దివ్యాంగురాలుకు మూడు చక్రాల సైకిల్ పంపిణీ.

దివ్యాంగురాలుకు మూడు చక్రాల సైకిల్ పంపిణీ…

భూపాలపల్లి నేటిధాత్రి:

shine junior college

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు విలీన విద్య, బాలిక విద్య కార్యక్రమము భవిత కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కృష్ణ కాలనీలో ప్రధానోపాధ్యాయులు రమ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ సామాజ సమీకరణ సమన్వయకర్త సమ్మిళితవిద్య సమన్వయకర్త సామల రమేష్ భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానో ఉపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న హాజరై, కార్యక్రమం ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ దివ్యంగులకు విద్యాశాఖ అంధిస్తున్న సేవలను భవిత సెంటర్ గురించి బాలిక విద్యా గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా దివ్యాంగురాలైన అమ్మాయికి మూడు చక్రాల సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. దివ్యాంగులైన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పుస్తకాలు యూనిఫామ్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. చైల్డ్ లైన్ వారి ద్వారా బాలికల గురించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల స్వప్న టీచర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ అమ్మ రజిత, కంకల రాజయ్య , మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version