కామ్రేడ్ యాకయ్య ఆకస్మిక మరణం పేదల పోరాటాలకు తీరనిలోటు
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
యాకయ్య మృతదేహానికి ఎర్ర జెండా కప్పి పూలమాలలు ఘన నివాళులు.
నర్సంపేట,నేటిధాత్రి:
ఎంసిపిఐ(యు) డివిజన్ కమిటీ సభ్యుడు పట్టణ నాయకుడు కామ్రేడ్ కుక్కల యాకయ్య ఆకస్మిక మరణం పేద ప్రజల ఉద్యమాలకు తీరని లోటని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.
నర్సంపేట పట్టణంలోని జ్యోతిబసు నగర్ లో అమరజీవి కామ్రేడ్ కుక్కల యాకయ్య అనారోగ్యంతో ఆకస్మికంగా ఆయన స్వగృహంలో చనిపోగా మృతదేహాన్ని సందర్శించి పార్టీ ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ యాకయ్య పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడిగా నర్సంపేట పట్టణ నాయకుడిగా పనిచేసాడని అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎర్ర జెండా పట్టి నిరంతరం పోరాడిన నిస్వార్థ జీవి అని ఆయన లేని లోటు పార్టీకి ప్రజా ఉద్యమాలకు ఎనలేనిదని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమరజీవి కామ్రేడ్ కుక్కల యాకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబూరావు వంగల రాగసుధ యుపిఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు ఎండి మాశూక్, డివిజన్ కమిటీ సభ్యులు మోటం సురేష్, బండారి మల్లేశం, జ్యోతిబస్ నగర్ కాలనీవాసులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.