మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ.

మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ…

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిబాపూ పూలే ఆలోచన విధానం తో బిసి లు అందరూ ఐక్యవేదిక కిందికి రావాలని బీసీ బంధువుల సమక్షంలో సిరిసిల్ల జిల్లా శాఖ గాంధీ చౌక్ లోను మాస్ కన్వీనర్ వెంగల లక్ష్మణ్ జెండా ఆవిష్కరించారు.పాత బస్టాండ్ నేతన్న సాక్షిగా కన్వీనర్ డాక్టర్ జనపాల శంకరయ్య జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దొంత ఆనందం గారు ,రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటి యాదవ్ ,పాల్గొని విద్యార్థుల విద్యా ఉద్యోగాల అవకాశాలలో బీసీలకు కేటాయించిన సీట్లు తారుమారు కాకుండా ఉండాలంటే బీసీలు ప్రశ్నించే తత్వం డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ ఎంతోమంది బీసీ జనాభా ఉన్న అనైక్యత కారణంగానే ప్రశ్నించే తత్వం లోపించడం వల్లే ఎవరికో వంత పాడుతూ తిరగడం వల్లే బీసీల అనైక్యత చోటుచేసుకుందని ఈ కట్లను వదిలించుకొని ఐక్యంగా ముందుకు సాగితే అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగుతుందని వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలంతా ఐక్యమైతే మనదే రాజ్యాంగ మై మన ఆత్మగౌరవాన్ని కాపాడు కుంటా మన్నారు అందుకు ఒక గేయాన్ని కోశాధికారి దొంత దేవదాస్ అందరూ పిలువ గానే తమ పనులను వదులుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు ఏనుగుల ఎల్లయ్య మాట్లాడుతూ అందరిని ఏకమైతే అధికారం సొంతమవుతుందన్నారు. కోడం నారాయణ బీసీ లందరూ సమైక్యత సాధిస్తే సాధికారం అందుతుందన్నారు. వెంగళ శ్రీనివాస్
గజ్జల్లి రామచంద్రం, ముత్తయ్య గౌడ్, కైరం కొండ నర్సింగ్ గంగపుత్ర రాష్ట్ర కార్యదర్శి,బూర దేవానందం, తడుక శ్రీహరి, దుంపటి కిషన్, మిరియాలు లక్ష్మణరావు,బాల రామస్వామి, మిరియాలుకార్,మేన రాములు, లైసెట్టి వెంకటేశం వడ్లకొండ తిరుపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజలు దైవచింతన అలవర్చుకోవాలి.

న్యాల్కల్: ప్రజలు దైవచింతన అలవర్చుకోవాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ప్రజలు దైవచింతన అలవర్చుకోవాలని మల్లయ్య గుట్ట పీఠాధిపతి డాక్టర్ బసవలింగ అవధూత గిరి మహారాజ్ చెప్పారు. న్యాల్కల్ మండలం మరియం పూర్ గ్రామంలో వీరభద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నేటి విద్యాలయాలు అభివృద్ది..

నేటి విద్యాలయాలు అభివృద్ది.. భవిష్యత్తు దేశాభివృద్ధి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

విద్యాలయాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వికలాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ ద్వారా రూ.69 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ మరియు గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ పాఠశాల లో చదివి ఈరోజు జీవితంలో స్థిరపడిన హరీష్ నాకు పాత మిత్రుడని హరిష్ తో పాటు ఈ పాఠశాల లో చదివి జీవితంలో స్థిరపడ్డ వారి మాదిరిగానే మీరు మంచిగా చదువుకొని మీరు కూడా జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. ఆత్మన్యూనత భావం నుంచి ఆత్మవిశ్వాసానికి ఎదగడానికి మీరందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. వ్యతిరేక ఆలోచనలు చేయరాదని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ఈ పాఠశాలలో ఏమైనా అభివృద్ధి పనులు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. అంతకుముందు అంధుల ఆశ్రమ పాఠశాల లో చదివి వివిధ ప్రభుత్వ ప్రైవేటు శాఖలో ఉద్యోగాలు సాధించి జీవితం లో స్థిరపడిన పలువురు పూర్వపు విద్యార్థులను ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓ.రాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, రాములు యాదవ్, రమేష్ యాదవ్, ఏసు దాస్ , రఘురామిరెడ్డి ,తిరుమల వెంకటేష్, పాపారాయుడు, రాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version