నాన్నకు ప్రేమతో చిరు సత్కారం
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
పితృదినోత్సవ సందర్భంగా భవానీ సాహితీ వేదిక కరీంనగర్ డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన నాన్నకు ప్రేమతో కవితాసంపుటి పుస్తకపరిచయ సభ కరీంనగర్ లో వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో జరిగినది. ఈ సందర్భంగా తెలుగు కవి, సాహితీ విమర్శకుడు
డాక్టర్ మోత్కుల నారాయణ గౌడ్ నాన్నపై కవితను చదివి సభికులను ఆహ్లాదపరిచారు. ఈ సందర్భంగా వారి నాన్నగారైన మోతుకుల పోచయ్య గౌడ్ ని సాహితీ వేదిక నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఇది పితృ దినోత్సవ0 సందర్భంగా కొడుకు తండ్రికి చేసిన సన్మానంగా ఆ సభలో ఉన్న తెలుగు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ ,దాస్యం సేనానధిపతి, ముఖ్య అతిథి ఎన్. వి రఘువీర్ ప్రతాప్, విశిష్ట అతిథి బుస్స శ్రీనివాస్, సమీక్షకులు కథకులు కూర చిదంబరం, విశ్రాంత ఉపాధ్యాయ సంఘ నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, టి. కిషన్ తదితర సాహితీవేత్తలు పాల్గొని సభను విజయవంతం చేశారు.