కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక.

కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
ఇస్సీపేట కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి

నేటిధాత్రి మొగుళ్ళపల్లి

 

భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఇస్సిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పెండ్లి ఇంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమన్వయ కమిటీ సభ్యులు ఏలేటి శివారెడ్డి, మోటె ధర్మారావు, తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు. ఇసిపేటలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. తన నియ మకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజేశ్వరరావు ( రాజు), గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, ముకుందా రెడ్డి, కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా పొన్నాల ఆది రెడ్డి, ఎండిగ బొజ్జరాజు, ప్రధాన కార్యదర్శిగా గాజుల కుమారస్వామి, పెంతల కిరణ్ పాల్, కోశాధికారిగా పొన్నాల సుమన్, కార్యదర్శిగా పండుగ మల్లయ్య, ఓరుగంటి రఘు , కార్యవర్గ సభ్యులుగా దివిటీల సంపత్, మేడిద లింగారెడ్డి, ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ సీడ్స్ నూతన అధ్యక్షుడిగా.!

ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ నూతన అధ్యక్షుడిగా గందె వెంకటేశ్వర్లు

అసోసియేషన్ అభివృద్ధికి కృషిచేస్తా-గందే వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి

 

ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్స్ పేస్టిసైడ్స్ సీడ్స్ జిల్లా అధ్యక్షులు నాగూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా ఏకగ్రీవంగా అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రేటర్ గందె వెంకటేశ్వర్లు ను,ప్రధాన కార్యదర్శిగా నవత బ్రదర్స్ శివాజీ,కోశాధికారిగా మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Gande Venkateshwarlu

 

 

ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన నాగుర్ల వెంకటేశ్వర్లు కి ఎల్లవేళలా రుణపడి ఉంటు పరకాల పట్టణ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నాతోటి వ్యాపారస్తులకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.

దళితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని.

దళితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని
ఆగిన దళిత బంధు ఇవ్వాలని
…,. జిల్లా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి….

జమ్మికుంట :నేటిధాత్రి

 

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరుగుతున్న అక్రమాలు గురించి, హుజురాబాద్ నియోజకవర్గంలో నిలిపి వేయబడిన రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, స్పోర్ట్స్ గ్రౌడ్ పనులు వెంటనే ప్రారంభించాలి అని, దళితుల అందరికి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని కరీంనగర్ జిల్లాలో నిలిపివేయబడిన అభివృద్ది పనులను వెంటనే పూర్తి చేయాలని మరియు కరీంనగర్ జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన

MLA Padi Kaushik Reddy

ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ గారు, సుంకే రవిశంకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు గారు, జిల్లా అధ్యక్షులు GV రామాక్రిష్ణా రావు గారు. మరియు మాజీ మున్సిపల్ చెర్మన్ లు కౌన్సెలర్స్ మాజీ ఎంపీపీ లు మాజీ జడ్పీటీసీలు పాల్గొన్నారు

డీఎస్పీ కార్యాలయం రెన్యు వేషన్ ఎస్పీ కలెక్టర్.

డీఎస్పీ కార్యాలయం రెన్యు వేషన్ ఎస్పీ కలెక్టర్ తో కలసి ప్రారంభించిన ఎమ్మెల్యే

 

వనపర్తి నేటిధాత్రి :

 

శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర పాత భవనానికి రెన్యువేషన్ చేసిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో శాంతి భద్రతలు బాగుండాలంటే పోలీస్ శాఖకు మౌలిక సదుపాయాలు ఉండాలని అందుకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీస్ విషయంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వనపర్తి జిల్లాను అగ్రస్థానంలో ఉంచాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని అన్నారు.

ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో డీఎస్పీ కార్యాలయాన్ని రెనోవేషన్ చేయించి పునఃప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు.

భవనం రెనోవేషన్ కు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.

వనపర్తి పట్టణానికి, మండలాలకు పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తన స్వంత నిధుల నుండి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

జిల్లాలో కొత్తగా మూడు మండలాల్లో కొత్త తహసిల్దార్ కార్యాలయాలు ఒక్కోటి రూ 32 లక్షల వ్యయంతో నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, సంబంధిత మండలాల్లో స్టేషన్ హౌస్ ఆఫీస్ లు సైతం కొత్త భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా పట్టణంలో ఒక సర్కిల్ కార్యాలయం, మరో ఎస్. హెచ్. ఒ మంజూరు కు సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం పట్టణంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని, జిల్లా ఎస్పీ, డీఎస్పీ చొరవ చూపడం వల్ల నిధులు మంజూరు చేయడంతో రెనోవేషన్ అనంతరం నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ప్రభుత్వం నుండి అద్దె చెల్లించే బాధ కూడా తప్పిందని అన్నారు.

