నాన్న అంటే నమ్మకం నాన్న ప్రేమలో బాధ్యత.

నాన్న అంటే నమ్మకం నాన్న ప్రేమలో బాధ్యత..

అమ్మ ప్రేమకు ప్రతిరూపం అయితే.నాన్న ఓ నమ్మకం. అమ్మ ప్రేమలో ఆప్యాయత ఉంటే… నాన్న ప్రేమలో బాధ్యత ఉంటుంది. అదే పిల్లలకు గొప్ప భరోసా.

నా గురువు

నేను నాన్న కూచీని. నా జీవితంలోని ప్రతి అడుగులోనూ ఆయన ముద్ర ఉంది. దేని గురించైనా నాన్నతో మాట్లాడగలిగేంత చనువు నాకుంది. మగవాళ్లు తమ మనసులోని భావాలను బయటకు వ్యక్తపరచలేరు అంటారు కదా! కానీ మా నాన్న మాత్రం అలా కాదు. మాపై తనకి ఎంత ప్రేముందో ఎప్పటికప్పుడు లేఖల ద్వారా తెలియజేస్తారు. అవి చదువుతున్నప్పుడు భలే ముచ్చటేస్తుంది. నాకు ఏ సమస్య వచ్చినా ముందు నాన్నకే ఫోన్‌ వెళ్తుంది. నా గదిలో వై-ఫై పనిచేయకపోయినా తనకే ఫోన్‌ చేస్తా. ఆయనే నా గురువు.

– కృతి సనన్‌

 

తన పేరు వాడొద్దన్నారు

నాన్న మహేశ్‌ భట్‌ నా చిన్నతనంలో ఇంట్లో కన్నా సెట్‌లోనే ఎక్కువ ఉండేవారు. ఒకరకంగా నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టాకే మా మధ్య మరింత అనుబంధం పెరిగిందని చెప్పొచ్చు. మొదట నేను సినిమాల్లోకి వస్తానంటే ఆయన ప్రోత్సహించలేదు. ‘ప్రతిభ ముఖ్యం. నా కూతురిగా సినిమాల్లోకి రావడం, నా పేరు వాడుకుని అవకాశాలు సంపాదించడం నాకు ఇష్టముండదు’ అన్నారు. నాన్న పేరు వాడుకోకుండా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. ప్రస్తుతం నా విజయాలు చూసి ఆయన చాలా గర్వంగా ఫీలవుతుంటారు.

సినిమా టికెట్‌లు

– అలియా భట్‌

నా మార్గ నిర్దేశకుడు…

సరిగ్గా నేను పుట్టడానికి రెండు రోజుల ముందు… పెద్ద కళ్లు, పొడవాటి జుట్టు, అందమైన ముక్కు, పట్టీలేసుకుని.. తన పొట్టపై నేను ఆడుకుంటున్నట్లుగా నాన్నకు ఓ కల వచ్చిందట. ఆ కలకు తగ్గట్టే నేను పుట్టేసరికి… ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందని తెగ సంబరపడిపోయారట. ఆ మధుర క్షణాల గురించి నాన్న ఇప్పటికీ నాకు చెప్తూ మురిసిపోతుంటారు. చిన్నతనంలో నాన్నతో గడిపిన క్షణాలు చాలా తక్కువ. కాస్త పెద్దయ్యాక పైచదువుల దృష్ట్యా హాస్టల్‌లో ఉండాల్సి వచ్చింది. ఆతర్వాత సినిమాలతో బిజీ అయ్యాను. చాలా సందర్భాల్లో నాన్నను మిస్సయిన ఫీలింగ్‌ కలుగుతుంటుంది. నాన్న కూడా నా ఆరోగ్యం, కెరీర్‌ గురించి అనుక్షణం ఆలోచిస్తూ, మార్గనిర్దేశనం చేస్తుంటారు.

