజ్యాంగ మై మన ఆత్మగౌరవాన్ని కాపాడు కుంటా మన్నారు అందుకు ఒక గేయాన్ని కోశాధికారి దొంత దేవదాస్ అందరూ పిలువ గానే తమ పనులను వదులుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు ఏనుగుల ఎల్లయ్య మాట్లాడుతూ అందరిని ఏకమైతే అధికారం సొంతమవుతుందన్నారు. కోడం నారాయణ బీసీ లందరూ సమైక్యత సాధిస్తే సాధికారం అందుతుందన్నారు. వెంగళ శ్రీనివాస్
గజ్జల్లి రామచంద్రం, ముత్తయ్య గౌడ్, కైరం కొండ నర్సింగ్ గంగపుత్ర రాష్ట్ర కార్యదర్శి,బూర దేవానందం, తడుక శ్రీహరి, దుంపటి కిషన్, మిరియాలు లక్ష్మణరావు,బాల రామస్వామి, మిరియాలుకార్,మేన రాములు, లైసెట్టి వెంకటేశం వడ్లకొండ తిరుపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేటీఆర్ కి మద్దతుగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు.

కేటీఆర్ కి మద్దతుగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు విచారణకు హాజరవుతున్న కేటీఆర్ కి మద్దతుగా జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ తరలి వెళ్లారు. ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ.. కేటీఆర్ పై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కాళేశ్వరంలో అవకతవకల ప్రచారంపై ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మళ్లీ ఫార్ములా ఈ రేసుపై తిరిగి విచారణ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

స‌రిపోయారు ఇద్ద‌రు.. సురేఖా, సుప్రీత‌ డ‌బుల్ డోస్‌.

స‌రిపోయారు ఇద్ద‌రు.. సురేఖా, సుప్రీత‌ డ‌బుల్ డోస్‌

 

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ సురేఖా వాణి, అమె ముద్దుల త‌న‌య సుప్రీత మ‌రోమారు సోష‌ల్‌ మీడియా దుమ్ము దులిపేస్తున్నారు.

 

 

 

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ సురేఖా వాణి (Surekha Vani), అమె ముద్దుల త‌న‌య సుప్రీత (Supritha) మ‌రోమారు సోష‌ల్‌ మీడియా దుమ్ము దులిపేస్తున్నారు. రీసెంట్‌గా.. ఇద్ద‌రు క‌లిసి వెకేష‌న్ వెళ్లిన వారు అక్క‌డ స‌ర‌దాగా గ‌డుపుతూ, ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్నారు.

 

ఈ క్ర‌మంలో త‌మ డ్రెస్సింగ్ స్టైల్‌లో హాట్ నెస్ పెంచి వీక్ష‌కుల‌కు అదిరే ట్రీట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు త‌మ ఇన్ స్టాలో షేర్ చేయ‌డంతో చూసిన వారంతా వారి గ్లామ‌ర్‌కు ఫిదా అవుతున్నారు.

 

ఈ దృశ్యాలు తిల‌కించిన‌ ఫాలోవ‌ర్లంతా స‌రిపోయారు ఇద్ద‌రు.. సాగుతుంది మీక‌లాగా అంటూ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలోని బామ డైలాగును వీరిద్ద‌రికి అన్వ‌యిస్తూ కామెంట్లు చేస్తునే ఒక‌టికి రెండు మార్లు ఆ చిత్రాలు చూసేస్తున్నారు.

 

ప్ర‌స్తుతం వీరి వీడియో, ఫొటోలు సామ‌జిక మాధ్య‌మాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వ‌య‌స్సుకు సంధం లేకుండా చాలా మంది వారి ఫొటోల‌కు లైక్‌లు కొడుతూ మీరిలాగే క‌ల‌కాలం హ్యాపీగా ఉండాల‌ని కోరుకుంటున్నారు.

 

రైతుకు చుక్కలు చూపిస్తున్న కౌలుదారుడు.

రైతుకు చుక్కలు చూపిస్తున్న కౌలుదారుడు…

రైతు కుటుంబంపై విచక్షణరహితంగా భౌతిక దాడులు..

