ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి
కేసముద్రం/ నేటి దాత్రి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలువల యందు
జిల్లా విద్యశాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించబడినది.
ఈ కార్యక్రమానికి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా కేసముద్రం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి, మరియు జిల్లా విద్యశాఖ అధికారి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు.
ప్రభుత్వ బడులు సామాజిక వారసత్వ సంపదను పెంపొందిస్తాయని, పేర్కొన్నారు.
ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందుతుందని, పైసా ఖర్చు లేకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్ మరియు నోట్ పుస్తకాలు అందించడం జరుగుతుందని, తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, అలాంటి ఊరుబడిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము అందించే ఉచిత పథకాలను ఆదరించిన విధంగానే ప్రభుత్వ బడులను కూడా ఆదరించాలని, ప్రజలందరూ తమ పిల్లలను ఊరి పాఠశాలలోనూ చేర్పించాలని కోరారు. కలువల ప్రాథమిక పాఠశాలలో తమ పిల్లవాణ్ణి చేర్పించిన యుపిఎస్ నరసింహుల గూడెం ఉపాధ్యాయులు ఎస్ కే సయ్యద్ను ఘనంగా సన్మానించడం జరిగింది.అదేవిధంగా కలవల ఉన్నత పాఠశాల పదవ తరగతి టాపర్స్, కే తేజస్విని, వై వెన్నెల మరియు జి శివాని లను కూడా అభినందించారు. గణితంలో వందకు వంద మార్కులు సాధించిన
వై వెన్నెలకు పాఠశాల గణిత ఉపాధ్యాయులు తండా సదానందం వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందజేయగా, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, 3016 రూపాయలు అందజేశారు. తర్వాత ప్రాథమిక పాఠశాలలో 65 అడ్మిషన్లు చేసిన ప్రధానోపాధ్యాయులు వీరారెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ ను, మిగతా ఉపాధ్యాయులను డిఇఓ రవీందర్ రెడ్డి ,సంజీవరెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం, బడిబాట ర్యాలీ తీయడం జరిగింది. గ్రామ కూడలిలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గిద్దె రాం నరసయ్య మరియు బండ వెంకన్నల బృందం ఆటపాట కార్యక్రమాలను నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు ఆజాద్, అప్పారావు మండల విద్యాధికారి కాలేరు యాదగిరి, ఉపాధ్యాయులు ఏకాంబరం, తండా సదానందం, ఎం యాకాంబరం, ఆర్ బిక్షపతి బాలషౌరెడ్డి , వి రాజేంద్ర చారి, కే రాములు, మార్గం శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్ ,
వి రాము, కే పార్వతి, ఎండి జుబేర్ అలీ,
జి నాగరాజు,ఏ లింగయ్య,.,గోపి ..స్వరూప, శ్రీదేవి, హరికృష్ణ, కృష్ణ, మోహనకృష్ణ సిఆర్పి ఉదయ్, రాధ..నవీన్ మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మునికుంట్ల ఐలేష్, ఎం భరత్, పరమేష్, బి .యాద గిరి, డప్పు యుగంధర్, వంగూరి శ్రీనివాసరావు, దేశెట్టి ప్రవీణ్ కుమార్ , అశ్విని, అనిల్, కవిత తదితరులు పాల్గొన్నారు.