– రష్మిక మందన్నా

 

దేవుడిచ్చిన బహుమతి

ఏ అమ్మాయికైనా తండ్రిలో ఓ స్నేహితుడు కనబడితే… ఆ అమ్మాయి చాలా లక్కీ అని నా ఫీలింగ్‌. మా నాన్న అలాంటివారే. ఎదుటివారితో ఎలా మాట్లాడాలి? అనేది ఆయన్నుంచే నేర్చుకున్నాను. ఓపిక, మంచితనం, ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం…. ఇలా అన్ని విషయాల గురించి నాన్న నా చిన్నప్పుడే చెప్పారు.Father means trust, father means responsibility in love.

 

ఆయనిచ్చిన ధైర్యమే…

నా జీవితంలో నాన్న స్థానం చాలా గొప్పది. నేను ఇంత చలాకీగా ఉంటున్నానంటే దానికి కారణం నాన్నే. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే సినిమాల్లో నాదైన శైలిలో రాణించగలుగుతున్నా. షూటింగ్‌ తర్వాత ఇంటికెళ్తే.. నాతో బోలెడు కబుర్లు చెబుతుంటారు. మా మాతృభాష బడగా అయినా… నేను ఇంట్లో అప్పుడప్పుడు తెలుగు మాట్లాడుతుంటా. ‘తెలుగు బాగా మాట్లాడుతున్నావ్‌గా.. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకో’ అంటూ ఆటపట్టిస్తుంటారు నాన్న.

విడిపోయిన తండ్రి కొడుకులను కలిపిన నెక్కొండ ఎస్సై

విడిపోయిన తండ్రి కొడుకులను కలిపిన నెక్కొండ ఎస్సై

నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండలంలోని తొపనపల్లి గ్రామంలో కందికొండ మల్లయ్య, అతని కుమారుడు కుమారుడు ప్రభాకర్, కోడలు రజిత లతో గొడవపడి రెండు సంవత్సరాల క్రితం విడిపోయి గ్రామంలోని పాడుబడిన పాత పాఠశాల బిల్డింగ్ లో మల్లయ్య భార్య వీరి లక్ష్మితో ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న నెక్కొండ ఎస్ఐ మహేందర్ తల్లి తండ్రి కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి తల్లి తండ్రి కొడుకులను కలిపిన ఎస్ఐ మహేందర్ దీంతో పోలీసుల విధానాన్ని ఎస్సై చోరవకు పలు వర్గాల ప్రజలు అభినందనలు తెలిపారు.

శ్రేయన్స్ తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే.

శ్రేయన్స్ తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే

జడ్చర్ల /నేటి ధాత్రి

 

జడ్చర్ల పట్టణంలోని మూడవ వార్డులో రెండు రోజుల క్రితం ఇంటి ముందు సైకిల్ పై వెళ్తుండగా.. విద్యుత్ వైరు తగిలి కరెంట్ షాక్ తో శ్రేయన్స్ (10) బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి శ్రేయాన్స్ తండ్రి బొక్క రాఘవేందర్ ను పరామర్శించారు. ధైర్యం కోల్పోకూడదని ఓదార్చారు. కరెంట్ షాక్ తో శ్రేయాన్స్ చనిపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

పిల్లలతో సహా తండ్రి అదృశ్యం…

పిల్లలతో సహా తండ్రి అదృశ్యం…

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో గల చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వతాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలతో సహా తండ్రి అదృశ్యమైనట్లు చిరాగ్ పల్లి ఎస్సై కె.రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 17 తారీకు న పర్వతాపూర్ గ్రామానికి చెందిన గురడి గోపాల్ రెడ్డి (38) సంవత్సరల వయస్సు గల వ్యక్తి తన కూతురు అనుష రెడ్డి, కొడుకు సాత్విక్ రెడ్డి తో కలిసి సంగారెడ్డికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపి ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని బంధువుల దగ్గర చుట్టూ ప్రక్క ల గల గ్రామాలలో ఆచూకీ కోసం ప్రయత్నించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో పిల్లలతో సహా అదృశ్యం అయినా తండ్రి గోపాల్ రెడ్డి తల్లి గూరడి శోభమ్మ చిరాగ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిరాగ్ పల్లి ఎస్ఐ కె. రాజేందర్ రెడ్డి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version