మహిళా రైతుపై భౌతిక దాడి చేస్తే చర్యలు ఉండవా..?

మహిళల రక్షణ పట్ల కొత్త చట్టాలు తెస్తున్న ప్రభుత్వం… తుంగలో తొక్కుతున్న అధికారులు..

పలుమార్లు కేసులు పెట్టిన బాధితులు… దాడికి పాల్పడ్డ వారికి అండగా పోలీసులు..?

కోర్టు ఆదేశాలను ధిక్కరించి… నిర్లక్ష్యపు ధోరణిలో పోలీసులు..?

భూమి కొనుగోలుకు సాక్షులు వీరే.. ప్రస్తుతం దాడులు చేసేది వీరే..

ప్రాణాలు తీసిన దిక్కులేని స్థితిలో బాధిత రైతు కుటుంబం..

కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూమి కొనుగోలు రిజిస్ట్రేషన్, భూమి అగ్రిమెంటు ప్రకారం న్యాయం చేయాలని బాధిత రైతు కుటుంబం ఆవేదన..

ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు.. సివిల్ కేసుల పట్ల నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎస్సై రాజేష్ రెడ్డి..

నర్సంపేట నేటిధాత్రి:

తన వ్యవసాయ భూమిని మరో వ్యక్తికి అమ్ముకొని కౌలుదారు అవతారమెత్తిన ఒక వ్యక్తి పక్కనే ఉన్న ఒక రైతు కుటుంబానికి చుక్కలు చూపిస్తున్నాడు.తన సొంత భూమి ఉన్నప్పుడు పక్కనే ఉన్న రైతుతో సన్నిహితంగా ఉంటూ పక్కలో ఇప్పుడు బల్లెంల మారాడు.తనకున్న వ్యవసాయ భూమిని మరొక వ్యక్తికి అమ్ముకొని అదే భూమిని కౌలుకు చేస్తూ పక్కనే అన్న రైతు కుటుంబంపై భౌతికదాడులకు తెగబడుతున్నాడు. కౌలుదారు కొనుగోలు చేసిన వ్యక్తి ఆయనను పక్కనే అన్న రైతు కుటుంబంపై ఒసిగొలుపుతూ అంటిఅంటకుండా వ్యవహరిస్తున్నాడు.నిత్యం కౌలుడారుడు చేసే దౌర్జన్యాలు,భౌతిక దాడుల పట్ల పోలీస్ స్టేషన్ వెళ్తే పట్టించుకోవడం మాట దేవుడెరుగు గాని బాధిత రైతు కుటుంబాన్ని బైండోవర్ చేసి ముప్పుతిప్పలు పెడుతున్న పరిస్థితి నెలకొన్నది.కోర్టు ఉత్తర్వులు తెచ్చిన కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.ఈ వ్యవహారం మొత్తం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో జరుగుతున్నది.