అదేవిధంగా పోలీస్ శాఖకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందు కు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగం, రాజకీయ నాయకులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ప్రజలకు శాంతి భద్రతల విషయంలో రాజీలేని కృషి చేస్తున్నామని అన్నారు.ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి వనపర్తి జిల్లాకు మంచిపేరు తెస్తామని అన్నారు
పోలీస్ శాఖకు అండగా నిలుస్తున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

అంతకు ముందు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి డీఎస్పీ వెంకటేశ్వర రావును గౌరవ ప్రదంగా తన కుర్చీలో కూర్చోబెట్టారు డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.

డీఎస్పీ వెంకటేశ్వర రావు, మార్కెట్ యార్డు చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎస్ ఎల్ ఏన్ మిడిదొడ్డి రమేష్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ టి శంకర్ ప్రసాద్ తహసీల్దార్ రమేష్ రెడ్డి, సి. ఐ లు, ఎస్సై లు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కక్ష్యలు..దుర్మార్గాలు.. దౌర్జన్యాలు చేయం.

‘కక్ష్యలు..దుర్మార్గాలు.. దౌర్జన్యాలు చేయం’

షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”

ఎమ్మెల్యే శంకర్ పై పూల వర్షం కురిపించిన గ్రామస్తులు.

37 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు – శంకుస్థాపన కార్యక్రమాలు

షాద్ నగర్/నేటి ధాత్రి

 

 

ఉమ్మడి మహబూబ్ నగర్.. ప్రస్తుత రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఇలాంటి రాజకీయాలు, కక్షలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేయమని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుందని వారి యోగక్షేమాలు చూస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో మంజూరైన 37 ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే శంకర్ తదితర శ్రేణులకు భారీ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శంకర్ ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో ఉన్నంత సేపు ఆయనపై అభిమానులు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా అట్టహాసంగా గ్రామస్తులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గులు పోసి పునాదులు తీశారు.

MLA Shankar.

శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ఇలాంటి కక్షలు దుర్మార్గాలు దౌర్జన్యాలకు పాల్పడనని ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని గత పాలకులు గ్రామంలో ఏమేం చేశారు ఎన్ని దౌర్జన్యాలు చేశారు అందరికీ తెలుసని వారి పేర్లు తీయదలుచుకోలేదని మీడియా ముఖంగా శంకర్ అన్నారు. ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చుతానని భరోసా ఇచ్చారు. గ్రామానికి చెందిన వై యాదయ్య యాదవ్ ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులకు ఎల్లవేళలా అండగా నిలుస్తారని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం జరుగుతుందో గ్రామాల్లో నిరూపిస్తున్నామని శంకర్ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పేదలకు ఇండ్లు సమకూరలేదని కాలయాపన చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు తప్ప సక్రమంగా పాలించలేదని ధ్వజమెత్తారు. నేడు గ్రామాలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయని ఉచిత బస్సు సిలిండర్ కరెంటు తోపాటు సన్నబియ్యాన్ని ప్రజలకు ఇచ్చి ప్రభుత్వం ఎంతో మేలు  చేసిందన్నారు.

రక్షణ శాఖకు 50 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు.

రక్షణ శాఖకు 50 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం

వనపర్తి నేటిధాత్రి:

 

 

 

చైనా పాకిస్తాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదుర్కొంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమీషా.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రక్షణ శాజకు 50 వేల కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ వనపర్తి న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ పై మాట్లాడుతూ ఇది ప్రపంచ దేశాలలోనే చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. ఏ దేశంలో రక్షణ రంగానికి కేటాయించని బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 7 లక్షల కోట్లు దాటిందని గతంలో ఉన్న 6.81 లక్షల కోట్లు ఉందని వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో మరో 50 వేల కోట్లు కేటాయించడం వల్ల రక్షణ రంగం బడ్జెట్ ఏడు లక్షల కోట్లకు దాటిపోతుందని ఆయన అన్నారు.

