మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ…
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిబాపూ పూలే ఆలోచన విధానం తో బిసి లు అందరూ ఐక్యవేదిక కిందికి రావాలని బీసీ బంధువుల సమక్షంలో సిరిసిల్ల జిల్లా శాఖ గాంధీ చౌక్ లోను మాస్ కన్వీనర్ వెంగల లక్ష్మణ్ జెండా ఆవిష్కరించారు.పాత బస్టాండ్ నేతన్న సాక్షిగా కన్వీనర్ డాక్టర్ జనపాల శంకరయ్య జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దొంత ఆనందం గారు ,రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటి యాదవ్ ,పాల్గొని విద్యార్థుల విద్యా ఉద్యోగాల అవకాశాలలో బీసీలకు కేటాయించిన సీట్లు తారుమారు కాకుండా ఉండాలంటే బీసీలు ప్రశ్నించే తత్వం డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ ఎంతోమంది బీసీ జనాభా ఉన్న అనైక్యత కారణంగానే ప్రశ్నించే తత్వం లోపించడం వల్లే ఎవరికో వంత పాడుతూ తిరగడం వల్లే బీసీల అనైక్యత చోటుచేసుకుందని ఈ కట్లను వదిలించుకొని ఐక్యంగా ముందుకు సాగితే అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగుతుందని వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలంతా ఐక్యమైతే మనదే రాజ్యాంగ మై మన ఆత్మగౌరవాన్ని కాపాడు కుంటా మన్నారు అందుకు ఒక గేయాన్ని కోశాధికారి దొంత దేవదాస్ అందరూ పిలువ గానే తమ పనులను వదులుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు ఏనుగుల ఎల్లయ్య మాట్లాడుతూ అందరిని ఏకమైతే అధికారం సొంతమవుతుందన్నారు. కోడం నారాయణ బీసీ లందరూ సమైక్యత సాధిస్తే సాధికారం అందుతుందన్నారు. వెంగళ శ్రీనివాస్
గజ్జల్లి రామచంద్రం, ముత్తయ్య గౌడ్, కైరం కొండ నర్సింగ్ గంగపుత్ర రాష్ట్ర కార్యదర్శి,బూర దేవానందం, తడుక శ్రీహరి, దుంపటి కిషన్, మిరియాలు లక్ష్మణరావు,బాల రామస్వామి, మిరియాలుకార్,మేన రాములు, లైసెట్టి వెంకటేశం వడ్లకొండ తిరుపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.