పూర్తి వివరాల్లోకి వెళ్ళితే…. చెన్నారావుపేట ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు కుటుంబ సభ్యులు సామల శాంత సాంబయ్య దంపతులు అదే గ్రామం నుండి ముదిగొండ వైపు వెళ్లే కంకర రోడ్డుకు సుమారు 3 ఎకరాల వ్యవసాయ భూమిని గత రెండు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు.రోడ్డుకు ఉన్న వీరి భూమి కింది మొదటి బాగాన చీమల కర్ణాకర్ సంబంధించిన ఎకరం వ్యవసాయ భూమి ఉన్నది.అలాగే కర్ణాకర్ కింద భాగాన కావటి ముత్యాలు అనే రైతు ఎకరం భూమి ఉన్నది.ఈ ముగ్గురు రైతులు సాంబయ్య,కర్ణాకర్,ముత్యాలు వ్యవసాయ భూములకు నీటి సౌకర్యం కోసం పొత్తుల భావి సాంబయ్య,కర్ణాకర్ ల భూముల్లో ఉన్నది. ఐతే కావటి ముత్యాలు తన ఇంటి అవసరాల నిమిత్తం ఆ ఎకరం అమ్మకానికి నిర్ణయించుకున్నాడు.ముందుగా చీమల కర్ణాకర్ అనే రైతును భూమి అమ్మకం పట్ల తెలుపగా నేను కొనుగోలు చేయనని తేల్చి చెప్పేశారు.అనంతరం సామల శాంత సాంబయ్య రైతును అమ్మకం పట్ల అడుగగా వారు కొనుగోలు చేసేందుకు ఒప్పుకున్నారు.గ్రామ పెద్దల సమక్షంలో ఎకరాకు రూ.7 లక్షల 60 వేలకు మాట్లాడుకొని బయాన ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు.మరల కొద్ది రోజుల తర్వాత చీమల కర్ణాకర్ ఆ భూమిని నేను కూడా తీసుకుంటామని పెద్దనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు.అనంతరం ముత్యాలుకు సంబంధించిన సర్వే నంబర్ 399 గల ఎకరం భూమి సామల శాంత సాంబయ్య,చీమల కర్ణాకర్ అదే రేటు ప్రకారంగా ఒక్కొక్కరు 20 గంటల చొప్పున కొనుగోలు చేసుకున్నారు.ఐతే ఇద్దరి భూమి సమాన ఓకె విధంగా ఉండేందుకు గాను కర్ణాకర్ కు సంబంధించిన 20 గంటల భూమిని సామల సాంబయ్యకు కేటాయించిన కర్ణాకర్.. ముత్యాలు వద్ద ఇద్దరి పొత్తుల 2018 లో కొనుగోలు చేసిన ఎకరం భూమిని తనే తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు.ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో డాక్యుమెంట్ ప్రకారం సర్వే నంబర్ 399 తో చేర్చి వారి ఒప్పందంలో భాగంగా కర్ణాకర్ కు గల 20 గంటల భూమిని సాంబయ్యకు మారుస్తూ తూర్పున భూమి కొనుగోలు చేసిన సాంబయ్య భూమి ,ఉత్తరము రెడ్డబోయిన సాయిలు,పడమర చీమల కర్ణాకర్,దక్షణం వైపు వాగు ఉన్నట్లుగా హద్దులు నిర్ణయిస్తూ భూమిని సాంబయ్యకు రిజిస్ట్రేషన్ చేస్తూ కర్ణాకర్ సాక్షిగా ఉన్నారు.మొత్తం భూమిని వారివారి ఒప్పందాల ప్రకారం కావటి ముత్యాలు వద్ద ఇద్దరి పొత్తుల కొనుగోలు చేసిన ఒక ఎకరం భూమిని కర్ణాకర్ తన భూమితో కలిపి 1 ఎకరం 20 గంటల భూమిని సాగుచేసుకుంటున్నాడు.అలాగే సామల సాంబయ్య తన 3 ఎకరాల భూమితో పాటు అగ్రిమెంట్ కర్ణాకర్ తో కుదుర్చుకున్న 20 గంటల భూమితో కలిసి గత ఏడేండ్లుగా సాగు చేసుకుంటున్నాడు.అలాగే వాటాల ప్రకారంగా వ్యవసాయ బావిని వాడుకుంటున్నారు.గత సంవత్సరం నర క్రితం చీమల కర్ణాకర్ తన ఎకరం 20 గంటల భూమిని నగేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మకం చేశారు.పక్కనే ఉన్న లావన్ పట్టా భూమి గల వాగును దారి కోసం తన అధీనంలోకి తీసుకుందామని విక్రయదారులు కర్ణాకర్ తో ప్లాన్ చేయగా అది కాస్త బెడిసికొట్టింది.పైన రోడ్డు బాగం నుండి ఉన్న రైతు సామల శాంత సాంబయ్యను అడుగగా వారు ఒప్పుకోలేదు.ఎలాగైనా సాంబయ్య భూమి నుండి తన భూమిలోకి దారి తీసుకోవాలని కర్ణాకర్ ను నగేష్ ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.ఐతే అదే భూమిని నగేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి అమ్మకం చేసిన కర్ణాకర్ కు కౌలుకు ఇచ్చాడు.దీంతో సాంబయ్య భూమిలో నుండి ఎలాగైనా దారి పొందాలని భావించిన క్రయ విక్రయ దారులు రంగం సిద్ధం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో భూమిని విక్రయించిన చీమల కర్ణాకర్.