BJP State Council Member

 

భారత సరిహద్దులు నిరంతరం నిలువ నీడ లేకుండా ఎండ. వర్షం. చలి లెక్కచేయకుండా రక్షణ దళాలు దేశ రక్షణ కోసం కాపలా కాస్తున్నారని దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఎంతటికైనా త్యాగం చేస్తుందని అందుకే అధునాతన ఆయుధాల కొనుగోలు కోసం లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపుతూ వీరోచితంగా దేశ సైనికులు కుటుంబాలను వదులుకొని పనిచేస్తున్నారని దేశ సైనికులు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులలో 26 మంది ప్రయాణికులు మరణించడం నా తర్వాత జరిగిన పరిణామాల వల్ల పాకిస్తాన్ భారత్ మధ్యన జరుగుతున్న అంతర్గత పోరాటం అందరికీ తెలిసిన విషయం అయినా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రముకలను తుద ముట్టించడంలో పై చేయి సాధించిందని ఆయన అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగానికి దేశ సరిహద్దుల్లో భద్రత కాస్తున్న భద్రత దళాలకు ఈ బడ్జెట్ ధైర్యాన్ని నింపుతుందని సైనికులలో ఆత్మ సైర్యాని కోల్పోకుండా గుండె ధైర్యం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.బడ్జెట్ మరింత పెంచినందుకు భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి దేశ ప్రజల తరపున ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ కి మున్నూర్ రవీందర్ కృతజ్ఞతలు  తెలిపారు

మండలం లో ఉన్న ఉగ్రవాదులను వెంటనే గుర్తించాలి.

మండలం లో ఉన్న ఉగ్రవాదులను వెంటనే గుర్తించాలి :-

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన మండల కేంద్రానికి చెందిన ఎండి ముజాహిద్ అనే వ్యక్తి మీద రామడుగు పోలీసు స్టేషన్ లో పిటీషన్ ఇవ్వడం జరిగినది.

 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని, భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

సాక్షాత్తు దేశ ప్రధాని జైలుకి వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో పెడితే ఇంటెలీజిన్స్ డిపార్ట్మెంట్ ఎంచేస్తుందని ప్రశ్నించారు.

 

పాకిస్థాన్ లో ఉన్నటువంటి అధైల్ జైల్ ఈవ్యక్తికి ఎలా తెలుసని, మరి అతడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

వెంటనే ఆవ్యక్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టి, అతడికి ఉన్న ఉగ్రవాద సంబంధాలు బయట పెట్టాలని కోరారు. మండలంలో ఉన్న పలు మదర్సలో ఇతర దేశస్తులు నివాసిస్తున్నారని వెంటనే వారిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

మోడీ మీద పోస్టు చేసిన ఈవ్యక్తి మీద వెంటనే దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని, అతడిని ప్రభుత్వ ఉద్యోగం విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈసందర్భంగా అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్లలో కి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

వెంటనే ఆవ్యక్తి మీద కేసు నమోదు చేయాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని బిష్మించుకొని ఉండడంతో కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు కారుపాకల అంజిబాబు, జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శి కడారి స్వామి

జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిట్టవేణి అంజిబాబు, బద్ధం లక్ష్మారెడ్డి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శిలు ఎడవెల్లి లక్ష్మణ్, బండారి శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు గోపు అనంత రెడ్డి, దయ్యాల వీరమల్లు, దైవల తిరుపతి, రాగం కనకయ్య, జంగిలి కరుణాకర్, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.

నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న.

నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామంలో పుసల్పహాడ్ తుకారం గంగమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మాజీ ఎంపీటీసీ శివ నంద శ్రీపతి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి యువజన నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

నాయకుని పరామర్శించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.!

ప్రమాదవశాత్తు గాయపడిన నాయకుని పరామర్శించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలానికి చెందిన టౌన్ బిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు జంగపల్లి. బిక్షపతి గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడం జరిగింది. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు . బొ ల్లి. రామ్మోహన్. పార్టీ నాయకులు కార్యకర్తలు . ఆయన. ఇంటికి వెళ్లి. పరామర్శించి మనోధైర్యం చెప్పి. బిఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పి. సంబంధిత విషయాన్ని మాజీ మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి తమకు అండగా ఉంటామని పార్టీ పరంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు . పరామర్శించిన వారిలో తంగళ్ళపల్లి టౌన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ .

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర వెంకటేష్ గౌడ్ జాతీయ సమైక్యతే లక్ష్యంగా..హిందూ భావజాల వ్యాప్తికై విద్యార్థి దశలోనే జాతీయ భావాలను అలవర్చుకొని..దేశ సమైక్యతే లక్ష్యంగా పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత చేరి..అనేకమంది విద్యార్థులను..ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది..విద్యారంగ సమస్యలపై అనేకమైన పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో విద్యార్థి పరిషత్ నాయకత్వం ఆయనకు వివిధ హోదాల్లో పని చేయడానికి అవకాశం కల్పించింది. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పటిష్టతకు విశేష కృషి చేస్తూ..ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ..ప్రభుత్వంపై పోరాటం చేస్తూ పార్టీ ఎదుగుదలకు విశేష కృషి చేస్తున్న క్రమంలో ఆయనను బిజెపి చిట్యాల మండల ప్రధాన కార్యదర్శిగా, అనంతరం బిజెపి మండల అధ్యక్షుడిగా నియమించింది. కాగా రెండవసారి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల సంస్థగత ఎన్నికల బుర్ర వెంకటేష్ గౌడ్ ను రెండవసారి భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, నాగపురి రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డి వెన్నంపల్లి పాపయ్యా ,కన్నం యుగదిశ్వర్, దొంగల రాజేందర్ ,మరియు జిల్లా మండల నాయకులకు వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టాన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తానన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలు…

మండేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండేపల్లి ప్రభుత్వ వయో ముద్దుల సమక్షంలో రాష్ట్ర రవాణా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వృద్ధులచే కేక్ కటింగ్ చేయించి వారికి పండ్లు పంపిణీ చేయడం జరిగిందని సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలిపారు భవిష్యత్తులో అన్ని రంగాలపై దృష్టి సారించి మంత్రి పొన్నం ప్రభాకర్ పనిచేస్తున్నారని రాష్ట్ర అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆయన పనితీరు ప్రశంసనీయమని కొనియాడుతూ పొన్నం ప్రభాకర్ కి దీర్ఘాయుష్ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎగుర్ల ప్రశాంత్. నరేష్. శ్యామ్. వేణు. శ్రీకాంత్. జ్యోతి. మౌనిక. అనిత. జ్యోతి . కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం లో సీఎం.

ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి గారు…

దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలి.

ఈ సమయంలో రాజకీయాలు, పార్టీ లకు తావు లేదు..

 

నేటి ధాత్రి

 

 

 

అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు .

ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలి..

మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి..

విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి..

ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు..

 

CM Revanth Reddy

 

 

24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి..

పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి..

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలి..

శాంతి భద్రతల కు భంగం కలుగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలి..

బ్లడ్ బ్యాంకు ల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలి…

అత్యవసర మెడిసిన్ సిద్దం చేసుకోవాలి..

ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి…

 

CM Revanth Reddy

 

రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలి..

ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలి..

సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలి.

ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలి…

ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉంది..

 

CM Revanth Reddy

 

ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి..

రాజధాని లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ను కమాండ్ కంట్రోల్ రూం కి అనుసంధానం చేయాలి…

అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలి..

హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భధ్రతను పెంచాలి..

ఐటీ సంస్థల దగ్గర భధ్రతను పెంచాలి…

హైదరాబాద్ నగరం లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి…

CM Revanth Reddy

 

అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలి…

హిస్టరీ షీటర్ లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలి…

మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు

గణపురం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, నిండు నూరేళ్ళు ప్రజా సేవలో, ప్రజా క్షేత్రంలో ప్రజల పక్షాన పనిచేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పోలసాని నరసింహా రావు, బీఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు మేకల రజిత, నాయకులు బైరాగాని కుమారస్వామి, డాక్టర్ జన్నయ్య, మంద అశోక్ రెడ్డి, దాసరి రవి, బీఆర్ఎస్ యూత్ నాయకులు, ఆయా గ్రామాల గ్రామ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు‌.

కేక్ కట్ చేసి, స్వీట్లను పంపిణీ చేస్తున్న BRS నాయకులు.

ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజానాయకుడు ఆపద వస్తే అండగా ఉండే నాయకుడు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘనంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి 60 వ జన్మదిన వేడుకలు

*-కేక్ కట్ చేసి, స్వీట్లను పంపిణీ చేస్తున్న బి ఆర్ఎస్ నాయకులు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

పేదల పెన్నిధిగా..ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని..ఆపదొస్తే అండగా ఉండే భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి జన్మదిన వేడుకలు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జడ్పిటిసి జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ లు కేక్ కట్ చేసి, సీట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన గండ్ర వెంకట రమణారెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, అభివృద్ధి అంటేనే గండ్ర వెంకట రమణారెడ్డి గుర్తుకు వచ్చేలా..భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే సున్నితమైన మనసు కలిగిన గండ్ర వెంకట రమణారెడ్డి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో..నిండు నూరేళ్లు..ఆయురారోగ్యాలతో..అష్టైశ్వర్యాలతో..మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజలకు మరిన్ని సేవలు చేసే యోగ్యం కల్పించాలని ఆ దేవున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం.

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దేశవ్యాప్తంగా జనగణన,కులగణన చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర ప్రకటించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ కమిటీ
అధ్యక్షులు గూడూరు సందీప్, పట్టణ నాయకులతో కలిసి పట్టణంలోని వరంగల్ రోడ్ సర్కిల్ లో గల అమరవీరుల స్థూపం దగ్గర ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.జనగణన దేశ అభివృద్ధికి మార్గదర్శిని,కులగణనతో అభివృద్ధిలో సమానతను తీసుకువచ్చే సాధనం అని అధ్యక్షులు గూడూరు సందీప్ పేర్కొన్నారు.జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని తలపెట్టిన జనగణనతో పాటు కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్ (చిన్న),జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిళ్ల రామచందర్, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శలు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత,ఉపాధ్యక్షులు కాసుల నాగేంద్రబాబు, ఠాకూర్ విజయ్ సింగ్, కార్యదర్శులు చేను నరేష్, సామల ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు పొనుగోటి రవీంద్ర చారి, దుగ్యాల సమ్మయ్య, ఠాకూర్ శివాంజన్ సింగ్, నూనె రంజిత్, రూరల్ నాయకులు బట్టు మదన్, తాళ్లపల్లి రాము, బూసాని సుదర్శన్, యువ మోర్చా జిల్లా ప్రధాన

కార్యదర్శి అచ్చ దయాకర్ ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, శ్రీనివాస్, కార్యదర్శి చిలువేరు అన్వేష్, నర్సంపేట యువ మోర్చా అధ్యక్షులు తప్పెట్ల సతీష్ మరియు తదితరులు  పాల్గొన్నారు.

ఘనంగా గండ్ర వెంకట రమణారెడ్డి పుట్టినరోజు వేడుకలు.

ఘనంగా గండ్ర వెంకట రమణారెడ్డి పుట్టినరోజు వేడుకలు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో ఘనంగా గండ్ర వెంకటరమ ణారెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకులు మండ ల కేంద్రంలో భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, ప్రజానా యకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డిమరియు మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వ ర్యంలో కూడలి వద్ద కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

 

Gangula Manohar Reddy.

 

 

అనంతరం గవర్న మెంట్ హాస్పిటల్ కి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

 

ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆయురా రోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆకాంక్షించారు.

Gangula Manohar Reddy.

ఈ కార్యక్ర మంలో మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మా రెడ్డి, మండల సోషల్ మీడి యా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మేకల వెంకటే శ్వర్లు,సవాసి రమేష్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, పసుల ప్రవీణ్, చిలుకయ్య, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మేకల శ్రీనివాస్, మాజీ సర్పంచులు వలపదాస్ చంద్రమౌళి, బొమ్మ కంటి సాంబయ్య, రఘుపతి రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లినందం, గడిపే విజయ్, ధైనంపల్లిసుమన్, పోతురమణారెడ్డి సావుళ్ళ కిష్టయ్య, నర్రరాజు, ఆకుల లక్ష్మణ్, కల్వాలశ్యామాజీ, అట్లతిరుపతి, రంగుమహేం దర్,కొమ్ముల రాకేష్,కరుణ్ బాబు, పైండ్లభానుచందర్, పైండ్లశంకర్, ఫైండ్లశ్రీనివాస్, కోగీలరవికిరణ్, కుతాటి రమేష్, మామిడి శంకర్, ప్రశాంత్, ఆదిరెడ్డి, నారాయణ రెడ్డి, రామరాజు, రమేష్ , మొగిలి,సుభాష్, వైద్యుల సాం బరెడ్డి, మస్కే సుమన్ , నాగరాజు ,దేవయ్య,రేణికుం ట్ల సంతోష్ ,కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన. !