అదే భూమికి కౌలుదారుగా అవతారమెత్తాడు.గత ఏడు సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న సాంబయ్య కుటుంబంపై దాడులకు పాల్పడటం మొదలుపెట్టారు.మీరు సాగుచేసుకుంటున్న 20 గంటల భూమి మాదే అంటూ 2024 జనవరి నెలలో సామల శాంత సాంబయ్య దంపతులపై దాడి చేసి వ్యవసాయ బావికి సంబంధించిన మోటార్,స్టార్టర్ లను చీమల కర్ణాకర్,అతని సోదరుడు సతీష్ లు ధ్వంసం చేశారు.వెంటనే బాధితులు స్థానిక చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.కొద్ది రోజులకే మొక్కజొన్న పంటపై కర్ణాకర్,సతీష్ లు గడ్డిమందు ప్రయోగం చేశారు.మరల బాధితులు శాంత సాంబయ్య దంపతులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.మరుసటి రోజున అదే మొక్కజొన్న పంటను ట్రాక్టర్ తో ఫాల్టర్ కొట్టించి దున్నించి నాపై కర్ణాకర్,సతీష్ లు మహిళా అనే ఇంగీతజ్ఞానం లేకుండా విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితురాలు సామల శాంత ఆరోపించారు.ఐనప్పటికీ పోలీస్ స్టేషన్ చేసిన పిర్యాదు మేరకు ఎస్సై,సీఐలు వ్యవసాయ భూమివద్ద విచారణ చేపట్టగా సాక్షులు కూడా తమదే న్యాయం అని పోలీస్ అధికారులకు తెలిపారని వాపోయారు.తీవ్రంగా గాయాలపాలైన మమ్మల్ని ఆస్పత్రికి వెళ్ళనివ్వకుండా మా దాడికి పాల్పడ్డ వారికి సహకరిస్తూ మండల రెవెన్యూ అధికారి వద్ద బైండోవర్ చేయించారని బాధిత రైతు కుటుంబం సభ్యులు శాంత సాంబయ్యలు అవేదన వ్యక్తం చేశారు.పెద్ద మనుషుల ఒప్పందం,భూమి అగ్రిమెంట్,రిజిస్ట్రేషన్ లో హద్దుల ప్రకారంగా తమకే భూమి చెందుతుందని కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకొని భూమి సాగుచేసుకుంటున్న క్రమంలో సతీష్ , కర్ణాకర్ లు నానా దుర్భాషలాడుతూ, వెంట్రుకలు పట్టుకుని విచక్షణారహితంగా కొట్టారని మహిళా రైతు సామల శాంత రోదిస్తూ తెలిపారు.ఈ నేపథ్యంలో వారిపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మా కుటుంబాన్ని పట్టించుకోవడంలేదని బాధితులు శాంత సాంబయ్యలు అవేదన వ్యక్తం చేశారు.భూమితో వారికి ఎలాంటి సంబంధం లేకున్నా కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నగేష్ సహకారంతో నిత్యం భయాందోళనల కల్పిస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.మా కుటుంబంపై దాడి చేసిన చీమల సతీష్ ,కర్ణాకర్ లపై పిర్యాదులు చేస్తే భూమి కొనుగోలు చేసిన నగేష్ తో సెటిల్ చేసుకోండని ఎస్సై రాజేష్ రెడ్డి తెలుపుతున్నారని బాధిత రైతు కుటుంబం శాంత సాంబయ్యలు ఆరోపించారు.ఎన్నిసార్లు పిర్యాదు చేసిన కానీ సతీష్ , కర్ణాకర్ లకు అండగా ఉంటూ మా ఫిర్యాదుల పట్ల

తూ తూ మంత్రంగా కేసులు నమోదు చేసి మాపై నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు.మా కుటుంబంపై జరుగుతున్న సంఘటనల పట్ల పోలీస్ కమిషనర్,నరంపేట ఏసిపిలకు పిర్యాదులు చేయనున్నట్లు బాధిత రైతు కుటుంబం సామల శాంత సాంబయ్యలు తెలిపారు.