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని,వరి ధాన్యం తడవకుండా తాడ్పల్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన.!

నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు

 

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి..

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెంలో 20 లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం కార్యాలయం స్థల దాతలు పోలెబోయిన కుటుంబస్తులు ప్రభాకర్ రావు, నరసింహారావు, కృష్ణమూర్తి, ముత్తయ్యను శాలువాతో సత్కరించి అభినందించారు, అనంతరం అన్ని శాఖల అధికారులతో పంచాయితీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యే ఈ సందర్బంగా ఆయా శాఖల అధికారులతో ప్రజల సమక్షంలోనే మాట్లాడి ఆయా పంచాయతీ పరిధిలో గల గ్రామలలో ప్రభుత్వం ప్రారంభించిన గ్యారెంటీ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేసారు అలాగే పంచాయతీలలో నీటి సరఫరా గురుంచి, కరెంటు సమస్యల గురుంచి, ఇరిగేషన్, విద్య, వైద్యం,అన్ని సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి వారం లోగ అన్ని సమస్యలు పరిష్కారం చేయాలనీ అదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు అర్హులయినా ప్రతీ ఒక్కరికి ఇప్పించే బాధ్యత తనదని తెలియజేశారు అలాగే ప్రజలకి ఎలాంటి కష్టం రాకుండా అధికారులతో పనులు చేపిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతీ పథకం అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా చూసుకునే బాధ్యత తనై చూసుకుంటానని అని ప్రజలకు హామీ ఇచ్చారు అనంతరం స్థానిక ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యే పాయం వినతి పత్రాలు అందజేశారు.

ఈ యొక్క కార్యక్రమానికి కరకగూడెం ఎమ్మార్వో నాగప్రసాద్ , ఎంపీడీవో దేవ వర కుమార్అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుసేన్ , మాజీ సర్పంచ్ పోలేబోయిన శ్రీవాణి,, మండల నాయకులు ఎర్ర సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా.

బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా దాసి శ్రావణ్ కుమార్

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో.బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా దాసి శ్రావణ్ కుమార్ ఎన్నుకున్నారు. అభివృద్ధి ప్రదాత ప్రజల సంక్షేమం కోసం భూపాలపల్లి మాజీశాసనస భ్యులుగండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షు రాలు గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో దాసి శ్రావణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా, ప్రకటించినందుకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాజీ జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి మండల నాయకులు గంగుల మనోహర్ రెడ్డి మెతుకు తిరుపతి రెడ్డి రామ్ శెట్టి లక్ష్మారెడ్డి మాజీ ఎంపిటిసి మాజీ సర్పంచ్ లకు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శి లకు, ఉపాధ్యక్షులకు బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు, యూ త్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జనగణన కులగనన చేసిన ఘనత బి జే పి కే

జనగణన కులగనన చేసిన ఘనత బి జే పి కే సాధ్యం..

బి జే పి జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్

మంగపేట నేటిధాత్రి :

 

మంగపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షుడు రావుల జానకిరామ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ….. దేశంలోని జనగణనలో కులగణనను చేయడం ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుందని నిరూపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నే అని ధీమా వ్యక్తం చేశారు. మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు పరిపాలించినా ఏనాడు కూడా జనగణన కుల గణనను చేయించిన దాఖల లు లేదని ఇంత బృహోత్కరమైన కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ నిర్వహించిన సందర్భంగా మండల నాయకులు అందరూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు యరంగారి వీరన్ కుమార్, గుండు రాజేష్, రామ గాని నరేందర్, బట్ట బాబురావు, కాసర్ల మల్లారెడ్డి, , సునీల్ కుమార్, గుండారపు రోహిత్ కుమార్, వై ప్రకాష్, కాక లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version