ఇరువురి ఫిర్యాదులతో కేసులు చేసిన..సివిల్ కేసుల పట్ల నాకు సంబంధం లేదు… చెన్నారావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి..

చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సామల శాంత సాంబయ్య అనే రైతులు,అదే గ్రామానికి చెందిన చీమల కర్ణాకర్,సతీష్ అలాగే నగేష్ అనే వ్యక్తుల మధ్య భూ తగాదాల గొడవలు జరుగుతున్నాయి.ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు.ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినం అని ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు.భూ తగాదాలు సివిల్ కేసుల పట్ల నాకు ఎలాంటి సంబంధం లేదని నేటిధాత్రి ప్రతినిధి అడిగిన వివరణకు ఎస్సై రాజేష్ రెడ్డి సమాధానం చెప్పారు.

కూతురి ప్రేమతో తల్లి కి సత్కారం.

కూతురి ప్రేమతో తల్లి కి సత్కారం

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

 

భవాని సాహిత్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో పితృదినోత్సవం సందర్భంగా  నాన్నకు ప్రేమతో. కవితా సంకలనం పుస్తకం లో నాన్న గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ (ఉషోదయ భానుడు నాన్న)అనే అంశంపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కవయిత్రి తాళ్లపల్లి భాగ్యలక్ష్మి కవితా గానం చేసినందుకు గాను సభఅధ్యక్షులు, నాన్నకు ప్రేమతో కవితా సంపుటి సంపాదకులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, ముఖ్య అతిథి ఎన్వీ రఘువీర్ ప్రతాప్, విశిష్ట అతిథులు కృషిరత్న బుస్స శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయులు నరహరి లక్ష్మారెడ్డి, సమీక్షకులు
కూర చిదంబరం, ఆధ్యాత్మికవేత్త బొమ్మకంటి కిషన్,తెలుగు సాహితీవేత్త ,విమర్శకులు
డాక్టర్ మోతుకుల నారాయణ గౌడ్ చేతుల మీదుగా ప్రముఖ తెలుగుసాహితీవేత్త,
కవి,రచయిత్రి శ్రీమతి తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (ఝాన్సీ) ఆమె తల్లి శ్రీమతి తాళ్లపల్లి బాలవ్వలను ఆత్మీయతతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవయిత్రి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్.

కేటీఆర్ గారికి మద్దతుగా హైదరాబాద్ తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

◆ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు. డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,బి ఆర్ ఎస్ నాయకులు

◆ రాష్ట్ర మాజి మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో CBI ఎదుట హాజరవుతున్న సందర్భంగా వారికి మద్దతుగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కి చేరుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు జహీరాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప‌రిపాల‌న‌లో విఫ‌ల‌మైన కాంగ్రెస్ పార్టీ కావాల‌నే ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను త‌ప్పుడు కేసుల్లో ఇరికించి విచార‌ణ పేరుతో ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఫార్ములా – ఈ రేసు కేసులో మ‌ళ్లీ కేటీఆర్‌ గారికి ACB నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండించారు.

ఎమ్మెల్యే గారితో పాటు గా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,నాల్కల్ మండల మాజీ జడ్పిటిసి స్వప్న భాస్కర్,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్,మాజీ పట్టణ అధ్యక్షులు మోహియుద్దీన్,మాజీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,మొగుడంపల్లి మండల పార్టీ జనరల్ సెక్రెటరీ గోపాల్,జహీరాబాద్ మండల బీసీల అధ్యక్షులు అమిత్ కుమార్,మాజీ సర్పంచ్ లు బస్వరజ్,ప్రభు పటేల్ నాయకులు ప్రవీణ్ కుమార్,అశోక్ పాటిల్,రాథోడ్ భీమ్రావు నాయక్, వసీం తదితరులు.

నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో.

నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం మాజి ఎంపీటీసీ రజినీ సంతోష్ మల్లిపాటెల్ గార్ల ఆహ్వానం మేరకు కక్కర్వాడ గ్రామంలో నిర్వహించిన నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ ,పూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఝరసంఘం పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా,మాజి సర్పంచ్ భోజి రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version